Update 02

శేఖర్ చెప్పిన మాటలు శ్రీను తల లోనే తిరుగుతూ ఉన్నాయి అలాగే ఆలోచిస్తూ స్వప్న రూమ్ నుంచి బయటకు వచ్చాడు అప్పుడు పక్కన ఉన్న చిన్నపిల్లల వార్డ్ నుంచి పద్దు గిటార్ వాయిస్తూ ఒక హిందీ పాట పాడుతూ ఉంది దాంతో శ్రీను లోపలికి వెళ్లి అదే పాట పాడుతూ పద్దు వెనుక నుంచి వెళ్లి తన చేతిలో ఉన్న గిటార్ నీ పట్టుకుని పద్దు చేత్తో కొత్త ట్యూన్ నీ వాయించడం మొదలు పెట్టాడు, శ్రీను వెచ్చని శ్వాస మెడ మీద తగులుతు ఉంటే పద్దు కీ లోపల ఏదో అలజడి మొదలైంది దాంతో పైకి నవ్వుతూ ఉన్న లోపల మాత్రం సెగ రగులుతూ ఉంది దాంతో పద్దు శ్రీను నీ స్వప్న రూమ్ లోకి తీసుకుని వెళ్లి మీదకు లాగి తన పెదవి తో శ్రీను పెదవి పైన ముద్దు పెట్టింది శ్రీను కూడా పద్దు నడుము చుట్టూ తన చేయి వేసి పద్దు నీ ఇంకా గట్టిగా మీదకు లాగి పద్దు పెదవులు జుర్రుకుంటు ఉన్నాడు అలా ఇద్దరు మైమరపు లో ఉండగా తలుపు కీ ఉన్న అద్దం నుంచి శేఖర్ వాళ్ళని చూడటం చూసి పద్దు నీ పక్కకు తోసి bathroom లోకి వెళ్ళాడు పద్దు కూడా బయటకు వెళ్లింది శ్రీను మొహం కడుక్కొని బయటకు వచ్చాడు పద్దు కూడా శ్రీను కోసం ఎదురు చూస్తూ ఉంది "సారీ ఇందాక" అని చెప్పాడు దానికి పద్దు నవ్వుతూ "పర్లేదు నేను ఇంకా మీ అమ్మ మనల్ని చూసింది అనుకున్నా" అని చెప్పింది దాంతో శ్రీను కీ అప్పుడు గుర్తుకు వచ్చింది స్వప్న ఇంకా వెనకు రాలేదు అని దాంతో ఫోన్ చేశాడు కానీ ఫోన్ reach అవలేదు అప్పుడే ఒక nurse వచ్చి "సార్ మేడమ్ ఒక postmortem కోసం వెళ్లారు మిమ్మల్ని వెళ్లిపోమని చెప్పారు" అని చెప్పింది దాంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీను.

