Update 06
శంభల నగరం – 2
స్వర్వాహినీ క్షేత్రం
శంభల నగరానికి నాలుగు వైపులా పర్వత శ్రేణులే ఉంటాయి. శంభలలో మొత్తం 18 ప్రాకారాలు ఉంటాయి. 9 ప్రాకారాలు శంభల నగరంలో ఉంటే మిగిలిన 9 శంభల రాజ్యంలో ఉంటాయి. శంభల నగరం, శంభల రాజ్యం వేటికవే రెండూ భిన్న లోకాలలా ఉంటాయి. శంభల నగరంలో జ్ఞానసముపార్జన, దైవసంకీర్తన, శివారాధన ప్రముఖంగా కనిపిస్తే శంభల రాజ్యంలో యుద్ధవిద్యా బోధన, నైపుణ్య పరీక్ష, ధర్మ శాస్త్రాలపై అవగాహన ప్రధానంగా ఉంటాయి.
శంభల నగరంలోని మొదటి ప్రాకారం ఐన స్వర్వాహినీ క్షేత్రంలో ఉన్నారు సంజయ్, అభిజిత్, అంకితలు.
సిద్ధపురుషుడికి కూడా శంభల నగరానికి రావటం ఇదే మొట్టమొదటి సారి కావటంతో చుట్టూ ఒకసారి పరిశీలనగా చూస్తున్నాడు. సైనికులు వీరితో పాటే అక్కడున్నారు.
"ఈ స్వర్వాహినీ క్షేత్రానికి ఎందరో సిద్ధులు, శంభల రాజ్యంలోని రాజులు, మంత్రులు, యోగులు వస్తూ ఉంటారు. ఇదొక నది అంటారు. శంభల చుట్టూతా ఉంటుంది. కానీ మనకు ఇదొక పుష్కరిణిలా కనిపిస్తుంది. ఈ ప్రాకారాన్ని అలా నిర్మించారు. శంభల నగరంలోకి అడుగుపెట్టేవారికి ఇది మొట్టమొదటి ప్రాకారంలా అనిపిస్తుందేమో కానీ ఇది చిట్టచివరిదైన 9వ ప్రాకారం. వికసించిన పద్మానికి ఎలా అయితే దళాలు విచ్చుకుని ఉంటాయో అలానే ఈ 9 ప్రాకారాలు శంభల నగరం మధ్యలో కేంద్రీకృతం అయ్యి ఉన్న శక్తిని ఆలంబనగా చేసుకుని చుట్టూ రక్షణ కవచాలలా వృత్తాకారంలో ఉంటాయి", అని చెప్పాడు వాళ్లలో ఒక సైనికుడు.
"ఈ క్షేత్రం ప్రాముఖ్యత ఏంటి?" అని అభిజిత్ అడిగాడు.
"వాక్కులో ఎలాంటి దోషాలు, అపశబ్దాలు లేకుండా అనవసరమైన ప్రసంగాలు చెయ్యకుండా ఉండాలంటే ఇక్కడికొచ్చి స్వర్వాహినీ దేవిని ప్రార్థించి ఇక్కడి జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే చాలునని అంటూ ఉంటారు శంభలలో", అన్నాడొక సైనికుడు.
"మానవులకు వాక్కులో దోషాలు సహజం. శంభలలో కూడా ఇలాంటివి ఉంటాయా స్వామి?" అంటూ సిద్ధపురుషుణ్ణి అడిగాడు సంజయ్.
"ఎంతటి వారికైనా సరే భగవంతుని గుణగణాల కీర్తన చెయ్యనిదే వాక్కులో పరిపూర్ణమైన శుద్ధి అనేది అసంభవం. అందుకే మనకు అచ్యుతా...అనంతా...గోవిందా అని స్మరించమంటారు", అన్నాడా సిద్ధపురుషుడు.
స్వర్వాహినీ క్షేత్రంలోని నీటిని తీర్థంలా సేవించి అక్కడే కాసేపు ఆసీనులయి వాక్కులో పరిపూర్ణమైన శుద్ధి కొరకు ఆ స్వర్వాహినీ దేవిని ప్రార్థించారు.
"స్వామీ కనకధారాస్తోత్రంలో
…..
స్వర్వాహినీ విమలచారు జల ప్లుతాంగీమ్
అని వస్తుంది కదా. అక్కడ ప్రస్తావించినది ఈ నది గురించేనా?" అని అడిగాడు సంజయ్.
“స్వర్గలోకంలో ఉన్న ఆకాశగంగ మందాకినీ
అనే పేరుతో నదిగా ప్రవహిస్తోంది. శంభల శివుని క్షేత్రం కావటంతో ఇక్కడ అదే ఆకాశగంగ స్వర్వాహినీ
పేరుతో ప్రవహిస్తోంది. ఆదిశంకరుని కనకధారా స్తోత్రంలో చెప్పిన స్వర్వాహినీ విమల చారు జలం ఇదే. నీ ఆలోచనలో ఉన్న లోతు నాకెంతగానో నచ్చింది. ఇలాగే ప్రతీ విషయాన్ని వివేకంతో ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు నీకు బ్రహ్మజ్ఞానం తప్పక లభిస్తుంది”, అంటూ ఆనందంతో సంజయ్ ని చూస్తూ చిరునవ్వు చిందించాడు సిద్ధపురుషుడు.
రెండవ ప్రాకారం ఐన ధనుః ప్రాకారం వైపుగా అడుగులు వేస్తున్నారు సంజయ్, అభిజిత్, అంకితలు. సైనికులు వీళ్లకు దారి చూపిస్తూ ముందుకు వెళుతున్నారు. సిద్ధపురుషుడు సైనికులని అనుసరిస్తూ వారి వెనకే వస్తున్నాడు. సిద్ధపురుషుణ్ణి అనుసరిస్తూ మిగతా ముగ్గురూ తమ అడుగులు ముందుకేస్తున్నారు.
శంభల నగరంలోని ప్రతీ ప్రాకారం వెడల్పు 3 యోజనాలు. 3 యోజనాల దూరం నడిస్తే గాని మరొక ప్రాకారానికి వెళ్లలేము. ప్రతీ ప్రాకారం యొక్క చుట్టుకొలత తగ్గుతూ పోతుంది. ఆ లెక్కన చూస్తే శంభల నగరంలో వున్న 9 ప్రాకారాలలో ఈ
స్వర్వాహినీ క్షేత్రమే అతి పెద్ద చుట్టుకొలత గల ప్రాకారం.
మధ్యలో కేంద్రీకృతం అయ్యి ఉన్న శక్తిపీఠం కిందుండే భూగృహములో చింతామణి అనే దేవమణి ఉంటుంది. ఆ దేవమణిని కోరుకుంటే దొరకని శక్తి లేదు. ఆ దేవమణి కాంతి ప్రసరిస్తే చాలుననుకునే రాజులు ఎందరో ఉన్నారు శంభల చరిత్రలో. ఇంతవరకూ అలాంటి అవసరం కానీ, సందర్భం కానీ ఏ కల్కి రాజుకీ రాలేదు. అనిరుద్ధుల వారికి అలాంటి అరుదైన సువర్ణావకాశాన్ని ఇచ్చేది బహుశా ఈ ముగ్గురేనేమోనని….సంజయ్, అభిజిత్, అంకితలను చూస్తూ మనసులో అనుకుంటున్నాడు సిద్ధపురుషుడు.
---------------------------------------------------
శంభల నగరం – 3
ధనుః ప్రాకారం
"మనస్సును అదుపులో పెట్టుకోవటం అన్నది తేలికగా అబ్బే విద్య కాదు. మనలో ఒక్క రోజులో కొన్ని వేల ఆలోచనలు అలా సముద్రంలోని కెరటాలలా వస్తూ పోతూ ఉంటాయి. మనసుని అలజడికి గురి చేసే విషయాల్ని కట్టడి చేస్తే మరింత ప్రమాదం. దేన్నైనా సరే ఛేదించి, సాధించాలి. అలా ఛేదించాలి అంటే మనలో వుండే అలజడిని తగ్గించే దిశగా మనం అడుగులు వెయ్యాలి. అదొక సాధనలా నిరంతరం సాగాలి. అంతే కానీ మనసుని బలవంతంగా కట్టడి చేస్తే మాత్రం అది పదింతలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఇలాంటి మనసును జ్ఞాన మార్గం వైపుకు నడిపించేదే ఈ ధనుః ప్రాకారం .
శంభల రాజ్యం లోని యోధులు, యోగులు, రాజులు ఎందరో ఈ ధనుః ప్రాకారానికి వచ్చి ఇక్కడ ధనుస్సు ఆకారంలో నిర్మించబడ్డ ఈ ప్రాంగణం అంతా తిరుగుతూ మంత్రాన్ని మననం చేసుకుంటూ 18 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత ఎక్కు పెట్టిన బాణంలా మధ్యలో ఉన్న దారి వెంట నడుస్తూ చివరిదాకా వెళ్లి అక్కడున్న ధ్యాన పీఠము
మీద ఆసీనులవుతారు. ఈ బాణంలా వున్న దారికి ఇరు వైపులా
పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణిలోని నీళ్లు స్వర్వాహినీ క్షేత్రానివే అయినా శివుని ఆలయంలోని భస్మమును ఎప్పటికప్పుడు తెచ్చి ఇక్కడి నీటితో జత చేస్తూ వుంటారు. సృష్టి, స్థితి, లయము లకు అతీతమైన ఒక ప్రపంచం ఈ శంభల నగరం. శివుని ఆజ్ఞను అనుసరించటమే ఇక్కడ పరమావధి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ధ్యాన పీఠాన్ని ఏర్పాటు చేసిన వేదికకు నలుదిక్కులా శివోహం
అని వ్రాయబడి ఉంటుంది. అంటే దానర్థం నీ దారి ఆయన వేసిన దారి. నీ ప్రయాణానికి ఆయనే గమ్యం. నీ ఉనికికి ఆయనే మూలం. నీ లోని జ్ఞానమే ఆయన. ఆయనలోని జ్ఞానమే ఈ అనంతమైన విశ్వం అని.
చిదానంద రూపః శివోహం శివోహం
ధ్యాన పీఠము
మీద ఆసీనులయిన తర్వాత ఉపాసకుడు తన సంకల్పాన్ని, లక్ష్యాన్ని, గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే పూర్తిగా మనసును తాను అనుకున్న లక్ష్యం వైపుగా దిశానిర్దేశం చేసి ఉండటంతో పరిపూర్ణమైన ఏకాగ్రత కుదురుతుంది. ఆ ధ్యాన పీఠము మీదున్నప్పుడే అతనికి అన్ని సమాధానాలు దొరుకుతాయి. అతని ఇచ్చాశక్తిని బట్టి అతనికి కలిగే అనుభూతి ఆధారపడి ఉంటుంది. తీవ్రమైన కోరిక వున్నప్పుడు మాత్రం ఇరువైపులా ఉన్న పుష్కరిణి లోని నీళ్లు 6 అడుగుల ఎత్తుకు ఎగసి పడుతూ ధ్యాన పీఠము మీదున్న ఉపాసకుడిని పునీతం చేస్తాయి. అనగా ఆ ఉపాసకుడు పవిత్రమైన పుష్కరిణి జలంతో ప్రోక్షణ చెయ్యబడ్డట్టు అన్నమాట. సంకల్ప సిద్ధి దొరికినట్టే అనుకోవచ్చు”, అంటూ చెప్పటం ముగించాడు
ధనుః ప్రాకారంలో ఉన్న ఆ ఉద్ధారకుడు.
"స్వామి ఇక్కడ ఆడవారికి కూడా ప్రవేశం ఉన్నదా?" అడిగింది అంకిత.
"సంకల్ప సిద్ధి కోసం చేసే ధ్యానానికి స్త్రీ, పురుష భేదం లేదు తల్లి", అన్నాడా ఉద్ధారకుడు.
"ఇంత క్రితం మీరు ఉపాసకుడు అని మాత్రమే సంబోధించారు. అందుకే ఇంతవరకు ఏ ఉపాసకురాలు ఇక్కడికి రాలేదేమోనని అనుకున్నాను", అని చమత్కారంగా అన్నది అంకిత.
"చాలా సరైన విషయాన్ని ప్రస్తావనకు తెచ్చావమ్మా. ఇక్కడ ఉపాసకుడు అంటే అర్థం పురుషుడు అని కాదు. శివుడు అని. ఎందుకంటే ఈ ధ్యాన పీఠము మీద ఆసీనులై ఎవరు ఉపాసన చేసినా సరే వారిలోని శివుడే జాగృతం అవుతాడు. సర్వం ఆ శివుడికే చెందుతుంది అన్న భావన అది.
శివుడే కర్త, కర్మ, క్రియ అన్న అంతరార్థం", అన్నాడు ఆ ఉద్ధారకుడు.
"ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ ప్రాంగణం మొత్తం తిరుగుతూ పఠించే ఆ మంత్రం ఏమిటి స్వామి?" అడిగాడు సంజయ్
"
సర్వ చైతన్య రూపాంతాం
ఆద్యాం విద్యాంచ ధీమహి
బుద్ధిం యాన: ప్రచోదయాత్
ఈ మంత్రాన్ని మనసులోనే సరిగ్గా 18 సార్లు జపించిన తరువాత మాత్రమే ఆ ధ్యాన పీఠము దగ్గరికి వెళ్లే అర్హత మీకు దొరుకుతుంది", అన్నాడు ఆ ఉద్ధారకుడు.
"మాకు ఇవన్నీ చెయ్యటానికి ఇప్పుడు అనుమతి ఉన్నదా స్వామి?" అని అడిగాడు అభిజిత్.
"దృఢమైన సంకల్పంతో శంభల రాజు అనిరుద్ధుల వారు ఒక రోజు ముందుగానే శివుని ఆలయానికి వచ్చి ఇక్కడి శాస్త్రం ప్రకారం దేవప్రశ్నము వేసిన తర్వాత ఒక శుభ ముహూర్తాన ‘ధనుః ప్రాకారానికి విచ్చేసి సంకల్ప సిద్ధి కొరకు ఇవన్నీ చెయ్యటం జరుగుతుంది. ఎవ్వరైనా ఈ పద్ధతిని అనుసరించాల్సిందే" అని నిర్మొహమాటంగా చెప్పాడు ఆ ఉద్ధారకుడు.
“ఒక ముహూర్తం, ఒక దృఢమైన సంకల్పం, గ్రహబలం లేకుండా ఇక్కడ ప్రదక్షిణలు చెయ్యటానికి వీలు లేదు”, అని కాస్త ఘాటుగానే చెప్పాడాయన.
దీంతో అభిజిత్ వైపు నిరసనగా చూసారు సంజయ్, అంకితలు. సిద్ధపురుషుడు తనకి అలవాటైన నవ్వునే ధరించాడు.
తన ప్రశ్నలతో ఆ ఉద్ధారకుడికి కోపం తెప్పించి తనేమైనా అనుచితంగా ప్రవర్తించానేమోనని అభిజిత్ దిగాలుగా మొహం పెట్టి నిట్టూర్చాడు.
సిద్ధపురుషుడు ఆ విషయాన్ని గ్రహించి, "అభిజిత్ అడగటం వల్లనే కదా ఈ ప్రాకారానికి ఎవరి అనుమతితో రావాలో తెలిసింది. మీరు ఘోర కలిని ఎదుర్కోవటానికి శంభల రాజ్యంలో ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎన్ని శాస్త్రాలు పఠించినా భూలోకం కెళ్ళాక అవన్నీ మీకు గుర్తుండాలి అన్నా, ఆ శక్తులన్నీ మీకు సహకరించాలి అన్నా మనం శంభల నుండి బయలుదేరే ముందు ఖచ్చితంగా ఈ ధనుః ప్రాకారానికే రావాలి. అభిజిత్ ఈ ప్రశ్న అడగటం మంచిదే అయ్యింది" అంటూ ముగించాడు ఆ సిద్ధపురుషుడు.
ఆ ఉద్ధారకుడి నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి ముందుకు కదిలారు. ఒక ప్రాకారానికీ మరొక ప్రాకారానికి మధ్యనున్న దూరం 3 యోజనాలైనా నడుస్తూ వెళ్తున్నప్పుడు అలసట లేదు. కాళ్ళ నొప్పి లేదు. దూరం, దగ్గర అన్న వ్యత్యాసమే తెలియటం లేదు. దారి పొడవునా ఉన్న పాదుకాతీర్థం మహిమో మరేంటో కానీ శంభల నగరంలో ఎంత సేపు నడిచినా, ఎంత దూరం నడిచినా నడుస్తున్నట్టే లేదు. ఏదో శక్తి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నట్టు ఉంది.
వాళ్ళు అక్కడి నుండి సమరః ప్రాకారానికి బయలుదేరారు.
----------------------------------------------------
శంభల నగరం – 4
సమర విజయ రాముని సమరః ప్రాకారం
చేరుకోగానే అక్కడ వారికి ఒక యోధుడి మూర్తి కనిపించింది. ఆ ప్రతిమ ధ్యానం చేస్తున్న భంగిమలో పద్మాసనంలో ఉంది. చూడటానికి ఉగ్రరూపంలో ఉన్న యోధుడిలా ఉంది. ఆ యోధుడి కళ్ళను చూస్తే కేవలం ధ్యానం చేస్తున్నట్టు మాత్రమే లేదు. ఏదో యుద్ధంలో నిర్విరామంగా శత్రువులతో పోరాడుతూ తన ఆగ్రహ జ్వాలలని కళ్ళ నిండా నింపుకున్నట్టు ఉంది. ఎందుకంటే అతను అర్ధనిమీలితనేత్రాలతో ఉన్నాడు. తీక్షణమైన ఆ చూపులను బట్టి అతను ఎవరినో అంతం చెయ్యటానికే దీక్ష పూనాడనిపిస్తోంది. ఎన్నో గాయాలతో రక్తసిక్తమై వున్న అతని దేహాన్ని చూస్తే చురకత్తులతో, బాణాలతో ఆ యోధుడిని దాడి చేసినట్టు అర్థం అవుతోంది. అయినా అది తనపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదని అతని ధీరత్వం మనతో చెబుతున్నట్టు ఉంటుంది. అణువణువూ ధైర్యంతో, వీరత్వంతో, అమరత్వంతో నిండిపోయి మృత్యుదేవతకు ముచ్చెమటలు పట్టించే పోరాటపటిమ తన సొంతం అన్నట్టు ఉన్నాయి అతని చూపులు.
ఆ ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా వుంది. అక్కడున్న నిశ్శబ్దాన్ని చూస్తే ఇప్పటికీ ఆ యోధుని వీరత్వానికి అర్పిస్తున్న నివాళి అదేమో అనిపించేలా ఉంది. సమరః ప్రాకారం మొత్తం ఆ యోధుడిదే అనిపించేలా ఉంది ఆ నిశ్శబ్దం. అక్కడున్న ప్రతీ అంగుళానికి ఆ యోధుడి పరాక్రమం తెలుసేమో అనిపించే నిశ్శబ్దం.
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ యోధుడినే కన్నార్పకుండా చూస్తున్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు కొంచెం దూరంగా నిలబడి ఉన్నారు.
అంతలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆ వృద్ధుడిని చూడగానే సైనికులిద్దరూ ప్రణామం చేశారు. సిద్ధపురుషుడు కూడా నమస్కరించాడు.
ఆ వృద్ధుడు ఎప్పటిలానే యథావిధిగా తన ఆసనం చూసుకుని అక్కడే స్థిరపడి ఆ యోధుడి ప్రతిమను చూస్తూ ఏదో మంత్రం జపిస్తూ వున్నాడు. ఇంతలో ఏదో జ్ఞప్తికి వచ్చినట్టు అనిపించి
సమరవిజయ రామా
సమరవిజయ రామా
సమరవిజయ రామా
అంటూ తన్మయత్వంతో తన కళ్ళ ముందే యుద్ధరంగం కనిపించినట్టు అనిపించి ఆ యోధుని ప్రతిమ దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి అక్కడున్న పూలను ఆ మూర్తీభవించిన వీరత్వానికి ప్రతీకగా సమర్పించి అక్కడున్న గంధపు జలంతో ఆ యోధుని పాదాలను పరిశుద్ధి చేసాడు ఆ వృద్ధుడు.
తిరిగి తన ఆసనం దగ్గరికి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అభిజిత్, అంకిత, సంజయ్ లను ఇటు రమ్మని సైగ చేసాడు. సిద్ధపురుషుని వైపు భక్తి భావంతో చూస్తూ ఆహ్వానించాడు. అక్కడున్న ఇద్దరు సైనికులకు విషయం అర్థం అయిపోయి ఆ ప్రాంగణం నుండి బయటికి వెళ్లిపోయారు.
ఆ వృద్ధుడు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.
"నా పేరు మహిభార్గవుడు. శంభల నగరంలో మీకు కనిపించే భూలోకవాసిని నేను. ఇక్కడ మీరు చూస్తున్న ఆ యోధుడిని గాయాలతో రక్తసిక్తమై వున్న స్థితిలో పార్థివ శరీరంగా వున్న తనని భూలోకం నుండి ఇక్కడకు తీసుకునివచ్చే ఆ మహాభాగ్యాన్ని పొందాను. శంభలకు వచ్చి నేనూ అమరుణ్ణి ఐపోయాను. నాకు ఆనాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవదేవుడు ఆ శ్రీకృష్ణుడే", అన్నాడు ఆ వృద్ధుడు.
"స్వామీ ఆ యోధుడి వీరగాథను సవివరంగా మాకు చెప్తారా?" అని అడిగాడు సంజయ్.
"అది చెప్పటానికే మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాను.
మీరు చూస్తున్న ఆ యోధుడి విగ్రహం సామాన్యమైనది కాదు. అది ఏ లోహంతో నిర్మితమైందో ఇప్పటిదాకా శంభలలో ఎవ్వరికీ తెలీదు.
దేవశిల్పి విశ్వకర్మ ప్రత్యేకంగా 3 మాసములు కేటాయించి ఆ యోధుని మూర్తిని సృజించాడు. మూర్తీభవించిన ఆ వీరత్వానికి ప్రాణప్రతిష్ట చేసాడు ఆ మాహానుభావుడు.
మీకిప్పుడు ఆ యోధుడి గురించి చెబుతాను. జాగ్రత్తగా వినండి", అంటూ ఇలా ఆ యోధుని వీరగాథను చెప్పసాగాడు ఆ మహిభార్గవుడు.
సమరవిజయ రాముడు శంభల నగరంలోని ఈ ప్రాకారంలోనే పెరిగాడు. అతని తల్లి రామ భక్తురాలు. ఈ యోధుడి సమరవిజయ రామ అన్న నామధేయం వెనుక ఉన్న బలమైన శక్తికి మూలం ఆవిడ మాతృ ప్రేమ, భక్తి.
సమరవిజయుడు కూడా తన తల్లిలానే రామభక్తుడు. అతి చిన్న వయసులోనే యుద్ధవిద్యలన్నీ నేర్చుకుని ఆరితేరిన వాడు. తనకు రాముని దర్శన భాగ్యం కావాలని పరితపించిపోయేవాడు. రామనామం జపిస్తూ ఎంతో కఠినమైన తపస్సును ఆచరించాడు. ఆహారం, నిద్ర ఏవీ లేకుండా కొన్ని నెలలు గడిపాడు. అయినా రాముడు కరుణించలేదు. అప్పుడు ఒక యోగి సమరవిజయుని చెంతకు వచ్చి శివుణ్ణి తపస్సు చెయ్యమని కోరాడు.
శివుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ తపం ఆచరించాడు.
ఒక రోజు శివుడు ప్రత్యక్షం అయ్యి సమరవిజయుణ్ణి ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ సమరవిజయుడు తనకు ఆ రాముని దర్శన భాగ్యం కలగాలనీ, అలాగే తన యుద్ధవిద్యా నైపుణ్యం వ్యర్థం అవ్వకుండా అదంతా ఆ రాముడికే ఉపయుక్తం అవ్వాలనీ, యుద్ధంలోనే అమరుడై శంభల చరిత్రలో తాను యోధుడిగానే మిగిలిపోవాలనీ కోరాడు.
రామదర్శనం తప్పక దొరుకుతుందని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. ఆ రోజు నుండి రామదర్శనం కోసమే ఎదురు చూస్తూ ఎన్నో ఏళ్ళు గడిపాడు ఆ సమరవిజయ రాముడు. అన్ని ఏళ్లలో అతను ఏ నాడూ రామనామ జపాన్ని వదిలిపెట్టలేదు.
కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు శ్రీ కృష్ణుడు శంభల నగరానికి విచ్చేశాడు. సమరవిజయ రాముణ్ణి కలవటం కోసమే ఆయన ఇంత దూరం వచ్చాడు.
శ్రీకృష్ణుడిని చూడగానే సమరవిజయ రాముడు కంటతడి పెట్టుకున్నాడు. రాముడి దర్శనం తను కోరుకుంటే శ్రీ కృష్ణుని రూపంలో తన జన్మ తరింపజెయ్యటానికి వచ్చినందుకు భావోద్వేగానికి లోనయ్యాడు సమరవిజయుడు.
"మా అమ్మ తన జన్మను మీకే ధారబోసింది స్వామీ. మీ నామస్మరణే నా అంతిమ లక్ష్యంగా నన్ను పెంచింది. ఇన్నాళ్టికి నన్ను కరుణించారా స్వామీ", అంటూ శ్రీ కృష్ణుని పాదారవిందములకు శిరస్సువంచి నమస్కరించాడు ఆ సమరవిజయుడు.
