Chapter 12

తిలోత్తమ చెప్పడం పూర్తి చేసింది. ఆనంద విశాదాల్ మిశ్రమంలా కళ్లల్లో నీళ్ళు ఊరాయి. పైటతో కళ్ళు అద్దుకుని బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించింది.
గోపాలకృష్ణ పరిస్థితి కూడా అదే. అతను ఆమె చెప్పినదానికి బాగా కదిలిపోయాడు.

“తిలోత్తమా! మీ ముగ్గురికి చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తోంది. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన మిమ్మల్ని తలుచుకుంటుంటే మానవజాతి మీదే గొప్ప ప్రేమ కలుగుతోంది. ఈ భావనల్ని ఇలాగే గుండెలో అణిచేసి, వాటి ఒత్తిడికి చిప్పిల్లే అనుభూతినంతా ఒంటరిగా అనుభవించాలనుంది” అన్నాడు.

“ఇక్కడికి వచ్చింది నాతో ఇంతకాలం నిక్షిప్తమైన ఆ అనుభవాన్ని చెప్పడానికే గోపాలకృష్ణా! నీతో గడిపి సిరిసంపదలను పొందాలన్న ఉద్దేశ్యం నాకు లేదు. మనుషుల మీద గొప్ప నమ్మకం, ప్రేమ వుండడంకంటే వేరే సిరిసంపదలున్నాయా! అవి పుష్కలంగా వున్న నాకు ఇక మీ అక్కరలేదు. నేను వస్తాను గోపాలకృష్ణా!”
ఇద్దరూ లేచి బయటికొచ్చారు.
వర్షం ఇంకా ఆగలేదు. చినుకులు జోరుగానే పడుతున్నాయి.
తెల్లవారుతోంది. నల్లటి ఆకాశం సిమెంట్ రంగులోకి మారుతోంది.
“వర్షం బాగానే పడుతోంది. నేను వచ్చి ఇంటి దగ్గర దిగబెట్టనా?”
“వద్దు”
“పోనీ గొడుగైనా తీసుకెళ్ళు”
“ఇంత తెల్లవారిపూట వర్షంలో తడిసి చాలా రోజులైంది” అని అడుగు ముందుకు వేసింది.
ఎంతో ఆరాధనతో ఆమెవైపు చూస్తూండిపోయాడు అతను.

‘కళ్ళు మూసినా నీవాయె, కళ్ళు తెరిచినా నీవాయె’ అన్నట్లుంది గోపాలకృష్ణ పరిస్థితి. ఒకప్పుడయితే అలాంటి పాటలను వింటూ నవ్వుకునే వాడు. సినిమా పాటల్లో ప్రేయసిని ప్రియుడు, ప్రియుడ్ని ప్రేయసి పొగుడుకోవడం తప్ప ఏమీ లేదనుకునేవాడు. అవి అసహజంగా కూడా వున్నాయని భావించేవాడు. కానీ ఇప్పుడు తన అభిప్రాయం తప్పు అని తెలుసుకున్నాడు.

ప్రేమించనంతవరకు మన పరిధి విశాలంగా వుంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే మన పరిధి చాలా కుంచించుకుపోతుంది. ప్రేమించిన వ్యక్తే ప్రపంచమైపోతుంది. ప్రపంచమే ప్రేమించిన వ్యక్తిగా దర్శనమిస్తుంది. ఈ కారణంవల్లనే ప్రేమికులు మిగిలిన ప్రపంచానికి అంధులైపోతారు.
చిన్నగాలి తన శరీరానికి తాకినా అది ప్రియురాలి స్పర్శలా అనిపిస్తుంది. కనిపించే పచ్చటి కొండలే తన ప్రేయసి కట్టుకున్న చీర అంచు మీద డిజైన్ లా అనిపిస్తుంది. ఎక్కడో దూరంగా వినిపించే పాట తన అవస్థను చూసి గంధర్వుడు చేసే ఆలాపనలా అనిపిస్తుంది. ఒక్కో రకమైన పువ్వు అ ప్రేయసి ఒక్కో అవయవానికి ప్రతీకలా అనిపిస్తుంది.
ప్రేమికుడు అనుభవించే అద్వైత స్థితి ఇది.