శ్రీను మొహం లో ఉన్న కంగారు అర్థం అయిన పద్దు, శ్రీను నీ తీసుకొని బయటకు వెళ్లింది ఇద్దరు అడవిలో చాలా దూరం వెళ్లారు అక్కడ ఒక చోటికి వెళ్లాక పద్దు గట్టిగా విజిల్ వేసింది దాంతో ఆ శబ్దం కీ చెట్టల మధ్య ఉన్న సీతాకోకచిలుకలు ఒక్కసారిగా ఎగురుకుంటు వాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి అది చూసి శ్రీను మొహం లో మెల్లగా చిరునవ్వు కనిపించింది దాంతో పద్దు కూడా సంతోషంగా ఫీల్ అయ్యింది ఆ తర్వాత ఇద్దరూ అలాగే అడవిల్లో నడుస్తూ వెళుతున్నారు అప్పుడు శ్రీను, పద్దు వైపు చూసి "చాలా థాంక్స్ పద్దు నా జీవితంలో ఇంత అందమైన దృశ్యం నేను మళ్లీ చూస్తాను అని అనుకోలేదు" అని చెప్పాడు పద్దు కూడా నవ్వుతూ శ్రీను చేతిలో తన చేయి వేసి ఇద్దరు కలిసి వెళ్లుతున్నారు అలా వెళ్లుతున్న వాళ్ళకి ఆ చెట్ల మధ్య ఒక విగ్రహం నీ చూశాడు శ్రీను అది మొత్తం పాచి పట్టి తీగలు అల్లుకొన్ని ఉంది "హే ఏంటి అది" అని పరిగెత్తుతూ వెళ్లి చూశాడు అది చూసి పద్దు "ఇది మా తాత విగ్రహం" అని చెప్పింది ఏంటి అని అని అడిగాడు దానికి పద్దు "మా తాతకి ఒక బంగారు షాప్ ఉంది అప్పట్లో ఉండే vampires మీద యుద్ధం చేశాడు ఆయన వెండి తో కొన్ని ఆయుధాలు చేసి vampires నీ వేటాడే వాడు ఆయన అలా యుద్ధం లో చనిపోయాడు ఆయన తరువాత చాలా మంది vampire ల బలహీనత తెలిసి వాళ్లను హింసించి చంపేవారు దాంతో clementi's చాలా అవస్థలు పడ్డారు అప్పుడు vendatins మొత్తం vampires తరుపున యుద్ధం చేసి vampires నీ కాపాడుకున్నారు " అని చెప్పింది.

అంతా విన్న తర్వాత శ్రీను ఇలా అడిగాడు "ఈ vendatins, clementi's అంటే ఏంటి" అని అడిగాడు దానికి పద్దు "బ్రిటిష్ ప్రభుత్వం టైమ్ లో ఒక డాక్టర్ ఎప్పటికీ యవనం అనేది శాశ్వతంగా ఉండాలని hybridization చేసే జంతువుల పైన ప్రయోగం చేశాడు అప్పుడు ఆ experiment లో జరిగిన ఏదో తప్పు వల్ల అతను ప్రయోగం చేసిన ఒక గబ్బిలం అతని కరిచి చంపింది ఆ తర్వాత ఆ గబ్బిలం లోని vampire విషం ఎవరికి ఎక్కిందో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి ఈ ఊరిలోనే ఉన్నాయి కాకపోతే ప్రస్తుతం ఈ ఊరికి vampires తెగకు రాజులు ఆ శేఖర్, ఆయన తండ్రి కాకపోతే వీలు vampires అని చాలా తక్కువ మందికి తెలుసు వీలు కూడా వాళ్ళని వాళ్లు expose చేసుకోరు జాగ్రత్త పడతారు ఇంక నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే vendatins non veg vampires, clementi's veg vampires, vendatins వీలు వేటాడి వాళ్ల ఎర నీ సాధించి రక్తం తాగుతారు అది మనుషులు అయిన జంతువులు అయిన, clementi's వీలు రక్తం లేకపోయినా ఎన్ని రోజులు అయిన ఉంటారు వాళ్ల ఆలోచనలని ఆవేశం నీ అదుపు లో పెట్టుకుంటారు ఇంక వీలు బ్లడ్ బ్యాంక్ లో నుంచి రక్తం దొంగలించి తాగుతారు వీలు" అని అలా ఆ ఊరిలో vampires చరిత్ర చెప్పింది పద్దు. అలా ఇద్దరు శ్రీను ఇంటికి వచ్చారు అప్పుడు పద్దు కీ bye చెప్పి తన రూమ్ లోకి వెళ్లాడు శ్రీను తన డ్రస్ మార్చుకుంటు కిటికీ నుండి రోడ్డు వైపు చూస్తే తన ఇంటికి కొంచెం దూరంలో శేఖర్ కార్ ఆగి ఉంది తను కిందకి దిగి పద్దు తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అది చూసి శ్రీను కొంచెం భయపడ్డాడు.

వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తూ నిద్రపోయాడు శ్రీను, మరుసటి రోజు ఉదయం కాలేజీ కీ కంగారు గా వెళ్లాడు పద్దు కోసం కానీ తను ఎక్కడ కనిపించలేదు అప్పుడే అనిత వచ్చి తనతో రమ్మని చెప్పి తీసుకొని వెళ్లింది "వచ్చిన వారం రోజుల్లోనే కాలేజీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ నీ లైన్ లో పెట్టావ్ ఆ పిల్ల కూడా ఒక మగాడితో ఇలా తిరగడం ఇప్పటి వరకు చూడలేదు మీ ఇద్దరి మధ్య ఏమీ జరిగిన నాకూ సంబంధం లేదు కాకపోతే మా గురించి నువ్వు బయటకు చెప్పాలి అని చూస్తే నీకు మాట ఇచ్చింది vendatins నేను కాదు" అని warning ఇచ్చింది తరువాత శ్రీను నీ తీసుకోని auditorium కీ వెళ్లింది అక్కడ పద్దు annual sports day కోసం బ్యానర్లు కట్టిస్తూ అందరికీ పనులు చెప్తూ బిజీగా ఉంది తను బాగానే ఉంది అని అర్థం చేసుకోని ఊపిరి పీల్చుకున్నాడు శ్రీను దాంతో అనిత, పద్దు నీ పిలిచి "auditorium కీ కొత్త పేయింట్ వేయడానికి హెల్పర్స్ కావాలని చెప్పావు కదా ఇతని తీసుకో నేను ఇంకా పంపుతా" అని చెప్పి శ్రీను కీ కోపంతో ఒక లుక్ ఇచ్చింది అనిత వెళ్లిన తర్వాత శ్రీను, పద్దు నీ శేఖర్ గురించి అడిగాడు, దానికి పద్దు "ఏమీ లేదు నేను హాస్పిటల్ లో పిల్లల కోసం volunteer గా ఉన్నాను కదా వచ్చే వారం హాస్పిటల్ లో ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి నా మ్యూజిక్ బ్యాండ్ తో చిన్న పిల్లల కోసం ప్రోగ్రాం పెట్టించడం కోసం మాట్లాడుతూ ఉన్నాం" అని చెప్పింది సరే అని శ్రీను గోడలకు పేయింట్ కొడుతూ ఉన్నాడు, అప్పుడే శ్రీ వచ్చి శ్రీను పక్కన గోడకి పేయింట్ వేస్తూ ఉంది ఒక్క సారిగా శ్రీ నీ చూసి షాక్ అయ్యి పేయింట్ డబ్బా కింద వేశాడు శ్రీను అప్పుడు పద్దు ఆవేశం గా వచ్చి "శ్రీ ఏంటి ఇది నీ పని నువ్వు చూసుకో ఎందుకు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావ్" అని అరిచింది దానికి శ్రీ, పద్దు వైపు చూసి "ఏంటి lotus ఈ రోజు నీ మొహం బాగా వెలిగిపోతుంది make up వల్ల నా లేదా రాత్రి నువ్వు నీ బాడి గార్డ్ చేసిన పెదవుల excersie వల్ల నా" అని అడిగింది దానికి పద్దు కీ కోపం వచ్చి శ్రీ నీ లాగి కొట్టింది, దానికి శ్రీ నవ్వుతూ "నీ సీక్రెట్ దాచుకొవడం కోసం నన్ను కొట్టినంత మాత్రానా వాస్తవం మారదు బేబీ" అని చెప్పింది అప్పుడు పద్దు తనని మళ్లీ కొట్టాలి అని చూసింది అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి పద్దు తో వేరే రాష్ట్రాల నుంచి వచ్చే స్టూడెంట్స్ కోసం హోటల్ రూమ్స్ బుక్ చేయడానికి వెళ్లాలి అని తీసుకొని వెళ్లారు.