-----------------------------------------------------
"నీ అంతిమ లక్ష్యం నేను కాదు సమరవిజయా. ఇన్నాళ్లూ నీ చేత నా నామ స్మరణ చేయించింది నీలోని యోధుడికి పెట్టిన పరీక్ష. నీలోని భక్తుడికి ఎలాంటి పరీక్షా లేదు. మీ అమ్మ గారి ద్వారా నీకు సంక్రమించిన ఆస్తి విష్ణు పథము. అసలైన పరీక్షలో నువ్వు ఇప్పుడు నెగ్గావు కాబట్టే నిన్ను వెతుక్కుంటూ భూలోకం నుండి నేను వచ్చాను.
కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల సైన్యాన్ని ఎదుర్కోవటం అంత సులభమైన పని కాదు. అందుకు నాకొక యోధుడు కావాలి. శివుణ్ణి నువ్వు కోరుకున్న మూడు కోరికల్లో మొదటిది నా దర్శనంతో ఈనాడు తీరిపోయింది. మిగిలిన రెండు కోరికలూ తీరే అవకాశం నీకిప్పుడు దొరికింది. నిన్ను కురుక్షేత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టమని ఆదేశించను. నా భక్తుడవు నీవు. నేను నిన్ను అర్థిస్తున్నాను. నీకు సమ్మతం అయితేనే రా. లేనిచో ఆనందంగా తిరిగి వచ్చిన దారినే నే వెళ్లెదను", అన్నాడు శ్రీ కృష్ణుడు.
"స్వామీ, మీరు ఈ సమరవిజయుణ్ణి అర్థించటం ఏంటి? మీ కోసం యుద్ధంలో నా ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడిన వాణ్ణి. నన్ను ఆజ్ఞాపించండి", అన్నాడు ఆ సమరవిజయుడు.
అలా కురుక్షేత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టాడు ఆ సమరవిజయుడు. శంభల నుండి భూలోకంలోకి వచ్చిన ఆ సమరవిజయుడు ఒక్క యోధుడిగా కాక 100 మంది యోధులలా రూపాంతరం చెందాడు. సమరవిజయునికి ఉన్న శక్తికి 1000 మందిని ఒకేసారి ఎదుర్కోగలడు.
సమరవిజయుణ్ణి ఒకే యోధుడిగా రంగంలోకి తెస్తే దుర్యోధనుడికి అనుమానం వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నది. అందుకే శ్రీ కృష్ణుడు తెలివిగా సమరవిజయుని నుండి 100 మంది వేర్వేరు యోధులను సృష్టించాడు. ఆ సమరవిజయుని యుద్ధశక్తిని 100 భాగాలుగా విభజించి ఈ 100 మందినీ సృజించాడు. 100 మందికీ వేర్వేరు ముఖాలు, వేర్వేరు యుద్ధ నైపుణ్యాలు ఉన్నా వారిలో ఉండే ఆత్మచైతన్యం ఒక్కటే. అదే సమరవిజయ రామ.
కదనరంగంలో ఈ 100 మంది 1000 మందితో సమానం.
అనగా ఒకే ఒక్కడైన సమరవిజయ రాముడే వెయ్యి మంది వున్న ఆ సైన్యాన్ని చీల్చి చెండాడగలడని దానర్థం.
ఆ రోజు కురుక్షేత్రంలో సమరవిజయుడు చూపించిన తెగువకి ఎవ్వరికీ నోట మాట రాలేదు. 1000 మందిని మట్టి కరిపించటం అంటే మాటలా!
ఆ రోజున ఆ 1000 మంది కౌరవ సైన్యానికీ యుద్ధభూమిలో వారి ఎదుటనున్న 100 మంది యోధులలోనూ సమరవిజయుడొక్కడే కనిపించటంతో మాయకు గురయ్యారు. వాళ్లకేం తెలుసు ఆ ఒక్కడిలోనే 100 మంది ఉన్నారని....ఆ వంద మంది ఒక్కడి నుంచే వచ్చారని.
శంభల నగరంలోని అతి పెద్ద రహస్యం ఇది. ఎవరికైనా చెప్పినా నమ్మశక్యం కాని వీరత్వం సమరవిజయ రాముడిది. అలాంటి యోధుడు మరొకడు పుట్టడు. ఆ ధీరత్వాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కళ్లారా చూసిన నేనే నా కళ్ళను నమ్మలేకపోయా. నేను అంతవరకు ఇలాంటి ధీరుని గురించి ఇలలో వినలేదు. కలలో కనలేదు. అందుకే ఆ సమరవిజయున్నే చూస్తూ ఉండిపోయా. ఆ రోజు సంగ్రామం పరిసమాప్తి అయినది. 1000 మందినీ మట్టికరిపించాడు. వారి సైన్యం అలా వారి కళ్ళముందే కుప్పకూలిపోవటం తట్టుకోలేక కౌరవులు యుద్ధభూమి నుండి నిష్క్రమించారు. 1000 మంది వున్న ఆ కౌరవుల సైన్యాన్ని హతమార్చిన తర్వాత ఆ 100 మంది యోధులు తమ ఉనికిని కోల్పోతూ వచ్చారు. యుద్ధభూమి యందు ఆ 100 మందికి బదులుగా ఇప్పుడు ఒక్కడే మిగిలాడు. అతనే ఇప్పుడు మీరిక్కడ ప్రతిమలో చూస్తున్న ఆ సమరవిజయ రాముడు. మీరిక్కడ చూస్తున్నట్టే నాకు ఆ నాడు యుద్ధభూమిలో కనిపించాడు. తన ముఖం నిండా గాయాలతో, కత్తులు, బాణాలతో రక్తసిక్తమై కనిపించిన వీరాధి వీరుడు. నా హృదయం ద్రవించిపోయింది. ఆయన పాదాల మీద పడ్డాను. నీ లాంటి యోధుడిని నేనెక్కడా చూడలేదని చెప్పాను. ఉద్వేగానికి గురయ్యాను. అంతలో అక్కడికి శ్రీ కృష్ణుడు విచ్చేశాడు. శంభల నగరానికి ఈ సమరవిజయుణ్ణి తీసుకుని వెళ్లే అదృష్టాన్ని నాకిచ్చాడు. అక్కడి వారికి సమరుని వీరత్వాన్ని చాటి చెబుతూ
సమరః ప్రాకారాన్ని నిర్మించే ప్రతిపాదనను శంభల రాజు ముందు పెట్టాను. అలా ఈ నాడు సమరవిజయుడు తన బాల్యం నుండి ఎదుగుతూ వచ్చిన ఈ చోటే
సమరః ప్రాకారంగా మారిపోయింది. ఎంతో ఖ్యాతిని గడించింది", అంటూ చెప్పటం ముగించాడు ఆ మహిభార్గవుడు.
జీవితంలో అలాంటి యోధుడి గురించి ఎప్పుడూ వినని అభిజిత్, అంకిత, సంజయ్ లకు కళ్ళనిండా నీరు నిండిపోయింది. ఉద్వేగంతో. ఇంకేం మాట్లాడాలో తెలియని స్థితి అది.
ధైర్యానికీ, వీరత్వానికీ, యుద్ధనైపుణ్యానికీ పరాకాష్ఠ ఆ రోజు కురుక్షేత్ర మహాసంగ్రామంలో సమరవిజయ రాముడు సృష్టించిన చరిత్ర. అలాంటి అరుదైన రహస్యాన్ని మహిభార్గవుడి ద్వారా తెలుసుకోవటం పూర్వజన్మ సుకృతమే అని వాళ్లకు అనిపించింది.
సిద్ధపురుషుడితో కాసేపు ముచ్చటించాడు ఆ మహిభార్గవుడు.
ఆ తర్వాత అక్కడినుండి సెలవు తీసుకున్నారు సిద్ధపురుషుడు, అభిజిత్, అంకిత, సంజయ్ లు.
ఆ ప్రాంగణం బయటే ఉన్న సైనికుల దగ్గరికొచ్చి సిద్ధపురుషుడు ఇలా అడిగాడు.
"తరువాతి ప్రాకారం ఏది?"
" సూర్యః ప్రాకారం. అతి ముఖ్యమైనది ఇదే. శంభల నగరంలోని ఈ సూర్యః ప్రాకారానికి సూర్యుణ్ణి అమితంగా ఆరాధించే దేవతలు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి బ్రహ్మ ముహూర్తాన విచ్చేసి పూజలు నిర్వహించి వెళ్తూ ఉంటారు", అని చెప్పాడు వాళ్లలో ఒక సైనికుడు.
-----------------------------------------------
శంభల నగరం – 5
సూర్యః ప్రాకారం
సూర్యః ప్రాకారంలో వున్న 7 సువర్ణ అశ్వాలను, రథ సారథి అనూరుడిని, ఆ రథచక్రాన్ని, మండలాన్ని చుట్టూ తిరిగి పరిశీలిస్తున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
"సూర్యుడు రావటానికి ఇంకా అరగంట సమయమున్నది. దయచేసి ఈ సమయాన్ని సూర్యారాధనలోనే గడపండి", అన్నాడు సిద్ధపురుషుడు.
సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మ ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహం ||
ఆ ప్రాకారం చుట్టూతా నలు వైపులా ఆ ఆదిత్యుని మంత్రము సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది.
"స్వామీ మాకు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని, మరియు సూర్యుని గురించి మేము తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలను చెబితే మీ నోట వినాలని మేము అనుకుంటున్నాము", అని ఆ సిద్ధపురుషుణ్ణి అడిగాడు సంజయ్.
"సూర్యుడి నుండే సప్త వర్ణాలు వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 7 అశ్వాలు 7 రంగులని అర్థం.
కశ్యపుడు, అదితికి కలిగిన ద్వాదశ ఆదిత్యులు అంటారు. అందుకే ఆ శ్లోకంలో మీకు కశ్యపాత్మజం అని ఉంటుంది. ఒక సంవత్సరంలో వున్న 12 మాసాలలో ద్వాదశ ఆదిత్యుల శక్తి ఒక్కో మాసంలో ఒక్కోలా ఉంటుంది.
ప్రకృతి సూర్యరశ్మి నుండే శక్తిని పొందుతోంది. ఆ ప్రకృతి నుండి వచ్చిన ఫల, జల, కందమూలాదులు తింటూ మనం పరోక్షంగా సూర్యుని ద్వారానే ఆహారాన్ని పొందుతున్నాము. ధర్మరాజు సూర్యుడిని నిష్ఠతో ప్రార్థిస్తే అక్షయ పాత్రను వరంగా పొందాడు. సమస్త ప్రాణికోటికి ఆహారాన్ని, నీటిని ప్రసాదించేది ఆ సూర్యభగవానుడే కాబట్టి సృష్టికి మూలం అయ్యాడు. అలా సూర్యుడు సృష్టికర్త బ్రహ్మ అయ్యాడు.
వ్యాప్తి చెందినవాడే విష్ణువు అంటారు. అంతటా తన సూర్యప్రభతో వ్యాప్తి చెందినవాడే ఆ భాస్కరుడు.
ఆదిత్యానామహం విష్ణుః
జ్యోతిషాం రవి రంశుమాన్ |
అంటే ఆదిత్యులలో వుండే విష్ణువును నేను , వెలిగించే రవిని నేను అని భగవద్గీతలో మనకు శ్రీ కృష్ణుడే స్వయంగా చెప్పాడు.
అన్నింటా మంగళాన్ని అనగా శుభాన్ని కలిగించే వాడే శివుడు. మన ప్రతీ ఉదయం సూర్యునితోటే మొదలవుతుంది. సూర్యుని కంటే ముందుగానే బ్రాహ్మి ముహూర్తంలో మనం నిద్రలేచి శుచిగా ఆయనను స్వాగతిస్తే అంతకంటే మంగళకరమైన రోజు మరొకటి ఉంటుందా?”, అని అడిగాడు ఆ సిద్ధపురుషుడు.
"బ్రాహ్మీ ముహూర్తం అనగా ఏది స్వామి?" అని అడిగాడు అభిజిత్.
"ఉదయం 3 గంటల నుండి 6 గంటల మధ్యనున్న కాలం", అని బదులిచ్చాడు సిద్ధపురుషుడు.
“ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధః ప్రజాపతిః
అని అగస్త్యుడు రాముడికి చెప్పిన ఆదిత్య హృదయంలో మనకు కనిపిస్తుంది. అనగా సృష్టి, స్థితి, లయ కారకులైన ఆ త్రిమూర్తుల ఆత్మ చైతన్యాన్ని ఒక్క ఆదిత్యునిలోనే మనం దర్శించుకోవచ్చునని అర్థం.
అగ్నిహోత్రంలో ఆహుతులు వెయ్యటం వల్ల అవి శక్తిగా మారతాయి. ఈ భూమి మీదున్న జలములన్నీ సూర్యమండలం అనే అగ్నిలో ఆహుతులు అవుతున్నాయి. మళ్ళీ తిరిగి అవి భూమికి సంపదలు ఇస్తున్నాయి. అందుకే సూర్యుడు యజ్ఞ స్వరూపుడు. అగ్నిహోత్ర స్వరూపుడు.
ఏష చైవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్ని హోత్రిణాం
అని మనకు ఆదిత్య హృదయంలో అగస్త్యుల వారు చెప్పిన రహస్యమిది.