గోపాలకృష్ణ వీటికి అతీతుడేం కాదు. పైపెచ్చు భావుకుడు కనుక ఈ స్థితిలో మరింత మమైక్యత పొందుతున్నాడు.
తన కనురెప్పల మీదే వర్ష కాపురం పెట్టేసినట్టుంది అతడికి. అందుకే కనురెప్ప మూస్తే ఆమె తన కళ్ళలోని రెటీనా మీద ప్రతిబింబిస్తున్నట్లు భ్రమపడుతున్నాడు. తను పీల్చే గాలిలో ఆమె అస్థిత్వపు పరిమళం కలిసిపోవడం వల్ల తన ఊపిరితిత్తుల్లో అంత అలజడి కలుగుతూ వుందని భావిస్తున్నాడు.

“వర్ష” అనే రెండు అక్షరాలు తప్ప మరో అక్షరాన్ని తనకు అయ్యవారు నేర్పించలేదేమోనని అనుమానం పడుతున్నాడు.
ఉదయం కలల దుప్పటిని తొలగించగానే అతనికి ఆమె వెచ్చ వెచ్చగా గుర్తుకొస్తుంది. పెరట్లో చెట్టుచేమల్ని నిద్రలేపుతున్న నీరెండలో ఆమె పచ్చపచ్చగా గుర్తుకొస్తుంది. ఇంటిముందు కొప్పంతా పూలు తురుముతున్న తురాయి చెట్టును చూస్తుంటే ఆమె ఎర్రెర్రగా గుర్తుకొస్తుంది. భగవంతుడు కాలు మోపడానికి అక్కడక్కడా తివాచీలను పరచినట్లుండే పంట చేలను చూస్తుంటే ఆమె వెర్రి వెర్రిగా గుర్తుకొస్తుంది. కన్ను చేస్తున్న ఇంద్రజాలంలా అనిపించే ఆకాశంవెపుఇ సారించినప్పుడు ఆమె పిచ్చిపిచ్చిగా గుర్తుకొస్తుంది.

ఏ అర్థరాత్రో ఒంటరిగా కూర్చుని వున్నప్పుడు సన్నజాజుల పరిమళాన్ని గాలి నెత్తిమీద కుమ్మరిస్తున్నా పట్టించుకోకుండా ఆమెకు తన రక్తంతో ఉత్తరం రాయాలనీ, ఆమె నడిచే దారివెంట పాదాలు కంది పోకుండా నందివర్ధనం పూలు పరవాలనీ, ఆమె కనుపాపల్లో దృశ్యంగా ఇమిడిపోవాలనీ, ఆమె పెదవులమీద ఎప్పటికి వాడిపోని చిరునవ్వుల దండలా వేలాడాలనీ ఇలా ఏవేవో ఆలోచిస్తున్నాడు అతను.

ఇక్కడ మనకు తెలియని విషయం ఎంటి అంటె వర్ష మన అర్జున్ ఇష్టపడుతుంది…..అర్జున్ మన చంటి సినిమాలొ వెంకి లా అందరికి సహాయపడుతు జీవితం గడిపెవాడు….ఆఖరికి మన వర్షకు కూడ టౌనులొ ఎమి కావలి అన్నా తెచ్చి ఇచ్చెవాడు…మన గొపాలక్రిష్నా కారియర్ కూడా తీసుకొని పొయెవాడు…….ఇలా అందరి ఆదరాభిమానాలు అతి తక్కువ కాలములొనె చురగొనాడు మన వర్ష తో కలిపి ,ఇప్పటి వరకు అమె వెంటె అందరు పడ్డారు కాని మొదటి సారి ఒక మగవాడు తనను ఇబ్బంది పెడుతున్నాడు……..కాని అది ఎలా చెప్పాలొ తెలియని పరిస్థితి…….తన మనస్సులొ ఈ పాట మొదలైంది……

ఎలా.. ఎలా.. ఎలా.. ఎలా..
ఎలా తెలుపను యెదలొని ప్రెమను మ్రుదువైన మాతను
గాలిలొన వెలితొతి రాసి
చూపన నెల మీద సిగ్గుముగ్గు వెసి చూపన
వాలు జదల కాగితాన
విరజాజుల అక్షరాలు పెర్చి కూర్చి చూపనా
రామ చిలక గొరువనక బొమ్మ గీసి తెలుపనా
రాధ క్రిష్నుల వంక చెయ్యి చూపి తెలుపనా
చిరునవ్వుతొ తెలుపనా కొన చూపుతొ తెలుపనా
నీలునవిలి తెలుపన గొల్లు కొరికి తెలుపన తెలుపకనె తెలుపనా