ఆ తర్వాత శ్రీను, శ్రీ ఇద్దరు మాత్రమే auditorium లో ఉన్నారు దాంతో శ్రీను కొంచెం ధైర్యం తెచ్చుకుని "ఆ రోజు నువ్వు చనిపోలేదా" అని అడిగాడు దానికి శ్రీ నవ్వుతూ తన జాకెట్ విప్పి, వెనకు తిరిగి తన t షర్ట్ విప్పి తన భుజం నుంచి వీపు పైన కాలిన గాయాలు చూపించింది దాంతో శ్రీను, శ్రీదేవి భుజం మీద చేయి చెయ్యి వేసి తాకి చూశాడు మొదటిసారి ఒక మగాడు తన ఒంటి మీద చెయ్యి వేసే సరికి శ్రీదేవి కీ బాడి మొత్తం కరెంట్ పాస్ అయ్యింది దాంతో తల వెనుకు తిప్పి "రా బయటికి వెళ్లదాం" అని అడిగింది దానికి శ్రీను "పిచ్చా నీకు ఇంత పని పెట్టుకుని ఎలా వెళ్లతాం" అని శ్రీను మాట పూర్తి కాకముందే తన మీద వేగంగా తుపాను గాలి వచ్చినట్లు గాలి తగిలింది ఏంటి అని చూస్తే మొత్తం గోడలు అన్నిటికీ పేయింట్ వేసి ఉంది శ్రీను అది చూసి ఆశ్చర్య పోయే లోపే తన చెయ్యి పట్టుకుని మెరుపు వేగంతో లాకుని వెళ్లింది శ్రీ దాంతో శ్రీను కీ కొంచెం తల తిరిగింది అప్పుడు తన ముందు ఉన్న దృశ్యం చూసి కళ్లు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండి పోయాడు ధర్మశాల లోనే అతి పెద్ద కొండ పైన వాళ్లు ఉన్నారు సూర్యుడి కిరణాలు తాకి కింద అడవిలోని చెట్లు మొత్తం ఇంద్రధనుస్సు భూమి మీద వాలినట్టు ఉంది. "శ్రీనివాసుడికి శ్రీదేవి కన్న ఎప్పుడు పద్మావతి దేవి అంటే నే ప్రేమ ఎక్కువ కానీ శ్రీదేవి కీ శ్రీనివాసుడు మాత్రమే ఇష్టం" అని చెప్పింది దానికి శ్రీను నవ్వి శ్రీ నీ కౌగిలించుకున్ని థాంక్స్ చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ అడవి నుంచి వస్తుండగా శ్రీను కీ మెదడులో ఒకటే ఆలోచన అంత పెద్ద కొండను 5 నిమిషాల వేగం లో ఎక్కిన శ్రీ ఆ రోజు రాత్రి తనను పట్టుకోవాలి అనుకుంటే పట్టుకునేది కానీ అలా జరగలేదు అంటే శ్రీ ఎవరినో కాపాడాలని చూసింది ఆ అమ్మాయి మీద దాడి చేసింది శ్రీ కాదు అని అర్థం అయ్యింది శ్రీను కీ అలా ఇద్దరు వస్తుంటే వాళ్ళకి దారిలో ఒక శవం కనిపించింది దాని చూసి శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది ఎందుకంటే అక్కడ పడి ఉన్నది vendatins కీ చెందిన ఒక vampire శవం ఆ చనిపోయిన మనిషి ఎవరో కాదు శ్రీ తమ్ముడూ ఆది.

ఆది చనిపోయి శవంలా పడి ఉండటం చూసిన శ్రీదేవి గట్టిగా అరుస్తూ వెళ్లి ఆది మీద పడి ఏడ్వడం మొదలు పెట్టింది తనని ఓదార్చాడు కానీ శ్రీదేవి ఆవేశం గా తన గోళ్లతో పక్కన ఉన్న చెట్టు కొడితే అది ముక్కలు అయ్యింది, అప్పుడు అక్కడ ఆది గర్ల్ ఫ్రెండ్ నిషా కూడా ఉంది వెళ్లి తనని చూసింది శ్రీదేవి చూస్తే తనకు రక్తం ఇస్తే బ్రతుకుతుంది అని తన తమ్ముడి శవం నీ నిషా నీ ఇద్దరిని తీసుకొని మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది శ్రీను కాలేజీ కీ వెళ్లి పద్దు నీ కలిశాడు జరిగింది అంతా చెప్పాడు దాంతో పద్దు కంగారుగా స్టూడెంట్స్ వైపు చూసింది వెంటనే dean రూమ్ కి వెళ్ళి "మేడమ్ urgent గా holiday declare చేయండి code red" అని చెప్పింది దాంతో అనిత వెంటనే తన రూమ్ లో ఉన్న మైకు ద్వారా సెలవు ప్రకటించింది దాంతో స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్లారు అప్పుడు పద్దు శ్రీను తో "శ్రీను ఇంటి నుంచి బయటికి రాకు ఏదైనా వెండి వస్తువు ఉంటే అది నీ పక్కన పెట్టుకో నీ జాగ్రత్త కోసమే" అని చెప్పి స్టూడెంట్స్ నీ ఇంటికి పంపే పనిలో ఉంది పద్దు.