అగస్త్యుని చేత ఆదిత్య హృదయం ఉపదేశింపబడిన మయూరుడు ఆ ప్రేరణతోనే సూర్య శతకం రాసాడు.
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్
అన్న సూక్తి మనందరికీ తెలిసినదే.
అలాంటి సూర్యుడి గురించి ఎన్నని చెప్పను? ఏమని చెప్పను?
ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత.
ఆ సూర్యభగవానుడిని మనం ఈ శంభలలో దర్శించుకోగలుగుతున్నాం అంటే మనమెంతటి అదృష్టవంతులమో మీరే అర్థం చేసుకోండి”, అంటూ చెప్పటం ముగించాడు ఆ సిద్ధపురుషుడు.
సూర్యుడే మూడు వేదాలైన ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలకు నిలయం అంటారు. సూర్య మండలాన్ని ఋగ్వేద స్వరూపముగా, ఆ సూర్య మండలంలోని పురుషుణ్ణి యజుర్వేద స్వరూపముగా, సూర్యకిరణాలను సామవేద స్వరూపముగా చెబుతారు. ఆ ప్రాతః కాల సమయమున ఎందరో ఋషులు శంభలలోని సూర్యః ప్రాకారానికి
విచ్చేసారు.
గంధర్వులు గానం చేస్తున్నారు. వారి స్వరాన్ని సూర్య నామార్చనతో పావనం చేసుకుంటున్నారు. సూర్యుని యందే లీనమైపోయి వారు చేస్తున్న ఆ గానం వింటే ప్రాతః కాల సమయమున సూర్యునికి స్వాగతం పలకని మానవజన్మ వృథా అనిపించింది అభిజిత్, అంకిత, సంజయ్ లకు.
అప్సరసలు తమ నాట్యముతో తమ సూర్యారాధనను అభివ్యక్తీకరిస్తున్నారు. సూర్యుడి మేలుకొలుపు ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా ఉంది వారి నాట్యం. ఆ నాట్యాన్ని చూడటానికే శంభలకు సూర్యుడొచ్చాడేమో అన్నట్టు కళ ఉట్టిపడుతోంది ఆ నాట్య భంగిమలలో.
యక్షులు రథాన్ని ఒక్క చోటికి చేర్చారు. నాగులు రథాన్ని చుట్టుముట్టి ఉన్నారు. రాక్షసులు రథాన్ని వెనుకనుండి తోస్తూ ఉన్నారు. క్రతువు ఋషి సంతానమైన 60,000 మంది వాలఖిల్యులు రథం ముందు నిలిచి సూర్యభగవానుని స్తుతిస్తూ ఉన్నారు. వారు అంగుష్ఠప్రమాణ దేహం కలవారు అనగా బొటనవేలంత పరిమాణంలో ఉంటారు. వేదాలను అభ్యసించిన వారు. బ్రహ్మచారులు. పవిత్రమైన మనసుకలవారు ఈ వాలఖిల్యులు.
ఇంత మంది ఆ సూర్యభగవానుడిని స్తుతిస్తూ ఉండగా ఆ
సూర్యః ప్రాకారం తేజోమయమై దివ్యముగా వెలిగిపోతోంది.
సూర్యభగవానుడు 10 నిమిషాలపాటు అఖండజ్యోతిలా ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్, అంకిత, సంజయ్ లు వారి పాదాలపై మోకరిల్లి ఆ భానుతేజానికి ప్రణమిల్లారు.
సిద్ధపురుషునికి సూర్యుని యందున్న వీరి భక్తి చూసి ఎంతో ముచ్చటేసింది. ఆయన కూడా వారిలో ఒకడై ఆ ప్రభాకరునిలో వున్న విష్ణు శక్తికి తన శిరస్సు వంచి ఏకాంగ నమస్కారం చేసాడు.
-------------------------------------------------------------
శంభల నగరం – 6
విమలః ప్రాకారం - 1
సూర్యః ప్రాకారం నుండి విమలః ప్రాకారం వైపుగా వారి అడుగులు పడ్డాయి. సైనికులిద్దరూ వారికి దారి చూపిస్తూ ఉండగా సంజయ్ ఆ సైనికులను ఇలా అడిగాడు.
"ఈ విమలః ప్రాకారం గురించి మాకు కాస్త చెప్తారా?"
నడుస్తూ ముందుకెళ్తున్న వాళ్ళల్లో ఒకడిలా చెప్పాడు.
" విమలః ప్రాకారంలో మీకు ఎందరో దేవతామూర్తులు కనిపిస్తారు. వాళ్ళందరూ జ్ఞాన ప్రదాతలు. వాళ్ళ గురించి మీరు అక్కడికి వెళ్ళాక సిద్ధపురుషుణ్ణి అడిగి తెలుసుకుంటేనే సబబుగా ఉంటుంది. నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ
విమలః ప్రాకారంలో మీకు ముముక్షువులు కనబడతారు. ఈ ముముక్షువులు అందరూ భూలోకం వారే. పైగా వీళ్లల్లో కళాకారులు, శాస్త్రవేత్తలు, విద్యావంతులు, క్రీడాకారులు, వైద్యులు...ఇలా ఎందరో కనిపిస్తారు. వాళ్ళల్లో మీరు చాలా మందిని గుర్తుపట్టగలుగుతారు. కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టలేరు. అయినప్పటికీ మీరు మాట్లాడే భాష మాత్రం మాట్లాడగలరు.
విమలః ప్రాకారంలో పొద్దున్నే సంగీతం, గానం వినిపిస్తుంది. ఎందరో ప్రసిద్ధ వాయిద్య కారులు పోటీపడి మరీ తమ సంగీత ప్రావీణ్యాన్ని చూపిస్తారు. ఎందరో కవులు కూడా తమ సాహిత్యాన్ని మనకు వారి కంఠం ద్వారా వినిపిస్తారు.
అసలైన విశేషం ఇది కాదు. కొంత మంది అరుదైన ప్రతిభ, శక్తి సామర్ధ్యాలు, సాధన కలిగిన కళాకారులకు మాత్రం ఒక అద్భుతమైన సువర్ణావకాశం దక్కుతుంది. అలాంటి వారు ఒకరో ఇద్దరో ఉంటారు. వీరు తమ కళను, సాహిత్య ప్రతిభను ఎవరి ఎదుట ప్రదర్శిస్తారో తెలుసా?", అని తన నడక ఆపేసి సంజయ్, అభిజిత్, అంకితల దిక్కు చూస్తూ అడిగాడు ఆ సైనికుడు.
ఎవరి ఎదుట ప్రదర్శిస్తారు ? అని అడుగుతున్నట్టు అనిపించేలా ఆ సైనికుడి వైపే ఆశ్చర్యంగా చూసారు వాళ్ళు.
" బాలా త్రిపుర సుందరీ దేవి ఎదుట", అని చెప్పి తన నడకను తిరిగి ప్రారంభించాడు ఆ సైనికుడు.
"ముముక్షువు అంటే ఎవరు స్వామి?" అడిగాడు అభిజిత్
"సాధనలో పరాకాష్ఠను చూసిన వారు....చివరిగా మోక్షం కోసమే ఎదురు చూసేవారెవరైనా సరే ముముక్షువుల కోవలోకే వస్తారు", అని సమాధానమిచ్చాడా సిద్ధపురుషుడు.
"మనం ఈనాడు బాలా త్రిపుర సుందరీ దేవి దర్శనం చేసుకోగలిగితే శంభల నగరంలో మనకు శివుని అనుమతి దొరికినట్టే అనుకోవచ్చు", అన్నాడా సిద్ధపురుషుడు.
"అదెలాగ స్వామీ?" అడిగాడు అభిజిత్.
“బాలా త్రిపుర సుందరీ దేవి అంటే ఎవరనుకున్నావ్? లలితా అమ్మవారి హృదయం నుండి వచ్చిన 9 ఏళ్ళ చిరు ప్రాయమున్న బాలిక. ముగ్ధమనోహర సౌందర్యమున్న శక్తి రూపిణి. దశ మహావిద్యలలో మూడవదైన శ్రీవిద్యకు మూలమే ఈ బాలా త్రిపుర సుందరీ దేవి. ఈవిడ చూపులు మన మీద పడినా చాలు. ఆ శక్తితో మనం ఎంతో సాధించవచ్చు. శంభల రాజ్యంలో మీరు నేర్చుకోవాల్సిన ఎన్నో విద్యలు అతి సులువుగా మీకు ప్రాప్తిస్తాయి", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
"స్వామీ ఈ ప్రాకారానికి విమలః ప్రాకారం అన్న పేరెందుకు వచ్చిందో చెప్తారా?" అడిగాడు సంజయ్.
" విమల అనగా ఎలాంటి మలినం లేనిదని అర్థం. అలా ఏ మాలిన్యము లేకుండా ఉండేది జ్ఞానమే. ఈ ప్రాకారంలో మనకు జ్ఞానం దొరకటం మాత్రమే కాదు, మనలోని అజ్ఞానం కూడా దూరం అయ్యే మార్గం దొరుకుతుంది. అజ్ఞానం అన్నది అంధకారమే. ఆ అంధకారం వున్నప్పుడే మనలో చెడు ప్రవృత్తులు ప్రవేశిస్తాయి. అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారానే ఛేదించాలి. అందుకే ఇక్కడ ఎంతో మంది జ్ఞాన దేవతలు ఉంటారు. ఈ విమలః ప్రాకారం లో వాక్దేవతల గురించి మనకు తెలుస్తుంది. హయగ్రీవుని ఆరాధన మనకు కనిపిస్తుంది. జ్ఞాన సరస్వతీ దేవి ఆరాధన కనిపిస్తుంది. శివపార్వతుల కుమారుడైన షణ్ముఖుని ఆరాధన కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ విమలః ప్రాకారమే శంభల లోని జ్ఞాన నిధి అని చెప్పవచ్చును. పయోనిధి అని కూడా చెప్పవచ్చు", అన్నాడా సిద్ధపురుషుడు.
"స్వామీ, పయోనిధి అంటే?" అంటూ అడగాలా వద్దా అన్నట్టు చూసాడు అభిజిత్
"అనంతమైన సముద్రమని అర్థం. దాశరథి కరుణాపయోనిధీ అన్న దాశరథి శతక పద్యాలు మనందరం విన్నాం కదా", అన్నాడు సిద్ధపురుషుడు.
అంతలోనే విమలః ప్రాకారం చేరుకున్నారు వారు. వీరిని స్వాగతిస్తూ అక్కడికి కొందరు వచ్చారు. వారు శంభల నగర వాసులు.
"మీరు భూలోక వాసులని మాకర్థం అయింది. కొన్ని ఘడియల్లో ఇక్కడ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. మీరు ఇచట ఆసీనులు అవ్వండి", అంటూ వారికి తమ చోటును చూపిస్తూ,"మీరు బిస్మిల్లా ఖాన్ గారి ప్రదర్శనలు భూలోకంలో ఎన్నో సార్లు చూసి ఉంటారు. కానీ ఈ రోజు ఈ శంభలలో మీరు చూడబోయేది మాత్రం
న భూతో న భవిష్యతి అన్న రీతిగా ఉండబోతోంది. ఎందుకంటే బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వినటానికి
బాలా త్రిపుర సుందరీ దేవి స్వయంగా విచ్చేస్తోంది.
శ్రీవిద్యోపాసన ఉంటే గాని మనకు కనబడని ఆ శక్తి రూపిణి కేవలం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి కళను కళ్లారా మనతో కలిసి చూడాలనే తపనతో ఆవిడే స్వయంగా శంభలలోని ఈ విమలః ప్రాకారానికి తరలి వస్తోంది. ఆయన కళ వల్ల మనకు ఆవిడ స్వయం ప్రకటితం అయ్యి కనబడుతోంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. బిస్మిల్లా ఖాన్ లాంటి అనర్ఘరత్నాలకే ఆ అర్హత దక్కుతుంది. ఆయన సాధన అలాంటిది మరి. వారణాసిలోని బాలాజీ మందిరంలో అతి లేత ప్రాయంలో ఆయన సాధన మొదలుపెట్టారు. అక్కడి బాలాజీ శక్తిని ఆయన మాత్రమే గుర్తించగలిగారు. గుడికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. పోతూ ఉంటారు. ఆయన మాత్రం అక్కడే ఉండి కొన్ని గంటల పాటు షెహనాయి సాధన చేసేవారు. ఆ గుడి బయటే ఉండి అక్కడి రాతిని తన చేతితో స్పృశించి దైవీ అనుభూతికి లోనయ్యారు. ఆయన షెహనాయి విన్న పూజారి ఆ రోజుకు ఆయనకు లోటు లేకుండా తినటానికి తన దగ్గరున్నది ఇచ్చేవారట. అలాంటి బిస్మిల్లా ఖాన్ గారు పుట్టిన భారత దేశం నుండి వస్తున్న మీకు మా ధన్యవాదములు", అనేసి అక్కడి నుండి వెళ్లిపోయారు వాళ్ళు.
