Update 28
వారిరువురు చెరువు కట్ట చేరుకునే సమయానికి ఒక ముసలి రైతు వారికోసమని ఎదురు చూస్తున్నాడు. ఆ ముసలోడు రాజుగానికి దూరపు బందువు.పెద రామరాజుకి దగ్గర చుట్టము. ఆయన పేరు చెబితే ఆ చెరువులో దూకి చావడానికైనా సిద్దమా ముసలి. అంటే ఈత రాదని కాదు. వానికా చెరువు పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసు. ఆ చెరువు మద్యలోని బాబయ్య మర్మం కూడా తెలుసు. ఇప్పుడక్కడ జరుగుతున్నదీ తెలుసు. కానీ ముసలాడు ఏమి చేయలేని వయస్సాయనది. అదృష్టవశాత్తూ వీరికి దొరికాడు.
"ఎట్లుంది యవ్వారం తాతా?" అని అడిగాడు శేషుగాడు ముసలాడి పక్కన కూర్చుంటూ.
"ముదిరి పాకాన పడింది. వేటగాడు గుట్టు పట్టేశాడు. కానీ జింకల చుట్టూ నక్కలు కాపలా వున్నాయి. వాటికి ఆపుగా తోడోల్లు, వాటి పైన పులులు వుండాయి. అన్నింటిని తప్పించుకుని వచ్చేసినాడు. ఈ నక్కల దగ్గర అల్లరైపోయేలా వుంది. ఆ బాబయ్య గుట్టు పట్టేస్తే ఏ అల్లరీ వుండదు. అయినా బయట సాయం కొంత అవసరమయ్యేలా వుందిరా అప్పయ్యా" అన్నడా ముసలాడు.
ఈ ట్రస్టు కట్టడాలకు మొదటి రాయి మోసిన కూలీల్లో వాడొకడు. ఎక్కడ ఏ రహస్యం దాగుందో కట్టడానికి పథకం వేసిన వాడికంటే కట్టిన వాడికే ఎక్కువ
తెలుసు. రత్నగాన్ని దగ్గరకు పిలిచి చెవిలో ఎదో వూదాడు.
ఆ రోజు శనివారం. చైత్ర మాసము. ద్వాదశి తిది. బడి పిల్లలకు వేసవి సెలవులు. ఇంకొన్ని రోజులలో పదవ తరగతి పరీక్షా పలితాలు వచ్చేస్తాయి.
ఆ పలితాలకు బయపడే ఎంతో మంది పిల్లలు, వారి తల్లితండ్రులు ఆ గుడికి యేతెంచినారు. ఒక అందమైన కన్నె పిల్ల గుడికి పోతాందంటే చాలు, అది ఎంతో అందంగా అలంకరించుకుంటుంది. అందమైన గుడ్డలు దరిస్తుంది. దుస్తుల పైన మెరిసేటి నగలు దరిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగాముద్దుగారే మోమును మరింత ముద్దుగా అలంకరించుకుంటుంది. ఇవన్నీ చేరి కుర్ర హృదయాలను కలత పెట్టి వారి పాలిట గాలెంలా పనిచేసి ఆ కన్నె పిల్లల కులుకులు చూడటానికి ఆత్ర పెడతాయి. అలాంటి కుర్రకారు ఆ గుడికి చేరే దావ పొడుగునా వున్నారు. కొంత మంది మోటారు బైకులలోనూ, మరికొంత మంది సైకెల్లలోనూ వచ్చి దారి తోవ వెంబడి వున్న చెట్ల నీడలలోనూ, చిన్న చిన్న గుండ్ల మీదను కాచుకుని వచ్చిపోయే ఆడవారి వైపు పల్లికలిస్తున్నారు. ఏ జవరాలైనా కనికరించపోతుందా దాని కులుకులు తమ సొంతం కాకపోతాయా అని.
మామూలుగా వుండే రద్దీ కన్నా ఆనాడు రద్దీ మరింత జాస్తీగానే వుంది. రంగు రంగుల చిలకలతో, వాటి కోసమని వచ్చిన గోరింకల గుసగుసలతో, ఆ గుసగుసలను చూసిన చిలకల సిగ్గుల ముసిముసి నవ్వులతో కళకళ లాడిపోతాంది. ఆ గుడికి అర్చకస్వామి రాఘవాచారి. సద్ బ్రాహ్మణుడు. కొన్ని తరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ వంశ ప్రతిష్ట నిలుపుతున్న వ్యక్తి. తన నలుగురి బిడ్డలలో ముగ్గురిని వుద్యోగాల వేటకని గూడు విడవనిచ్చి ఒక్కన్ని మాత్రం తన వంశ వృత్తిని నిలుపుకోవడానికి తన పంచనే వుండనిచ్చాడు. వాడికి వుపనయనం చేసిన కొద్దినాళ్ళకే కర్ణాటక లోని శారదా పీఠం చిన వాసుదేవాచార్యుల వద్ద శిష్యరికానికి వదిలేశాడు. ఈ మద్యనే విద్యాభ్యాసం ముగించుకుని గూటికి వచ్చాడు. గుడిలో తండ్రికి సాయం చేస్తూ వూరి పరిస్తితులను కొద్దికొద్దిగా అలవాటు చేసుకుంటున్నాడు.
అర్చకత్వం నిస్వార్థంగా చేసేటి మాధవసేవ. అది సాధారణ మానవ జీవనానికి కావలసిన ధనాన్ని సంపాదించి పెట్టదు. ఇంత ముందు అంటే రాజుల కాలంలో రాజు యొక్క కోశాగారం నుండి జీతభత్యాలు అందేటివి. దానికి ప్రతిఫలంగా రాజుల పేరన అర్చనలు, ఆశీర్వాదాలు జరిగేటివి. రాజ్యాలు పోయి పాలేగాల్లు వచ్చారు. స్వార్థం కోసం వారు దేవుల్లనే దోచేశారు. ప్రభుత్వాలు వచ్చాక పేరుపొందిన గుడుల పరిస్తితి మెరుగుపడి దేవాదాయశాఖ వారు ఎంతో కొంత జీతం, దేవుని మాన్యాలు పాలేగాళ్ల చెరనుండి విడిపించి దాని మీద వచ్చే ఆధాయాన్ని గుడి బాగోగుల కోసమని వాడుకునే వెసులు బాటు కలిగింది. కానీ ఇలా మారుమూల పల్లెల్లోనూ, అదీ అడివి గ్రామాల్లో వుండే ఇలాంటి గుళ్ల పరిస్తితి మరింత దారుణంగా తయారైంది. ఎన్నో గుళ్లు ఆధరణకు నోచుకోలేక శిథలమై పోయాయి. కొంతమంది క్షుద్ర మాంత్రీకులు నిధుల వేట పేరుతో వాటిని తవ్వి, నేలమాలిగలలోని దేవుని ఆస్తి పాస్తులతో పాటు విలువైన తాళపత్రాలను మాయం చేశారు.