శేఖర్ ఇంట్లో తన మేనల్లుడు అలా శవం గా పడి ఉండటం చూసి తట్టుకోలేక పోయాడు "ఈ ఊరిలో మన కుటుంబం మీద చెయ్యి వేసి దమ్ము ఎవరికి వచ్చింది" అని కోపంగా తన పిడికిలి బిగించి పక్కన ఉన్న స్తంభాని కోడితే అది ముక్కలు అయ్యింది అప్పుడు శేఖర్ వాళ్ల నాన్న రామ్మోహన్ "శేఖర్ ఆవేశం అణిచి పెట్టు దాని ఎప్పుడు వాడాలో తెలుసుకో మన శత్రువులు ఎవరో గుర్తించు" అని చెప్పాడు దానికి పద్దు "ఆ ఎస్పి ఠాకూర్ తమ్ముడూ బచ్చు తో నాకూ పెళ్లి cancel అయినప్పుడు ఆది కీ బచ్చు కీ గొడవ జరిగింది అప్పుడు ఆది నీ చంపుతా అన్నాడు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది అది చూసిన రామ్మోహన్ "ఈ శవం తో ఇంకా కొన్ని శవాలు తోడు వెళ్లే లాగా ఉన్నాయి శేఖర్ ఆది నీ హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళండి శేఖర్ వెళ్లి శ్రీ నీ తీసుకోని రా" అని చెప్పాడు శేఖర్ వెళ్లే సరికి అక్కడ ఒక పది మంది చనిపోయి పడి ఉన్నారు బచ్చు తో గొడవ పడుతున్న శ్రీ కంటే బలంగా ఉండటం తో తన గోళ్లతో కొట్టడానికి చెయ్యి పైకి లేపాడు, ఆ గాలిలో లేచిన చెయ్యి శ్రీ నీ తాకే లోపు శేఖర్ వెళ్లి బచ్చు చెయ్యి పట్టుకుని ఎత్తి అవతల వేశాడు "నీకు సమానమైన వారితో తలబడు అని బచ్చు కాలు పట్టుకుని ఎత్తి పడేశాడు తరువాత శ్రీ నీ లేపి ఇంటికి వెళ్లమని చెప్పాడు ఆ తర్వాత బచ్చు పీక పట్టుకుని తన పంజా దెబ్బ తో చంపాలీ అని చెయ్యి ఎత్తాడు శేఖర్, అప్పుడే ఠాకూర్ వచ్చి శేఖర్ నీ పక్కకు తోశాడు దాంతో శేఖర్ తన కోర పళ్ల తో ఠాకూర్ వైపు చూసి గర్జించాడు దానికి ఠాకూర్ కూడా తన కొర పళ్ల తో గర్జించాడు "చూడు శేఖర్ నా తమ్ముడి కీ నీ అల్లుడు కీ గొడవలు ఉండొచ్చు కానీ వాడు కాదు నీ అల్లుడు నీ చంపింది నెల రోజులు టైమ్ ఇవ్వు వాడు ఎవడో కనిపెట్టి తేస్తా లేదు అంటే నా తల నరికి నీ చేతిలో పెడతా" అని చెప్పాడు ఠాకూర్ దానికి శేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