స్వర్వాహినీ క్షేత్రం
శంభల నగరానికి నాలుగు వైపులా పర్వత శ్రేణులే ఉంటాయి. శంభలలో మొత్తం 18 ప్రాకారాలు ఉంటాయి. 9 ప్రాకారాలు శంభల నగరంలో ఉంటే మిగిలిన 9 శంభల రాజ్యంలో ఉంటాయి. శంభల నగరం, శంభల రాజ్యం వేటికవే రెండూ భిన్న లోకాలలా ఉంటాయి. శంభల నగరంలో జ్ఞానసముపార్జన, దైవసంకీర్తన, శివారాధన ప్రముఖంగా కనిపిస్తే శంభల రాజ్యంలో యుద్ధవిద్యా బోధన, నైపుణ్య పరీక్ష, ధర్మ శాస్త్రాలపై అవగాహన ప్రధానంగా ఉంటాయి.
శంభల నగరంలోని మొదటి ప్రాకారం ఐన స్వర్వాహినీ క్షేత్రంలో ఉన్నారు సంజయ్, అభిజిత్, అంకితలు.
సిద్ధపురుషుడికి కూడా శంభల నగరానికి రావటం ఇదే మొట్టమొదటి సారి కావటంతో చుట్టూ ఒకసారి పరిశీలనగా చూస్తున్నాడు. సైనికులు వీరితో పాటే అక్కడున్నారు.
"ఈ స్వర్వాహినీ క్షేత్రానికి ఎందరో సిద్ధులు, శంభల రాజ్యంలోని రాజులు, మంత్రులు, యోగులు వస్తూ ఉంటారు. ఇదొక నది అంటారు. శంభల చుట్టూతా ఉంటుంది. కానీ మనకు ఇదొక పుష్కరిణిలా కనిపిస్తుంది. ఈ ప్రాకారాన్ని అలా నిర్మించారు. శంభల నగరంలోకి అడుగుపెట్టేవారికి ఇది మొట్టమొదటి ప్రాకారంలా అనిపిస్తుందేమో కానీ ఇది చిట్టచివరిదైన 9వ ప్రాకారం. వికసించిన పద్మానికి ఎలా అయితే దళాలు విచ్చుకుని ఉంటాయో అలానే ఈ 9 ప్రాకారాలు శంభల నగరం మధ్యలో కేంద్రీకృతం అయ్యి ఉన్న శక్తిని ఆలంబనగా చేసుకుని చుట్టూ రక్షణ కవచాలలా వృత్తాకారంలో ఉంటాయి", అని చెప్పాడు వాళ్లలో ఒక సైనికుడు.
"ఈ క్షేత్రం ప్రాముఖ్యత ఏంటి?" అని అభిజిత్ అడిగాడు.
"వాక్కులో ఎలాంటి దోషాలు, అపశబ్దాలు లేకుండా అనవసరమైన ప్రసంగాలు చెయ్యకుండా ఉండాలంటే ఇక్కడికొచ్చి స్వర్వాహినీ దేవిని ప్రార్థించి ఇక్కడి జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే చాలునని అంటూ ఉంటారు శంభలలో", అన్నాడొక సైనికుడు.
"మానవులకు వాక్కులో దోషాలు సహజం. శంభలలో కూడా ఇలాంటివి ఉంటాయా స్వామి?" అంటూ సిద్ధపురుషుణ్ణి అడిగాడు సంజయ్.
"ఎంతటి వారికైనా సరే భగవంతుని గుణగణాల కీర్తన చెయ్యనిదే వాక్కులో పరిపూర్ణమైన శుద్ధి అనేది అసంభవం. అందుకే మనకు అచ్యుతా...అనంతా...గోవిందా అని స్మరించమంటారు", అన్నాడా సిద్ధపురుషుడు.
స్వర్వాహినీ క్షేత్రంలోని నీటిని తీర్థంలా సేవించి అక్కడే కాసేపు ఆసీనులయి వాక్కులో పరిపూర్ణమైన శుద్ధి కొరకు ఆ స్వర్వాహినీ దేవిని ప్రార్థించారు.
"స్వామీ కనకధారాస్తోత్రంలో
…..
స్వర్వాహినీ విమలచారు జల ప్లుతాంగీమ్
అని వస్తుంది కదా. అక్కడ ప్రస్తావించినది ఈ నది గురించేనా?" అని అడిగాడు సంజయ్.
“స్వర్గలోకంలో ఉన్న ఆకాశగంగ మందాకినీ
అనే పేరుతో నదిగా ప్రవహిస్తోంది. శంభల శివుని క్షేత్రం కావటంతో ఇక్కడ అదే ఆకాశగంగ స్వర్వాహినీ
పేరుతో ప్రవహిస్తోంది. ఆదిశంకరుని కనకధారా స్తోత్రంలో చెప్పిన స్వర్వాహినీ విమల చారు జలం ఇదే. నీ ఆలోచనలో ఉన్న లోతు నాకెంతగానో నచ్చింది. ఇలాగే ప్రతీ విషయాన్ని వివేకంతో ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు నీకు బ్రహ్మజ్ఞానం తప్పక లభిస్తుంది”, అంటూ ఆనందంతో సంజయ్ ని చూస్తూ చిరునవ్వు చిందించాడు సిద్ధపురుషుడు.
రెండవ ప్రాకారం ఐన ధనుః ప్రాకారం వైపుగా అడుగులు వేస్తున్నారు సంజయ్, అభిజిత్, అంకితలు. సైనికులు వీళ్లకు దారి చూపిస్తూ ముందుకు వెళుతున్నారు. సిద్ధపురుషుడు సైనికులని అనుసరిస్తూ వారి వెనకే వస్తున్నాడు. సిద్ధపురుషుణ్ణి అనుసరిస్తూ మిగతా ముగ్గురూ తమ అడుగులు ముందుకేస్తున్నారు.
శంభల నగరంలోని ప్రతీ ప్రాకారం వెడల్పు 3 యోజనాలు. 3 యోజనాల దూరం నడిస్తే గాని మరొక ప్రాకారానికి వెళ్లలేము. ప్రతీ ప్రాకారం యొక్క చుట్టుకొలత తగ్గుతూ పోతుంది. ఆ లెక్కన చూస్తే శంభల నగరంలో వున్న 9 ప్రాకారాలలో ఈ
స్వర్వాహినీ క్షేత్రమే అతి పెద్ద చుట్టుకొలత గల ప్రాకారం.
మధ్యలో కేంద్రీకృతం అయ్యి ఉన్న శక్తిపీఠం కిందుండే భూగృహములో చింతామణి అనే దేవమణి ఉంటుంది. ఆ దేవమణిని కోరుకుంటే దొరకని శక్తి లేదు. ఆ దేవమణి కాంతి ప్రసరిస్తే చాలుననుకునే రాజులు ఎందరో ఉన్నారు శంభల చరిత్రలో. ఇంతవరకూ అలాంటి అవసరం కానీ, సందర్భం కానీ ఏ కల్కి రాజుకీ రాలేదు. అనిరుద్ధుల వారికి అలాంటి అరుదైన సువర్ణావకాశాన్ని ఇచ్చేది బహుశా ఈ ముగ్గురేనేమోనని….సంజయ్, అభిజిత్, అంకితలను చూస్తూ మనసులో అనుకుంటున్నాడు సిద్ధపురుషుడు.
---------------------------------------------------
శంభల నగరం – 3
ధనుః ప్రాకారం
"మనస్సును అదుపులో పెట్టుకోవటం అన్నది తేలికగా అబ్బే విద్య కాదు. మనలో ఒక్క రోజులో కొన్ని వేల ఆలోచనలు అలా సముద్రంలోని కెరటాలలా వస్తూ పోతూ ఉంటాయి. మనసుని అలజడికి గురి చేసే విషయాల్ని కట్టడి చేస్తే మరింత ప్రమాదం. దేన్నైనా సరే ఛేదించి, సాధించాలి. అలా ఛేదించాలి అంటే మనలో వుండే అలజడిని తగ్గించే దిశగా మనం అడుగులు వెయ్యాలి. అదొక సాధనలా నిరంతరం సాగాలి. అంతే కానీ మనసుని బలవంతంగా కట్టడి చేస్తే మాత్రం అది పదింతలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఇలాంటి మనసును జ్ఞాన మార్గం వైపుకు నడిపించేదే ఈ ధనుః ప్రాకారం .
శంభల రాజ్యం లోని యోధులు, యోగులు, రాజులు ఎందరో ఈ ధనుః ప్రాకారానికి వచ్చి ఇక్కడ ధనుస్సు ఆకారంలో నిర్మించబడ్డ ఈ ప్రాంగణం అంతా తిరుగుతూ మంత్రాన్ని మననం చేసుకుంటూ 18 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత ఎక్కు పెట్టిన బాణంలా మధ్యలో ఉన్న దారి వెంట నడుస్తూ చివరిదాకా వెళ్లి అక్కడున్న ధ్యాన పీఠము
మీద ఆసీనులవుతారు. ఈ బాణంలా వున్న దారికి ఇరు వైపులా
పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణిలోని నీళ్లు స్వర్వాహినీ క్షేత్రానివే అయినా శివుని ఆలయంలోని భస్మమును ఎప్పటికప్పుడు తెచ్చి ఇక్కడి నీటితో జత చేస్తూ వుంటారు. సృష్టి, స్థితి, లయము లకు అతీతమైన ఒక ప్రపంచం ఈ శంభల నగరం. శివుని ఆజ్ఞను అనుసరించటమే ఇక్కడ పరమావధి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ధ్యాన పీఠాన్ని ఏర్పాటు చేసిన వేదికకు నలుదిక్కులా శివోహం
అని వ్రాయబడి ఉంటుంది. అంటే దానర్థం నీ దారి ఆయన వేసిన దారి. నీ ప్రయాణానికి ఆయనే గమ్యం. నీ ఉనికికి ఆయనే మూలం. నీ లోని జ్ఞానమే ఆయన. ఆయనలోని జ్ఞానమే ఈ అనంతమైన విశ్వం అని.
చిదానంద రూపః శివోహం శివోహం
ధ్యాన పీఠము
మీద ఆసీనులయిన తర్వాత ఉపాసకుడు తన సంకల్పాన్ని, లక్ష్యాన్ని, గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే పూర్తిగా మనసును తాను అనుకున్న లక్ష్యం వైపుగా దిశానిర్దేశం చేసి ఉండటంతో పరిపూర్ణమైన ఏకాగ్రత కుదురుతుంది. ఆ ధ్యాన పీఠము మీదున్నప్పుడే అతనికి అన్ని సమాధానాలు దొరుకుతాయి. అతని ఇచ్చాశక్తిని బట్టి అతనికి కలిగే అనుభూతి ఆధారపడి ఉంటుంది. తీవ్రమైన కోరిక వున్నప్పుడు మాత్రం ఇరువైపులా ఉన్న పుష్కరిణి లోని నీళ్లు 6 అడుగుల ఎత్తుకు ఎగసి పడుతూ ధ్యాన పీఠము మీదున్న ఉపాసకుడిని పునీతం చేస్తాయి. అనగా ఆ ఉపాసకుడు పవిత్రమైన పుష్కరిణి జలంతో ప్రోక్షణ చెయ్యబడ్డట్టు అన్నమాట. సంకల్ప సిద్ధి దొరికినట్టే అనుకోవచ్చు”, అంటూ చెప్పటం ముగించాడు
ధనుః ప్రాకారంలో ఉన్న ఆ ఉద్ధారకుడు.
"స్వామి ఇక్కడ ఆడవారికి కూడా ప్రవేశం ఉన్నదా?" అడిగింది అంకిత.
"సంకల్ప సిద్ధి కోసం చేసే ధ్యానానికి స్త్రీ, పురుష భేదం లేదు తల్లి", అన్నాడా ఉద్ధారకుడు.
"ఇంత క్రితం మీరు ఉపాసకుడు అని మాత్రమే సంబోధించారు. అందుకే ఇంతవరకు ఏ ఉపాసకురాలు ఇక్కడికి రాలేదేమోనని అనుకున్నాను", అని చమత్కారంగా అన్నది అంకిత.
"చాలా సరైన విషయాన్ని ప్రస్తావనకు తెచ్చావమ్మా. ఇక్కడ ఉపాసకుడు అంటే అర్థం పురుషుడు అని కాదు. శివుడు అని. ఎందుకంటే ఈ ధ్యాన పీఠము మీద ఆసీనులై ఎవరు ఉపాసన చేసినా సరే వారిలోని శివుడే జాగృతం అవుతాడు. సర్వం ఆ శివుడికే చెందుతుంది అన్న భావన అది.
శివుడే కర్త, కర్మ, క్రియ అన్న అంతరార్థం", అన్నాడు ఆ ఉద్ధారకుడు.
"ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ ప్రాంగణం మొత్తం తిరుగుతూ పఠించే ఆ మంత్రం ఏమిటి స్వామి?" అడిగాడు సంజయ్
"
సర్వ చైతన్య రూపాంతాం
ఆద్యాం విద్యాంచ ధీమహి
బుద్ధిం యాన: ప్రచోదయాత్
ఈ మంత్రాన్ని మనసులోనే సరిగ్గా 18 సార్లు జపించిన తరువాత మాత్రమే ఆ ధ్యాన పీఠము దగ్గరికి వెళ్లే అర్హత మీకు దొరుకుతుంది", అన్నాడు ఆ ఉద్ధారకుడు.
"మాకు ఇవన్నీ చెయ్యటానికి ఇప్పుడు అనుమతి ఉన్నదా స్వామి?" అని అడిగాడు అభిజిత్.
"దృఢమైన సంకల్పంతో శంభల రాజు అనిరుద్ధుల వారు ఒక రోజు ముందుగానే శివుని ఆలయానికి వచ్చి ఇక్కడి శాస్త్రం ప్రకారం దేవప్రశ్నము వేసిన తర్వాత ఒక శుభ ముహూర్తాన ‘ధనుః ప్రాకారానికి విచ్చేసి సంకల్ప సిద్ధి కొరకు ఇవన్నీ చెయ్యటం జరుగుతుంది. ఎవ్వరైనా ఈ పద్ధతిని అనుసరించాల్సిందే" అని నిర్మొహమాటంగా చెప్పాడు ఆ ఉద్ధారకుడు.
“ఒక ముహూర్తం, ఒక దృఢమైన సంకల్పం, గ్రహబలం లేకుండా ఇక్కడ ప్రదక్షిణలు చెయ్యటానికి వీలు లేదు”, అని కాస్త ఘాటుగానే చెప్పాడాయన.
దీంతో అభిజిత్ వైపు నిరసనగా చూసారు సంజయ్, అంకితలు. సిద్ధపురుషుడు తనకి అలవాటైన నవ్వునే ధరించాడు.
తన ప్రశ్నలతో ఆ ఉద్ధారకుడికి కోపం తెప్పించి తనేమైనా అనుచితంగా ప్రవర్తించానేమోనని అభిజిత్ దిగాలుగా మొహం పెట్టి నిట్టూర్చాడు.
సిద్ధపురుషుడు ఆ విషయాన్ని గ్రహించి, "అభిజిత్ అడగటం వల్లనే కదా ఈ ప్రాకారానికి ఎవరి అనుమతితో రావాలో తెలిసింది. మీరు ఘోర కలిని ఎదుర్కోవటానికి శంభల రాజ్యంలో ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎన్ని శాస్త్రాలు పఠించినా భూలోకం కెళ్ళాక అవన్నీ మీకు గుర్తుండాలి అన్నా, ఆ శక్తులన్నీ మీకు సహకరించాలి అన్నా మనం శంభల నుండి బయలుదేరే ముందు ఖచ్చితంగా ఈ ధనుః ప్రాకారానికే రావాలి. అభిజిత్ ఈ ప్రశ్న అడగటం మంచిదే అయ్యింది" అంటూ ముగించాడు ఆ సిద్ధపురుషుడు.
ఆ ఉద్ధారకుడి నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి ముందుకు కదిలారు. ఒక ప్రాకారానికీ మరొక ప్రాకారానికి మధ్యనున్న దూరం 3 యోజనాలైనా నడుస్తూ వెళ్తున్నప్పుడు అలసట లేదు. కాళ్ళ నొప్పి లేదు. దూరం, దగ్గర అన్న వ్యత్యాసమే తెలియటం లేదు. దారి పొడవునా ఉన్న పాదుకాతీర్థం మహిమో మరేంటో కానీ శంభల నగరంలో ఎంత సేపు నడిచినా, ఎంత దూరం నడిచినా నడుస్తున్నట్టే లేదు. ఏదో శక్తి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నట్టు ఉంది.
వాళ్ళు అక్కడి నుండి సమరః ప్రాకారానికి బయలుదేరారు.
----------------------------------------------------
శంభల నగరం – 4
సమర విజయ రాముని సమరః ప్రాకారం
చేరుకోగానే అక్కడ వారికి ఒక యోధుడి మూర్తి కనిపించింది. ఆ ప్రతిమ ధ్యానం చేస్తున్న భంగిమలో పద్మాసనంలో ఉంది. చూడటానికి ఉగ్రరూపంలో ఉన్న యోధుడిలా ఉంది. ఆ యోధుడి కళ్ళను చూస్తే కేవలం ధ్యానం చేస్తున్నట్టు మాత్రమే లేదు. ఏదో యుద్ధంలో నిర్విరామంగా శత్రువులతో పోరాడుతూ తన ఆగ్రహ జ్వాలలని కళ్ళ నిండా నింపుకున్నట్టు ఉంది. ఎందుకంటే అతను అర్ధనిమీలితనేత్రాలతో ఉన్నాడు. తీక్షణమైన ఆ చూపులను బట్టి అతను ఎవరినో అంతం చెయ్యటానికే దీక్ష పూనాడనిపిస్తోంది. ఎన్నో గాయాలతో రక్తసిక్తమై వున్న అతని దేహాన్ని చూస్తే చురకత్తులతో, బాణాలతో ఆ యోధుడిని దాడి చేసినట్టు అర్థం అవుతోంది. అయినా అది తనపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదని అతని ధీరత్వం మనతో చెబుతున్నట్టు ఉంటుంది. అణువణువూ ధైర్యంతో, వీరత్వంతో, అమరత్వంతో నిండిపోయి మృత్యుదేవతకు ముచ్చెమటలు పట్టించే పోరాటపటిమ తన సొంతం అన్నట్టు ఉన్నాయి అతని చూపులు.
ఆ ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా వుంది. అక్కడున్న నిశ్శబ్దాన్ని చూస్తే ఇప్పటికీ ఆ యోధుని వీరత్వానికి అర్పిస్తున్న నివాళి అదేమో అనిపించేలా ఉంది. సమరః ప్రాకారం మొత్తం ఆ యోధుడిదే అనిపించేలా ఉంది ఆ నిశ్శబ్దం. అక్కడున్న ప్రతీ అంగుళానికి ఆ యోధుడి పరాక్రమం తెలుసేమో అనిపించే నిశ్శబ్దం.
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ యోధుడినే కన్నార్పకుండా చూస్తున్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు కొంచెం దూరంగా నిలబడి ఉన్నారు.
అంతలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆ వృద్ధుడిని చూడగానే సైనికులిద్దరూ ప్రణామం చేశారు. సిద్ధపురుషుడు కూడా నమస్కరించాడు.
ఆ వృద్ధుడు ఎప్పటిలానే యథావిధిగా తన ఆసనం చూసుకుని అక్కడే స్థిరపడి ఆ యోధుడి ప్రతిమను చూస్తూ ఏదో మంత్రం జపిస్తూ వున్నాడు. ఇంతలో ఏదో జ్ఞప్తికి వచ్చినట్టు అనిపించి
సమరవిజయ రామా
సమరవిజయ రామా
సమరవిజయ రామా
అంటూ తన్మయత్వంతో తన కళ్ళ ముందే యుద్ధరంగం కనిపించినట్టు అనిపించి ఆ యోధుని ప్రతిమ దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి అక్కడున్న పూలను ఆ మూర్తీభవించిన వీరత్వానికి ప్రతీకగా సమర్పించి అక్కడున్న గంధపు జలంతో ఆ యోధుని పాదాలను పరిశుద్ధి చేసాడు ఆ వృద్ధుడు.
తిరిగి తన ఆసనం దగ్గరికి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అభిజిత్, అంకిత, సంజయ్ లను ఇటు రమ్మని సైగ చేసాడు. సిద్ధపురుషుని వైపు భక్తి భావంతో చూస్తూ ఆహ్వానించాడు. అక్కడున్న ఇద్దరు సైనికులకు విషయం అర్థం అయిపోయి ఆ ప్రాంగణం నుండి బయటికి వెళ్లిపోయారు.
ఆ వృద్ధుడు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.
"నా పేరు మహిభార్గవుడు. శంభల నగరంలో మీకు కనిపించే భూలోకవాసిని నేను. ఇక్కడ మీరు చూస్తున్న ఆ యోధుడిని గాయాలతో రక్తసిక్తమై వున్న స్థితిలో పార్థివ శరీరంగా వున్న తనని భూలోకం నుండి ఇక్కడకు తీసుకునివచ్చే ఆ మహాభాగ్యాన్ని పొందాను. శంభలకు వచ్చి నేనూ అమరుణ్ణి ఐపోయాను. నాకు ఆనాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవదేవుడు ఆ శ్రీకృష్ణుడే", అన్నాడు ఆ వృద్ధుడు.
"స్వామీ ఆ యోధుడి వీరగాథను సవివరంగా మాకు చెప్తారా?" అని అడిగాడు సంజయ్.
"అది చెప్పటానికే మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాను.
మీరు చూస్తున్న ఆ యోధుడి విగ్రహం సామాన్యమైనది కాదు. అది ఏ లోహంతో నిర్మితమైందో ఇప్పటిదాకా శంభలలో ఎవ్వరికీ తెలీదు.
దేవశిల్పి విశ్వకర్మ ప్రత్యేకంగా 3 మాసములు కేటాయించి ఆ యోధుని మూర్తిని సృజించాడు. మూర్తీభవించిన ఆ వీరత్వానికి ప్రాణప్రతిష్ట చేసాడు ఆ మాహానుభావుడు.
మీకిప్పుడు ఆ యోధుడి గురించి చెబుతాను. జాగ్రత్తగా వినండి", అంటూ ఇలా ఆ యోధుని వీరగాథను చెప్పసాగాడు ఆ మహిభార్గవుడు.
సమరవిజయ రాముడు శంభల నగరంలోని ఈ ప్రాకారంలోనే పెరిగాడు. అతని తల్లి రామ భక్తురాలు. ఈ యోధుడి సమరవిజయ రామ అన్న నామధేయం వెనుక ఉన్న బలమైన శక్తికి మూలం ఆవిడ మాతృ ప్రేమ, భక్తి.
సమరవిజయుడు కూడా తన తల్లిలానే రామభక్తుడు. అతి చిన్న వయసులోనే యుద్ధవిద్యలన్నీ నేర్చుకుని ఆరితేరిన వాడు. తనకు రాముని దర్శన భాగ్యం కావాలని పరితపించిపోయేవాడు. రామనామం జపిస్తూ ఎంతో కఠినమైన తపస్సును ఆచరించాడు. ఆహారం, నిద్ర ఏవీ లేకుండా కొన్ని నెలలు గడిపాడు. అయినా రాముడు కరుణించలేదు. అప్పుడు ఒక యోగి సమరవిజయుని చెంతకు వచ్చి శివుణ్ణి తపస్సు చెయ్యమని కోరాడు.
శివుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ తపం ఆచరించాడు.
ఒక రోజు శివుడు ప్రత్యక్షం అయ్యి సమరవిజయుణ్ణి ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ సమరవిజయుడు తనకు ఆ రాముని దర్శన భాగ్యం కలగాలనీ, అలాగే తన యుద్ధవిద్యా నైపుణ్యం వ్యర్థం అవ్వకుండా అదంతా ఆ రాముడికే ఉపయుక్తం అవ్వాలనీ, యుద్ధంలోనే అమరుడై శంభల చరిత్రలో తాను యోధుడిగానే మిగిలిపోవాలనీ కోరాడు.
రామదర్శనం తప్పక దొరుకుతుందని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. ఆ రోజు నుండి రామదర్శనం కోసమే ఎదురు చూస్తూ ఎన్నో ఏళ్ళు గడిపాడు ఆ సమరవిజయ రాముడు. అన్ని ఏళ్లలో అతను ఏ నాడూ రామనామ జపాన్ని వదిలిపెట్టలేదు.
కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు శ్రీ కృష్ణుడు శంభల నగరానికి విచ్చేశాడు. సమరవిజయ రాముణ్ణి కలవటం కోసమే ఆయన ఇంత దూరం వచ్చాడు.
శ్రీకృష్ణుడిని చూడగానే సమరవిజయ రాముడు కంటతడి పెట్టుకున్నాడు. రాముడి దర్శనం తను కోరుకుంటే శ్రీ కృష్ణుని రూపంలో తన జన్మ తరింపజెయ్యటానికి వచ్చినందుకు భావోద్వేగానికి లోనయ్యాడు సమరవిజయుడు.
"మా అమ్మ తన జన్మను మీకే ధారబోసింది స్వామీ. మీ నామస్మరణే నా అంతిమ లక్ష్యంగా నన్ను పెంచింది. ఇన్నాళ్టికి నన్ను కరుణించారా స్వామీ", అంటూ శ్రీ కృష్ణుని పాదారవిందములకు శిరస్సువంచి నమస్కరించాడు ఆ సమరవిజయుడు.
