Update 07
సిద్ధపురుషుడి కళ్ళు చెమర్చాయి.
"ఆ మహానుభావుడిది ఎంతటి గొప్ప అదృష్టం. కళలకు, జ్ఞానానికి నిలయమైన ఆ బాలా త్రిపుర సుందరీ దేవి ఎదుట తన కళను ప్రదర్శించటమా! ఇతను సామాన్య మానవుడు కాదు. సంజయ్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి నీకు తెలిసింది చెప్తావా? ఆయన గురించి నాకు ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది", అని అడిగాడు సిద్ధపురుషుడు.
సంజయ్ కి బిస్మిల్లా ఖాన్ గారి గురించి పెద్దగా తెలియదు.
"మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్తాను స్వామీ", అన్నాడు అభిజిత్.
"ఎవరైతే ఏముంది? ఆ మాహానుభావుడి గురించి తెలుసుకోవటమే నాకు ముఖ్యం. చెప్పు, అభిజిత్", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
"బిస్మిల్లా ఖాన్ గారికి భారత రత్న అనే గొప్ప గౌరవాన్ని ఇచ్చింది భారత కేంద్ర ప్రభుత్వం. ఎంతో మందికి భారత రత్న వచ్చి ఉండవచ్చు. కానీ బిస్మిల్లా ఖాన్ గారికి భారత రత్న రావటం ఆయనకు గౌరవం కాదు. ఆయనని వరించటం భారత రత్నకు దక్కిన గౌరవం అని భావించారు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ' సుర్ ఏక్ హయ్....భగవాన్ ఏక్ హయ్.....దునియా మే కళా జిస్ కే పాస్ హోతీ హయ్ వో అకేలా హయ్....క్యోన్కి వో ఏక్ హీ హయ్....అన్మోల్ రతన్ ఏక్ హీ హోతే హయ్....దో కభీ నహి హో సక్తే' అన్నారు. అంటే ఈ ప్రపంచంలో దేవుడు అనే శక్తి ఒక్కటే. సుస్వరాలను అవలీలగా పలికించగలిగే స్వరం ఒక్కటే. కళ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఒంటరిగానే ఉంటారు. వారిలా కళను ప్రదర్శించే మరొకరు మనకు ఎప్పటికీ కనబడరు. ఎందుకంటే వెలకట్టలేని మణి ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది. రెండు ఎప్పటికీ ఉండవు అన్నారు. అనటం మాత్రమే కాదు ఆయన తన జీవితాంతం అదే సిద్ధాంతంతో బ్రతికారు. ఆయనని దగ్గర నుంచి గమనించిన వారు చెప్పేది ఏంటంటే ఆయనకి వారణాసి అంటే చాలా భక్తి అని. ఒకసారి పాశ్చాత్య దేశాలలో ఎక్కడో షెహనాయి ప్రదర్శన ఇవ్వటానికి వెళ్లాల్సి వచ్చిందంట. ఆయనకి తన మాతృదేశాన్ని వదిలి వెళ్ళటం ఎంత మాత్రం ఇష్టం లేదట. వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ కాశీ విశ్వనాథుణ్ణి తలుచుకుని అక్కడికి వెళ్ళారంట. అక్కడ ప్రదర్శన ఇచ్చి తిరిగి కాశీకి రాగానే షెహనాయిని గంగలో ముంచి కడిగారంట. ఎందుకు అని అడిగితే నా షెహనాయి అపవిత్రం అయిపోయింది....అందుకే ఈ గంగాజలంతో తిరిగి పావనం చేస్తున్నాను అని సమాధానం ఇచ్చారంట. ఆయనకు కుల మత భేదాలు తెలియవు. తాత్విక చింతనతో బతికిన గొప్ప కళాకారుడు ఆయన. ఆయన నవ్వితే పసిపాప నవ్వినట్టుగా ఉంటుంది.
ఆయన బాధపడితే మన హృదయం ద్రవించిపోతుంది. ఆయన కంఠంలోనే షెహనాయి ఉందేమో అనిపిస్తుంది ఆయన గానం విన్నవారికి. అంత గొప్ప స్వరజ్ఞానం ఉంది. ఒకసారి రాగభైరవి లో అల్లాహ్ గురించి పాడి మతపరంగా తన విద్యను తప్పుబట్టాలని చూసిన ఒక మౌలానా నోరు మూయించారు. కళకు, దేవుడికి కుల, మత, వర్ణ భేదాలేంటి అంటూ ఆయన నవ్వేసేవారు. ఆయనే షెహనాయి. షెహనాయినే ఆయన. మనుషుల్లో దేవుడిలా బతికాడాయన. దేవుడికి దగ్గరగా బతికాడాయన. ఈ రోజు ఆ దేవుడి ముందే షెహనాయిని ప్రదర్శిస్తున్నాడాయన.
ఇది ఆయనకే సాధ్యం", అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు అభిజిత్.
సంజయ్, అంకితలు ఇద్దరూ ఆశ్చర్యపోతూ అభిజిత్ వంకే చూస్తున్నారు.
"బిస్మిల్లా ఖాన్ ఒక వ్యక్తిగా ఎలాంటి వారో నాకు పరిచయం చేసావు, అభిజిత్. నీలో చాలా లోతుంది. పైకి ఏమీ తెలియనట్టు ఉంటావు కానీ, నీకు చాలా తెలుసు. నీలో ఉన్న విద్యార్థిని ఇలానే ఉంచుకో. నీకు తిరుగుండదు", అన్నాడా సిద్ధపురుషుడు.
-------------------------------------------------
శంభల నగరం – 7
విమలః ప్రాకారం - 2
దర్శించుకోవలసినవి ఇంకా ఎన్నో మిగిలే ఉన్నాయి. ముందుకు వెళుతూ ఉండగా వారికి మొట్ట మొదట కనిపించినది ఈ జ్ఞాన కుంభము
జ్ఞాన కుంభములో ఉండే జలం స్వర్వాహినీ నదిలోనిదే అయినప్పటికీ ఆ జ్ఞాన కుంభాన్ని విమలః ప్రాకారంలోని జ్ఞాన దేవతలందరికీ తెల్లవారుఝామునే నివేదన చెయ్యటం చేత ఒక పవిత్రత సంతరించుకుని తీర్థం అయిపోతుంది.
జ్ఞాన కుంభములోని తీర్థాన్ని మూడు పర్యాయాలుగా ఒక క్రమంలో తీసుకోవాలి. అందులోఒక పరమార్థం దాగుంది.
మొదటి సారి తీర్థం తీసుకున్నప్పుడు బుద్ధికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ పవిత్రతను ఇచ్చే హయగ్రీవుణ్ణి తలుచుకుంటూ తీసుకోవాలి.
రెండో సారి తీర్థం తీసుకునేటప్పుడు మనసును జ్ఞానం వైపుకు మళ్లిస్తూ పవిత్రతను చేకూర్చే షణ్ముఖుణ్ణి స్మరించుకుంటూ తీసుకోవాలి.
మూడో సారి తీర్థం తీసుకుంటున్నప్పుడు నిర్మలమైన
బ్రహ్మజ్ఞానాన్ని ఏ నాటికైనా ప్రసాదించమని కోరుతూ సరస్వతీ స్తుతిస్తూ తీసుకోవాలి.
ఆ జ్ఞాన కుంభము దగ్గర ఒక ముముక్షువు ఉంటాడు. అక్కడికి వచ్చిన వారందరికీ ఆయనే తీర్థాన్ని అందిస్తాడు.
హయగ్రీవుణ్ణి, షణ్ముఖుణ్ణి, జ్ఞాన సరస్వతీ దేవినీ దర్శించుకోకుండా అక్కడ తీర్థాన్ని స్వీకరించకూడదు.
ఆ జ్ఞాన కుంభము దాటిన తరువాత వాళ్లకు అక్కడొక మందిరం కనిపించింది.
దురిత నివారితః
అని వ్రాయబడి ఉన్నది. అదేమిటో తెలుసుకుందామని ముఖద్వారం దగ్గరికెళ్ళారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు మాత్రం దూరం నుంచే వీళ్ళను గమనిస్తున్నారు.
ముఖద్వారం దగ్గరే ఒక ముముక్షువు ఉన్నాడు. వారిని సాదరంగా లోనికి ఆహ్వానించాడు.
"మీకు నేనే విధముగా సాయపడగలను?" అని అడిగాడు ఆయన.
"మాకు ఈ మందిరం గురించి విపులంగా చెప్తారా?" అని అడిగాడు సంజయ్.
“దురిత నివారితః” అని పైన వ్రాయబడి ఉంది కదా. అనగా ఈ చోటు మీ పాపములను పూర్తిగా తొలగించి వేస్తుందని దానర్థం ", అని బదులిచ్చాడు ఆ ముముక్షువు.
"పాపములు అనగా ఏవి స్వామి?" అడిగాడు అభిజిత్.
"విమలః ప్రాకారంలో పాపం అంటే అజ్ఞానం అనే అర్థం. అజ్ఞానం చేతనే ఎన్నో తప్పిదాలు జరుగుతాయి", అన్నాడా ముముక్షువు.
"అంటే ఇక్కడ అజ్ఞానాన్ని పూర్తిగా తీసేస్తారా స్వామి?" అని అమాయకంగా అడిగింది అంకిత.
"అజ్ఞానాన్ని తీసివెయ్యటం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు జ్ఞానసముపార్జనతోనే మనం అజ్ఞానాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం", అన్నాడు ఆ ముముక్షువు.
"అంటే ఇక్కడ గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఉంటాయా స్వామి?" అని అడిగాడు సంజయ్.
"అవేవీ ఇక్కడుండవు. ఇక్కడి నుండి కొంత దూరంలో ఉన్న జ్ఞాన శిఖ అనబడే ఒక గ్రంథాలయములో మీకు అవన్నీ దొరుకుతాయి. అక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు. మీరేది తెలుసుకోవాలని ఆరాటపడినా అక్కడ ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన విషయ సంపదంతా మీకు దొరుకుతుంది", అన్నాడా ముముక్షువు.
"మరి ఈ మందిరం విశిష్టత ఏమిటి స్వామి?" అని అడిగాడు అభిజిత్.
"ఇక్కడ మీరు ఎన్నో విషయాలను మరిచిపోవచ్చు. అలా మరిచిపోవటానికి ఇక్కడ మీకు మూడు ద్వారాలు ఉన్నవి", అని కాసేపు ఆగి ఆ మందిరం మొత్తాన్ని చూపిస్తూ
"ఈ మందిరంలో మొత్తం మూడు వాకిళ్లు ఉన్నాయి. అనగా మొత్తం మూడు అరలు అన్నమాట", అన్నాడా ముముక్షువు.
అర అంటే ఏమిటి?
అన్నట్టు సందేహంగా చూస్తున్నాడు అభిజిత్. దాన్ని అర్థం చేసుకున్న ముముక్షువు వెంటనే ఇలా అన్నాడు.
"ఇక్కడ ఉండే వాటిని గదులు అనకూడదు. గడపలు ఉండవు కాబట్టి ఇవి గదులు కావు. అందుకే అరలు అన్నాను. గడపను దేహళి అంటారు. ఒక గృహము నందు వేర్వేరు గదులు ఉంటాయి. ప్రతీ గదికీ ఒక గడప ఉంటుంది. గడపను తొక్కరాదు. గడప మీద కూర్చోకూడదు. గడపకు పసుపు, కుంకుమ పెట్టాలి. గడప లక్ష్మీ దేవి స్వరూపం కనుకనే ఈ మందిరంలో ఉన్న మూడు ద్వారాలకూ వాటిని అమర్చలేదు. అజ్ఞాన అంధకారాన్ని మొత్తం తీసేసుకునే మూడు అరలు ఇవి. ఈ మందిరంలోకి అడుగుపెట్టే ముందు మాత్రం మీరొక గడపను చూసి ఉంటారు. అక్కడ దైవ ప్రతిష్ఠ జరిగింది. అందుకే ఆ మొదటి వాకిలికి మాత్రమే గడప ఉంటుంది", అని చెప్పటం ముగించాడు.