హాస్పిటల్ లో ఆది శవం నీ postmortem చేయడానికి స్వప్న వెళ్ళుతుంటే శేఖర్ వెళ్లాడు తన తరువాత vedantis నీ పరిపాలించే అవకాశం ఇవ్వాలి అని కళ్లలు కన్నాడు శేఖర్ కానీ ఇలా తన చేత్తో తానే తన మేనల్లుడు కీ postmortem చేస్తా అని అనుకోలేదు అప్పుడు శేఖర్ కీ ఆది ఒంటి మీద ఒక పంజా గుర్తు ఉంది కాకపోతే అది vampire పంజా గుర్తు కాదు కాకపోతే ఆది చనిపోయింది మాత్రం vampire చేతిలోనే నిషా లేస్తే కానీ జరిగింది ఏంటో ఎవరికి తెలియదు, బయటికి వచ్చి రిపోర్ట్ రెడీ చేయించాడు వేట కీ వెళ్లిన ఆది పైన ఒక అడవి జంతువు దాడి చేసి వాడిని చంపింది అని రిపోర్ట్ లో రాప్పించి కేసు investigation close చేశారు కానీ ఠాకూర్ మాత్రం తన తమ్ముడి ప్రాణం కోసం అసలు నిజం వెతికే ప్రయత్నంలో ఉన్నాడు, అలా ఉండగా స్వప్న కూడా ఆది కేసు నీ ప్రైవేట్ గా investigate చేస్తుంది అప్పుడు తన ముందు కేసు కీ ఈ కేసు కూడా ఒకేలా ఉన్నాయి దాంతో తనకి కొత్త అనుమానాలు మొదలయ్యాయి, ఇది చూసిన శ్రీను భయం తో వాళ్ల అమ్మ ను divert చేయడానికి "అమ్మ ఇది జంతువుల ఎటాక్ వల్ల జరిగింది అని సీనియర్ డాక్టర్లు చెప్పారు కదా ఇంకా ఎందుకు ఆలోచిస్తూన్నావు" అని అడిగాడు, "ఈ ఫోటోలు చూస్తే అలాగే ఉన్నాయి కాకపోతే నా మనసు ఎందుకో ఎక్కడో తప్పు జరుగుతోంది అని చెప్తుంది అందుకే నాకూ నేను గా ఈ కేసు లో ఒక నిర్ణయానికి వచ్చే వరకు ఎవరూ చెప్పిన విన్న దల్చుకోలేదు " అని చెప్పింది స్వప్న దానికి శ్రీను కీ అప్పటికి అప్పుడు తనకు నిజం చెప్పాలి అని చూశాడు కానీ లోపల ఉన్న భయం వల్ల తను ఏమీ చెప్పలేక పోయాడు మరుసటి రోజు ఉదయం కాలేజీ క్యాంటిన్ లో పద్దు తో ఈ విషయాన్ని చెప్పి బాధ తో తల పట్టుకుని ఉన్నాడు శ్రీను, శ్రీను బాధ నీ చూసి పద్దు తన చెయ్యి శ్రీను భుజం మీద వేసి నిమ్మురుతు ఉంది "మనం ఇద్దరం అక్కడికి వెళ్లి వెతుకుదాం ఏదైనా క్లూ మీ అమ్మ నీ తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేయవచ్చు" అని చెప్పింది పద్దు శ్రీను కూడా సరే అని తల ఊపాడు.

