Update 40
ఇంటి కెల్లంగానే పెద్దాయన అడిగాడు ఏంది గొడవ అని , సంక్షిప్తంగా చెప్పాను పల్లవిని ఎవడో ఏడిపిస్తుంటే వాడిని దండించడానికి పొతే వాడి వెనుక పెద్ద గ్యాంగు వుంది ఆళ్ళ దగ్గర ఓ చిన్న టౌన్ పెల్చేసెంత మందు గుండు ఓ 200 మందికి సరిపోయే తుపాకులు వున్నాయి. అవన్నీ సెక్యూరిటీ ఆఫీసర్లకు పట్టిచ్చాము అంతే.
" పెద్దయ్యా ఇంతకీ శైలజమ్మ కాలు ఎలా వుంది. "
"ఇప్పుడు బాగానే ఉంది నడుస్తుంది, ఇంట్లోనే వుంది వెళ్లి పలక రించు". లోనకేలితే మంచం మీద కూచొని వుంది , నన్ను చూస్తూనే
"హిరో గారికి రాచ కార్యాలు అయిపోయాయ, ఇప్పుడు తీరిక దొరికిందా "
"మీకు నా మింద కోపంగా ఉన్నట్లు ఉంది , తాతను అడిగే కదా వెళ్ళింది "
"నువ్వు వెళ్లి నందుకు కాదు , అక్కడ నీకు ఏమైనా జరిగుంటే "
"నాకేమి కాదు "
"ఆ పల్లవికి నివే దొరికావా , ఇంకెవరు లేరా తన బాధలు చెప్పుకోవడానికి "
"టయానికి నేను అక్కడ ఉన్నాను , చూస్తూ వురుకోలేనుగా "
"అదే గదా వచ్చిన తిప్పడ " అంటూ ఎదో గోనిగింది కాని నాకు వినబడలేదు , ఆ ఆడవాళ్ళు ఏమి మాట్లాడతారో అర్థం చేసుకోవాలంటే ఓ బుర్ర చాలదు రావణాసురిడి లాగా పది బుర్రలు వుండాలి అనుకుంటూ .
"మందులు వేసుకున్నవా ?"
"ఆ వేసుకున్నా, పద అన్నం తిందాం " అంటూ వెళ్లి బొం చేసి పైకి వెళ్లి పడుకున్నా . రాత్రి నిద్ర లేక పగలంతా అలసి పోవడం వలన వెంటనే నిద్ర పట్టేసింది. పొద్దున్న వేడిగా సూర్య కిరణాలు పడుతుంటే మెలుకవ వచ్చింది.
లేచి , టిఫిన్ చేస్తుంటే ఓ మూడు పొలిసు జీపులు పెద్దాయన కాంపౌండ్ లోపలి కి వచ్చాయి. ఓబులేసు వాళ్ళకు ఇల్లు చూపిచ్చి వెళ్ళాడు. చుస్తే , ప్రతాప్ , హమీద్ , రవీంద్ర వాళ్ళ ఫామిలీస్, పెద్దాయనను పరిచయం చేసాను, నేను , ప్రతాప్ , రవీంద్ర కలిసి పదవ తరగతి చదువు కున్నామని చెప్పాను. వాళ్ళ చేతుల్లో ఆ రోజు అన్ని న్యూస్ పేపర్స్, మెయిన్ పేపర్ లో పెద్ద పెద్ద హెడింగ్స్, "గుర్తు తెలియని వ్యక్తి సహాయంతో రాయచోటి సెక్యూరిటీ ఆఫీసర్లు , అతి పెద్ద టెర్రరిస్ట్ ల ఆయుద గిడ్డంగి పట్టివేత " అంటూ. వాటి కింద వీళ్ళ ముగ్గారికి ఇ చ్చిన ప్రమోషన్స్. వాటి పక్కనే ఆ ఆపరేషన్స్ లో చనిపోయిన గడ్డపొడి ఫోటో( వాడిని ప్రాణం తోగాని , చచ్చినాక వాడి శవాన్ని తెచ్చిన వారికి 10 లక్షలు బహుమానం వుంది ) . ఆ విషయాలు అన్ని వాళ్ళు పెద్దాయనకు వివరించారు. ఈ లోపుల సర్పంచ్ , పల్లవి , శైలజా , వాళ్ళ ఆయన వచ్చారు . అందర్నీ పరిచయం చేసాను.