సరిగ్గా ఇరవై అయిదు యేళ్లకిందటి వరకు రంగనాథాలయానిది కూడా అదే పరిస్తితి. రాఘవాచారి తండ్రి రామాచారి జీవితం చివరి అంకంలో వుండి కొడిక్కి తన వృత్తి భాద్యతలను పూర్తిగా రాఘవయ్య మీద వొదిలేసి మంచెం పట్టాడు. అనుభవం లేని రాఘవయ్య శిథిలమై పోతున్న గుడిని వీలైనంత వరకు కాపాడుకుంటూ నెట్టుకొస్తున్నాడు. ఎంతో కొంత బయట ప్రపంచం గురించి తెలిసినోడయుండటం వల్ల ప్రభుత్వానికి గుడి విశిష్టతను, దానికి చుట్టు పక్కనున్న పల్లెల్లో గుడికి వుండే పేరు ప్రతిష్టలను ప్రభుత్వానికి తెలియజెప్పాలని చేసిన ప్రయత్నాలన్నీ వృథా అవుతూనే వస్తున్నాయి. కానీ భగీరథ ప్రయత్నాలని మానలేదాయన. మొండి బాపడు. పైగా రంగనాథున్ని నమ్ముకున్న వాడు. దేవుడే తనకు తోడూ నీడ అని నమ్మిన భక్తుడు. ఆయనే ఏదో ఒకటి చేసి ఆయన గూటిని ఆయనే కాచుకుంటాడులే అని సరిపెట్టుకుని నెగ్గుకొస్తున్నాడు.
కార్తీకమాసం. శివునికి,శివభక్తులకు ప్రీతి అయిన మాసం. ఆ మాసంలో ఆ ముక్కంటి గుళ్లన్ని భక్తసముదాయాలతో కలకల లాడుతుంటే విష్ణుమూర్తి గుళ్లన్ని వెలవెల బోతుంటాయి. ఆయినా ఆయనకు నిత్య మంగళారతులు అందుతూనే వుంటాయి. ఆ రోజు కార్తీక శనివారం. భక్తుల తాకిడి సాధారణంగానే వుంది. సాయంత్రం ఎనిమిది గంటల వరకు అడపా దడపా భక్తులు వస్తూనే వున్నారు. వచ్చిన ప్రతి భక్తుడు దైవ దర్శనం చేసుకుని వెళ్లాకే రాఘవాచారి గుడికి తాళం వేశాడు. ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్తుండగా ఎందుకో అడుగు తడబడింది. దూరంగా నక్కల కూతలు వినబడ్డాయి. గుడి మెట్లు దిగుతుంటే వెనకనుండి ఎవరో తోసేసినట్టనిపించింది. ఎదో తెలియని ఒక ఆందోళనతో వడివడిగా ఇంటికి చేరుకున్నాడు. స్నానం చేసి రంగనాథుని విగ్రహం ముందు ద్యాన ముద్రలో కూర్చున్నాడు. నాలుగు ఘడియల తరవాత అతనికి నగుమోముతో యమునా నదీ తీరంలో రాధా సమేతుడైన రంగనాథున్నిచూచిన గానీ అతని మనోవ్యాకులత తీరలేదు. అంతా ఆ కృష్ణుని లీలావినోదం అనుకున్నాడు. అప్పటికే అతనికి ముగ్గురు సంతానం ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.
శృంగార రాధామాధవుల దర్శనం తరవాత అతని మోము కాంతివంతమైంది. అవ్యక్తభావనలతో పడకగదిని చేరుకున్నాడు. అప్పటికే భార్య పాన్పు సిద్దం చేసివుంచింది. తాంబూలం సిద్దం చేసి మగని రాకకోసమని ఎదురుచూస్తొంది. రాత్రిల్లు అతను భోజనం మితంగా తింటాడు. ఏవైనా నాలుగు పళ్లు, కాసిన్నితినుబండారాలు మాత్రమే అతని భోజనం. చిరునవ్వుతో పడకెక్కిన అతనికి వరుసగా నాలుగు అరటి పళ్లని అందించింది. ఆ నాలుగింటిని చిరునవ్వుతూనే తినేశాడు. గోరువెచ్చటి స్వచ్చమైన గోక్షీరాన్ని సేవించాడు.తమలపాకు, సున్నం, వక్క, కస్తూరి కలిపిన తాంబూలం అతనికి అందించింది. చిరునవ్వుతూనే నములుతున్నాడు.
"ఏమిటోయ్ ఇవ్వాళ అంత ఆనందంగా వున్నావు" అని పలకరిచిందా ఇల్లాలు.
చిరునవ్వుతో ఆ ఇల్లాలి ముఖంలోకి చూస్తూ "రాధామాధవుల దర్శన భాగ్యం కలిగిందోయ్. ఎప్పుడు ప్రార్థించినా అభయహస్తంతో రాక్షస సంహారియై దర్శనమిచ్చే స్వామి ఇవ్వాళ యమునా నదీ తీరంలో రాధాసమేతుడై కనిపించాడోయ్" అన్నాడు. ఆమాటలంటుంటే అతని ముఖం మరింత కాంతివంతమైంది. ఆ ఇల్లాలు ముఖం సిగ్గుతో చిన్నదై పోయింది. అతనింకా రాధామాధవుల దర్శన భ్రమలోనే వుండి మాట్లాడుతుంటే ఆమె అతని వక్షస్థలంపై వాలి కేశాలను తన వేళ్లకు ముడిపెట్టి గట్టిగా లాగింది. "అబ్బా. . . " అని అరిచి మాయాలోకం లోనుండి బయటపడ్డాడు.