ఆ మూడు వాకిళ్ళనూ వారికి చూపిస్తూ ఆ ముముక్షువు ఇలా అన్నాడు.
"మొదటి వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న మానసికమైన మలినాలు అన్నీ దూరం అవుతాయి. అనగా మీలో ఉన్న మోహం, ప్రాపంచిక విషయాల పట్ల మీకుండే భ్రమలు, అజ్ఞానం వల్ల కలిగే కోపాలు...ఇలా అన్నీ తొలగిపోతాయి.
రెండవ వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న బుద్ధి జాడ్యాలు అన్నీ తొలగిపోతాయి.అటు పిమ్మట మీకు సజ్జనుల సాంగత్యము దొరుకుతుంది. బుద్ధిలో పుట్టే జాడ్యాలన్నిటికీ కారణం దుర్జనుల సాంగత్యమే అన్నది నిర్వివాదాంశం.
--------------------------------------------------
మూడవ వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న ఆత్మస్తుతి అనే దోషము పూర్తిగా తొలగిపోతుంది. అన్నిటికీ నేనే కారణం. అంతా నా వల్లే జరుగుతోంది. అసలు నేను లేకపోతే ఇదంతా సాధ్యపడుతుందా? ఇలా ప్రతీ చిన్న విషయానికి ఆత్మస్తుతి చేసుకోవటం అలవాటైన వారికి ఈ వాకిలి ద్వారా వెళితే వారిలోని ఆత్మచైతన్య శక్తి జాగృతం అయ్యి అసలైన బ్రహ్మజ్ఞానం మీద జిజ్ఞాస పెరుగుతుంది. హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది", అన్నాడు ఆయన.
హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది
అన్న మాటలు ఆ ముముక్షువు చెబుతున్నట్టుగా వారికి అనిపించలేదు. ఆ మాటలు ఆయన నోటి వెంట వస్తున్నప్పుడు ఆ ముముక్షువునే చూసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. ఆ ముముక్షువుకి బదులుగా సిద్ధపురుషుడు కనిపించాడు వారికి. ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు ముగ్గురూ.
"స్వామీ, చివర్లో మీరు బ్రహ్మ జ్ఞానం మీద జిజ్ఞాస పెరుగుతుంది అన్నారు కదా?" అడిగాడు సంజయ్.
"అవును", అన్నాడా ముముక్షువు.
"హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది అని మీరు అనలేదా?" అడిగాడు అభిజిత్.
"అలా నేనలేదే", అన్నాడా ముముక్షువు.
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయి చూస్తుంటే ఆ ముముక్షువు ఇలా చెప్పాడు.
"మీతో వచ్చిన ఆ సిద్ధపురుషుడిలో ఋతంభర ప్రజ్ఞ వున్నది. నిరంతరమైన తపస్సు చేత, సాధన చేత ఆయనలో జాగృతం అయిన ప్రజ్ఞ అది. ఈ ప్రజ్ఞ ఆయన పొందటం వల్లే ఇంద్రియాలకు అతీతంగా చూడగలిగే ఒక దృష్టి ఆయన సొంతమయ్యింది. ఇప్పుడు ఆయన మీతో లేకపోయినప్పటికీ ఆయన శక్తి మీకు రక్షణ కవచంలా మీ చుట్టూ వున్నది. అందుకే మీకు ఆ వాక్యం వినిపించింది. ఇందులో అంతగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఆనందపడాల్సిన విషయమిది. అంతటి ప్రజ్ఞ కలిగిన ఆ సిద్ధపురుషుడు మీకు లభించటం మీరు చేసుకున్న పుణ్యఫలం. మీరెంతో అదృష్టవంతులు.
ఋషులు తపః శక్తితో సాధించిన శాశ్వత సత్యాల సమాహారమే వేదము. అలాంటి వేదాన్ని అర్థం చేసుకునే దృష్టి ఆ సిద్ధపురుషుని సొంతం. అలాంటి సిద్ధపురుషుడు మీకు గురువు అయ్యాడు. ఇంతకంటే మీకు కావలసినది ఏముంది?" అన్నాడు ఆ ముముక్షువు.
ఆ ముముక్షువుకు నమస్కరించి ఆయన నుండి సెలవు తీసుకున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
ఆ మందిరం నుండి బయటకి రాగానే అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ సిద్ధపురుషునికి అక్కడే పాదాభివందనం చేశారు. వారెందుకు అలా చేశారో సిద్ధపురుషునికి ఏం అర్థం కాలేదు.
"స్వామీ ఈ మందిరానికి వెళ్ళాక మాకు మీరేంటో అర్థం అయ్యింది", అని భావోద్వేగంతో చెప్పాడు అభిజిత్.
"ఈ మందిరాన్ని గుర్తు పెట్టుకోండి. మనం మళ్ళీ ఇక్కడికి రావలసి ఉంటుంది", అని చిరుమందహాసంతో అభిజిత్, అంకిత, సంజయ్ లను చూస్తూ సిద్ధపురుషుడు అన్నాడా మాట.
ఇద్దరు సైనికులూ వారికి దారి చూపిస్తూ ముందుకెళ్తున్నారు. వారు విమలః ప్రాకారంలోని హయగ్రీవుణ్ణి, షణ్ముఖుణ్ణి, వాగ్దేవతలను, జ్ఞాన సరస్వతీ దేవిని దర్శనం చేసుకున్నారు. ఆ తరువాతే జ్ఞాన కుంభములోని తీర్థాన్ని మూడు మార్లు స్వీకరించారు.
శంభల రాజ్యంలో తారా దేవి అన్న సరస్వతీ శక్తి రూపం ఉంటుంది. శత్రువులను మాటలతో సంహరించగల శక్తిని ఇస్తుంది. నీలమైన రంగులో ఉండే రూపం ఈ తారాదేవిది. తారా దేవి గురించి అభిజిత్, అంకిత, సంజయ్ లకు పరిచయం చేసాడు ఆ సిద్ధపురుషుడు. వారికి ఏదైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదో అది మాత్రమే చెబుతూ ఉంటాడు. అడిగితే తప్ప ఒక్క వాక్యమైననూ ఎక్కువ చెప్పడు. వాక్కు మీద ఆ సిద్ధపురుషునికి ఎంత పట్టుందో చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
విమలః ప్రాకారంలోని జ్ఞాన దేవతలను దర్శించుకున్న తర్వాత, వారు జ్ఞాన శిఖ గ్రంథాలయానికి వెళ్లారు. అక్కడున్న జ్ఞాన సంపదనంతా కళ్లారా చూసి ఆశ్చర్యపోయారు. అన్ని పుస్తకాలున్నాయి అక్కడ. జ్ఞాన శిఖ దాటిన తర్వాత జ్ఞాన దీపికలు అనబడే కేంద్రాలు 9 ఉన్నాయి. ఆ 9 జ్ఞాన దీపికలలో శాస్త్రవిద్యను క్షుణ్ణముగా అధ్యయనం చేసిన విద్యావేత్తలైన ముముక్షువులు ఉంటారు. వేదవిద్యను అభ్యసించిన ముముక్షువులు కూడా ఉంటారు. వాళ్ళందరూ సందేహ నివృత్తి చేస్తారక్కడ.
అలా విమలః ప్రాకారాన్ని మొత్తంగా సందర్శించాక వారు అక్కడి నుండి అభయః ప్రాకారానికి బయలుదేరారు.
----------------------------------------------------------------
శంభల నగరం – 8
అభయః ప్రాకారం
సమరవిజయ రాముని కోసం శంభల నగరానికి విచ్చేసిన ఆ శ్రీకృష్ణుడు శంభలలో నడయాడిన ప్రాంతమే ఈ అభయః ప్రాకారం. ఆయన ఎంతో దీక్షతో సదాశివుని జపం చేసి, మౌనాన్ని ధరించి లలితా దేవి ధ్యానంలోనే గడిపారు. అలాంటి ఈ అభయః ప్రాకారంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి చేతుల మీదుగా ఒక చెట్టును ప్రతిష్ఠించటం జరిగింది. అదే కల్పవృక్షము.
ఈ కల్పవృక్షం క్షీర సాగర మథనంలో పుట్టింది. దేవతలకు రాజైన ఇంద్రుడి చెంతకు చేరింది. మనం కోరిన కోరికలను తీర్చే చెట్టు ఇది. శ్రీకృష్ణుడు అమ్మవారిని ధ్యానం చేసి అలాంటి అరుదైన కల్పవృక్షాన్ని కోరగా ఆ లలితాదేవి వరంగా ప్రసాదించినది.
ఆ కల్పవృక్షాన్ని ఇక్కడ స్థాపన చేసిన తరువాత సమరవిజయ రామునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.
“ఈ కల్పవృక్షానికి ఒక విశిష్టత ఉన్నది. భవిష్యత్తులో భూలోకవాసులు ఈ శంభలకు విచ్చేస్తారు. ఒకానొక సమయంలో భూలోకంలోని వారికి అగమ్యగోచరమైన స్థితి ఏర్పడుతుంది. పాతకులు అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం ముష్కరులతో నిండిపోయి ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితులలో కొంతమంది మానవులు ఈ శంభలకు శరణార్థి పొందటం కోసం వస్తారు. వాళ్ళు సామాన్య మానవులే అయినప్పటికీ వారి పూర్వీకులు చేసిన పుణ్య కర్మల వల్ల వారికి సిద్ధపురుషుల సాంగత్యం దొరుకుతుంది. అలా వారికి శంభలలో అడుగుపెట్టే యోగ్యత దక్కుతుంది.
ప్రపంచాన్ని పాపం నుండి, పాపుల నుండి విముక్తి చేసే శక్తిని పొందాలంటే కల్పవృక్షానికున్న ఈ కుసుమాలతో శక్తి పీఠమునందున్న అమ్మవారిని వారు పూజించాలి. శ్రద్ధతో పూజించినప్పుడు మాత్రం దివ్యశక్తులే వారిని వరిస్తాయి. అవి సరిగ్గా లోకానికి ఉపయోగపడతాయి.”
ఆ రోజు నుండి ఈ అభయః ప్రాకారంలోని కల్పవృక్షాన్ని ఎంతో పవిత్రంగా ఆరాధించటం జరుగుతున్నది. శంభల రాజ్యంలోని రాజైన అనిరుద్ధుల వారికి అమ్మవారిని ఈ కుసుమాలతో పూజించటం అంటే ఎంతో ఇష్టం. ఒక సంకల్పం, ఒక లక్ష్యం, ఒక కోరిక లేకుండా అమ్మవారిని పూజించటం శాస్త్ర విరుద్ధమైన చర్య అవుతుంది. పైగా అమ్మవారిని కోరుకునే కోరిక లోకకల్యాణం కోసమే అయ్యి ఉండాలి. వ్యక్తిగతమైన వాంఛలు నెరవేరటం కోసం అమ్మవారిని కల్పవృక్షం కుసుమాలతో సేవిస్తే అది లోకానికే అరిష్టం. ఈ ధర్మసూక్ష్మం తెలుసు కాబట్టే అనిరుద్ధుల వారు తన మనస్సులోనే సహస్ర నామ పఠనం చేస్తూ ఆ దేవిని భక్తితో కొలుస్తారు.
అభయః ప్రాకారంలో ఎన్నో అద్భుతాలుంటాయి. శ్రీకృష్ణుడు ఎంతో కఠిన దీక్షతో ధ్యానంలో గడిపిన స్థలమిది. అందువల్ల ఆయన ధ్యానించిన చోటు శాశ్వతంగా ఒక శక్తి వలయంలా మారిపోయింది. ఆ వలయం చుట్టూ ఉండే అగ్ని నిరంతరం ఒక జ్యోతిలా ఎర్రటి కాంతితో వెలుగుతూ ఉంటుంది. ఆ వలయం మధ్యలో సూర్యుని కిరణాలన్నీ ఒక్క చోట చేరినట్టుగా ఉండే కాంతి పుంజం మనకు కనబడుతుంది. ఆ కాంతి పుంజం రంగు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అరుణ వర్ణం, నీలమేఘ వర్ణం, హరితవర్ణం.,ఇత్యాది వర్ణములను ఈ కాంతిపుంజంలో మనం దర్శించుకోవచ్చు. మనలో వున్న దైవీభావాలను ద్విగుణితం చేసే అరుదైన దర్శనమిది.