కాలివెల్లు నెలమీద రాసి చూపన
నా చీర కొంగు తొతి వెలు చుత్తి చెప్పన
కూనలమ్మ పాతలొ రయబారమంపన
గాలికైన తెలియకుంద మాత చెవిని వెయన నాలొ ప్రానం నీవని..

ఇది తెలియని మన్ అర్జున్ ఎప్పటిలానె ఉన్నాడు……….
“ఏం గురుడా! ఎప్పుడూ ఏదో మూడ్ లో వుంటున్నావు? కొంపదీసి వర్షమ్మను ప్రేమిస్తున్నావా ఏమిటి? అనడిగాడు ఓ రోజు అర్జున్ .
దానికి అతని నవ్వే సమాధానమయింది. అతను చెప్పకపోయినా అర్జున్ కి తన గురుడి అవస్థంతా అర్థమయింది. గురువుగారి అవస్థను చూసి అతను ముసిముసిగా నవ్వుకుంటున్నాడు.

ప్రేమ అంతే “ఇదీ” అని చెప్పగలిగిన వాళ్ళెవరూ లేరు. ఎవరైనా వున్నారూ అంతే వాళ్ళు నిజమైన ప్రేమికులు కారు. నిర్వచనంలోకి ఇమడనిది ప్రేమ. ఇది ఏమిటో తెలియదు కాబట్టే ప్రేమికుల చేష్టలు పిచ్చివాళ్ళ పనుల్లా అనిపిస్తాయి. లేకుంటే వీధిలో నడవడానికే జంకుగా ఫీలయ్యే గోపాలకృష్ణ రోజూ సాయంకాలం వర్ష కనిపిస్తుందేమోనని వీధుల్లో పచార్లు ప్రారంభించాడు. ఎప్పుడయినా ఆమె కనిపించినప్పుడు రూపాన్ని కళ్ళల్లో ప్రతిష్టించుకునేవాడు.

ఆరోజు కూడా యధాప్రకారం నిద్రలేచి, ఓ స్థంభానికి జారిగిలబడి వర్ష రూపానికి అరమోడ్పు కన్నులతో ఫ్రేము కడుతున్నాడు. రక్తంలోని ఆమె అనుభూతులకు రంగులద్దుతున్నాడు. గుండెల్లోని ఆమెకు గుడి కడుతున్నాడు. మొత్తం శరీరమంతా పరుచుకున్న ఆమె ఊహలకు వూపిరి పోస్తున్నాడు.
ఊర్లోకి వెళ్ళిన నరుడు హడావుడిగా అక్కడికి వచ్చాడు.

“గురుడా! ఏమిటింకా స్నానం చెయ్యలేదా? అక్కడ ఊరి జనమంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు దేవుడి ఊరేగింపు అన్నది గుర్తులేదా?” అని నాన్ స్టాప్ గా మాట్లాడాడు.

అప్పుడు గుర్తొచ్చింది గోపాలకృష్ణకు. ఆరోజు దేవుడి వూరేగింపు విషయం. తను వెళ్ళి మొదట దేవుడికి హారతి ఇవ్వందే వూరేగింపు పనులు ప్రారంభం కావు. అందుకే అక్కడినుంచి లేచి తయారవడం మొదలు పెట్టాడు.

మరో అరగంటకు ఇద్దరూ వూరిలోకి బయలుదేరారు.
వీళ్ళు వచ్చేసరికి రథం దగ్గర చాలామంది వున్నారు. గోపాలకృష్ణను చూడగానే జనంలో కలకలం మొదలయింది.
పంతులు ఎదురెళ్ళి ఆహ్వానించాడు.