"ఏమిటోయ్ " అన్నాడు. ఆమె చిరునగువులు చిందిస్తూ అతని చాతిపై వాలింది. ఆమె కళ్లలోని సిగ్గు అతనికి స్పష్టంగా కనపడింది. ఆ సిగ్గులోని భావం అతనికి భోదపడింది. సిగ్గుతో చాతిపైన ఆమె మృధువాటి మునివేళ్లతో సున్నాను చుడుతుంటే, ఆమెను అతని బలమైన బాహువుల బిగి కౌగిలిలో బందించేశాడు. ఆ రాత్రి వారికి తొలిరాత్రి తిరిగొచ్చినట్టనిపించింది. వారి కామదాహం ఎంతకీ తీరింది లేదు. ఎన్నో రకాల సమరతులను అనుభవించారు. ఎత్తైన ఆమె గుబ్బలపై, నాజూకైన శరీరంపై అతని గోటిగాట్లు, అమృత ధారలు కురిసే ఆమె అధరాలపై పంటిగాట్లు వారి కామకళా ఖేళికి సాక్ష్యాలు. ఆ రాత్రి నడిజాము వరకు వారి శరీరాలు ఎన్నోసార్లు అలసి సొలసి తిరిగి బలం పుంజుకుని రతికి సిద్దపడి సుఖించాయి. ఆ రాత్రి వారి సుఖానికి ప్రేమకు గుర్తుగా
సంవత్సరం తరవాత వారికి ఒక మగ శిశువు పుట్టాడు. వాడే అతని వృత్తికి వారసుడైన మాధవాచారి.
ఆ రాత్రి రాఘవుడు అతని భార్య రాధామాధవులలా శృంగారంలో మునిగి తేలుతుంటే, రంగనాథుని ఆలయంలోకి చొరబడటానికి ఒక దొంగ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతను వృత్తి రీత్యా దొంగ కాదే. అందుకే తటపటాయిస్తూ గుడికి యోజనం దూరంలో తీవ్ర మనోవ్యాకులతతో కూర్చుని వున్నాడు. వాడిపేరు నారసింహుడు. ఊరు ఆముదాల గొండి. కోనాపురం అడువులకు నడిబొడ్డున వున్న చిన్న కుగ్రామం. వేట వారి వృత్తి. కలపతో చక్కటి బొమ్మలు అలంకరణ వస్తువులు, కుర్చీలు, బొమ్మలు చేయడం వారి ప్రవృత్తి.
నరసింహుడు యాభై ఏళ్లవాడు. గుబురు మీసాలవాడు. తలమీది వొత్తైన వెంట్రుకల నడుమ సగం నెరిసిన వెంట్రుకలు బంగారం రంగులో మెరిసిపోతుంటాయి. వయస్సుతో పాటు అనుభవం దానంతటదే వస్తుందంటారు. ఆ నరెసిన పసిడి రంగు శిరోజాలు అతని అనుభవానికి ప్రతీకలు. పరిణితి చెందిన మనిషతను. ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోగల శక్తి కలవాడు. అంత అనుభవజ్ఞుడు కాబట్టే తన వూర్లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోగలిగాడు. ఆ వూర్లో యాభై గడపలు వుంటే నూటయాభై మందికి పైగా జనం వున్నారు. అంతా వొకే కులానికి చెందినవారు. ఐదుగురు కులపెద్దలు. వాళ్ళలో వీడొకడు. పది మందికి మంచి చెప్పి చేయించాల్సిన వాడు, తప్పు చేసిన వాన్ని కులాచారాల ప్రకారం దండించాల్సిన వాడు. వాడే తప్పుల్లో కెల్లా అతి పెద్ద
తప్పయిన దొంగతనానికి పూనుకున్నాడు. కులాచారం ప్రకారం దొంగతనానికి శిక్ష మాసం పాటు వూరి బహిష్కరణ. అది మామూలు దొంగతనానికి శిక్ష. తానిప్పుడు పూనుకున్నది దేవుని ఆభరణాల అపహరణ. దీనికి ఎటువంటి శిక్షో. అయినా తప్పదు కార్యం గడపాలంటే ధనం అవసరం. వున్న తక్కువ సమయంలో అంత ధనం సంపాదించడానికి ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదు. అందుకనే ధైర్యం చేసి ఈ దొంగతనానికి పూనుకున్నాడు.
ముహూర్తం పెట్టుకుని పొద్దుగునుకుతుండగా ఇంటిని వదిలాడు. సుమారు పది మైలీల నడక తరవాత అర్దరాత్రికి ఇంకో గంట వుందనగా గుడి వెనకున్న కొండమీదకు చేరుకున్నాడు. కృష్ణపక్షపు పండు వెలుగులో గుడి ప్రాంగణమంతా వెలిగిపోతొంది. కొండపై నుండి చూస్తుంటే తెల్లటి వెన్నెల వెలుగులోని నిర్మాణుశమైన ఆ దేవాలయం క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుంటున్న రంగనాథుడు కనిపించాడు నారసింహునికి. ఆ దృశ్యం చూసిన నారసింహునికి గుండెలు జారిపోయాయి. వెన్నెలో వణుకు పుట్టి పక్కనే వున్న రాతికి జారగిలపడిపోయాడు. పంకజ నాభుడు గాడ నిద్రలో వున్న రూపం. మురలి వూదుతూ గోపికలను మాయ చేస్తున్న మాధవుడి రూపం. ఎందుకో ఆ మాయలోనుండి బయటపడటానికి నారసింహునికి ఘడియ కాలం పట్టింది.
ఆ ఘడియ కాలంలో అతని యాభై యేళ్ల జీవితం గిర్రున తిరిగింది. ( నారసింహుని ఎపిసోడ్ "మోహనాంగి" అనే కథలో రాస్తున్నాను.)
తనది ఎంతో పెద్ద కుటుంబం.తనకు ఇద్దరు మేనత్తలు, ఇద్దరు పెదనాన్నలు, ఒక చిన్నాన్న. అతని తండ్రి మద్యముడు అవ్వడం మూలాన అటు తాతకు, నాన్నమ్మకు దగ్గరకాలేదు తను, తన తోడ బుట్టిన వారెవరు. అయినా వారెవరికి ఆ లోటు తెలీకుండా పెంచాడు తండ్రి. తనకు ఐదుగురు తోడబుట్టిన వాళ్లు. వాళ్ళలోతనకే వేట, పశు సంరక్షణ వంటబట్టాయి. 14 యేళ్లు వచ్చేపాటి వూరిమొత్తానికి తన కొట్టం కిందే ఎక్కువ పశువులు కూడాయి. సుమారు నూటికి పైగా గొర్రెలు, అరవై మేకలు, నలభై ఐదు గోవులు, పది జాతులకై పైగా కోళ్లు, బాతులు. వాటి సంఖ్య సుమారు ఇన్నూరు. ఇరవై యెండ్లు కూడా దాటకుండానే పశువుల యాపారంలో దిగిపోయాడు. ఆముదాల గొండికి పది కిలోమీటర్ల దూరంలో కోనాపురం అడువుల మొదట్లో వున్న బుర్రకాయల కోట అనే చిన్నపట్టణంలోని పశువుల సంతలో అతని వ్యాపారం మొదలైంది. సజాతి పశువుల విక్రయంతో పాటు, తన అన్నగార్లు చేసిన చెక్క కళాకృతుల విక్రయించేవాడు. ఎటువంటి వస్తువునైనా సరియైన ధరకు అమ్మడం అతని ప్రత్యేకత.