కల్పవృక్షాన్ని, శక్తి వలయాన్నిదర్శించుకున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. సిద్ధపురుషుడు ఆ శక్తి వలయం దగ్గరే తగిన చోటు చూసుకుని అక్కడే ఆసీనుడై ధ్యానం చేసుకుంటున్నాడు. వారితో వచ్చిన ఆ ఇద్దరు సైనికులు సిద్ధపురుషునికి దగ్గరలోనే ఒక రాతి బండ మీద కూర్చుని ఉన్నారు.
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ ప్రదేశాన్నంతా పరిశీలనగా చూస్తున్నారు.
ఇంతలో అక్కడికొక కపిల గోవు వచ్చింది. ఆ కపిల గోవు మెడకి గంటలు కట్టి ఉండటంతో అది నడుస్తూ ముందుకెళ్తున్న కొద్దీ ఆ గంటల శబ్దం చెవులకు మధురంగా వినిపిస్తోంది. ఆ కపిల గోవునే అనుసరిస్తూ వారు ముందుకు కదిలారు. అక్కడొక గోశాల కనబడింది. సున్నితత్వానికి ప్రతీకలా, సాత్విక గుణాలకు పెన్నిధిలా, సచ్ఛీలతకు సదనములా అనిపించినదా గోశాల.
అభిజిత్, అంకిత, సంజయ్ లు భారత దేశంలో ఎన్నో సార్లు గోవులను చూసారు కానీ ఇక్కడున్న గోవులను మాత్రం ఇంతక్రితం ఎప్పుడూ వారు చూడలేదు. గోలోకంలోని గోవులలా అనిపించాయి వాళ్లకి. ఆ గోవులను సంరక్షించే ఉద్ధారకుడు వారికి అక్కడ కనిపించాడు. విచిత్రం ఏంటంటే ఆయనొక ముముక్షువు. భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో గోవులకు ఇలాగే సేవ చేసుకునేవాడు. గోసేవలో తరించిపోయేవాడు ఆయన.
అభిజిత్, అంకిత, సంజయ్ లను చూడగానే ఆ ఉద్ధారకుడు వారిని సమీపించి ఆ గోశాల గురించి ఇలా వివరించటం మొదలు పెట్టాడు.
“శ్రీకృష్ణుడు శంభల నగరంలో చాలా రోజులు ధ్యానంలో గడిపారు. సమరవిజయరాముడు చేసుకున్న అదృష్టం వల్ల శ్రీకృష్ణుడిని సేవించుకునే భాగ్యం శంభలకు కలిగింది. ఆయన గోవులు లేకుండా ఉండలేడు. శంభలకు కపిల గోవులను ఆయనే వరంగా ప్రసాదించాడు. ఆ రోజు నుండి శంభలలోని శివుని ఆలయంలో ఆ మహాదేవునికి క్షీరాభిషేకం చెయ్యటమనే ప్రక్రియ మొదలయ్యింది. ఇక్కడి గోవు పాలనే శివుని అభిషేకానికి వినియోగిస్తారు. గోవులను సూర్యుని కిరణాలుగా, సూర్యమండలంలోని యజ్ఞపురుషుడిని గోవిందుడిగా భావిస్తూ ఇక్కడ సూర్యారాధన చేస్తారు.
గోబ్రాహ్మణేభ్యహ శుభం భవతు అని వేదాలలో పఠిస్తారు. గోవులకు బ్రాహ్మణుల కంటే ముందు స్థానాన్ని ఇచ్చి వారికి శుభం కలుగుగాక అని మన ప్రార్థనలో మనం దేవుణ్ణి కోరుకుంటాం అన్నమాట. ఎంత గొప్ప భావన అది.
ఇక్కడ మీరు చూసేవి కపిల గోవులే అయినప్పటికీ ఇవన్నీ
కామధేనువు నుండి వచ్చినవి. ఇక్కడున్న ప్రతీ కపిల గోవూ గోమాతగా ఉన్న దేవతే అనర్థం. వీటికి చావూ పుట్టుకలతో సంబంధం లేదు. శంభలలోని ఈ అభయః ప్రాకారంలో శ్రీకృష్ణుడిని సేవించుకుంటూ ఉంటాయి. దయచేసి మీరు ఈ కపిల గోవులను దేవతలలానే చూడండి. ఈ గోశాలలో ఉన్న ఏ కపిల గోవుకు మీరు సేవ చేసుకున్నా సరే దేవతలకు అభిషేకం చేసినంత ఫలం మీకు దక్కుతుంది.”
ఆ ఉద్ధారకుడి సూచనలు అనుసరిస్తూ అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ గోశాలలోని కపిల గోవులకు సేవ చేసుకున్నారు.
అక్కడి నుండి కాస్త ముందుకెళ్ళగానే వాళ్లకి వేణు నాదం వినిపించింది. వేణుగానం చేస్తున్న ఒక ముముక్షువు కనిపించాడు వాళ్ళకి. సమ్మోహన పరిచేలా ఉందా వేణుగానం.
-----------------------------------------------------
ఆ ముముక్షువు వేణు గానం చేస్తున్నంత సేపూ ఆ ప్రాంగణం అంతా కృష్ణమయం అయిపోయింది. అభిజిత్, అంకిత, సంజయ్ లు ఏదో తెలియని ఓ దివ్యానుభూతికి లోనయ్యారు. శ్రీకృష్ణుడి దర్శనం కోసం వాళ్లలో కలుగుతున్న తహతహ అది అని గ్రహించలేని స్థితికి వెళ్లిపోయారు.
వేణుగానం ముగిసిన వెంటనే ఆ ముముక్షువు వారి వద్దకు వచ్చాడు. వేణుగానం చేస్తున్నంత సేపూ తాదాత్మ్య స్థితిలో ఉన్న వారిని చూసాక ఆ ముముక్షువుకు ఈ వేణుగానం వెనుకనున్న శ్రీకృష్ణుని మహిమ గురించి చెప్పాలనిపించి ఇలా చెప్పాడు.
“శ్రీకృష్ణుడి దర్శనభాగ్యం దొరకటం అంత సులువు కాదు. సిద్ధపురుషుడి సాంగత్యం చేత మీకు రాముడు కనిపించాడు. ఆయన మార్గదర్శిలా మిమ్మల్ని ఇక్కడి దాకా నడిపించాడు. మీ పూర్వీకుల రామభక్తి చేత మీకు రామలక్ష్మణుల దర్శనం దొరికింది. శ్రీకృష్ణుడిని దర్శించుకోవటం ఎందరో యోగీశ్వరులకు సైతం సాధ్యపడని విషయం. శంభలలోని సమరవిజయ రాముడికొక్కడికే అది సాధ్యపడినది. శంభలలో శ్రీకృష్ణుడు ఉన్నన్ని రోజులూ ఆయనని ఒక్కసారైనా చూడాలని ఎందరో యోగులు పరితపించిపోయేవారు. సాయం సంధ్యా సమయంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేసేవాడు. ఆ వేణుగానం విని ఎందరో యోగులు శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ ఈ అభయః ప్రాకారానికి వచ్చేవారు. కానీ ఆయన వీరికి కనబడేవారు కాదు. అయినా సరే ఆ గానాన్నే విని ఆస్వాదిస్తూ ఆయన ధ్యానంలో, నామ జపంలో గడిపేవారు ఆ యోగులు. వేదాలనే వేణువు ద్వారా గానం చేసిన ఆయన స్థాయిని ఏ వేణునాద విద్వాంసుడూ అందుకోలేడు. ఈ అభయః ప్రాకారం చేసుకున్న పుణ్యం అలాంటిది. ఆయన ఇక్కడున్నన్ని రోజులూ వేణువు ద్వారా వేదగానం చేశారు.
ఆ వేణుగాన వేద ఘోష ఇప్పటికీ ఈ అభయః ప్రాకారంలో నిక్షిప్తమై ఉన్నది. నేను చేసిన వేణుగానం కూడా అలాంటిదే. శ్రీకృష్ణుడు అభయః ప్రాకారానికి ఇచ్చిన వేణుగాన జ్ఞాన సంపద వల్లే నేను వేణువును ఆలపించాను. ఇందులో నా ప్రతిభ కంటే శ్రీకృష్ణుని ప్రభే మీకు కనబడుతుంది.”
"స్వామి రాముని దర్శన భాగ్యం మాకు దొరికిందన్న విషయం మీకెలా తెలిసింది?" అని అడిగాడు సంజయ్
"మోక్ష సాధనలో ఉన్న వాడినే ముముక్షువు అంటారు. ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారు అభ్యసించేది కూడా విద్యే కదా. విద్య ఎక్కడుంటుందో స్పర్ధ అక్కడుంటుంది. స్పర్ధ ఎక్కడుంటుందో అక్కడ అన్ని విషయాలూ తెలిసిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా దైవానుగ్రహం ఎవరికి దక్కింది అన్న రహస్యాలు. మీకు రాముని అనుగ్రహం దొరకటం ఎంత విలువైనదో మీకిప్పుడు అర్థం కాదు. మోక్ష సాధనలోకి మీరు అడుగుపెట్టిన రోజున మీరెంత అదృష్టవంతులో మీకర్థం అవుతుంది", అన్నాడు ఆ ముముక్షువు.
ఆ ముముక్షువు నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి బయలుదేరారు. సిద్ధపురుషుడు తన జపమును ముగించుకుని ధ్యాన స్థితిని వీడి వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
అభిజిత్, అంకిత, సంజయ్ లని చూడగానే వారితో ఒక ముఖ్యమైన విషయాన్ని ఇలా ప్రస్తావించాడు.
"వేణు గానాన్ని విని మీరు చాలా మంచిపని చేశారు. నేనే స్వయంగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళదాం అనుకున్నాను. ఈ రోజుతో మీలోని పాషండ భావాలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఇక మీరు శంభల రాజ్యంలోని సకల విద్యలూ నేర్చుకోవటానికి సంసిద్ధులు అయినట్టే లెక్క", అన్నాడా సిద్ధపురుషుడు.
"పాషండ భావాలంటే ఏవి స్వామి?" అని అడిగాడు అభిజిత్.
"వేదాలకి విరుద్ధమైన భావాలు. కలిదోషం వల్ల మానవులలో కలిగే వికారాలు ఇవి. మీరు గోమాతను దర్శించి, సేవించి ఎంతో శ్రేష్ఠమైన పని చేశారు. గోవును మన సనాతన ధర్మదేవతగా వేదాలు అభివర్ణించాయి. మీరు సాక్షాత్తు ఆ కామధేనువు నుండి వచ్చిన కపిల గోవులను అనగా దేవతలనే సేవించుకున్నారు. ఇలాంటి అదృష్టం మీకు దక్కిందంటే మీకు దైవబలం తోడుగా ఉందని అర్థం. ప్రపంచాన్ని వినాశనం చేయాలనుకునే ఆ ఘోరకలిని అంతం చెయ్యటం కోసం అడుగు అడుగునా మిమ్మల్ని స్వాగతిస్తూ మీలోని అంతర్గత శక్తిని జాగృతం చేస్తున్నారు దేవతలు. ఆ ఘోరకలి అంతం అవ్వాలని, భూలోకం సురక్షితంగా ఉండాలని దేవతలు బలంగా కోరుకుంటున్నారని దానర్థం", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
"ఈ పాషండ భావాలు మాలో నుండి ఎలా పోయాయి స్వామి?" అడిగాడు సంజయ్
"శ్రీకృష్ణుడు శంభల కిచ్చిన వరం వేణుగాన నాద శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అనుసరించి చేసిన వేణుగానాన్నే మీరు విన్నారు. వేద విరుద్ధమైన భావాలు మీలో నుండి మాయమైపోయే గానమది. వేదాలని స్మృతి చేతనే గుర్తుపెట్టుకుని, పదే పదే మననం చేసుకునేవారు మన ఋషులు. ఇంద్రియాలలో ముఖ్యమైనది శ్రవణ శక్తి. కలియుగంలో ఆ శక్తి దుర్వినియోగం అవుతోందని చెప్పక తప్పదు. వినకూడని శబ్దాలు ఎన్నింటినో మీరు వినటం చేత మీలోకి ఈ పాషండ భావాలు చొరబడ్డాయి. ఒక్క చెవులకే కాదు మన జ్ఞానేంద్రియాలు అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఇంద్రియాలకు నియమం అంటూ లేకపోతే మాత్రం విష్ణు నామం ఉచ్ఛరించటానికి కూడా మనస్కరించని దుస్థితికి వెళ్ళిపోతాడు మనిషి. తనకు దేవుడిచ్చిన ఇంద్రియ శక్తిని ఉపయోగించుకోకపోయినా పోయేదేంలేదు కానీ దుర్వినియోగం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే దేహమే దేవాలయం అన్నారు. దేవాలయం లాంటి ఆ దేహంలో ఉన్న ఇంద్రియాలు గుడి తలుపుల లాంటివి. పవిత్రమైన దేవాలయంలోకి ఎవరిని అనుమతించాలి అన్న విజ్ఞత ఉండాల్సింది మనిషికే కదా”, అంటూ చెప్పటం ముగించాడు.