“రండి, మీకోసమే చూస్తున్నాం. ఈరోజు సాయంకాలం వూరేగింపు. మదనకామరాజు వంశానికి చెందిన మీరు మొదట పూజాకార్యక్రమాలు నిర్వహిస్తే పనులు ప్రారంభమవుతాయి” అతి వినయంతో అంటూ అతన్ని రథం దగ్గిరికి తీసుకొచ్చాడు.
వీధి మొదట్లో వున్న రథం రకరకాల చిలుకలు వాలిన చెట్టులా వుంది. మొత్తం రథమంతా కడిగి శుభ్రం చేయడంవల్ల అది నీరెండలో ఇంద్రధనుస్సు చిట్లి ఆ రూపం ఎత్తినట్లుంది.

గోపాలకృష్ణను అక్కడ నిలబెట్టి పంతులు మంత్రాలు చదివి, ఓ పళ్ళెంలో కర్పూరం వెలిగించి, దాన్ని అతనికిచ్చాడు. హారతి అయిపోగానే తిరిగి పళ్ళాన్ని పంతులకిచ్చాడు. ఈ సమయం కోసం చూస్తున్న మంగళ వాయిద్యాలు ఒక్కసారిగా మోగాయి. పంతులు రథం ఎక్కాడు. దేవుడికి అలంకరణలు ప్రారంభించాడు.

ఊరేగింపు సాయంకాలం ప్రారంభమవుతుంది. అప్పటివరకు ఊరేగింపు ఏర్పాట్లు జరుగుతుంటాయి.
హారతి అయిపోగానే గోపాలకృష్ణ అక్కడినుంచి బయల్దేరాడు. వర్ష కనిపిస్తుందేమోనన్న ఆశ అతన్ని ముందుకు నడిపిస్తోంది ఆ వీధిలో పోకుండా మలుపు తిరిగితే తన ఇంటికి త్వరగా చేరుకోవచ్చు. కాస్త ఆలస్యమైన శివరామయ్య ఇంటిగుండా వెళదామని నిర్ణయించుకుని అటు అడుగులు వేశాడు.

ఇల్లు దగ్గరవుతుంటే రక్తప్రసరణ హెచ్చింది. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.
మెల్లగా అడుగులేస్తూ ఇంటివైపు చూశాడు.
కిటికీ పక్కన కూర్చున్న ఆమెను చూడగానే ఓ క్షణంలో వెయ్యోవంతు ఆగిపోయాడు.
ఎవరో గొప్ప చిత్రకారుడు ఆమె చిత్రం గీసి రంగులు ఆరడానికి కిటికీకి వేలాడదీసినట్లుంది.
నీలం ఆకాశం ముక్కను కత్తిరించి కిటికీగా చేసి. మధ్యలో చందమామ అతికించినట్లనిపించింది.
సముద్రపు నీళ్ళమీద పడ్డ సూర్యకాంతి అల్లా ఫ్రీజ్ అయినట్లనిపించింది.

ఆమె రూపం కళ్ళల్లో రంగుల వలయాలను సృష్టిస్తుంటే మెల్లగా అక్కడి నుంచి కదిలాడు.
తను కనుపించగానే అతనిలో కలుగుతున్న మార్పులను ఆమె గమనించింది. అయితే అతని గురించి ఓ క్షణం సేపైనా ఆలోచించడం ఇష్టం లేని ఆమె తిరిగి పుస్తక పఠనంలో మునిగిపోయింది.
అతను ఇంటికి చేరుకున్నాడు.

నరుడు మాత్రం రథం దగ్గరే ఆగిపోయాడు. జనంలో కోలాహలాన్ని వదలి ఒంటరిగా అడవిలో తపస్సు చేసుకుంటున్న ఋషిలా వుండే తన గురువుగారి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు.

పిల్లలంతా తలస్నానాలు చేసి, చక్కగా ముస్తాబై వీధుల్లో పడ్డారు. స్త్రీలు ఇళ్ళంతా అలికి, శుభ్రం చేస్తున్నారు. మగవాళ్ళు రథం దగ్గరికి, ఇంటి దగ్గరికి తిరుగుతూ హడావుడిగా వున్నారు.

ఊరిలోని యువకుల్లో కొందరు వీధికి ఇరువైపులా గుంజలు నాటుతున్నారు. మరికొందరు వాటికి రంగు కాగితాల తోరణాలు కడుతున్నారు. మల్లాం నుంచి వచ్చిన గ్రామ్ ఫోన్ గొంతు సవరించుకుంటూ వుంది.