ఇలా అతని వ్యాపారం, వ్యక్తిగత జీవితం మూడు పువ్వులు ఆరుకాయల్లా నడిచిపోతున్న సమయంలో అతని జీవితంలోకి మోహన ప్రవేశించింది. మోహన అతని చిన్నత్త ఇందిరకు ఒక్కగానొక్క కూతురు. కోరి వచ్చిన మోహనను కాదని తన పెద్దత్త కూతురు లక్ష్మిని పెళ్లాడాడు. లక్ష్మిని మనువాడాక అతని వ్యాపారం మరింత విస్తరించింది. పశుసంపదే కాకుండా అడవిలో దొరికే అమూల్యమైన కలప, విలువైన రాళ్లతో చేసిన బొమ్మలు వస్తువులను బుర్రకాయల కోటలో అమ్మేవాడు. ఈ వస్తువుల తయారీకి అతనికి పనిమంతులైన వడ్రంగుల అవసరం ఏర్పడింది. కోనాపురానికి పడమర వున్న వెంకటరాఘవ వురంలోని నాగరాజు అతనికి కుడిచేయిగా వుండేవాడు.
నాగరాజుకు ఒకడే కొడుకు అతని పేరు పెదరామరాజు. ఇప్పుడతనికి ఇరవై నాలుగేళ్లు.నారసింహునికి యాభై ఆరు యేళ్లు. అతనికి పెళ్లైన సంవత్సరానికి ఒక కూతురు, అది పుట్టిన యేడాది తిరక్కుండానే కొడుకు పుట్టాడు. అంతటితో చాలనుకుని వ్యాపారంపై దృష్టి పెట్టి లెక్కలేనంత సంపాదించాడు. వూరిలో కుల పెద్దగా లెక్కలేనంత పరువు సంపాదించాడు. అతనికి నలభై యేళ్లున్నప్పుడు హఠాత్తుగా ఆయన భార్య లక్ష్మమ్మ గర్భం దాల్చి పండంటి ఆడబిడ్డను కన్నది. అది పుట్టిన వేళా విశేషమేమో అతనికి వ్యాపార పరంగానూ, వ్యక్తిగతంగానూ అపారమైన నష్టం కలగడం మొదలెట్టింది. అది పుట్టిన మూడు నెలలకు అతనికి ప్రాణప్రదమైన అతని తండ్రి పరమావదించాడు. దానికి సంవత్సరం రాగానే అతని పరువు మీద మచ్చ పడింది. అతని ఒక్కగానొక్క కొడుకైన నాగేష్ తన పెదతల్లి మోహనను చెరపట్టి పంచాయితిలో నిలిచాడు. పైగా ఆమె భర్తను చంపి హంతకుడయ్యాడు.
వారసుడు కారాగారం పాలైన బాద తగ్గకనే అతనికి వ్యాపారంలో తేరుకోలేని దెబ్బ తగిలింది. దొంగ సరుకుల రవాణా చేస్తున్నారని అతని చేతివృత్తుల వ్యాపారాన్ని సెక్యూరిటీ ఆఫీసర్లు మూయించేశారు. పశువులు ఒక్కోక్కటిగా పరలోకం చేరాయి. అతనికి యాభై వచ్చేనాటికి అతనికి మిగిలింది నాలుగు పాడి ఆవులు, అతని కుటుంభం, వూరిలో పలుకుబడి.
చిన్న కూతురికి పెళ్లీడొచ్చింది. పూర్వపు వ్యాపార భాగస్వామి కొడుకుతో పెళ్లి నిశ్చయమైంది. అందుకు డబ్బవసరమైంది. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎందరినో అడిగాడు. ఎక్కడా పైసా పుట్టలేదు. చివరగా దొంగతనానికి పూనుకున్నాడు. అదీ కూడా దేవుని గుడి దొంగతనానికి తను చేస్తున్న ఈ నేరం కొడుకు చేసిన హత్యకంటే మహా ఘోరమైనదని తలుచుకుంటేనే వెన్నులో ఒణుకు పుడుతొంది. జీవిత పర్యాంతం నీతికి న్యాయానికి కట్టుబడ్డ బతుకతనిది. అందుకనే దొంగతనం చేయాలంటే అసహ్యం పుడుతొంది. అడవి ఎలుగునే వట్టి చేతులతో మట్టు పెట్టగలిగే ధైర్యం కలిగివున్నా కనీసం కాపలా గూడాలేని గుడిని దొంగలించడానికి ఒణికి పోతున్నాడు.
సమయం అర్దరాత్రిని సమీపిస్తొంది. ఆకాశంలో చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతూ చల్లటి వెన్నెలను వెదజల్లుతున్నాడు. చల్లటిగాని కోనాపురం కోనల్లో వీస్తొంది. ఆ చల్లటి గాలి ప్రభావానికి అతనిలో భయం చచ్చి కాస్త ధైర్యం కూడగట్టుకుంది.
గుండెల్లో జారిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకుని లేచినిల్చున్నాడు. వెన్నెల సంద్రంలో తేలుతున్న రంగనాథుని గుడిని చూశాడు. పాలసముద్రంలో పన్నగశయనుడిగా విశ్రాంతి తీసుకుంటున్న అనంతుడిలా అతనికి దర్శనమిచ్చాడు. ఆ దర్శనం అతని భయాన్ని పటాపంచలు చేసింది. దొంగతనానికి దేవుడి అనుమతే దొరికినంత ధైర్యంగా కొడదిగాడు. ఆలయాన్ని వుత్తర దిశగా సమీపించాడు. అక్కడే క్షేత్రపాలకుడు ఆంజనేయుని మందిరం లోనికి చొరబడి మందిరమంతా కలయ తిరిగాడు. ముహూర్త కాలానికి అతను వెదుకుతున్న మీట ఆంజనేయుని యెడమ పాదం కింద కనబడింది. ఆ మీట నొక్కి భక్తితో పాదం పట్టుకు లాగగానే ఆంజనేయుడు ముందుకి కదిలాడు. ఆయన పాద పద్మాలున్న చోట సొరంగం వెలువడింది. ఆ ఆనందంలో ముందూ వెనక చూసుకోకుండా లోపలికి అడుగేశాడంతే ఎగిరొచ్చి మందిరం వెలుపల పడ్డాడు. కళ్లు బయర్లు కమ్మాయి. అనంత నక్షత్ర కోటీ అతనికి అనుభవం లోకి వచ్చింది. ఆ నక్షత్ర వెలుగులో వుగ్ర రూప బాలాత్రిపుర సుందరి అతని కళ్ల ముందు దర్శనమిచ్చింది. ఆ వుగ్ర రూపం దాల్చిన మరుక్షణం అతను స్పృహ కోల్పోయాడు.