"స్వామి నాదొక చివరి ప్రశ్న", అడిగింది అంకిత.
అదేమిటో అడుగు అన్నట్టు చూసాడా సిద్ధపురుషుడు.
"ఈ ప్రాకారానికి అభయః ప్రాకారం అన్న పేరెందుకు వచ్చింది?" అని అడిగింది అంకిత.
"కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి వైరాగ్యం కలిగినప్పుడు జ్ఞానబోధను చేసి తిరిగి తనని కార్యోన్ముఖుడిని చేశాడా కృష్ణ పరమాత్మ. తద్వారా లోకానికి భగవద్గీత దొరికింది. కష్టం వచ్చిన ప్రతీ సారి మనకు అభయాన్ని ఇచ్చేది ఆ శ్రీకృష్ణుడేనమ్మా. అలాంటి శ్రీ కృష్ణుడు ధ్యానించిన చోటిది. ఆయనే లలితాదేవిని ఉపాసన చేసిన స్థలమిది. అనగా ఆయనకు అభయాన్ని ఇచ్చే ఆది పరాశక్తిని ధ్యానించాడిక్కడ. అలాంటి ఈ ప్రాకారం అభయః ప్రాకారం కాక మరేం అవుతుంది" అంటూ మరొక్క మారు శ్రీకృష్ణుడిని తలచుకున్నాడా సిద్ధపురుషుడు.
"తరువాత వచ్చే ప్రాకారం ఏది?" అని అక్కడున్న ఇద్దరు సైనికులను సిద్ధపురుషుడు అడిగాడు.
----------------------------------------------------------
శంభల నగరం – 9
ఇందుః ప్రాకారం
ఇందుః ప్రాకారంలోకి అడుగుపెట్టగానే వారికి అమితాశ్చర్యం కలిగింది. భూలోకంలో మనం చూసే పరస్పర విరుద్ధమైన స్వభావం కల జీవులన్నీ ఒకే చోట కలిసి ఉంటున్నాయి ఇక్కడ. పాము-ముంగిస. శునకము-మార్జాలము. సింహము-జింక. ఇలా అన్నీ సాధు స్వభావంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. పైగా వాటి కళ్ళను చూస్తే పాశవిక లక్షణాలు కనిపించకపోగా, దైవీ కాంతులను విరజిమ్ముతున్నాయి.
వాటిని అలానే చూస్తూ విస్తుపోయిన అభిజిత్, అంకిత, సంజయ్ లతో సిద్ధపురుషుడు ఇలా అన్నాడు.
"ఈ ఇందుః ప్రాకారంలో మనసు చంద్రుని ఆధీనములో ఉంటుంది. చంద్రుడు అంటే భూమి చుట్టూ తిరిగే చంద్రుడు కాదు. భూలోక వాసుల కంటికి కనిపించే చంద్ర రూపం అది. సూర్య మండలం పైన నిజమైన శీతల, జల లక్షణాలు కలిగిన ఒక భూమిక ఉన్నదని చెబుతోంది వేదం. ఆ భూమికనే చంద్ర మండలంగా గుర్తించారు మన వేదాలలో. భౌతిక దృష్టికి అందని చంద్రుని రూపం అది అని చెబుతారు. వేద ఋషులు దర్శించిన చంద్ర మండలం అదే. ఆచంద్రతారార్కం అన్న పదం వినే ఉంటారు. చంద్రుడూ, తారలూ, సూర్యుడు ఉన్నంతవరకూ అని అనటంలో ఉన్న పరమార్థం ఇదే.
ఆ చంద్రుణ్ణి ప్రార్థిస్తే మనసును నిర్మలంగా, ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకుండా ఒక సరోవరం వలే ప్రశాంతముగా ఉంచుతాడు. అందుకే భూలోకంలో పరస్పర వైరంతో ఉండే జంతువులు సైతం ఇక్కడ కలిసి మెలసి జీవిస్తాయి.
అంతే కాదు, ఈ ప్రాకారంలో మీ మనసుకు ఎన్నో పరీక్షలు ఎదురవ్వబోతున్నాయి. అందుకు సంసిద్ధంగా ఉండండి", అని వారిని హెచ్చరించాడా సిద్ధపురుషుడు.
"స్వామి, భూలోకంలో అడవుల్లో మనకు కనిపించే జంతువులన్నీ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదెలా సాధ్యం?" అని అడిగాడు సంజయ్.
"భూలోకంలోని మనుషులే ఇక్కడ ముముక్షువులుగా మీకెలా అయితే దర్శనం ఇచ్చారో, ఇదీ అంతే. భూలోకంలో జంతువుగా జన్మించినప్పటికీ ఆ జన్మలో చేసిన సాధన వల్ల ఉత్కృష్టమైన స్థితికి చేరుకున్న అన్ని జంతువులూ ఇక్కడ ముముక్షువులలా అవే శరీరాలు ధరించి కేవలం మోక్ష సాధన కోసమే తపించిపోతూ ఉంటాయి. వాటికి మరొక జన్మ అంటూ ఉండదని అర్థం", అన్నాడా సిద్ధపురుషుడు.
“ఇక్కడున్న ఆ సింహాన్ని చూసారా? అది శంభల నగరానికి కేంద్రబిందువు ఐన శక్తి పీఠమునందున్న అమ్మవారికి నిర్వహించే అన్ని పూజలలో కర్మసాక్షిగా ఉంటుంది. అమ్మవారిని పూజించే రోజున ఆ అమ్మకు వాహనంగా ఈ సింహం ఎన్నో సేవలను అందుకుంటుంది”, అన్నాడు సైనికులలో ఒకడు.
"ఆ సింహం పేరేమిటి?" అని అడిగాడు అభిజిత్.
" కేశనామ ", అన్నాడు ఆ సైనికుడు.
"ఆ పేరుకి అర్థం చెప్పగలరా?" అని అడిగాడు అభిజిత్.
"ఆ సింహం యొక్క కేశాలు సుగంధాన్ని వెదజల్లే మూలికలలా ఉంటాయి. ఎలాంటి దుష్ట పీడిత శక్తి దరిచేరకుండా ఉండటానికి చింతామణి గృహమునందు ఈ సింహ కేశాలను నీటితో కలిపి ప్రోక్షణ కూడా చేస్తారు. అంతటి ఓషధీ శక్తి ఉన్నదా కేశాలకు", అని వివరించాడు ఆ సైనికుడు.
అక్కడి నుండి అభిజిత్, అంకిత, సంజయ్ లు ముందుకు వెళుతూ ఉన్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు మాత్రం అక్కడే ఆగిపోయారు. అభిజిత్, అంకిత, సంజయ్ లు వెనక్కి తిరిగి చూసారు.
అప్పుడు ఆ ఇద్దరు సైనికులు, "మీరు ముందుకు వెళ్ళండి. మేమిక్కడే ఉంటాము", అన్నారు.
సిద్ధపురుషుడు,"మీకు అక్కడ ఎదురయ్యే పరీక్షలు ఎంతో విలువైనవి. మీ జీవితాంతం మీరు గుర్తుపెట్టుకోవలసిన ఎన్నో పాఠాలను మీరక్కడ నేర్చుకోబోతున్నారు", అని చెప్పాడు.
అసిధారావ్రతం అని రాసి ఉన్న ప్రాంగణంలోకి అడుగుపెట్టారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
అక్కడ ఎందరో అందమైన యువతీ, యువకులు జంటగా కనిపించారు. అందమైన దుస్తులు ధరించి, సుగంధ ద్రవ్యాలను వెదజల్లుతూ చేతిలో చెయ్యేసి ఒకరి సాహచర్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ ఆ ప్రాంగణం అంతా తిరుగుతున్నారు. వాళ్ళల్లో కొంత మంది ఒకరిని ఒకరు ఆటపట్టిస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. మరి కొంత మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొంత మంది నడుస్తూ మౌనంగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ ఏదో తెలియని అనుభూతితో ఊహాలోకాల్లో విహరిస్తున్నారేమో అన్నట్టుగా కదులుతూ ముందుకెళుతున్నారు.
అంతలో అక్కడికి ఒక అందమైన శంఖినీ జాతి స్త్రీ వచ్చింది.
"మీ భూలోక వాసులకు ఇక్కడేం పని?" అని కొంటెగా అభిజిత్ వంక చూస్తూ సంజయ్ ని, అంకితని అడిగింది.
"శంభల రాజు అనిరుద్ధుల వారి ఆజ్ఞ మేరకు శంభల నగర సందర్శనం చేస్తూ ఈ ఇందుః ప్రాకారానికి వచ్చాము", తడబడుతూ అన్నాడు అభిజిత్.
"తను నీ ప్రేయసి కదా", అని అంకితని చూపిస్తూ అభిజిత్ తో నవ్వుతూ అన్నదా శంఖినీ జాతి స్త్రీ.
"అవన్నీ నీకెందుకు?" అని పైకి కోపం నటిస్తూ అన్నాడు అభిజిత్.
"మంచి అభినయం దాగుంది నీలో. మంచి రసికుడివే కదా", అంటూ అభిజిత్ బుగ్గను చుంబించినది.
"ఇదిగో అమ్మాయి, ఇదేం బాగోలేదు.పద్ధతి కాదిది", అన్నాడు అభిజిత్.
"నీ ప్రేయసి కోపంగా నన్నే చూస్తోంది", అంటూ గట్టిగా నవ్విందా శంఖినీ జాతి స్త్రీ.
"ఇక్కడ ఇంతమంది అందమైన జంటలను చూస్తుంటే నీకేం అనిపిస్తోంది?" అని అభిజిత్ ని అడిగింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
అభిజిత్ అంకిత వైపు చూసాడు ఏం చెప్పాలి? అన్నట్టు. అంకిత కోపంగా చూసింది.
"అబ్బో...ఆ అమ్మాయి కనుసైగ చేస్తే గాని తమరి నోటి నుండి ముత్యాల మాటలు రావే?" అంటూ నవ్వింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
"అలా ఏం కాదు. ఈ అందమైన జంటలను చూస్తుంటే నాకు కూడా నా కాబోయే భార్యతో ఇలానే చేతిలో చెయ్యేసి కళ్ళతోటే అనుబంధం పెనవేసుకుని నడుస్తూ అలా ముందుకెళ్లాలి అనిపిస్తోంది", అన్నాడు అభిజిత్.
అలా అన్నాడో లేదో అక్కడి ప్రాంగణంలో ఒక్క జంట కూడా లేకుండా అందరూ మాయం అయిపోయారు. ఇప్పుడక్కడ అభిజిత్, అంకిత తప్ప ఎవ్వరూ లేరు. సంజయ్ లేడు. ఆ శంఖినీ జాతి స్త్రీ కూడా లేదు.