-----------------------------------------------------
"నీ అంతిమ లక్ష్యం నేను కాదు సమరవిజయా. ఇన్నాళ్లూ నీ చేత నా నామ స్మరణ చేయించింది నీలోని యోధుడికి పెట్టిన పరీక్ష. నీలోని భక్తుడికి ఎలాంటి పరీక్షా లేదు. మీ అమ్మ గారి ద్వారా నీకు సంక్రమించిన ఆస్తి విష్ణు పథము. అసలైన పరీక్షలో నువ్వు ఇప్పుడు నెగ్గావు కాబట్టే నిన్ను వెతుక్కుంటూ భూలోకం నుండి నేను వచ్చాను.
కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల సైన్యాన్ని ఎదుర్కోవటం అంత సులభమైన పని కాదు. అందుకు నాకొక యోధుడు కావాలి. శివుణ్ణి నువ్వు కోరుకున్న మూడు కోరికల్లో మొదటిది నా దర్శనంతో ఈనాడు తీరిపోయింది. మిగిలిన రెండు కోరికలూ తీరే అవకాశం నీకిప్పుడు దొరికింది. నిన్ను కురుక్షేత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టమని ఆదేశించను. నా భక్తుడవు నీవు. నేను నిన్ను అర్థిస్తున్నాను. నీకు సమ్మతం అయితేనే రా. లేనిచో ఆనందంగా తిరిగి వచ్చిన దారినే నే వెళ్లెదను", అన్నాడు శ్రీ కృష్ణుడు.
"స్వామీ, మీరు ఈ సమరవిజయుణ్ణి అర్థించటం ఏంటి? మీ కోసం యుద్ధంలో నా ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడిన వాణ్ణి. నన్ను ఆజ్ఞాపించండి", అన్నాడు ఆ సమరవిజయుడు.
అలా కురుక్షేత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టాడు ఆ సమరవిజయుడు. శంభల నుండి భూలోకంలోకి వచ్చిన ఆ సమరవిజయుడు ఒక్క యోధుడిగా కాక 100 మంది యోధులలా రూపాంతరం చెందాడు. సమరవిజయునికి ఉన్న శక్తికి 1000 మందిని ఒకేసారి ఎదుర్కోగలడు.
సమరవిజయుణ్ణి ఒకే యోధుడిగా రంగంలోకి తెస్తే దుర్యోధనుడికి అనుమానం వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నది. అందుకే శ్రీ కృష్ణుడు తెలివిగా సమరవిజయుని నుండి 100 మంది వేర్వేరు యోధులను సృష్టించాడు. ఆ సమరవిజయుని యుద్ధశక్తిని 100 భాగాలుగా విభజించి ఈ 100 మందినీ సృజించాడు. 100 మందికీ వేర్వేరు ముఖాలు, వేర్వేరు యుద్ధ నైపుణ్యాలు ఉన్నా వారిలో ఉండే ఆత్మచైతన్యం ఒక్కటే. అదే సమరవిజయ రామ.
కదనరంగంలో ఈ 100 మంది 1000 మందితో సమానం.
అనగా ఒకే ఒక్కడైన సమరవిజయ రాముడే వెయ్యి మంది వున్న ఆ సైన్యాన్ని చీల్చి చెండాడగలడని దానర్థం.
ఆ రోజు కురుక్షేత్రంలో సమరవిజయుడు చూపించిన తెగువకి ఎవ్వరికీ నోట మాట రాలేదు. 1000 మందిని మట్టి కరిపించటం అంటే మాటలా!
ఆ రోజున ఆ 1000 మంది కౌరవ సైన్యానికీ యుద్ధభూమిలో వారి ఎదుటనున్న 100 మంది యోధులలోనూ సమరవిజయుడొక్కడే కనిపించటంతో మాయకు గురయ్యారు. వాళ్లకేం తెలుసు ఆ ఒక్కడిలోనే 100 మంది ఉన్నారని....ఆ వంద మంది ఒక్కడి నుంచే వచ్చారని.
శంభల నగరంలోని అతి పెద్ద రహస్యం ఇది. ఎవరికైనా చెప్పినా నమ్మశక్యం కాని వీరత్వం సమరవిజయ రాముడిది. అలాంటి యోధుడు మరొకడు పుట్టడు. ఆ ధీరత్వాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కళ్లారా చూసిన నేనే నా కళ్ళను నమ్మలేకపోయా. నేను అంతవరకు ఇలాంటి ధీరుని గురించి ఇలలో వినలేదు. కలలో కనలేదు. అందుకే ఆ సమరవిజయున్నే చూస్తూ ఉండిపోయా. ఆ రోజు సంగ్రామం పరిసమాప్తి అయినది. 1000 మందినీ మట్టికరిపించాడు. వారి సైన్యం అలా వారి కళ్ళముందే కుప్పకూలిపోవటం తట్టుకోలేక కౌరవులు యుద్ధభూమి నుండి నిష్క్రమించారు. 1000 మంది వున్న ఆ కౌరవుల సైన్యాన్ని హతమార్చిన తర్వాత ఆ 100 మంది యోధులు తమ ఉనికిని కోల్పోతూ వచ్చారు. యుద్ధభూమి యందు ఆ 100 మందికి బదులుగా ఇప్పుడు ఒక్కడే మిగిలాడు. అతనే ఇప్పుడు మీరిక్కడ ప్రతిమలో చూస్తున్న ఆ సమరవిజయ రాముడు. మీరిక్కడ చూస్తున్నట్టే నాకు ఆ నాడు యుద్ధభూమిలో కనిపించాడు. తన ముఖం నిండా గాయాలతో, కత్తులు, బాణాలతో రక్తసిక్తమై కనిపించిన వీరాధి వీరుడు. నా హృదయం ద్రవించిపోయింది. ఆయన పాదాల మీద పడ్డాను. నీ లాంటి యోధుడిని నేనెక్కడా చూడలేదని చెప్పాను. ఉద్వేగానికి గురయ్యాను. అంతలో అక్కడికి శ్రీ కృష్ణుడు విచ్చేశాడు. శంభల నగరానికి ఈ సమరవిజయుణ్ణి తీసుకుని వెళ్లే అదృష్టాన్ని నాకిచ్చాడు. అక్కడి వారికి సమరుని వీరత్వాన్ని చాటి చెబుతూ
సమరః ప్రాకారాన్ని నిర్మించే ప్రతిపాదనను శంభల రాజు ముందు పెట్టాను. అలా ఈ నాడు సమరవిజయుడు తన బాల్యం నుండి ఎదుగుతూ వచ్చిన ఈ చోటే
సమరః ప్రాకారంగా మారిపోయింది. ఎంతో ఖ్యాతిని గడించింది", అంటూ చెప్పటం ముగించాడు ఆ మహిభార్గవుడు.
జీవితంలో అలాంటి యోధుడి గురించి ఎప్పుడూ వినని అభిజిత్, అంకిత, సంజయ్ లకు కళ్ళనిండా నీరు నిండిపోయింది. ఉద్వేగంతో. ఇంకేం మాట్లాడాలో తెలియని స్థితి అది.
ధైర్యానికీ, వీరత్వానికీ, యుద్ధనైపుణ్యానికీ పరాకాష్ఠ ఆ రోజు కురుక్షేత్ర మహాసంగ్రామంలో సమరవిజయ రాముడు సృష్టించిన చరిత్ర. అలాంటి అరుదైన రహస్యాన్ని మహిభార్గవుడి ద్వారా తెలుసుకోవటం పూర్వజన్మ సుకృతమే అని వాళ్లకు అనిపించింది.
సిద్ధపురుషుడితో కాసేపు ముచ్చటించాడు ఆ మహిభార్గవుడు.
ఆ తర్వాత అక్కడినుండి సెలవు తీసుకున్నారు సిద్ధపురుషుడు, అభిజిత్, అంకిత, సంజయ్ లు.
ఆ ప్రాంగణం బయటే ఉన్న సైనికుల దగ్గరికొచ్చి సిద్ధపురుషుడు ఇలా అడిగాడు.
"తరువాతి ప్రాకారం ఏది?"
" సూర్యః ప్రాకారం. అతి ముఖ్యమైనది ఇదే. శంభల నగరంలోని ఈ సూర్యః ప్రాకారానికి సూర్యుణ్ణి అమితంగా ఆరాధించే దేవతలు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి బ్రహ్మ ముహూర్తాన విచ్చేసి పూజలు నిర్వహించి వెళ్తూ ఉంటారు", అని చెప్పాడు వాళ్లలో ఒక సైనికుడు.
-----------------------------------------------
శంభల నగరం – 5
సూర్యః ప్రాకారం
సూర్యః ప్రాకారంలో వున్న 7 సువర్ణ అశ్వాలను, రథ సారథి అనూరుడిని, ఆ రథచక్రాన్ని, మండలాన్ని చుట్టూ తిరిగి పరిశీలిస్తున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
"సూర్యుడు రావటానికి ఇంకా అరగంట సమయమున్నది. దయచేసి ఈ సమయాన్ని సూర్యారాధనలోనే గడపండి", అన్నాడు సిద్ధపురుషుడు.
సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మ ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహం ||
ఆ ప్రాకారం చుట్టూతా నలు వైపులా ఆ ఆదిత్యుని మంత్రము సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది.
"స్వామీ మాకు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని, మరియు సూర్యుని గురించి మేము తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలను చెబితే మీ నోట వినాలని మేము అనుకుంటున్నాము", అని ఆ సిద్ధపురుషుణ్ణి అడిగాడు సంజయ్.
"సూర్యుడి నుండే సప్త వర్ణాలు వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 7 అశ్వాలు 7 రంగులని అర్థం.
కశ్యపుడు, అదితికి కలిగిన ద్వాదశ ఆదిత్యులు అంటారు. అందుకే ఆ శ్లోకంలో మీకు కశ్యపాత్మజం అని ఉంటుంది. ఒక సంవత్సరంలో వున్న 12 మాసాలలో ద్వాదశ ఆదిత్యుల శక్తి ఒక్కో మాసంలో ఒక్కోలా ఉంటుంది.
ప్రకృతి సూర్యరశ్మి నుండే శక్తిని పొందుతోంది. ఆ ప్రకృతి నుండి వచ్చిన ఫల, జల, కందమూలాదులు తింటూ మనం పరోక్షంగా సూర్యుని ద్వారానే ఆహారాన్ని పొందుతున్నాము. ధర్మరాజు సూర్యుడిని నిష్ఠతో ప్రార్థిస్తే అక్షయ పాత్రను వరంగా పొందాడు. సమస్త ప్రాణికోటికి ఆహారాన్ని, నీటిని ప్రసాదించేది ఆ సూర్యభగవానుడే కాబట్టి సృష్టికి మూలం అయ్యాడు. అలా సూర్యుడు సృష్టికర్త బ్రహ్మ అయ్యాడు.
వ్యాప్తి చెందినవాడే విష్ణువు అంటారు. అంతటా తన సూర్యప్రభతో వ్యాప్తి చెందినవాడే ఆ భాస్కరుడు.
ఆదిత్యానామహం విష్ణుః
జ్యోతిషాం రవి రంశుమాన్ |
అంటే ఆదిత్యులలో వుండే విష్ణువును నేను , వెలిగించే రవిని నేను అని భగవద్గీతలో మనకు శ్రీ కృష్ణుడే స్వయంగా చెప్పాడు.
అన్నింటా మంగళాన్ని అనగా శుభాన్ని కలిగించే వాడే శివుడు. మన ప్రతీ ఉదయం సూర్యునితోటే మొదలవుతుంది. సూర్యుని కంటే ముందుగానే బ్రాహ్మి ముహూర్తంలో మనం నిద్రలేచి శుచిగా ఆయనను స్వాగతిస్తే అంతకంటే మంగళకరమైన రోజు మరొకటి ఉంటుందా?”, అని అడిగాడు ఆ సిద్ధపురుషుడు.
"బ్రాహ్మీ ముహూర్తం అనగా ఏది స్వామి?" అని అడిగాడు అభిజిత్.
"ఉదయం 3 గంటల నుండి 6 గంటల మధ్యనున్న కాలం", అని బదులిచ్చాడు సిద్ధపురుషుడు.
“ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధః ప్రజాపతిః
అని అగస్త్యుడు రాముడికి చెప్పిన ఆదిత్య హృదయంలో మనకు కనిపిస్తుంది. అనగా సృష్టి, స్థితి, లయ కారకులైన ఆ త్రిమూర్తుల ఆత్మ చైతన్యాన్ని ఒక్క ఆదిత్యునిలోనే మనం దర్శించుకోవచ్చునని అర్థం.
అగ్నిహోత్రంలో ఆహుతులు వెయ్యటం వల్ల అవి శక్తిగా మారతాయి. ఈ భూమి మీదున్న జలములన్నీ సూర్యమండలం అనే అగ్నిలో ఆహుతులు అవుతున్నాయి. మళ్ళీ తిరిగి అవి భూమికి సంపదలు ఇస్తున్నాయి. అందుకే సూర్యుడు యజ్ఞ స్వరూపుడు. అగ్నిహోత్ర స్వరూపుడు.
ఏష చైవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్ని హోత్రిణాం
అని మనకు ఆదిత్య హృదయంలో అగస్త్యుల వారు చెప్పిన రహస్యమిది.