"ఎట్లుంది యవ్వారం తాతా?" అని అడిగాడు శేషుగాడు ముసలాడి పక్కన కూర్చుంటూ.
"ముదిరి పాకాన పడింది. వేటగాడు గుట్టు పట్టేశాడు. కానీ జింకల చుట్టూ నక్కలు కాపలా వున్నాయి. వాటికి ఆపుగా తోడోల్లు, వాటి పైన పులులు వుండాయి. అన్నింటిని తప్పించుకుని వచ్చేసినాడు. ఈ నక్కల దగ్గర అల్లరైపోయేలా వుంది. ఆ బాబయ్య గుట్టు పట్టేస్తే ఏ అల్లరీ వుండదు. అయినా బయట సాయం కొంత అవసరమయ్యేలా వుందిరా అప్పయ్యా" అన్నడా ముసలాడు.
ఈ ట్రస్టు కట్టడాలకు మొదటి రాయి మోసిన కూలీల్లో వాడొకడు. ఎక్కడ ఏ రహస్యం దాగుందో కట్టడానికి పథకం వేసిన వాడికంటే కట్టిన వాడికే ఎక్కువ
తెలుసు. రత్నగాన్ని దగ్గరకు పిలిచి చెవిలో ఎదో వూదాడు.
ఆ రోజు శనివారం. చైత్ర మాసము. ద్వాదశి తిది. బడి పిల్లలకు వేసవి సెలవులు. ఇంకొన్ని రోజులలో పదవ తరగతి పరీక్షా పలితాలు వచ్చేస్తాయి.
ఆ పలితాలకు బయపడే ఎంతో మంది పిల్లలు, వారి తల్లితండ్రులు ఆ గుడికి యేతెంచినారు. ఒక అందమైన కన్నె పిల్ల గుడికి పోతాందంటే చాలు, అది ఎంతో అందంగా అలంకరించుకుంటుంది. అందమైన గుడ్డలు దరిస్తుంది. దుస్తుల పైన మెరిసేటి నగలు దరిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగాముద్దుగారే మోమును మరింత ముద్దుగా అలంకరించుకుంటుంది. ఇవన్నీ చేరి కుర్ర హృదయాలను కలత పెట్టి వారి పాలిట గాలెంలా పనిచేసి ఆ కన్నె పిల్లల కులుకులు చూడటానికి ఆత్ర పెడతాయి. అలాంటి కుర్రకారు ఆ గుడికి చేరే దావ పొడుగునా వున్నారు. కొంత మంది మోటారు బైకులలోనూ, మరికొంత మంది సైకెల్లలోనూ వచ్చి దారి తోవ వెంబడి వున్న చెట్ల నీడలలోనూ, చిన్న చిన్న గుండ్ల మీదను కాచుకుని వచ్చిపోయే ఆడవారి వైపు పల్లికలిస్తున్నారు. ఏ జవరాలైనా కనికరించపోతుందా దాని కులుకులు తమ సొంతం కాకపోతాయా అని.
మామూలుగా వుండే రద్దీ కన్నా ఆనాడు రద్దీ మరింత జాస్తీగానే వుంది. రంగు రంగుల చిలకలతో, వాటి కోసమని వచ్చిన గోరింకల గుసగుసలతో, ఆ గుసగుసలను చూసిన చిలకల సిగ్గుల ముసిముసి నవ్వులతో కళకళ లాడిపోతాంది. ఆ గుడికి అర్చకస్వామి రాఘవాచారి. సద్ బ్రాహ్మణుడు. కొన్ని తరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ వంశ ప్రతిష్ట నిలుపుతున్న వ్యక్తి. తన నలుగురి బిడ్డలలో ముగ్గురిని వుద్యోగాల వేటకని గూడు విడవనిచ్చి ఒక్కన్ని మాత్రం తన వంశ వృత్తిని నిలుపుకోవడానికి తన పంచనే వుండనిచ్చాడు. వాడికి వుపనయనం చేసిన కొద్దినాళ్ళకే కర్ణాటక లోని శారదా పీఠం చిన వాసుదేవాచార్యుల వద్ద శిష్యరికానికి వదిలేశాడు. ఈ మద్యనే విద్యాభ్యాసం ముగించుకుని గూటికి వచ్చాడు. గుడిలో తండ్రికి సాయం చేస్తూ వూరి పరిస్తితులను కొద్దికొద్దిగా అలవాటు చేసుకుంటున్నాడు.
అర్చకత్వం నిస్వార్థంగా చేసేటి మాధవసేవ. అది సాధారణ మానవ జీవనానికి కావలసిన ధనాన్ని సంపాదించి పెట్టదు. ఇంత ముందు అంటే రాజుల కాలంలో రాజు యొక్క కోశాగారం నుండి జీతభత్యాలు అందేటివి. దానికి ప్రతిఫలంగా రాజుల పేరన అర్చనలు, ఆశీర్వాదాలు జరిగేటివి. రాజ్యాలు పోయి పాలేగాల్లు వచ్చారు. స్వార్థం కోసం వారు దేవుల్లనే దోచేశారు. ప్రభుత్వాలు వచ్చాక పేరుపొందిన గుడుల పరిస్తితి మెరుగుపడి దేవాదాయశాఖ వారు ఎంతో కొంత జీతం, దేవుని మాన్యాలు పాలేగాళ్ల చెరనుండి విడిపించి దాని మీద వచ్చే ఆధాయాన్ని గుడి బాగోగుల కోసమని వాడుకునే వెసులు బాటు కలిగింది. కానీ ఇలా మారుమూల పల్లెల్లోనూ, అదీ అడివి గ్రామాల్లో వుండే ఇలాంటి గుళ్ల పరిస్తితి మరింత దారుణంగా తయారైంది. ఎన్నో గుళ్లు ఆధరణకు నోచుకోలేక శిథలమై పోయాయి. కొంతమంది క్షుద్ర మాంత్రీకులు నిధుల వేట పేరుతో వాటిని తవ్వి, నేలమాలిగలలోని దేవుని ఆస్తి పాస్తులతో పాటు విలువైన తాళపత్రాలను మాయం చేశారు.