పూజారి ఆదేశాలిస్తుంటే కొందరు రథాన్ని పూలమాలలతో అలంకరిస్తున్నారు.
ఇలా మన అర్జున్ కూడ పనులలొ బిజి ఐపొయాడు ఆకలి కూడ మరిచిపొయి,,,,,,,చెమట తడిచిపొయిన చొక్కా విప్పి అలా బనియన్ తొ పని చెస్తుంటె అక్కడ వాళ్ళు గుడ్లు అప్పగించి కండలు తిరిగినా మన అర్జున్ బాడీని చుస్తు చొంగా కార్స్తునారు ఇది గమనించినా వర్ష….తనకు ఒక టవల్ కప్పింది…ఎంటి ఇలా అందరి ముందరా షర్ట్ విప్పి ఎక్స్పొసింగ్ అంది,,,ఎవరైనా చుస్తె దిష్టి తగుల్తుంది అంటుంది వర్ష,,,,మన వొంటి దిష్టి గిష్టీ ఎమి తగలదు అంటాడు అర్జున్………ఇలా మాటల్లొ అతని వంక చుస్తు ఈ లోకాని మర్చిపొయింది….మన అర్జున్ చిటికెసి పిలిచెంతవరకు ఈ లోకం లోకి రాలేదు …….ఇలా అతనిని ఇంటికి బలవంతముగా పిలుకొని వెళ్ళీ వొడ్డిచింది……….

సాయంకాలం నాలుగు గంటలకే వాతావరణం మారిపోయింది. ప్రతి ఇంటిముందూ నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టారు. నీటి చెమ్మమీద తేలుతున్న ముగ్గులు ముత్యాలను ఆరబెట్టినట్లున్నాయి. ఎర్రమట్టి గీతలతో అలరారుతున్న ఇళ్ళు అందమైన పావురాళ్ళు పెట్టుకున్న గూళ్ళలా వున్నాయి.

వీధి మధ్యలో వేలాడుతున్న మామిడాకుల తోరణాలు ఆకాశం మెడలోని పచ్చల హరాల్లా మెరిసిపోతున్నాయి గ్రామ్ ఫోన్ రికార్డు లోంచి వినిపిస్తున్న భక్తకన్నప్పలోని సినిమా పాట గ్రామం చేత నృత్యం చేయిస్తున్నట్లుంది.

సాయంకాలం అయిదు గంటలకి ఊరేగింపులోని మొదటి భాగం వసంతోత్సవం ప్రారంభమవుతుంది. రథం ముందు అటూ ఇటూ రెండు పెద్ద బిందెల్లో వసంతం కలుపుతారు.

వసంతం అంతే నీళ్ళల్లో పసుపు, సున్నం కలిపితే వచ్చేదే. గ్రామస్తులు ఆ నీటిని చెంబుల్లోకి తీసుకుని తమకు ఇష్టమైన వాళ్ళమీద చల్లడమే వసంతాలు పోసుకోవడం. ఈ ఘట్టం ప్రారంభం అయిన తరువాత ఊరేగింపు జరుగుతుంది. ఎదుటి వ్యక్తి మీదున్న ఇష్టాన్ని ఇలా వసంతాలు పోయడం ద్వారా గ్రామస్తులు వ్యక్తపరుస్తారు. చాలా ఉత్సాహంగా, అంతకంటే ఉద్రేకంగా జరుగుతుంది ఇది. తమకు ఇష్టమైన వ్యక్తి ఎక్కడున్నా వెదికి పట్టుకుని వసంతం పోస్తారు. అప్పటికే చాలామంది యువకులు చెంబులు తీసుకుని రథం దగ్గర తయారైపోయారు. ఊరేగింపులో వసంతోత్సవాల ఘట్టం అంతే నరుడికి చాలా ఇష్టం.