"ఆ మహానుభావుడిది ఎంతటి గొప్ప అదృష్టం. కళలకు, జ్ఞానానికి నిలయమైన ఆ బాలా త్రిపుర సుందరీ దేవి ఎదుట తన కళను ప్రదర్శించటమా! ఇతను సామాన్య మానవుడు కాదు. సంజయ్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి నీకు తెలిసింది చెప్తావా? ఆయన గురించి నాకు ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది", అని అడిగాడు సిద్ధపురుషుడు.
సంజయ్ కి బిస్మిల్లా ఖాన్ గారి గురించి పెద్దగా తెలియదు.
"మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్తాను స్వామీ", అన్నాడు అభిజిత్.
"ఎవరైతే ఏముంది? ఆ మాహానుభావుడి గురించి తెలుసుకోవటమే నాకు ముఖ్యం. చెప్పు, అభిజిత్", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
"బిస్మిల్లా ఖాన్ గారికి భారత రత్న అనే గొప్ప గౌరవాన్ని ఇచ్చింది భారత కేంద్ర ప్రభుత్వం. ఎంతో మందికి భారత రత్న వచ్చి ఉండవచ్చు. కానీ బిస్మిల్లా ఖాన్ గారికి భారత రత్న రావటం ఆయనకు గౌరవం కాదు. ఆయనని వరించటం భారత రత్నకు దక్కిన గౌరవం అని భావించారు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ' సుర్ ఏక్ హయ్....భగవాన్ ఏక్ హయ్.....దునియా మే కళా జిస్ కే పాస్ హోతీ హయ్ వో అకేలా హయ్....క్యోన్కి వో ఏక్ హీ హయ్....అన్మోల్ రతన్ ఏక్ హీ హోతే హయ్....దో కభీ నహి హో సక్తే' అన్నారు. అంటే ఈ ప్రపంచంలో దేవుడు అనే శక్తి ఒక్కటే. సుస్వరాలను అవలీలగా పలికించగలిగే స్వరం ఒక్కటే. కళ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఒంటరిగానే ఉంటారు. వారిలా కళను ప్రదర్శించే మరొకరు మనకు ఎప్పటికీ కనబడరు. ఎందుకంటే వెలకట్టలేని మణి ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది. రెండు ఎప్పటికీ ఉండవు అన్నారు. అనటం మాత్రమే కాదు ఆయన తన జీవితాంతం అదే సిద్ధాంతంతో బ్రతికారు. ఆయనని దగ్గర నుంచి గమనించిన వారు చెప్పేది ఏంటంటే ఆయనకి వారణాసి అంటే చాలా భక్తి అని. ఒకసారి పాశ్చాత్య దేశాలలో ఎక్కడో షెహనాయి ప్రదర్శన ఇవ్వటానికి వెళ్లాల్సి వచ్చిందంట. ఆయనకి తన మాతృదేశాన్ని వదిలి వెళ్ళటం ఎంత మాత్రం ఇష్టం లేదట. వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ కాశీ విశ్వనాథుణ్ణి తలుచుకుని అక్కడికి వెళ్ళారంట. అక్కడ ప్రదర్శన ఇచ్చి తిరిగి కాశీకి రాగానే షెహనాయిని గంగలో ముంచి కడిగారంట. ఎందుకు అని అడిగితే నా షెహనాయి అపవిత్రం అయిపోయింది....అందుకే ఈ గంగాజలంతో తిరిగి పావనం చేస్తున్నాను అని సమాధానం ఇచ్చారంట. ఆయనకు కుల మత భేదాలు తెలియవు. తాత్విక చింతనతో బతికిన గొప్ప కళాకారుడు ఆయన. ఆయన నవ్వితే పసిపాప నవ్వినట్టుగా ఉంటుంది.
ఆయన బాధపడితే మన హృదయం ద్రవించిపోతుంది. ఆయన కంఠంలోనే షెహనాయి ఉందేమో అనిపిస్తుంది ఆయన గానం విన్నవారికి. అంత గొప్ప స్వరజ్ఞానం ఉంది. ఒకసారి రాగభైరవి లో అల్లాహ్ గురించి పాడి మతపరంగా తన విద్యను తప్పుబట్టాలని చూసిన ఒక మౌలానా నోరు మూయించారు. కళకు, దేవుడికి కుల, మత, వర్ణ భేదాలేంటి అంటూ ఆయన నవ్వేసేవారు. ఆయనే షెహనాయి. షెహనాయినే ఆయన. మనుషుల్లో దేవుడిలా బతికాడాయన. దేవుడికి దగ్గరగా బతికాడాయన. ఈ రోజు ఆ దేవుడి ముందే షెహనాయిని ప్రదర్శిస్తున్నాడాయన.
ఇది ఆయనకే సాధ్యం", అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు అభిజిత్.
సంజయ్, అంకితలు ఇద్దరూ ఆశ్చర్యపోతూ అభిజిత్ వంకే చూస్తున్నారు.
"బిస్మిల్లా ఖాన్ ఒక వ్యక్తిగా ఎలాంటి వారో నాకు పరిచయం చేసావు, అభిజిత్. నీలో చాలా లోతుంది. పైకి ఏమీ తెలియనట్టు ఉంటావు కానీ, నీకు చాలా తెలుసు. నీలో ఉన్న విద్యార్థిని ఇలానే ఉంచుకో. నీకు తిరుగుండదు", అన్నాడా సిద్ధపురుషుడు.
-------------------------------------------------
శంభల నగరం – 7
విమలః ప్రాకారం - 2
దర్శించుకోవలసినవి ఇంకా ఎన్నో మిగిలే ఉన్నాయి. ముందుకు వెళుతూ ఉండగా వారికి మొట్ట మొదట కనిపించినది ఈ జ్ఞాన కుంభము
జ్ఞాన కుంభములో ఉండే జలం స్వర్వాహినీ నదిలోనిదే అయినప్పటికీ ఆ జ్ఞాన కుంభాన్ని విమలః ప్రాకారంలోని జ్ఞాన దేవతలందరికీ తెల్లవారుఝామునే నివేదన చెయ్యటం చేత ఒక పవిత్రత సంతరించుకుని తీర్థం అయిపోతుంది.
జ్ఞాన కుంభములోని తీర్థాన్ని మూడు పర్యాయాలుగా ఒక క్రమంలో తీసుకోవాలి. అందులోఒక పరమార్థం దాగుంది.
మొదటి సారి తీర్థం తీసుకున్నప్పుడు బుద్ధికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ పవిత్రతను ఇచ్చే హయగ్రీవుణ్ణి తలుచుకుంటూ తీసుకోవాలి.
రెండో సారి తీర్థం తీసుకునేటప్పుడు మనసును జ్ఞానం వైపుకు మళ్లిస్తూ పవిత్రతను చేకూర్చే షణ్ముఖుణ్ణి స్మరించుకుంటూ తీసుకోవాలి.
మూడో సారి తీర్థం తీసుకుంటున్నప్పుడు నిర్మలమైన
బ్రహ్మజ్ఞానాన్ని ఏ నాటికైనా ప్రసాదించమని కోరుతూ సరస్వతీ స్తుతిస్తూ తీసుకోవాలి.
ఆ జ్ఞాన కుంభము దగ్గర ఒక ముముక్షువు ఉంటాడు. అక్కడికి వచ్చిన వారందరికీ ఆయనే తీర్థాన్ని అందిస్తాడు.
హయగ్రీవుణ్ణి, షణ్ముఖుణ్ణి, జ్ఞాన సరస్వతీ దేవినీ దర్శించుకోకుండా అక్కడ తీర్థాన్ని స్వీకరించకూడదు.
ఆ జ్ఞాన కుంభము దాటిన తరువాత వాళ్లకు అక్కడొక మందిరం కనిపించింది.
దురిత నివారితః
అని వ్రాయబడి ఉన్నది. అదేమిటో తెలుసుకుందామని ముఖద్వారం దగ్గరికెళ్ళారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు మాత్రం దూరం నుంచే వీళ్ళను గమనిస్తున్నారు.
ముఖద్వారం దగ్గరే ఒక ముముక్షువు ఉన్నాడు. వారిని సాదరంగా లోనికి ఆహ్వానించాడు.
"మీకు నేనే విధముగా సాయపడగలను?" అని అడిగాడు ఆయన.
"మాకు ఈ మందిరం గురించి విపులంగా చెప్తారా?" అని అడిగాడు సంజయ్.
“దురిత నివారితః” అని పైన వ్రాయబడి ఉంది కదా. అనగా ఈ చోటు మీ పాపములను పూర్తిగా తొలగించి వేస్తుందని దానర్థం ", అని బదులిచ్చాడు ఆ ముముక్షువు.
"పాపములు అనగా ఏవి స్వామి?" అడిగాడు అభిజిత్.
"విమలః ప్రాకారంలో పాపం అంటే అజ్ఞానం అనే అర్థం. అజ్ఞానం చేతనే ఎన్నో తప్పిదాలు జరుగుతాయి", అన్నాడా ముముక్షువు.
"అంటే ఇక్కడ అజ్ఞానాన్ని పూర్తిగా తీసేస్తారా స్వామి?" అని అమాయకంగా అడిగింది అంకిత.
"అజ్ఞానాన్ని తీసివెయ్యటం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు జ్ఞానసముపార్జనతోనే మనం అజ్ఞానాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం", అన్నాడు ఆ ముముక్షువు.
"అంటే ఇక్కడ గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఉంటాయా స్వామి?" అని అడిగాడు సంజయ్.
"అవేవీ ఇక్కడుండవు. ఇక్కడి నుండి కొంత దూరంలో ఉన్న జ్ఞాన శిఖ అనబడే ఒక గ్రంథాలయములో మీకు అవన్నీ దొరుకుతాయి. అక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు. మీరేది తెలుసుకోవాలని ఆరాటపడినా అక్కడ ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన విషయ సంపదంతా మీకు దొరుకుతుంది", అన్నాడా ముముక్షువు.
"మరి ఈ మందిరం విశిష్టత ఏమిటి స్వామి?" అని అడిగాడు అభిజిత్.
"ఇక్కడ మీరు ఎన్నో విషయాలను మరిచిపోవచ్చు. అలా మరిచిపోవటానికి ఇక్కడ మీకు మూడు ద్వారాలు ఉన్నవి", అని కాసేపు ఆగి ఆ మందిరం మొత్తాన్ని చూపిస్తూ
"ఈ మందిరంలో మొత్తం మూడు వాకిళ్లు ఉన్నాయి. అనగా మొత్తం మూడు అరలు అన్నమాట", అన్నాడా ముముక్షువు.
అర అంటే ఏమిటి?
అన్నట్టు సందేహంగా చూస్తున్నాడు అభిజిత్. దాన్ని అర్థం చేసుకున్న ముముక్షువు వెంటనే ఇలా అన్నాడు.
"ఇక్కడ ఉండే వాటిని గదులు అనకూడదు. గడపలు ఉండవు కాబట్టి ఇవి గదులు కావు. అందుకే అరలు అన్నాను. గడపను దేహళి అంటారు. ఒక గృహము నందు వేర్వేరు గదులు ఉంటాయి. ప్రతీ గదికీ ఒక గడప ఉంటుంది. గడపను తొక్కరాదు. గడప మీద కూర్చోకూడదు. గడపకు పసుపు, కుంకుమ పెట్టాలి. గడప లక్ష్మీ దేవి స్వరూపం కనుకనే ఈ మందిరంలో ఉన్న మూడు ద్వారాలకూ వాటిని అమర్చలేదు. అజ్ఞాన అంధకారాన్ని మొత్తం తీసేసుకునే మూడు అరలు ఇవి. ఈ మందిరంలోకి అడుగుపెట్టే ముందు మాత్రం మీరొక గడపను చూసి ఉంటారు. అక్కడ దైవ ప్రతిష్ఠ జరిగింది. అందుకే ఆ మొదటి వాకిలికి మాత్రమే గడప ఉంటుంది", అని చెప్పటం ముగించాడు.