సరిగ్గా ఇరవై అయిదు యేళ్లకిందటి వరకు రంగనాథాలయానిది కూడా అదే పరిస్తితి. రాఘవాచారి తండ్రి రామాచారి జీవితం చివరి అంకంలో వుండి కొడిక్కి తన వృత్తి భాద్యతలను పూర్తిగా రాఘవయ్య మీద వొదిలేసి మంచెం పట్టాడు. అనుభవం లేని రాఘవయ్య శిథిలమై పోతున్న గుడిని వీలైనంత వరకు కాపాడుకుంటూ నెట్టుకొస్తున్నాడు. ఎంతో కొంత బయట ప్రపంచం గురించి తెలిసినోడయుండటం వల్ల ప్రభుత్వానికి గుడి విశిష్టతను, దానికి చుట్టు పక్కనున్న పల్లెల్లో గుడికి వుండే పేరు ప్రతిష్టలను ప్రభుత్వానికి తెలియజెప్పాలని చేసిన ప్రయత్నాలన్నీ వృథా అవుతూనే వస్తున్నాయి. కానీ భగీరథ ప్రయత్నాలని మానలేదాయన. మొండి బాపడు. పైగా రంగనాథున్ని నమ్ముకున్న వాడు. దేవుడే తనకు తోడూ నీడ అని నమ్మిన భక్తుడు. ఆయనే ఏదో ఒకటి చేసి ఆయన గూటిని ఆయనే కాచుకుంటాడులే అని సరిపెట్టుకుని నెగ్గుకొస్తున్నాడు.
కార్తీకమాసం. శివునికి,శివభక్తులకు ప్రీతి అయిన మాసం. ఆ మాసంలో ఆ ముక్కంటి గుళ్లన్ని భక్తసముదాయాలతో కలకల లాడుతుంటే విష్ణుమూర్తి గుళ్లన్ని వెలవెల బోతుంటాయి. ఆయినా ఆయనకు నిత్య మంగళారతులు అందుతూనే వుంటాయి. ఆ రోజు కార్తీక శనివారం. భక్తుల తాకిడి సాధారణంగానే వుంది. సాయంత్రం ఎనిమిది గంటల వరకు అడపా దడపా భక్తులు వస్తూనే వున్నారు. వచ్చిన ప్రతి భక్తుడు దైవ దర్శనం చేసుకుని వెళ్లాకే రాఘవాచారి గుడికి తాళం వేశాడు. ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్తుండగా ఎందుకో అడుగు తడబడింది. దూరంగా నక్కల కూతలు వినబడ్డాయి. గుడి మెట్లు దిగుతుంటే వెనకనుండి ఎవరో తోసేసినట్టనిపించింది. ఎదో తెలియని ఒక ఆందోళనతో వడివడిగా ఇంటికి చేరుకున్నాడు. స్నానం చేసి రంగనాథుని విగ్రహం ముందు ద్యాన ముద్రలో కూర్చున్నాడు. నాలుగు ఘడియల తరవాత అతనికి నగుమోముతో యమునా నదీ తీరంలో రాధా సమేతుడైన రంగనాథున్నిచూచిన గానీ అతని మనోవ్యాకులత తీరలేదు. అంతా ఆ కృష్ణుని లీలావినోదం అనుకున్నాడు. అప్పటికే అతనికి ముగ్గురు సంతానం ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.
శృంగార రాధామాధవుల దర్శనం తరవాత అతని మోము కాంతివంతమైంది. అవ్యక్తభావనలతో పడకగదిని చేరుకున్నాడు. అప్పటికే భార్య పాన్పు సిద్దం చేసివుంచింది. తాంబూలం సిద్దం చేసి మగని రాకకోసమని ఎదురుచూస్తొంది. రాత్రిల్లు అతను భోజనం మితంగా తింటాడు. ఏవైనా నాలుగు పళ్లు, కాసిన్నితినుబండారాలు మాత్రమే అతని భోజనం. చిరునవ్వుతో పడకెక్కిన అతనికి వరుసగా నాలుగు అరటి పళ్లని అందించింది. ఆ నాలుగింటిని చిరునవ్వుతూనే తినేశాడు. గోరువెచ్చటి స్వచ్చమైన గోక్షీరాన్ని సేవించాడు.తమలపాకు, సున్నం, వక్క, కస్తూరి కలిపిన తాంబూలం అతనికి అందించింది. చిరునవ్వుతూనే నములుతున్నాడు.
"ఏమిటోయ్ ఇవ్వాళ అంత ఆనందంగా వున్నావు" అని పలకరిచిందా ఇల్లాలు.
చిరునవ్వుతో ఆ ఇల్లాలి ముఖంలోకి చూస్తూ "రాధామాధవుల దర్శన భాగ్యం కలిగిందోయ్. ఎప్పుడు ప్రార్థించినా అభయహస్తంతో రాక్షస సంహారియై దర్శనమిచ్చే స్వామి ఇవ్వాళ యమునా నదీ తీరంలో రాధాసమేతుడై కనిపించాడోయ్" అన్నాడు. ఆమాటలంటుంటే అతని ముఖం మరింత కాంతివంతమైంది. ఆ ఇల్లాలు ముఖం సిగ్గుతో చిన్నదై పోయింది. అతనింకా రాధామాధవుల దర్శన భ్రమలోనే వుండి మాట్లాడుతుంటే ఆమె అతని వక్షస్థలంపై వాలి కేశాలను తన వేళ్లకు ముడిపెట్టి గట్టిగా లాగింది. "అబ్బా. . . " అని అరిచి మాయాలోకం లోనుండి బయటపడ్డాడు.
"ఏమిటోయ్ " అన్నాడు. ఆమె చిరునగువులు చిందిస్తూ అతని చాతిపై వాలింది. ఆమె కళ్లలోని సిగ్గు అతనికి స్పష్టంగా కనపడింది. ఆ సిగ్గులోని భావం అతనికి భోదపడింది. సిగ్గుతో చాతిపైన ఆమె మృధువాటి మునివేళ్లతో సున్నాను చుడుతుంటే, ఆమెను అతని బలమైన బాహువుల బిగి కౌగిలిలో బందించేశాడు. ఆ రాత్రి వారికి తొలిరాత్రి తిరిగొచ్చినట్టనిపించింది. వారి కామదాహం ఎంతకీ తీరింది లేదు. ఎన్నో రకాల సమరతులను అనుభవించారు. ఎత్తైన ఆమె గుబ్బలపై, నాజూకైన శరీరంపై అతని గోటిగాట్లు, అమృత ధారలు కురిసే ఆమె అధరాలపై పంటిగాట్లు వారి కామకళా ఖేళికి సాక్ష్యాలు. ఆ రాత్రి నడిజాము వరకు వారి శరీరాలు ఎన్నోసార్లు అలసి సొలసి తిరిగి బలం పుంజుకుని రతికి సిద్దపడి సుఖించాయి. ఆ రాత్రి వారి సుఖానికి ప్రేమకు గుర్తుగా
సంవత్సరం తరవాత వారికి ఒక మగ శిశువు పుట్టాడు. వాడే అతని వృత్తికి వారసుడైన మాధవాచారి.