అబ్బాయిలు, అమ్మాయిలు చక్కగా ముస్తాబై వసంతాన్ని నింపుకుని తమను మనసుపడ్డవాళ్ళ కోసం హాడావుడిగా వెదకడం- వాళ్ళు కనిపించగానే తొందర తొందరగా వసంతాన్ని నెత్తిమీద కుమ్మరించడం వసంతం తనను పూర్తిగా తడిపేసినప్పుడు కళ్ళు తుడుచుకుంటూ తన మీద వసంతాన్ని పోసిన వ్యక్తికేసి కొంటెగా, అంతకంటే ఆత్మీయతతో చూడడం అబ్బాయిలయితే అమ్మాయిలవైపు ‘తెలిసిందిలే- గుట్టు తెలిసిందిలే’ అన్నట్లు చూడడం- అమ్మాయిలు సిగ్గు బరువుతో ఎదుటి వ్యక్తికేసి ఆరాధనతో పెదవులపై చిరునవ్వులను పూయించడం. ఇవన్నీ చూస్తూ చిన్నపిల్లాడే అయిపోతాడు అతను. అందుకే నాలుగు గంటల నుంచే రథం దగ్గరకు వెళదామని తన గురుడ్ని పోరుపెట్టాడు.

గోపాలకృష్ణకూ తొందరగా అక్కడికి వెళ్ళాలని వుంది. వర్ష తప్పక అక్కడికి వస్తుందని తెలుసు. గ్రామంలోని వాళ్ళంతా వసంతాల దగ్గర గుమికూడుతారు. అందులో చాలామందే పాల్గొంటారు. వసంతాల దగ్గర గుమికూడుతారు. అందులో చాలామందే పాల్గొంటారు. వరసయిన వాళ్ళ మీద వసంతాలు చల్లడం అక్కడి సాంప్రదాయం. కాస్త వయసైన వాళ్ళు మాత్రం అందులో పాల్గొనకుండా ప్రేక్షకులైపోయి, వసంతాలు పోసుకుంటున్న వాళ్ళను చూస్తూ ఎంజాయ్ చేస్తారు.

వసంతాలను చూడడం ఎవరూ మిస్ చేయారు. కాబట్టి వర్షను ధాన్య అక్కడికి తీసుకువస్తుందని అతని నమ్మకం. కాని మరీ నాలుగు గంటలకే అక్కడికి వెళ్ళడం ఇబ్బందిగా అనిపిస్తుందని వెళ్ళలేకపోయాడు.

చివరికి ఆరుగంటల ప్రాంతాన ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు.

వీధుల్లో నీళ్ళు చల్లడంతో మట్టి వాసన గమ్మత్తుగా ఆ ప్రాంతమంతా ఆవరించింది. ముగ్గులు ఎవరో వనదేవత మెడలోని ముత్యాలదండల్లా వున్నాయి. కాలం చెక్కమీద సంధ్యకాంతిని అరగదీసి కలిపినట్టు వసంతం నీళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి.

పంతులు రథం ఎక్కి అందులోని ఉత్సవ విగ్రహానికి పూజ చేస్తున్నాడు. గోపాలకృష్ణను చూడగానే అందరూ అడ్డు తొలిగారు. అతనూ, నరుడూ ముందుకు సాగి రథం ముందు నిలుచున్నారు.

గోపాలకృష్ణ కళ్ళు వర్ష కోసం వెదుకుతున్నాయి. ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఏదో తెలియని నిరాశ గుండెను మెలిపెడుతోంది.

ఇంకా పంతులు పూజ చేస్తున్నాడు.

అప్పటికే కుర్రకారంతా చేతుల్లో చెంబులు పుచ్చుకుని పూజ ఎప్పుడు ముగుస్తుందా, వసంతాలు చల్లుకుందామా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఎవరిమీద వసంతం పోయాలోనని ఆలోచిస్తున్నారు.

పంతులు చివరిసారిగా మంత్రాలు బిగ్గరగా చదివి, విగ్రహం మెడలోని పూలమాలను సరిచేసి కిందకు దిగాడు.

వృద్ధులు అలా చేతులు జోడించి ఉత్సవమూర్తిని భక్తి పారవశ్యంతో చూస్తున్నారు.

పులిరాజు, వెంకట్రామయ్య ఓ మూలచేరి గోపాలకృష్ణ వంక గుర్రుగా చూస్తున్నారు. ఇంకెంత కాలం ఈ భోగం అన్నట్లు వాళ్ళిద్దరూ అతనివైపు చులకనగా చూస్తూ ఏదో గొణుక్కుంటున్నారు. ఈ మసక వెలుతురులో వాళ్ళు వేటకు బయలుదేరిన నక్క, తోడేలు జంటలా వున్నారు.