మీ శివా సార్ వళ్ళ నాకు రెండు ప్రమోషన్ లు వచ్చాయి అంటూ హమీద్ అందరికి స్వీట్స్ పంచి ఇచ్చాడు, ముగ్గరు కలిపి దాదాపు ఓ పది కిలోలు స్వీట్స్ తెచ్చారు. నేను ఎక్కడ కష్టాలలో ఉన్నానో అని వూరు అందరూ కలిసి నా కోసం రావడం , మా రవీంద్ర గాడికి బాగా నచ్చింది. అందుకే అందర్నీ పోగుచేసుకొని వచ్చాడు.
మిగిలిన స్వీట్స్ అన్నిటిని మల్లన్న చేత పంపించి , ఓబులేసు తో పాటు పల్లెలో మనకోసం వచ్చిన వాళ్ళ అందరికి పంచమని రవీంద్ర ఇచ్చి పంపాడు. వాళ్ళు వెలతా మంటే పెద్దాయన మద్యానం భోంచేసుకొని వేళ్ళమన్నాడు. నల్లప్పకు చెప్పి ఊర్లో కెళ్ళి 4 కోళ్ళు పట్టుకొని రమ్మని , సర్పంచ్ వాళ్ళ ఫ్యామిలిని కుడా అక్కడే భోంచేయమని చెప్పి, ఇక్కడ వంట అయ్యే లోపల వాళ్ళకు మన గుడి చుపిచ్చుకొని రాపో రా అని రామి రెడ్డికి చెప్పాడు.
రామి రెడ్డి తోడు రాగా అందరం గుడి కి వచ్చాము , అక్కడ పూజారి గుడికి సంబందించి న విషయాలు చెప్పసాగాడు. విజయ నగర సామ్రాజ్య కాలంలో వీల్ల వంశం వారు రాజుల దగ్గర పాలెగాళ్ళు గా చేసేవారట, అప్పుడు ఆ పలేగాల్లలో ఒకరు రాజు వెంట అనేక యుద్దాలకు వెళ్లి ఆయనకు బోలెడన్ని విజయాలు చేకుర్చారట ఆ విజయాలకు చిహ్నం గా ఈ అమ్మవారు ఆలయాన్ని కట్టించీ ఇచ్చాడట.
ఓ యుద్ధం లో గెలిచి ఆ సంపదనంతా ఎక్కడో ఈ చుట్టు పక్కల ప్రాంతాలలో దాచి ఆ రహస్యాన్ని మా పెద్దలకు ఎవరికో చెప్పారంట ,ఆ సంపద ఇప్పుడు ఎక్కడ వుందో ఏమో ఎవరికీ తెలిదు. వంశ పారంపర్యంగా వచ్చే వస్తువులల్లో ఆ సంపద రహస్యం దాచి ఉంచారట అని మాతాతలు ఎప్పుడో మేము చిన్నగా వున్నప్పుడు చెబుతుంటే విన్నాము. మీ పెద్దాయన పొలానికి పక్కన గుట్ట వుంది చూసారా ఆ గుట్ట మీద ఒకప్పుడు కోట వుండేది అంట , ఇప్పుడు ఒట్టి రాళ్ళు మాత్రమే ఉన్నాయి గోడలు కుడా లేవు. అక్కడ సంపద వుంది అని చాలా మంది గుంతలు గుంతలు తవ్వినారు , కానీ ఎవ్వరికి పిసరంత కుడా దొరక లేదు. అంటూ ఆ గుడి చరిత్ర , వీళ్ళ వంశ చరిత్ర , ఆ నిధి గురించి చెప్పాడు. అక్కడ పూజ చేసి , ప్రసాదం తీసికొని వెనుకకు బయలు దేరుతుంతే , పూజారి పిలిచి అందరికి బండారు ఇచ్చాడు.
"మరి ఈ గుడికి ఆదాయం ఎలాగా , మీకు జీతాలు ఎవరూ ఇస్తారు ? " అంటూ ప్రతాప్ అడిగాడు.