ఆ రాత్రి రాఘవుడు అతని భార్య రాధామాధవులలా శృంగారంలో మునిగి తేలుతుంటే, రంగనాథుని ఆలయంలోకి చొరబడటానికి ఒక దొంగ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతను వృత్తి రీత్యా దొంగ కాదే. అందుకే తటపటాయిస్తూ గుడికి యోజనం దూరంలో తీవ్ర మనోవ్యాకులతతో కూర్చుని వున్నాడు. వాడిపేరు నారసింహుడు. ఊరు ఆముదాల గొండి. కోనాపురం అడువులకు నడిబొడ్డున వున్న చిన్న కుగ్రామం. వేట వారి వృత్తి. కలపతో చక్కటి బొమ్మలు అలంకరణ వస్తువులు, కుర్చీలు, బొమ్మలు చేయడం వారి ప్రవృత్తి.
నరసింహుడు యాభై ఏళ్లవాడు. గుబురు మీసాలవాడు. తలమీది వొత్తైన వెంట్రుకల నడుమ సగం నెరిసిన వెంట్రుకలు బంగారం రంగులో మెరిసిపోతుంటాయి. వయస్సుతో పాటు అనుభవం దానంతటదే వస్తుందంటారు. ఆ నరెసిన పసిడి రంగు శిరోజాలు అతని అనుభవానికి ప్రతీకలు. పరిణితి చెందిన మనిషతను. ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోగల శక్తి కలవాడు. అంత అనుభవజ్ఞుడు కాబట్టే తన వూర్లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోగలిగాడు. ఆ వూర్లో యాభై గడపలు వుంటే నూటయాభై మందికి పైగా జనం వున్నారు. అంతా వొకే కులానికి చెందినవారు. ఐదుగురు కులపెద్దలు. వాళ్ళలో వీడొకడు. పది మందికి మంచి చెప్పి చేయించాల్సిన వాడు, తప్పు చేసిన వాన్ని కులాచారాల ప్రకారం దండించాల్సిన వాడు. వాడే తప్పుల్లో కెల్లా అతి పెద్ద
తప్పయిన దొంగతనానికి పూనుకున్నాడు. కులాచారం ప్రకారం దొంగతనానికి శిక్ష మాసం పాటు వూరి బహిష్కరణ. అది మామూలు దొంగతనానికి శిక్ష. తానిప్పుడు పూనుకున్నది దేవుని ఆభరణాల అపహరణ. దీనికి ఎటువంటి శిక్షో. అయినా తప్పదు కార్యం గడపాలంటే ధనం అవసరం. వున్న తక్కువ సమయంలో అంత ధనం సంపాదించడానికి ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదు. అందుకనే ధైర్యం చేసి ఈ దొంగతనానికి పూనుకున్నాడు.
ముహూర్తం పెట్టుకుని పొద్దుగునుకుతుండగా ఇంటిని వదిలాడు. సుమారు పది మైలీల నడక తరవాత అర్దరాత్రికి ఇంకో గంట వుందనగా గుడి వెనకున్న కొండమీదకు చేరుకున్నాడు. కృష్ణపక్షపు పండు వెలుగులో గుడి ప్రాంగణమంతా వెలిగిపోతొంది. కొండపై నుండి చూస్తుంటే తెల్లటి వెన్నెల వెలుగులోని నిర్మాణుశమైన ఆ దేవాలయం క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుంటున్న రంగనాథుడు కనిపించాడు నారసింహునికి. ఆ దృశ్యం చూసిన నారసింహునికి గుండెలు జారిపోయాయి. వెన్నెలో వణుకు పుట్టి పక్కనే వున్న రాతికి జారగిలపడిపోయాడు. పంకజ నాభుడు గాడ నిద్రలో వున్న రూపం. మురలి వూదుతూ గోపికలను మాయ చేస్తున్న మాధవుడి రూపం. ఎందుకో ఆ మాయలోనుండి బయటపడటానికి నారసింహునికి ఘడియ కాలం పట్టింది.
ఆ ఘడియ కాలంలో అతని యాభై యేళ్ల జీవితం గిర్రున తిరిగింది. ( నారసింహుని ఎపిసోడ్ "మోహనాంగి" అనే కథలో రాస్తున్నాను.)
తనది ఎంతో పెద్ద కుటుంబం.తనకు ఇద్దరు మేనత్తలు, ఇద్దరు పెదనాన్నలు, ఒక చిన్నాన్న. అతని తండ్రి మద్యముడు అవ్వడం మూలాన అటు తాతకు, నాన్నమ్మకు దగ్గరకాలేదు తను, తన తోడ బుట్టిన వారెవరు. అయినా వారెవరికి ఆ లోటు తెలీకుండా పెంచాడు తండ్రి. తనకు ఐదుగురు తోడబుట్టిన వాళ్లు. వాళ్ళలోతనకే వేట, పశు సంరక్షణ వంటబట్టాయి. 14 యేళ్లు వచ్చేపాటి వూరిమొత్తానికి తన కొట్టం కిందే ఎక్కువ పశువులు కూడాయి. సుమారు నూటికి పైగా గొర్రెలు, అరవై మేకలు, నలభై ఐదు గోవులు, పది జాతులకై పైగా కోళ్లు, బాతులు. వాటి సంఖ్య సుమారు ఇన్నూరు. ఇరవై యెండ్లు కూడా దాటకుండానే పశువుల యాపారంలో దిగిపోయాడు. ఆముదాల గొండికి పది కిలోమీటర్ల దూరంలో కోనాపురం అడువుల మొదట్లో వున్న బుర్రకాయల కోట అనే చిన్నపట్టణంలోని పశువుల సంతలో అతని వ్యాపారం మొదలైంది. సజాతి పశువుల విక్రయంతో పాటు, తన అన్నగార్లు చేసిన చెక్క కళాకృతుల విక్రయించేవాడు. ఎటువంటి వస్తువునైనా సరియైన ధరకు అమ్మడం అతని ప్రత్యేకత.