అలా కళ్ళు తిప్పుతున్న గోపాలకృష్ణ ఓ దగ్గర ఆగిపోయాడు.

అక్కడ ధాన్య, ఆమె వెనక వర్ష నిలబడి చూస్తున్నారు.

ఆరోజు విచిత్రంగా చంద్రోదయం ఆకాశంలో కాకుండా జనంలో జరిగినట్టు మెరిసిపోతున్న వర్ష ముఖారవిందాన్ని చూసి అతను ఎగ్జయిట్ మెంట్ కు గురయ్యాడు.

అక్కడి నుంచి చూపులను మరల్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఏదో ట్రాన్స్ లో వున్నట్లు అతను అటువైపే చూస్తున్నాడు.

“వసంతాలు ప్రారంభిద్దామా బాబుగారూ?” పంతులు మెల్లగా అడిగాడు అతడ్ని.

అలాగేనన్నట్లు తల వూపాడు.

వసంతోత్సవం ప్రారంభమైనట్లు పంతులు జనంవైపు చూసి సంజ్ఞ చేశాడు. దీనికోసమే ఎదురుచూస్తున్న యువకులు ఒక్కసారిగా ముందుకు దూకారు. తమమీద ఎవరైనా వసంతాలు పోస్తారేమోనని తమను తాము రక్షించుకోవడానికి కొందరు ఇళ్ళవైపు పరుగెత్తారు. వాళ్ళను వెంటాడుతూ చెంబులోని వసంతం చిందిపోకుండా పరుగెడుతున్నారు మరికొందరు.

క్షణంలో అక్కడి వాతావరణం కోలాహలంగా తయారయ్యింది.

అంతలో పునర్వాసు జనం మధ్యలోంచి దూరి వసంతాన్ని తీసుకుని, అంతే వేగంతో వచ్చి గోపాలకృష్ణ మీద దాన్ని కుమ్మరించింది. తెల్లటి బట్టలు ఎర్రగా, అక్కడక్కడా పసుపుపచ్చగా తయారై సాక్షాత్తూ ఆ మన్మథ దేవుడు అక్కడ ప్రత్యక్షమైనట్లు అతను మెరిసిపోయాడు.

పులిరాజు కళ్ళల్లో వసంతం పడి మండినట్లు గిజగిజలాడిపోయాడు. అతనికి తెలియకుండానే అతని పిడికిలి గోపాలకృష్ణ మీద కసితో బిగుసుకుంది.

తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి అలా పరాయి మగాడిమీద వసంతం పోయడం అతను భరించలేకపోతున్నాడు. దీన్ని గమనించిన వెంకట్రామయ్య అతని భుజంపై బాధపడవద్దన్నట్లు చేత్తో చరిచాడు.

పునర్వసు అలా గోపాలకృష్ణమీద వసంతం పోయడాన్ని మిగిలిన జనం బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఆమెను ప్రోత్సహిస్తున్నట్లు చప్పట్లు చరిచారు.

ఆమె అటు వెళ్ళగానే మరో అమ్మాయి వసంతాన్ని అతనిమీద పోసింది. మళ్ళీ జనం ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. అతను అలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవడాన్ని చూసి పులిరాజు ఈర్ష్యతో ఉడికిపోతున్నాడు. ఊర్లో అతని డామినేషన్ చూసి వెంకట్రామయ్య కోపంతో ఊగిపోతున్నాడు. కోపం కంటే ఈర్ష్య డేంజరస్. అందుకే పులిరాజు నిలువెల్లా దహించుకుపోతున్నాడు.

గోపాలకృష్ణకు నీళ్ళు పైన పడుతుండడం వల్ల ఊపిరి ఆడడం లేదు. కళ్ళల్లో సన్నటి మంట. అయితే దాన్ని లెక్క చేయకుండా మధ్య మధ్యలో కళ్ళు తెరిచి వర్షవైపు చూస్తున్నాడు.

అతను అలా తనవైపే చూస్తున్నాట్లు భ్రమిస్తోంది ధాన్య.

“నా హీరో నావైపే చూస్తున్నాడు. అలా వెళ్లి కాసింత వసంతం చిలకరించి వస్తాను” అంది వర్షతో.