"దేవుడి మన్యం అని ఓ 20 ఎకరాల పొలం వుంది అది ఊరిలో కౌలుకు వేలం వేస్తాం , ఆ ఏడాది ఎవరూ ఎక్కవ కౌలు ఇస్తారో వారికి కౌలుకు ఇస్తాం ఆడబ్బే బోలెడు ఉంది, ఇక పూజ లంటారా రోజంతా ఇక్కడ ఎవ్వరు వుండరు , పొద్దున్నే , సాయంత్రం మాత్రమె దీపం వెలిగిస్తాం, మా వంశస్తులు మాత్రమె ఇక్కడ పూజలు చేస్తారు మేము జీతాలు తీసుకోము , ఇది మాకు ఆ అమ్మోరు ఇచ్చిన వరం అనుకుంటాము. ఈ నగలు అన్ని చుట్ట పక్కల వుల్లో వాళ్ళు చేపిచ్చినవే , ఇదిగో ఈ పాపిటి బిళ్ళ మా ఇంట్లో పడుంటే నేను ఎత్తుకొచ్చి అమ్మోరు తల్లో పెట్టినా , ఈ వడ్డాణం వెండిది , మీ పెద్దాయన M.L.A గెలిచినప్పుడు చేయించాడు, ఇదిగో ఈ హారం వీళ్ళ నాయన సర్పంచ్ గా గెలిచి నప్పుడు చేయించాడు " అంటూ వాటి పుట్టు పూర్వోత్తరాలు చెప్పా సాగాడు. అది మా వాళ్ళకు బోర్ కొట్టి నట్లు ఉంది , ఒక్కరొక్కరే చల్లగా బయటకు జారు కున్నారు నేను ఒక్కడే అక్కడ మిగిలాను.
"ఆ పాపిటి బిళ్ళ ఒకసారి చూడొచ్చా పూజారి గారు" అది పుర్య కాలం డిజైను లాగా వుంది అన్నాను.
"రాప్పా నువ్వు , పెద్దాయన ఇంటి మనిషివి , మాకు ఇక్కడ ఎంత హక్కు వుందో నీకూ అంతే హక్కు వుంది అంటూ నన్ను లోపలికి పిలిచి "
"నువ్వు చుత్తాండు నేను ఇప్పుడే వస్తా" అని బయటకు వెళ్ళాడు. ఆ బిళ్ళ కుడా శాంత మెళ్ళో లాకెట్ లాగే ఉంది. దాన్ని చేతులో తీసికొని చుస్తే , మైనం వుంది దానిని వేలితో గోకి దాని కింద ఉన్న స్క్రు ని నా పుర్స్ లో ఉన్న బ్లేడ్ ముక్కతో ఓపెన్ చేసి చుస్తే , అందులో ఓ చిన్న రాగి రేకు . దానిని జేబులో వేసుకొని దానిని యదా విదిగా బిగించి అమ్మోరి మీద అలంక రిస్తుంటే పూజారి వచ్చాడు. అయన దగ్గర సెలవు తీసుకోని అందరం కలిసి ఇంటికి వచ్చాము.
మేము వచ్చే టప్పటికి భోజనం రడిగా గా చేసి ఉంచారు , అందరం కలిసి బొంచేస్తుంతే హమీద్ అన్నాడు
"మీ ఊరికి ఏమి అవసరం వచ్చినా ,మా శివా రెడ్డి సార్ లాగే మేము ఉన్నామని మర్చి పోకండి " ఓ చిన్న కబురంపండి మేము వచ్చి వాలి పోతాము అన్నాడు. ఆ మాటలకు సర్పంచి , వాళ్ళ పిల్లలు మా పెద్దాయన అందరూ ఆశ్చర్య పోతూ "ఏమన్నావు , శివా రెడ్డా ?"
"ఏమబ్బి , నీవు రెడ్డి బిడ్డవా ? మాకు అందరకి శివ అని చెప్పినావు ఏంది ? "
"అదేం అంత పెద్ద విషయం కాదులే పెద్దయ్యా , పిలవడానికి సులువుగా ఉంటుంది అని శివ అని చెప్పా " అంటూ ఆ మాటలు అక్కడే కట్ చేసి టాపిక్ మార్చేసా,
మేము తింటుంటే , మల్లన్న తోటలోకి వెళ్లి ఓ సంచి నిండా మామిడి కాయలు ,నిమ్మ కాయలు పిక్కొచ్చి వాళ్ళ బండ్లో పెట్టాడు. అందరికి వీడ్కోలు చెప్పి వెళ్ళారు.