ఇలా అతని వ్యాపారం, వ్యక్తిగత జీవితం మూడు పువ్వులు ఆరుకాయల్లా నడిచిపోతున్న సమయంలో అతని జీవితంలోకి మోహన ప్రవేశించింది. మోహన అతని చిన్నత్త ఇందిరకు ఒక్కగానొక్క కూతురు. కోరి వచ్చిన మోహనను కాదని తన పెద్దత్త కూతురు లక్ష్మిని పెళ్లాడాడు. లక్ష్మిని మనువాడాక అతని వ్యాపారం మరింత విస్తరించింది. పశుసంపదే కాకుండా అడవిలో దొరికే అమూల్యమైన కలప, విలువైన రాళ్లతో చేసిన బొమ్మలు వస్తువులను బుర్రకాయల కోటలో అమ్మేవాడు. ఈ వస్తువుల తయారీకి అతనికి పనిమంతులైన వడ్రంగుల అవసరం ఏర్పడింది. కోనాపురానికి పడమర వున్న వెంకటరాఘవ వురంలోని నాగరాజు అతనికి కుడిచేయిగా వుండేవాడు.
నాగరాజుకు ఒకడే కొడుకు అతని పేరు పెదరామరాజు. ఇప్పుడతనికి ఇరవై నాలుగేళ్లు.నారసింహునికి యాభై ఆరు యేళ్లు. అతనికి పెళ్లైన సంవత్సరానికి ఒక కూతురు, అది పుట్టిన యేడాది తిరక్కుండానే కొడుకు పుట్టాడు. అంతటితో చాలనుకుని వ్యాపారంపై దృష్టి పెట్టి లెక్కలేనంత సంపాదించాడు. వూరిలో కుల పెద్దగా లెక్కలేనంత పరువు సంపాదించాడు. అతనికి నలభై యేళ్లున్నప్పుడు హఠాత్తుగా ఆయన భార్య లక్ష్మమ్మ గర్భం దాల్చి పండంటి ఆడబిడ్డను కన్నది. అది పుట్టిన వేళా విశేషమేమో అతనికి వ్యాపార పరంగానూ, వ్యక్తిగతంగానూ అపారమైన నష్టం కలగడం మొదలెట్టింది. అది పుట్టిన మూడు నెలలకు అతనికి ప్రాణప్రదమైన అతని తండ్రి పరమావదించాడు. దానికి సంవత్సరం రాగానే అతని పరువు మీద మచ్చ పడింది. అతని ఒక్కగానొక్క కొడుకైన నాగేష్ తన పెదతల్లి మోహనను చెరపట్టి పంచాయితిలో నిలిచాడు. పైగా ఆమె భర్తను చంపి హంతకుడయ్యాడు.
వారసుడు కారాగారం పాలైన బాద తగ్గకనే అతనికి వ్యాపారంలో తేరుకోలేని దెబ్బ తగిలింది. దొంగ సరుకుల రవాణా చేస్తున్నారని అతని చేతివృత్తుల వ్యాపారాన్ని సెక్యూరిటీ ఆఫీసర్లు మూయించేశారు. పశువులు ఒక్కోక్కటిగా పరలోకం చేరాయి. అతనికి యాభై వచ్చేనాటికి అతనికి మిగిలింది నాలుగు పాడి ఆవులు, అతని కుటుంభం, వూరిలో పలుకుబడి.
చిన్న కూతురికి పెళ్లీడొచ్చింది. పూర్వపు వ్యాపార భాగస్వామి కొడుకుతో పెళ్లి నిశ్చయమైంది. అందుకు డబ్బవసరమైంది. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎందరినో అడిగాడు. ఎక్కడా పైసా పుట్టలేదు. చివరగా దొంగతనానికి పూనుకున్నాడు. అదీ కూడా దేవుని గుడి దొంగతనానికి తను చేస్తున్న ఈ నేరం కొడుకు చేసిన హత్యకంటే మహా ఘోరమైనదని తలుచుకుంటేనే వెన్నులో ఒణుకు పుడుతొంది. జీవిత పర్యాంతం నీతికి న్యాయానికి కట్టుబడ్డ బతుకతనిది. అందుకనే దొంగతనం చేయాలంటే అసహ్యం పుడుతొంది. అడవి ఎలుగునే వట్టి చేతులతో మట్టు పెట్టగలిగే ధైర్యం కలిగివున్నా కనీసం కాపలా గూడాలేని గుడిని దొంగలించడానికి ఒణికి పోతున్నాడు.
సమయం అర్దరాత్రిని సమీపిస్తొంది. ఆకాశంలో చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతూ చల్లటి వెన్నెలను వెదజల్లుతున్నాడు. చల్లటిగాని కోనాపురం కోనల్లో వీస్తొంది. ఆ చల్లటి గాలి ప్రభావానికి అతనిలో భయం చచ్చి కాస్త ధైర్యం కూడగట్టుకుంది.
గుండెల్లో జారిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకుని లేచినిల్చున్నాడు. వెన్నెల సంద్రంలో తేలుతున్న రంగనాథుని గుడిని చూశాడు. పాలసముద్రంలో పన్నగశయనుడిగా విశ్రాంతి తీసుకుంటున్న అనంతుడిలా అతనికి దర్శనమిచ్చాడు. ఆ దర్శనం అతని భయాన్ని పటాపంచలు చేసింది. దొంగతనానికి దేవుడి అనుమతే దొరికినంత ధైర్యంగా కొడదిగాడు. ఆలయాన్ని వుత్తర దిశగా సమీపించాడు. అక్కడే క్షేత్రపాలకుడు ఆంజనేయుని మందిరం లోనికి చొరబడి మందిరమంతా కలయ తిరిగాడు. ముహూర్త కాలానికి అతను వెదుకుతున్న మీట ఆంజనేయుని యెడమ పాదం కింద కనబడింది. ఆ మీట నొక్కి భక్తితో పాదం పట్టుకు లాగగానే ఆంజనేయుడు ముందుకి కదిలాడు. ఆయన పాద పద్మాలున్న చోట సొరంగం వెలువడింది. ఆ ఆనందంలో ముందూ వెనక చూసుకోకుండా లోపలికి అడుగేశాడంతే ఎగిరొచ్చి మందిరం వెలుపల పడ్డాడు. కళ్లు బయర్లు కమ్మాయి. అనంత నక్షత్ర కోటీ అతనికి అనుభవం లోకి వచ్చింది. ఆ నక్షత్ర వెలుగులో వుగ్ర రూప బాలాత్రిపుర సుందరి అతని కళ్ల ముందు దర్శనమిచ్చింది. ఆ వుగ్ర రూపం దాల్చిన మరుక్షణం అతను స్పృహ కోల్పోయాడు.