ఆ మూడు వాకిళ్ళనూ వారికి చూపిస్తూ ఆ ముముక్షువు ఇలా అన్నాడు.
"మొదటి వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న మానసికమైన మలినాలు అన్నీ దూరం అవుతాయి. అనగా మీలో ఉన్న మోహం, ప్రాపంచిక విషయాల పట్ల మీకుండే భ్రమలు, అజ్ఞానం వల్ల కలిగే కోపాలు...ఇలా అన్నీ తొలగిపోతాయి.
రెండవ వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న బుద్ధి జాడ్యాలు అన్నీ తొలగిపోతాయి.అటు పిమ్మట మీకు సజ్జనుల సాంగత్యము దొరుకుతుంది. బుద్ధిలో పుట్టే జాడ్యాలన్నిటికీ కారణం దుర్జనుల సాంగత్యమే అన్నది నిర్వివాదాంశం.
--------------------------------------------------
మూడవ వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న ఆత్మస్తుతి అనే దోషము పూర్తిగా తొలగిపోతుంది. అన్నిటికీ నేనే కారణం. అంతా నా వల్లే జరుగుతోంది. అసలు నేను లేకపోతే ఇదంతా సాధ్యపడుతుందా? ఇలా ప్రతీ చిన్న విషయానికి ఆత్మస్తుతి చేసుకోవటం అలవాటైన వారికి ఈ వాకిలి ద్వారా వెళితే వారిలోని ఆత్మచైతన్య శక్తి జాగృతం అయ్యి అసలైన బ్రహ్మజ్ఞానం మీద జిజ్ఞాస పెరుగుతుంది. హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది", అన్నాడు ఆయన.
హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది
అన్న మాటలు ఆ ముముక్షువు చెబుతున్నట్టుగా వారికి అనిపించలేదు. ఆ మాటలు ఆయన నోటి వెంట వస్తున్నప్పుడు ఆ ముముక్షువునే చూసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. ఆ ముముక్షువుకి బదులుగా సిద్ధపురుషుడు కనిపించాడు వారికి. ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు ముగ్గురూ.
"స్వామీ, చివర్లో మీరు బ్రహ్మ జ్ఞానం మీద జిజ్ఞాస పెరుగుతుంది అన్నారు కదా?" అడిగాడు సంజయ్.
"అవును", అన్నాడా ముముక్షువు.
"హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది అని మీరు అనలేదా?" అడిగాడు అభిజిత్.
"అలా నేనలేదే", అన్నాడా ముముక్షువు.
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయి చూస్తుంటే ఆ ముముక్షువు ఇలా చెప్పాడు.
"మీతో వచ్చిన ఆ సిద్ధపురుషుడిలో ఋతంభర ప్రజ్ఞ వున్నది. నిరంతరమైన తపస్సు చేత, సాధన చేత ఆయనలో జాగృతం అయిన ప్రజ్ఞ అది. ఈ ప్రజ్ఞ ఆయన పొందటం వల్లే ఇంద్రియాలకు అతీతంగా చూడగలిగే ఒక దృష్టి ఆయన సొంతమయ్యింది. ఇప్పుడు ఆయన మీతో లేకపోయినప్పటికీ ఆయన శక్తి మీకు రక్షణ కవచంలా మీ చుట్టూ వున్నది. అందుకే మీకు ఆ వాక్యం వినిపించింది. ఇందులో అంతగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఆనందపడాల్సిన విషయమిది. అంతటి ప్రజ్ఞ కలిగిన ఆ సిద్ధపురుషుడు మీకు లభించటం మీరు చేసుకున్న పుణ్యఫలం. మీరెంతో అదృష్టవంతులు.
ఋషులు తపః శక్తితో సాధించిన శాశ్వత సత్యాల సమాహారమే వేదము. అలాంటి వేదాన్ని అర్థం చేసుకునే దృష్టి ఆ సిద్ధపురుషుని సొంతం. అలాంటి సిద్ధపురుషుడు మీకు గురువు అయ్యాడు. ఇంతకంటే మీకు కావలసినది ఏముంది?" అన్నాడు ఆ ముముక్షువు.
ఆ ముముక్షువుకు నమస్కరించి ఆయన నుండి సెలవు తీసుకున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
ఆ మందిరం నుండి బయటకి రాగానే అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ సిద్ధపురుషునికి అక్కడే పాదాభివందనం చేశారు. వారెందుకు అలా చేశారో సిద్ధపురుషునికి ఏం అర్థం కాలేదు.
"స్వామీ ఈ మందిరానికి వెళ్ళాక మాకు మీరేంటో అర్థం అయ్యింది", అని భావోద్వేగంతో చెప్పాడు అభిజిత్.
"ఈ మందిరాన్ని గుర్తు పెట్టుకోండి. మనం మళ్ళీ ఇక్కడికి రావలసి ఉంటుంది", అని చిరుమందహాసంతో అభిజిత్, అంకిత, సంజయ్ లను చూస్తూ సిద్ధపురుషుడు అన్నాడా మాట.
ఇద్దరు సైనికులూ వారికి దారి చూపిస్తూ ముందుకెళ్తున్నారు. వారు విమలః ప్రాకారంలోని హయగ్రీవుణ్ణి, షణ్ముఖుణ్ణి, వాగ్దేవతలను, జ్ఞాన సరస్వతీ దేవిని దర్శనం చేసుకున్నారు. ఆ తరువాతే జ్ఞాన కుంభములోని తీర్థాన్ని మూడు మార్లు స్వీకరించారు.
శంభల రాజ్యంలో తారా దేవి అన్న సరస్వతీ శక్తి రూపం ఉంటుంది. శత్రువులను మాటలతో సంహరించగల శక్తిని ఇస్తుంది. నీలమైన రంగులో ఉండే రూపం ఈ తారాదేవిది. తారా దేవి గురించి అభిజిత్, అంకిత, సంజయ్ లకు పరిచయం చేసాడు ఆ సిద్ధపురుషుడు. వారికి ఏదైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదో అది మాత్రమే చెబుతూ ఉంటాడు. అడిగితే తప్ప ఒక్క వాక్యమైననూ ఎక్కువ చెప్పడు. వాక్కు మీద ఆ సిద్ధపురుషునికి ఎంత పట్టుందో చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
విమలః ప్రాకారంలోని జ్ఞాన దేవతలను దర్శించుకున్న తర్వాత, వారు జ్ఞాన శిఖ గ్రంథాలయానికి వెళ్లారు. అక్కడున్న జ్ఞాన సంపదనంతా కళ్లారా చూసి ఆశ్చర్యపోయారు. అన్ని పుస్తకాలున్నాయి అక్కడ. జ్ఞాన శిఖ దాటిన తర్వాత జ్ఞాన దీపికలు అనబడే కేంద్రాలు 9 ఉన్నాయి. ఆ 9 జ్ఞాన దీపికలలో శాస్త్రవిద్యను క్షుణ్ణముగా అధ్యయనం చేసిన విద్యావేత్తలైన ముముక్షువులు ఉంటారు. వేదవిద్యను అభ్యసించిన ముముక్షువులు కూడా ఉంటారు. వాళ్ళందరూ సందేహ నివృత్తి చేస్తారక్కడ.
అలా విమలః ప్రాకారాన్ని మొత్తంగా సందర్శించాక వారు అక్కడి నుండి అభయః ప్రాకారానికి బయలుదేరారు.
----------------------------------------------------------------
శంభల నగరం – 8
అభయః ప్రాకారం
సమరవిజయ రాముని కోసం శంభల నగరానికి విచ్చేసిన ఆ శ్రీకృష్ణుడు శంభలలో నడయాడిన ప్రాంతమే ఈ అభయః ప్రాకారం. ఆయన ఎంతో దీక్షతో సదాశివుని జపం చేసి, మౌనాన్ని ధరించి లలితా దేవి ధ్యానంలోనే గడిపారు. అలాంటి ఈ అభయః ప్రాకారంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి చేతుల మీదుగా ఒక చెట్టును ప్రతిష్ఠించటం జరిగింది. అదే కల్పవృక్షము.
ఈ కల్పవృక్షం క్షీర సాగర మథనంలో పుట్టింది. దేవతలకు రాజైన ఇంద్రుడి చెంతకు చేరింది. మనం కోరిన కోరికలను తీర్చే చెట్టు ఇది. శ్రీకృష్ణుడు అమ్మవారిని ధ్యానం చేసి అలాంటి అరుదైన కల్పవృక్షాన్ని కోరగా ఆ లలితాదేవి వరంగా ప్రసాదించినది.
ఆ కల్పవృక్షాన్ని ఇక్కడ స్థాపన చేసిన తరువాత సమరవిజయ రామునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.
“ఈ కల్పవృక్షానికి ఒక విశిష్టత ఉన్నది. భవిష్యత్తులో భూలోకవాసులు ఈ శంభలకు విచ్చేస్తారు. ఒకానొక సమయంలో భూలోకంలోని వారికి అగమ్యగోచరమైన స్థితి ఏర్పడుతుంది. పాతకులు అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం ముష్కరులతో నిండిపోయి ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితులలో కొంతమంది మానవులు ఈ శంభలకు శరణార్థి పొందటం కోసం వస్తారు. వాళ్ళు సామాన్య మానవులే అయినప్పటికీ వారి పూర్వీకులు చేసిన పుణ్య కర్మల వల్ల వారికి సిద్ధపురుషుల సాంగత్యం దొరుకుతుంది. అలా వారికి శంభలలో అడుగుపెట్టే యోగ్యత దక్కుతుంది.
ప్రపంచాన్ని పాపం నుండి, పాపుల నుండి విముక్తి చేసే శక్తిని పొందాలంటే కల్పవృక్షానికున్న ఈ కుసుమాలతో శక్తి పీఠమునందున్న అమ్మవారిని వారు పూజించాలి. శ్రద్ధతో పూజించినప్పుడు మాత్రం దివ్యశక్తులే వారిని వరిస్తాయి. అవి సరిగ్గా లోకానికి ఉపయోగపడతాయి.”
ఆ రోజు నుండి ఈ అభయః ప్రాకారంలోని కల్పవృక్షాన్ని ఎంతో పవిత్రంగా ఆరాధించటం జరుగుతున్నది. శంభల రాజ్యంలోని రాజైన అనిరుద్ధుల వారికి అమ్మవారిని ఈ కుసుమాలతో పూజించటం అంటే ఎంతో ఇష్టం. ఒక సంకల్పం, ఒక లక్ష్యం, ఒక కోరిక లేకుండా అమ్మవారిని పూజించటం శాస్త్ర విరుద్ధమైన చర్య అవుతుంది. పైగా అమ్మవారిని కోరుకునే కోరిక లోకకల్యాణం కోసమే అయ్యి ఉండాలి. వ్యక్తిగతమైన వాంఛలు నెరవేరటం కోసం అమ్మవారిని కల్పవృక్షం కుసుమాలతో సేవిస్తే అది లోకానికే అరిష్టం. ఈ ధర్మసూక్ష్మం తెలుసు కాబట్టే అనిరుద్ధుల వారు తన మనస్సులోనే సహస్ర నామ పఠనం చేస్తూ ఆ దేవిని భక్తితో కొలుస్తారు.
అభయః ప్రాకారంలో ఎన్నో అద్భుతాలుంటాయి. శ్రీకృష్ణుడు ఎంతో కఠిన దీక్షతో ధ్యానంలో గడిపిన స్థలమిది. అందువల్ల ఆయన ధ్యానించిన చోటు శాశ్వతంగా ఒక శక్తి వలయంలా మారిపోయింది. ఆ వలయం చుట్టూ ఉండే అగ్ని నిరంతరం ఒక జ్యోతిలా ఎర్రటి కాంతితో వెలుగుతూ ఉంటుంది. ఆ వలయం మధ్యలో సూర్యుని కిరణాలన్నీ ఒక్క చోట చేరినట్టుగా ఉండే కాంతి పుంజం మనకు కనబడుతుంది. ఆ కాంతి పుంజం రంగు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అరుణ వర్ణం, నీలమేఘ వర్ణం, హరితవర్ణం.,ఇత్యాది వర్ణములను ఈ కాంతిపుంజంలో మనం దర్శించుకోవచ్చు. మనలో వున్న దైవీభావాలను ద్విగుణితం చేసే అరుదైన దర్శనమిది.