అగస్త్యుని చేత ఆదిత్య హృదయం ఉపదేశింపబడిన మయూరుడు ఆ ప్రేరణతోనే సూర్య శతకం రాసాడు.
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్
అన్న సూక్తి మనందరికీ తెలిసినదే.
అలాంటి సూర్యుడి గురించి ఎన్నని చెప్పను? ఏమని చెప్పను?
ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత.
ఆ సూర్యభగవానుడిని మనం ఈ శంభలలో దర్శించుకోగలుగుతున్నాం అంటే మనమెంతటి అదృష్టవంతులమో మీరే అర్థం చేసుకోండి”, అంటూ చెప్పటం ముగించాడు ఆ సిద్ధపురుషుడు.
సూర్యుడే మూడు వేదాలైన ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలకు నిలయం అంటారు. సూర్య మండలాన్ని ఋగ్వేద స్వరూపముగా, ఆ సూర్య మండలంలోని పురుషుణ్ణి యజుర్వేద స్వరూపముగా, సూర్యకిరణాలను సామవేద స్వరూపముగా చెబుతారు. ఆ ప్రాతః కాల సమయమున ఎందరో ఋషులు శంభలలోని సూర్యః ప్రాకారానికి
విచ్చేసారు.
గంధర్వులు గానం చేస్తున్నారు. వారి స్వరాన్ని సూర్య నామార్చనతో పావనం చేసుకుంటున్నారు. సూర్యుని యందే లీనమైపోయి వారు చేస్తున్న ఆ గానం వింటే ప్రాతః కాల సమయమున సూర్యునికి స్వాగతం పలకని మానవజన్మ వృథా అనిపించింది అభిజిత్, అంకిత, సంజయ్ లకు.
అప్సరసలు తమ నాట్యముతో తమ సూర్యారాధనను అభివ్యక్తీకరిస్తున్నారు. సూర్యుడి మేలుకొలుపు ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా ఉంది వారి నాట్యం. ఆ నాట్యాన్ని చూడటానికే శంభలకు సూర్యుడొచ్చాడేమో అన్నట్టు కళ ఉట్టిపడుతోంది ఆ నాట్య భంగిమలలో.
యక్షులు రథాన్ని ఒక్క చోటికి చేర్చారు. నాగులు రథాన్ని చుట్టుముట్టి ఉన్నారు. రాక్షసులు రథాన్ని వెనుకనుండి తోస్తూ ఉన్నారు. క్రతువు ఋషి సంతానమైన 60,000 మంది వాలఖిల్యులు రథం ముందు నిలిచి సూర్యభగవానుని స్తుతిస్తూ ఉన్నారు. వారు అంగుష్ఠప్రమాణ దేహం కలవారు అనగా బొటనవేలంత పరిమాణంలో ఉంటారు. వేదాలను అభ్యసించిన వారు. బ్రహ్మచారులు. పవిత్రమైన మనసుకలవారు ఈ వాలఖిల్యులు.
ఇంత మంది ఆ సూర్యభగవానుడిని స్తుతిస్తూ ఉండగా ఆ
సూర్యః ప్రాకారం తేజోమయమై దివ్యముగా వెలిగిపోతోంది.
సూర్యభగవానుడు 10 నిమిషాలపాటు అఖండజ్యోతిలా ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్, అంకిత, సంజయ్ లు వారి పాదాలపై మోకరిల్లి ఆ భానుతేజానికి ప్రణమిల్లారు.
సిద్ధపురుషునికి సూర్యుని యందున్న వీరి భక్తి చూసి ఎంతో ముచ్చటేసింది. ఆయన కూడా వారిలో ఒకడై ఆ ప్రభాకరునిలో వున్న విష్ణు శక్తికి తన శిరస్సు వంచి ఏకాంగ నమస్కారం చేసాడు.
-------------------------------------------------------------
శంభల నగరం – 6
విమలః ప్రాకారం - 1
సూర్యః ప్రాకారం నుండి విమలః ప్రాకారం వైపుగా వారి అడుగులు పడ్డాయి. సైనికులిద్దరూ వారికి దారి చూపిస్తూ ఉండగా సంజయ్ ఆ సైనికులను ఇలా అడిగాడు.
"ఈ విమలః ప్రాకారం గురించి మాకు కాస్త చెప్తారా?"
నడుస్తూ ముందుకెళ్తున్న వాళ్ళల్లో ఒకడిలా చెప్పాడు.
" విమలః ప్రాకారంలో మీకు ఎందరో దేవతామూర్తులు కనిపిస్తారు. వాళ్ళందరూ జ్ఞాన ప్రదాతలు. వాళ్ళ గురించి మీరు అక్కడికి వెళ్ళాక సిద్ధపురుషుణ్ణి అడిగి తెలుసుకుంటేనే సబబుగా ఉంటుంది. నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ
విమలః ప్రాకారంలో మీకు ముముక్షువులు కనబడతారు. ఈ ముముక్షువులు అందరూ భూలోకం వారే. పైగా వీళ్లల్లో కళాకారులు, శాస్త్రవేత్తలు, విద్యావంతులు, క్రీడాకారులు, వైద్యులు...ఇలా ఎందరో కనిపిస్తారు. వాళ్ళల్లో మీరు చాలా మందిని గుర్తుపట్టగలుగుతారు. కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టలేరు. అయినప్పటికీ మీరు మాట్లాడే భాష మాత్రం మాట్లాడగలరు.
విమలః ప్రాకారంలో పొద్దున్నే సంగీతం, గానం వినిపిస్తుంది. ఎందరో ప్రసిద్ధ వాయిద్య కారులు పోటీపడి మరీ తమ సంగీత ప్రావీణ్యాన్ని చూపిస్తారు. ఎందరో కవులు కూడా తమ సాహిత్యాన్ని మనకు వారి కంఠం ద్వారా వినిపిస్తారు.
అసలైన విశేషం ఇది కాదు. కొంత మంది అరుదైన ప్రతిభ, శక్తి సామర్ధ్యాలు, సాధన కలిగిన కళాకారులకు మాత్రం ఒక అద్భుతమైన సువర్ణావకాశం దక్కుతుంది. అలాంటి వారు ఒకరో ఇద్దరో ఉంటారు. వీరు తమ కళను, సాహిత్య ప్రతిభను ఎవరి ఎదుట ప్రదర్శిస్తారో తెలుసా?", అని తన నడక ఆపేసి సంజయ్, అభిజిత్, అంకితల దిక్కు చూస్తూ అడిగాడు ఆ సైనికుడు.
ఎవరి ఎదుట ప్రదర్శిస్తారు ? అని అడుగుతున్నట్టు అనిపించేలా ఆ సైనికుడి వైపే ఆశ్చర్యంగా చూసారు వాళ్ళు.
" బాలా త్రిపుర సుందరీ దేవి ఎదుట", అని చెప్పి తన నడకను తిరిగి ప్రారంభించాడు ఆ సైనికుడు.
"ముముక్షువు అంటే ఎవరు స్వామి?" అడిగాడు అభిజిత్
"సాధనలో పరాకాష్ఠను చూసిన వారు....చివరిగా మోక్షం కోసమే ఎదురు చూసేవారెవరైనా సరే ముముక్షువుల కోవలోకే వస్తారు", అని సమాధానమిచ్చాడా సిద్ధపురుషుడు.
"మనం ఈనాడు బాలా త్రిపుర సుందరీ దేవి దర్శనం చేసుకోగలిగితే శంభల నగరంలో మనకు శివుని అనుమతి దొరికినట్టే అనుకోవచ్చు", అన్నాడా సిద్ధపురుషుడు.
"అదెలాగ స్వామీ?" అడిగాడు అభిజిత్.
“బాలా త్రిపుర సుందరీ దేవి అంటే ఎవరనుకున్నావ్? లలితా అమ్మవారి హృదయం నుండి వచ్చిన 9 ఏళ్ళ చిరు ప్రాయమున్న బాలిక. ముగ్ధమనోహర సౌందర్యమున్న శక్తి రూపిణి. దశ మహావిద్యలలో మూడవదైన శ్రీవిద్యకు మూలమే ఈ బాలా త్రిపుర సుందరీ దేవి. ఈవిడ చూపులు మన మీద పడినా చాలు. ఆ శక్తితో మనం ఎంతో సాధించవచ్చు. శంభల రాజ్యంలో మీరు నేర్చుకోవాల్సిన ఎన్నో విద్యలు అతి సులువుగా మీకు ప్రాప్తిస్తాయి", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
"స్వామీ ఈ ప్రాకారానికి విమలః ప్రాకారం అన్న పేరెందుకు వచ్చిందో చెప్తారా?" అడిగాడు సంజయ్.
" విమల అనగా ఎలాంటి మలినం లేనిదని అర్థం. అలా ఏ మాలిన్యము లేకుండా ఉండేది జ్ఞానమే. ఈ ప్రాకారంలో మనకు జ్ఞానం దొరకటం మాత్రమే కాదు, మనలోని అజ్ఞానం కూడా దూరం అయ్యే మార్గం దొరుకుతుంది. అజ్ఞానం అన్నది అంధకారమే. ఆ అంధకారం వున్నప్పుడే మనలో చెడు ప్రవృత్తులు ప్రవేశిస్తాయి. అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారానే ఛేదించాలి. అందుకే ఇక్కడ ఎంతో మంది జ్ఞాన దేవతలు ఉంటారు. ఈ విమలః ప్రాకారం లో వాక్దేవతల గురించి మనకు తెలుస్తుంది. హయగ్రీవుని ఆరాధన మనకు కనిపిస్తుంది. జ్ఞాన సరస్వతీ దేవి ఆరాధన కనిపిస్తుంది. శివపార్వతుల కుమారుడైన షణ్ముఖుని ఆరాధన కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ విమలః ప్రాకారమే శంభల లోని జ్ఞాన నిధి అని చెప్పవచ్చును. పయోనిధి అని కూడా చెప్పవచ్చు", అన్నాడా సిద్ధపురుషుడు.
"స్వామీ, పయోనిధి అంటే?" అంటూ అడగాలా వద్దా అన్నట్టు చూసాడు అభిజిత్
"అనంతమైన సముద్రమని అర్థం. దాశరథి కరుణాపయోనిధీ అన్న దాశరథి శతక పద్యాలు మనందరం విన్నాం కదా", అన్నాడు సిద్ధపురుషుడు.
అంతలోనే విమలః ప్రాకారం చేరుకున్నారు వారు. వీరిని స్వాగతిస్తూ అక్కడికి కొందరు వచ్చారు. వారు శంభల నగర వాసులు.
"మీరు భూలోక వాసులని మాకర్థం అయింది. కొన్ని ఘడియల్లో ఇక్కడ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. మీరు ఇచట ఆసీనులు అవ్వండి", అంటూ వారికి తమ చోటును చూపిస్తూ,"మీరు బిస్మిల్లా ఖాన్ గారి ప్రదర్శనలు భూలోకంలో ఎన్నో సార్లు చూసి ఉంటారు. కానీ ఈ రోజు ఈ శంభలలో మీరు చూడబోయేది మాత్రం
న భూతో న భవిష్యతి అన్న రీతిగా ఉండబోతోంది. ఎందుకంటే బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వినటానికి
బాలా త్రిపుర సుందరీ దేవి స్వయంగా విచ్చేస్తోంది.
శ్రీవిద్యోపాసన ఉంటే గాని మనకు కనబడని ఆ శక్తి రూపిణి కేవలం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి కళను కళ్లారా మనతో కలిసి చూడాలనే తపనతో ఆవిడే స్వయంగా శంభలలోని ఈ విమలః ప్రాకారానికి తరలి వస్తోంది. ఆయన కళ వల్ల మనకు ఆవిడ స్వయం ప్రకటితం అయ్యి కనబడుతోంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. బిస్మిల్లా ఖాన్ లాంటి అనర్ఘరత్నాలకే ఆ అర్హత దక్కుతుంది. ఆయన సాధన అలాంటిది మరి. వారణాసిలోని బాలాజీ మందిరంలో అతి లేత ప్రాయంలో ఆయన సాధన మొదలుపెట్టారు. అక్కడి బాలాజీ శక్తిని ఆయన మాత్రమే గుర్తించగలిగారు. గుడికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. పోతూ ఉంటారు. ఆయన మాత్రం అక్కడే ఉండి కొన్ని గంటల పాటు షెహనాయి సాధన చేసేవారు. ఆ గుడి బయటే ఉండి అక్కడి రాతిని తన చేతితో స్పృశించి దైవీ అనుభూతికి లోనయ్యారు. ఆయన షెహనాయి విన్న పూజారి ఆ రోజుకు ఆయనకు లోటు లేకుండా తినటానికి తన దగ్గరున్నది ఇచ్చేవారట. అలాంటి బిస్మిల్లా ఖాన్ గారు పుట్టిన భారత దేశం నుండి వస్తున్న మీకు మా ధన్యవాదములు", అనేసి అక్కడి నుండి వెళ్లిపోయారు వాళ్ళు.