“అలా చేశావంటే నేను వెళ్ళిపోతాను. ఆచారం పేరుతో ఆడపిల్లల్ని నాశనం చేసే అతను హీరోనా? తాతా ముత్తాతల పేరు చెప్పుకుని నయా పైసా పని చేయకుండా వేళకు షడ్రసోపేతమైన విందు భోజనం ఆరగించే ఆ సోమరిపోతు నీ హీరోనా? నాన్సెన్స్…… నువ్వు వసంతం పోయడానికి వెళితే నేను ఇంటికి వెళ్ళిపోతాను….. అంతే” చివరగా బెదిరించింది వర్ష.

“అయితే పోయానులే. నువ్వు వెళ్ళిపోయావంటే నాకు తోచదు” లోపల మనసు పడుతున్న కష్టాన్నంతా కళ్ళల్లో వ్యక్తపరుస్తూ చెప్పింది ధన్య.

అమ్మాయిలు ఒక్కొక్కరే వచ్చి గోపాలకృష్ణ మీద వసంతాలు పోస్తున్నారు నరుడు ఉత్సాహంగా గురువుగారికి జరుగుతున్న వసంతా భిషేకాన్ని చూస్తున్నాడు.

అంతలో గోపాలకృష్ణకు ఓ కొంటె ఆలోచన వచ్చింది. దాన్ని తలుచుకుంటుంటే తెలియని ఉత్సాహం రక్తాన్ని ఊపేస్తోంది.

అనాది ప్రేమికులంతా అతన్ని ముందుకు నెడుతున్నారు. అజ్ఞాత శక్తులు అతన్ని ప్రేరేపిస్తున్నాయి. ధైర్యం, అంతకంటే మించిన తెగువ మున్ముందుకు తోస్తున్నాయి. ఏదో ఉద్రేకం విచక్షణాజ్ఞానాన్ని మింగేసింది.

అంతే….. తనమీద వసంతం పోసి ఎదురుగా నిల్చుని నవ్వుతున్న అమ్మాయి చేతిలోని వెండి చెంబును లాక్కున్నాడు.

అలా నిలబడి బుద్ధిగా వసంతాలు పోసుకోవడమే తప్ప, ఎన్నడూ వసంతాలు ఎవరిమీదా పోయాని గోపాలకృష్ణ మొదటిసారి చెంబు చేతుల్లోకి తీసుకోవడంలో జనం ఉత్కంఠతో నిలుచుండిపోయారు. ఆ తరువాత అతను ఏం చేయబోతాడోనని రెప్పలు వాల్చకుండా చూస్తున్నారు.

గోపాలకృష్ణ నెమ్మదిగా నడిచి చెంబు ముంచాడు. ఎర్రటి వసంతం చెంబు నుంచి జారుతుండగా పైకి లాగాడు.

తల పైకెత్తాడు తనమీద పోయడానికే వసంతం నింపుకున్నాడని అంతకు ముందు అతని మీద వసంతాలు పోసిన స్త్రీలంతా ఎవరికి వారే అనుకుంటూ టెన్షన్ గా నిలబడి చూస్తున్నారు.

అయితే గోపాలకృష్ణ చూపులు ధాన్యవైపు ప్రసరించగానే జనం కీ ఇచ్చిన బొమ్మల్లాగా అటువైపు తలలు తిప్పారు.

ధాన్య అయితే చిన్నపిల్లలా కేరింతలు కొడుతోంది.

అతను నెమ్మదిగా అడుగులేస్తున్నాడు. ధాన్య మరికొంత ముందుకు వచ్చి నిలబడాలని అనుకుంది గానీ కాళ్ళు కదలడం లేదు.

అతను మరింత దగ్గరయ్యాడు.

వసంతం పోసుకోవడానికి ప్రిపేర్ అయిపోయిన ఆమె కళ్ళు మూసుకుంది. జనం బిర్రబిగుసుపోయి చూస్తున్నారు.

గోపాలకృష్ణ దాన్యను సమీపించి, పక్కకు ఓ అడుగువేసి చెంబు ఎత్తి వర్శపై కుమ్మరించాడు.​
Next page: Chapter 13
Previous page: Chapter 11