కల్పవృక్షాన్ని, శక్తి వలయాన్నిదర్శించుకున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. సిద్ధపురుషుడు ఆ శక్తి వలయం దగ్గరే తగిన చోటు చూసుకుని అక్కడే ఆసీనుడై ధ్యానం చేసుకుంటున్నాడు. వారితో వచ్చిన ఆ ఇద్దరు సైనికులు సిద్ధపురుషునికి దగ్గరలోనే ఒక రాతి బండ మీద కూర్చుని ఉన్నారు.
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ ప్రదేశాన్నంతా పరిశీలనగా చూస్తున్నారు.
ఇంతలో అక్కడికొక కపిల గోవు వచ్చింది. ఆ కపిల గోవు మెడకి గంటలు కట్టి ఉండటంతో అది నడుస్తూ ముందుకెళ్తున్న కొద్దీ ఆ గంటల శబ్దం చెవులకు మధురంగా వినిపిస్తోంది. ఆ కపిల గోవునే అనుసరిస్తూ వారు ముందుకు కదిలారు. అక్కడొక గోశాల కనబడింది. సున్నితత్వానికి ప్రతీకలా, సాత్విక గుణాలకు పెన్నిధిలా, సచ్ఛీలతకు సదనములా అనిపించినదా గోశాల.
అభిజిత్, అంకిత, సంజయ్ లు భారత దేశంలో ఎన్నో సార్లు గోవులను చూసారు కానీ ఇక్కడున్న గోవులను మాత్రం ఇంతక్రితం ఎప్పుడూ వారు చూడలేదు. గోలోకంలోని గోవులలా అనిపించాయి వాళ్లకి. ఆ గోవులను సంరక్షించే ఉద్ధారకుడు వారికి అక్కడ కనిపించాడు. విచిత్రం ఏంటంటే ఆయనొక ముముక్షువు. భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో గోవులకు ఇలాగే సేవ చేసుకునేవాడు. గోసేవలో తరించిపోయేవాడు ఆయన.
అభిజిత్, అంకిత, సంజయ్ లను చూడగానే ఆ ఉద్ధారకుడు వారిని సమీపించి ఆ గోశాల గురించి ఇలా వివరించటం మొదలు పెట్టాడు.
“శ్రీకృష్ణుడు శంభల నగరంలో చాలా రోజులు ధ్యానంలో గడిపారు. సమరవిజయరాముడు చేసుకున్న అదృష్టం వల్ల శ్రీకృష్ణుడిని సేవించుకునే భాగ్యం శంభలకు కలిగింది. ఆయన గోవులు లేకుండా ఉండలేడు. శంభలకు కపిల గోవులను ఆయనే వరంగా ప్రసాదించాడు. ఆ రోజు నుండి శంభలలోని శివుని ఆలయంలో ఆ మహాదేవునికి క్షీరాభిషేకం చెయ్యటమనే ప్రక్రియ మొదలయ్యింది. ఇక్కడి గోవు పాలనే శివుని అభిషేకానికి వినియోగిస్తారు. గోవులను సూర్యుని కిరణాలుగా, సూర్యమండలంలోని యజ్ఞపురుషుడిని గోవిందుడిగా భావిస్తూ ఇక్కడ సూర్యారాధన చేస్తారు.
గోబ్రాహ్మణేభ్యహ శుభం భవతు అని వేదాలలో పఠిస్తారు. గోవులకు బ్రాహ్మణుల కంటే ముందు స్థానాన్ని ఇచ్చి వారికి శుభం కలుగుగాక అని మన ప్రార్థనలో మనం దేవుణ్ణి కోరుకుంటాం అన్నమాట. ఎంత గొప్ప భావన అది.
ఇక్కడ మీరు చూసేవి కపిల గోవులే అయినప్పటికీ ఇవన్నీ
కామధేనువు నుండి వచ్చినవి. ఇక్కడున్న ప్రతీ కపిల గోవూ గోమాతగా ఉన్న దేవతే అనర్థం. వీటికి చావూ పుట్టుకలతో సంబంధం లేదు. శంభలలోని ఈ అభయః ప్రాకారంలో శ్రీకృష్ణుడిని సేవించుకుంటూ ఉంటాయి. దయచేసి మీరు ఈ కపిల గోవులను దేవతలలానే చూడండి. ఈ గోశాలలో ఉన్న ఏ కపిల గోవుకు మీరు సేవ చేసుకున్నా సరే దేవతలకు అభిషేకం చేసినంత ఫలం మీకు దక్కుతుంది.”
ఆ ఉద్ధారకుడి సూచనలు అనుసరిస్తూ అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ గోశాలలోని కపిల గోవులకు సేవ చేసుకున్నారు.
అక్కడి నుండి కాస్త ముందుకెళ్ళగానే వాళ్లకి వేణు నాదం వినిపించింది. వేణుగానం చేస్తున్న ఒక ముముక్షువు కనిపించాడు వాళ్ళకి. సమ్మోహన పరిచేలా ఉందా వేణుగానం.
-----------------------------------------------------
ఆ ముముక్షువు వేణు గానం చేస్తున్నంత సేపూ ఆ ప్రాంగణం అంతా కృష్ణమయం అయిపోయింది. అభిజిత్, అంకిత, సంజయ్ లు ఏదో తెలియని ఓ దివ్యానుభూతికి లోనయ్యారు. శ్రీకృష్ణుడి దర్శనం కోసం వాళ్లలో కలుగుతున్న తహతహ అది అని గ్రహించలేని స్థితికి వెళ్లిపోయారు.
వేణుగానం ముగిసిన వెంటనే ఆ ముముక్షువు వారి వద్దకు వచ్చాడు. వేణుగానం చేస్తున్నంత సేపూ తాదాత్మ్య స్థితిలో ఉన్న వారిని చూసాక ఆ ముముక్షువుకు ఈ వేణుగానం వెనుకనున్న శ్రీకృష్ణుని మహిమ గురించి చెప్పాలనిపించి ఇలా చెప్పాడు.
“శ్రీకృష్ణుడి దర్శనభాగ్యం దొరకటం అంత సులువు కాదు. సిద్ధపురుషుడి సాంగత్యం చేత మీకు రాముడు కనిపించాడు. ఆయన మార్గదర్శిలా మిమ్మల్ని ఇక్కడి దాకా నడిపించాడు. మీ పూర్వీకుల రామభక్తి చేత మీకు రామలక్ష్మణుల దర్శనం దొరికింది. శ్రీకృష్ణుడిని దర్శించుకోవటం ఎందరో యోగీశ్వరులకు సైతం సాధ్యపడని విషయం. శంభలలోని సమరవిజయ రాముడికొక్కడికే అది సాధ్యపడినది. శంభలలో శ్రీకృష్ణుడు ఉన్నన్ని రోజులూ ఆయనని ఒక్కసారైనా చూడాలని ఎందరో యోగులు పరితపించిపోయేవారు. సాయం సంధ్యా సమయంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేసేవాడు. ఆ వేణుగానం విని ఎందరో యోగులు శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ ఈ అభయః ప్రాకారానికి వచ్చేవారు. కానీ ఆయన వీరికి కనబడేవారు కాదు. అయినా సరే ఆ గానాన్నే విని ఆస్వాదిస్తూ ఆయన ధ్యానంలో, నామ జపంలో గడిపేవారు ఆ యోగులు. వేదాలనే వేణువు ద్వారా గానం చేసిన ఆయన స్థాయిని ఏ వేణునాద విద్వాంసుడూ అందుకోలేడు. ఈ అభయః ప్రాకారం చేసుకున్న పుణ్యం అలాంటిది. ఆయన ఇక్కడున్నన్ని రోజులూ వేణువు ద్వారా వేదగానం చేశారు.
ఆ వేణుగాన వేద ఘోష ఇప్పటికీ ఈ అభయః ప్రాకారంలో నిక్షిప్తమై ఉన్నది. నేను చేసిన వేణుగానం కూడా అలాంటిదే. శ్రీకృష్ణుడు అభయః ప్రాకారానికి ఇచ్చిన వేణుగాన జ్ఞాన సంపద వల్లే నేను వేణువును ఆలపించాను. ఇందులో నా ప్రతిభ కంటే శ్రీకృష్ణుని ప్రభే మీకు కనబడుతుంది.”
"స్వామి రాముని దర్శన భాగ్యం మాకు దొరికిందన్న విషయం మీకెలా తెలిసింది?" అని అడిగాడు సంజయ్
"మోక్ష సాధనలో ఉన్న వాడినే ముముక్షువు అంటారు. ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారు అభ్యసించేది కూడా విద్యే కదా. విద్య ఎక్కడుంటుందో స్పర్ధ అక్కడుంటుంది. స్పర్ధ ఎక్కడుంటుందో అక్కడ అన్ని విషయాలూ తెలిసిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా దైవానుగ్రహం ఎవరికి దక్కింది అన్న రహస్యాలు. మీకు రాముని అనుగ్రహం దొరకటం ఎంత విలువైనదో మీకిప్పుడు అర్థం కాదు. మోక్ష సాధనలోకి మీరు అడుగుపెట్టిన రోజున మీరెంత అదృష్టవంతులో మీకర్థం అవుతుంది", అన్నాడు ఆ ముముక్షువు.
ఆ ముముక్షువు నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి బయలుదేరారు. సిద్ధపురుషుడు తన జపమును ముగించుకుని ధ్యాన స్థితిని వీడి వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
అభిజిత్, అంకిత, సంజయ్ లని చూడగానే వారితో ఒక ముఖ్యమైన విషయాన్ని ఇలా ప్రస్తావించాడు.
"వేణు గానాన్ని విని మీరు చాలా మంచిపని చేశారు. నేనే స్వయంగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళదాం అనుకున్నాను. ఈ రోజుతో మీలోని పాషండ భావాలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఇక మీరు శంభల రాజ్యంలోని సకల విద్యలూ నేర్చుకోవటానికి సంసిద్ధులు అయినట్టే లెక్క", అన్నాడా సిద్ధపురుషుడు.
"పాషండ భావాలంటే ఏవి స్వామి?" అని అడిగాడు అభిజిత్.
"వేదాలకి విరుద్ధమైన భావాలు. కలిదోషం వల్ల మానవులలో కలిగే వికారాలు ఇవి. మీరు గోమాతను దర్శించి, సేవించి ఎంతో శ్రేష్ఠమైన పని చేశారు. గోవును మన సనాతన ధర్మదేవతగా వేదాలు అభివర్ణించాయి. మీరు సాక్షాత్తు ఆ కామధేనువు నుండి వచ్చిన కపిల గోవులను అనగా దేవతలనే సేవించుకున్నారు. ఇలాంటి అదృష్టం మీకు దక్కిందంటే మీకు దైవబలం తోడుగా ఉందని అర్థం. ప్రపంచాన్ని వినాశనం చేయాలనుకునే ఆ ఘోరకలిని అంతం చెయ్యటం కోసం అడుగు అడుగునా మిమ్మల్ని స్వాగతిస్తూ మీలోని అంతర్గత శక్తిని జాగృతం చేస్తున్నారు దేవతలు. ఆ ఘోరకలి అంతం అవ్వాలని, భూలోకం సురక్షితంగా ఉండాలని దేవతలు బలంగా కోరుకుంటున్నారని దానర్థం", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
"ఈ పాషండ భావాలు మాలో నుండి ఎలా పోయాయి స్వామి?" అడిగాడు సంజయ్
"శ్రీకృష్ణుడు శంభల కిచ్చిన వరం వేణుగాన నాద శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అనుసరించి చేసిన వేణుగానాన్నే మీరు విన్నారు. వేద విరుద్ధమైన భావాలు మీలో నుండి మాయమైపోయే గానమది. వేదాలని స్మృతి చేతనే గుర్తుపెట్టుకుని, పదే పదే మననం చేసుకునేవారు మన ఋషులు. ఇంద్రియాలలో ముఖ్యమైనది శ్రవణ శక్తి. కలియుగంలో ఆ శక్తి దుర్వినియోగం అవుతోందని చెప్పక తప్పదు. వినకూడని శబ్దాలు ఎన్నింటినో మీరు వినటం చేత మీలోకి ఈ పాషండ భావాలు చొరబడ్డాయి. ఒక్క చెవులకే కాదు మన జ్ఞానేంద్రియాలు అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఇంద్రియాలకు నియమం అంటూ లేకపోతే మాత్రం విష్ణు నామం ఉచ్ఛరించటానికి కూడా మనస్కరించని దుస్థితికి వెళ్ళిపోతాడు మనిషి. తనకు దేవుడిచ్చిన ఇంద్రియ శక్తిని ఉపయోగించుకోకపోయినా పోయేదేంలేదు కానీ దుర్వినియోగం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే దేహమే దేవాలయం అన్నారు. దేవాలయం లాంటి ఆ దేహంలో ఉన్న ఇంద్రియాలు గుడి తలుపుల లాంటివి. పవిత్రమైన దేవాలయంలోకి ఎవరిని అనుమతించాలి అన్న విజ్ఞత ఉండాల్సింది మనిషికే కదా”, అంటూ చెప్పటం ముగించాడు.
"స్వామి నాదొక చివరి ప్రశ్న", అడిగింది అంకిత.
అదేమిటో అడుగు అన్నట్టు చూసాడా సిద్ధపురుషుడు.
"ఈ ప్రాకారానికి అభయః ప్రాకారం అన్న పేరెందుకు వచ్చింది?" అని అడిగింది అంకిత.
"కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి వైరాగ్యం కలిగినప్పుడు జ్ఞానబోధను చేసి తిరిగి తనని కార్యోన్ముఖుడిని చేశాడా కృష్ణ పరమాత్మ. తద్వారా లోకానికి భగవద్గీత దొరికింది. కష్టం వచ్చిన ప్రతీ సారి మనకు అభయాన్ని ఇచ్చేది ఆ శ్రీకృష్ణుడేనమ్మా. అలాంటి శ్రీ కృష్ణుడు ధ్యానించిన చోటిది. ఆయనే లలితాదేవిని ఉపాసన చేసిన స్థలమిది. అనగా ఆయనకు అభయాన్ని ఇచ్చే ఆది పరాశక్తిని ధ్యానించాడిక్కడ. అలాంటి ఈ ప్రాకారం అభయః ప్రాకారం కాక మరేం అవుతుంది" అంటూ మరొక్క మారు శ్రీకృష్ణుడిని తలచుకున్నాడా సిద్ధపురుషుడు.
"తరువాత వచ్చే ప్రాకారం ఏది?" అని అక్కడున్న ఇద్దరు సైనికులను సిద్ధపురుషుడు అడిగాడు.
----------------------------------------------------------
శంభల నగరం – 9
ఇందుః ప్రాకారం
ఇందుః ప్రాకారంలోకి అడుగుపెట్టగానే వారికి అమితాశ్చర్యం కలిగింది. భూలోకంలో మనం చూసే పరస్పర విరుద్ధమైన స్వభావం కల జీవులన్నీ ఒకే చోట కలిసి ఉంటున్నాయి ఇక్కడ. పాము-ముంగిస. శునకము-మార్జాలము. సింహము-జింక. ఇలా అన్నీ సాధు స్వభావంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. పైగా వాటి కళ్ళను చూస్తే పాశవిక లక్షణాలు కనిపించకపోగా, దైవీ కాంతులను విరజిమ్ముతున్నాయి.
వాటిని అలానే చూస్తూ విస్తుపోయిన అభిజిత్, అంకిత, సంజయ్ లతో సిద్ధపురుషుడు ఇలా అన్నాడు.
"ఈ ఇందుః ప్రాకారంలో మనసు చంద్రుని ఆధీనములో ఉంటుంది. చంద్రుడు అంటే భూమి చుట్టూ తిరిగే చంద్రుడు కాదు. భూలోక వాసుల కంటికి కనిపించే చంద్ర రూపం అది. సూర్య మండలం పైన నిజమైన శీతల, జల లక్షణాలు కలిగిన ఒక భూమిక ఉన్నదని చెబుతోంది వేదం. ఆ భూమికనే చంద్ర మండలంగా గుర్తించారు మన వేదాలలో. భౌతిక దృష్టికి అందని చంద్రుని రూపం అది అని చెబుతారు. వేద ఋషులు దర్శించిన చంద్ర మండలం అదే. ఆచంద్రతారార్కం అన్న పదం వినే ఉంటారు. చంద్రుడూ, తారలూ, సూర్యుడు ఉన్నంతవరకూ అని అనటంలో ఉన్న పరమార్థం ఇదే.
ఆ చంద్రుణ్ణి ప్రార్థిస్తే మనసును నిర్మలంగా, ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకుండా ఒక సరోవరం వలే ప్రశాంతముగా ఉంచుతాడు. అందుకే భూలోకంలో పరస్పర వైరంతో ఉండే జంతువులు సైతం ఇక్కడ కలిసి మెలసి జీవిస్తాయి.
అంతే కాదు, ఈ ప్రాకారంలో మీ మనసుకు ఎన్నో పరీక్షలు ఎదురవ్వబోతున్నాయి. అందుకు సంసిద్ధంగా ఉండండి", అని వారిని హెచ్చరించాడా సిద్ధపురుషుడు.
"స్వామి, భూలోకంలో అడవుల్లో మనకు కనిపించే జంతువులన్నీ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదెలా సాధ్యం?" అని అడిగాడు సంజయ్.
"భూలోకంలోని మనుషులే ఇక్కడ ముముక్షువులుగా మీకెలా అయితే దర్శనం ఇచ్చారో, ఇదీ అంతే. భూలోకంలో జంతువుగా జన్మించినప్పటికీ ఆ జన్మలో చేసిన సాధన వల్ల ఉత్కృష్టమైన స్థితికి చేరుకున్న అన్ని జంతువులూ ఇక్కడ ముముక్షువులలా అవే శరీరాలు ధరించి కేవలం మోక్ష సాధన కోసమే తపించిపోతూ ఉంటాయి. వాటికి మరొక జన్మ అంటూ ఉండదని అర్థం", అన్నాడా సిద్ధపురుషుడు.
“ఇక్కడున్న ఆ సింహాన్ని చూసారా? అది శంభల నగరానికి కేంద్రబిందువు ఐన శక్తి పీఠమునందున్న అమ్మవారికి నిర్వహించే అన్ని పూజలలో కర్మసాక్షిగా ఉంటుంది. అమ్మవారిని పూజించే రోజున ఆ అమ్మకు వాహనంగా ఈ సింహం ఎన్నో సేవలను అందుకుంటుంది”, అన్నాడు సైనికులలో ఒకడు.
"ఆ సింహం పేరేమిటి?" అని అడిగాడు అభిజిత్.
" కేశనామ ", అన్నాడు ఆ సైనికుడు.
"ఆ పేరుకి అర్థం చెప్పగలరా?" అని అడిగాడు అభిజిత్.
"ఆ సింహం యొక్క కేశాలు సుగంధాన్ని వెదజల్లే మూలికలలా ఉంటాయి. ఎలాంటి దుష్ట పీడిత శక్తి దరిచేరకుండా ఉండటానికి చింతామణి గృహమునందు ఈ సింహ కేశాలను నీటితో కలిపి ప్రోక్షణ కూడా చేస్తారు. అంతటి ఓషధీ శక్తి ఉన్నదా కేశాలకు", అని వివరించాడు ఆ సైనికుడు.
అక్కడి నుండి అభిజిత్, అంకిత, సంజయ్ లు ముందుకు వెళుతూ ఉన్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు మాత్రం అక్కడే ఆగిపోయారు. అభిజిత్, అంకిత, సంజయ్ లు వెనక్కి తిరిగి చూసారు.
అప్పుడు ఆ ఇద్దరు సైనికులు, "మీరు ముందుకు వెళ్ళండి. మేమిక్కడే ఉంటాము", అన్నారు.
సిద్ధపురుషుడు,"మీకు అక్కడ ఎదురయ్యే పరీక్షలు ఎంతో విలువైనవి. మీ జీవితాంతం మీరు గుర్తుపెట్టుకోవలసిన ఎన్నో పాఠాలను మీరక్కడ నేర్చుకోబోతున్నారు", అని చెప్పాడు.
అసిధారావ్రతం అని రాసి ఉన్న ప్రాంగణంలోకి అడుగుపెట్టారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
అక్కడ ఎందరో అందమైన యువతీ, యువకులు జంటగా కనిపించారు. అందమైన దుస్తులు ధరించి, సుగంధ ద్రవ్యాలను వెదజల్లుతూ చేతిలో చెయ్యేసి ఒకరి సాహచర్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ ఆ ప్రాంగణం అంతా తిరుగుతున్నారు. వాళ్ళల్లో కొంత మంది ఒకరిని ఒకరు ఆటపట్టిస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. మరి కొంత మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొంత మంది నడుస్తూ మౌనంగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ ఏదో తెలియని అనుభూతితో ఊహాలోకాల్లో విహరిస్తున్నారేమో అన్నట్టుగా కదులుతూ ముందుకెళుతున్నారు.
అంతలో అక్కడికి ఒక అందమైన శంఖినీ జాతి స్త్రీ వచ్చింది.
"మీ భూలోక వాసులకు ఇక్కడేం పని?" అని కొంటెగా అభిజిత్ వంక చూస్తూ సంజయ్ ని, అంకితని అడిగింది.
"శంభల రాజు అనిరుద్ధుల వారి ఆజ్ఞ మేరకు శంభల నగర సందర్శనం చేస్తూ ఈ ఇందుః ప్రాకారానికి వచ్చాము", తడబడుతూ అన్నాడు అభిజిత్.
"తను నీ ప్రేయసి కదా", అని అంకితని చూపిస్తూ అభిజిత్ తో నవ్వుతూ అన్నదా శంఖినీ జాతి స్త్రీ.
"అవన్నీ నీకెందుకు?" అని పైకి కోపం నటిస్తూ అన్నాడు అభిజిత్.
"మంచి అభినయం దాగుంది నీలో. మంచి రసికుడివే కదా", అంటూ అభిజిత్ బుగ్గను చుంబించినది.
"ఇదిగో అమ్మాయి, ఇదేం బాగోలేదు.పద్ధతి కాదిది", అన్నాడు అభిజిత్.
"నీ ప్రేయసి కోపంగా నన్నే చూస్తోంది", అంటూ గట్టిగా నవ్విందా శంఖినీ జాతి స్త్రీ.
"ఇక్కడ ఇంతమంది అందమైన జంటలను చూస్తుంటే నీకేం అనిపిస్తోంది?" అని అభిజిత్ ని అడిగింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
అభిజిత్ అంకిత వైపు చూసాడు ఏం చెప్పాలి? అన్నట్టు. అంకిత కోపంగా చూసింది.
"అబ్బో...ఆ అమ్మాయి కనుసైగ చేస్తే గాని తమరి నోటి నుండి ముత్యాల మాటలు రావే?" అంటూ నవ్వింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
"అలా ఏం కాదు. ఈ అందమైన జంటలను చూస్తుంటే నాకు కూడా నా కాబోయే భార్యతో ఇలానే చేతిలో చెయ్యేసి కళ్ళతోటే అనుబంధం పెనవేసుకుని నడుస్తూ అలా ముందుకెళ్లాలి అనిపిస్తోంది", అన్నాడు అభిజిత్.
అలా అన్నాడో లేదో అక్కడి ప్రాంగణంలో ఒక్క జంట కూడా లేకుండా అందరూ మాయం అయిపోయారు. ఇప్పుడక్కడ అభిజిత్, అంకిత తప్ప ఎవ్వరూ లేరు. సంజయ్ లేడు. ఆ శంఖినీ జాతి స్త్రీ కూడా లేదు.