నిషా నీ లేపాలి అని శేఖర్ ఒక పులి నీ తెచ్చి దాని వెచ్చని రక్తంతో నిషా నీ లేపాలి అని ఒక vampire సంప్రదాయ పూజ చేయడం మొదలు పెట్టాడు ఆ పూజ జరిగే సమయంలో రక్త సంబంధికులు అంతా కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉండాలి ఎవరూ కదిలిన యాగం చెడిపోతుంది దాంతో అందరూ నిష్ఠగా చేయాలి, అదే సమయంలో శ్రీను, పద్దు ఇద్దరు కలిసి ఆది చనిపోయిన చోటు దగ్గరికి వెళ్లి వెతకడం మొదలు పెట్టారు అప్పుడు పద్దు కీ అక్కడ కొన్ని వెంట్రుకలు దొరికాయి దాని శ్రీను కీ తీయకుండా దాచి పెట్టింది, తరువాత శ్రీను వైపు తిరిగి ఏమీ దొరకలేదు అని చెప్పింది అప్పుడు ఇద్దరు తిరిగి వెళ్లాలి అని చూస్తే ముగ్గురు vendatins వాళ్ళని ఆపారు "ఏంటి lotus నీ కొత్త బాడీ గార్డ్ తో అడవిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నావా మాలో లేనిది ఏమీ ఉంది వీడి దగ్గర గట్టిగా చూస్తే ఒంటి మీద kg కండ కూడా లేదు" అని అన్నాడు దానికి శ్రీను "కండలు కంటే కొంచెం extra పొడవు ఉంది లే" అని అన్నాడు దాంతో వాళ్లు శ్రీను నీ కొట్టడం మొదలు పెట్టారు దాంతో ఇది telepathy ద్వారా చూసిన శ్రీ వెంటనే అక్కడికి వెళ్లింది, శ్రీను నీ కొట్టిన వాడి పీక పట్టుకుని చెట్టుకు అణిచి గట్టిగా గర్జించింది దాంతో మిగిలిన ఇద్దరు silent అయ్యారు పద్దు వైపు చూసి వెళ్లిపోండి అని సైగ చేసింది దాంతో పద్దు శ్రీను నీ తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయింది, "ఇంకోసారి శ్రీను నీ ఇబ్బంది పెడితే చస్తారు" అని చెప్పింది శ్రీ దాంతో ఆ ముగ్గురికి ego దెబ్బతిన్నింది, తన వల్ల యాగం పాడు అయ్యింది అని శేఖర్, శ్రీ మీద కోపడాడు దాంతో ఆ యాగం మళ్లీ ఒక పదైదు రోజుల తరువాత చెయ్యాలి అని చెప్పాడు.

ఆ తర్వాత ఒక వారం రోజుల తరువాత కాలేజీ లో annual sports meet మొదలు అయ్యింది అని రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ వచ్చారు మొదటి రోజు కల్చరల్ events పెట్టారు అందులో పద్దు, శ్రీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు అది చాలా మంది కీ ఆశ్చర్యం వేసింది కాకపోతే దీని వెనుక శ్రీను ప్లాన్ ఉంది, బయటి కాలేజీ స్టూడెంట్స్ ముందు వాళ్ల కాలేజీ విద్యార్థులు గొడవ పడుతూ ఉంటే బాగోదు అందుకే ఇద్దరు కలిసికట్టుగా ఉన్నారు అని నమ్మిస్తే స్పోర్ట్స్ మీట్ అయ్యే వరకు ఆర్ట్స్, సైన్స్ స్టూడెంట్స్ కలిసి ఉంటారు అని చెప్పాడు దానికి ఇద్దరు ఒప్పుకున్నారు, వాళ్ల performance తరువాత శ్రీను వెళ్లి శ్రీ నీ కలిసి "నిను కలిసి మాట్లాడి చాలా రోజులు అయ్యింది నాకూ తెలుసు ఇంట్లో ఒకరిని కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో అయిన ఆది నీ చంపింది ఎవరో ఎమైన తెలిసిందా" అని అడిగాడు, దానికి శ్రీ లేదు అని తల ఆడించింది "కానీ అది ఎవరో తెలిసిన రోజు వాళ్ల చావు చాలా క్రూరంగా ఉంటుంది" అని చెప్పి వెళ్లింది ఆ తర్వాత శ్రీను నీ ఆ రోజు అడవిలో ఎటాక్ చేసిన ముగ్గురు శ్రీను నీ ఎత్తుకొని వెళ్లి తన ఫోన్ తో పద్దు కీ auditorium లోకి రమ్మని మెసేజ్ చేశారు అలా శ్రీను నీ తీసుకోని వెళ్లి auditorium లోకి వెళ్ళిన తర్వాత పద్దు కూడా వచ్చింది అప్పుడు వాళ్ళు ఒక blade తో శ్రీను బొటన వేలు కోసి రక్తం చుక్కలు Floor మీద వేశారు ఆ రక్తం వాసనకు పద్దు పిచ్చి పట్టినట్టు అరుస్తూ తల పట్టుకుని అరుస్తూ ఉంది శ్రీను వాళ్ళని విడిపించుకొని పద్దు దగ్గరికి వెళ్ళాడు, అప్పుడు శ్రీను, పద్దు భుజం మీద చేయి వేయగానే పద్దు తల వెనుకు తిప్పి గట్టిగా గర్జించింది అప్పుడు చూశాడు శ్రీను, పద్దు మొహం కోరల పళ్లు, నీలి రంగు కనుగుడ్డు అది చూసి భయపడి వెనకు జరిగాడు ఇంతకు ముందు శ్రీ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది శ్రీను కీ "నీ రహాస్యం బయటికి రాకుండా బాగానే కవర్ చేస్తూన్నావ్" అని శ్రీ, పద్దు తో అన్న మాట గుర్తుకు వచ్చింది, దాని అర్థం ఇప్పుడు తెలిసింది శ్రీను కీ పద్దు కూడా ఒక vampire అని.

పద్దు నీ vampire గా చూసిన శ్రీను భయపడ్డాడు శ్రీను కీ పద్దు చేతిలో తన చావు confirm అని అనుకున్నాడు కానీ శ్రీను మీదకు వచ్చిన పద్దు తనను గుర్తు పట్టి "శ్రీను నేను నిన్ను" అని తన చేతికి వచ్చిన గోళ్లు చూసుకుని తన మొహం తాకుతూ ఎప్పటికీ శ్రీను కీ తన ఈ రూపం కనిపించకుడదు అని ఆశ పడిందో అదే రూపంలో ఇప్పుడు తనను శ్రీను చూసే సరికి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చింది దాంతో పాటు తన అసలు రూపం శ్రీను కీ తెలిసేలా చేసిన వాళ్లను అక్కడికి అక్కడే చంపింది పద్దు కానీ శ్రీను రక్తం వాసన చూసి వెర్రి తలకు ఎక్కి శ్రీను నీ కొరకడానికి వచ్చింది అప్పుడే అనిత వచ్చి ఒక locket నీ శ్రీను కీ విసిరింది ఆ locket నీ పగలగొట్టు అని చెప్పింది అనిత దాంతో శ్రీను ఆ locket నీ నెలకు విసిరి కొట్టాడు దాంతో ఆ locket పగిలి ఒక కాంతి వచ్చింది ఆ కాంతి కీ పద్దు కళ్లు తిరిగి పడిపోయింది, ఆ వెంటనే శ్రీ వెనక నుంచి వచ్చి శ్రీను నీ స్పృహ కోల్పోయేలా చేసింది ఆ తర్వాత అనిత శ్రీ నీ కూడా కొట్టి ముగ్గురు నీ తీసుకోని వెళ్లింది శ్రీను కళ్లు తెరిచే సరికి శ్రీ, పద్దు నీ గొలుసులతో కట్టేసి ఉంచారు అప్పుడు పద్దు చేతిలో బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చిన ఒక బ్లడ్ ప్యాక్ నీ చూశాడు పద్దు అలాంటివి అప్పటికే నాలుగు ఖాళీ చేసింది "ఏంటి లవర్ బాయ్ నీ లవర్ నీ ఇలా రక్తం తాగడం చూసి షాక్ లో ఉన్నావా" అని అడిగింది శ్రీ, దానికి శ్రీను మౌనంగా ఉన్నాడు పద్దు తన మొహం దాచుకొనీ ఉంది ఏమీ మాట్లాడటం లేదు అప్పుడు శ్రీ, శ్రీను దగ్గరికి జరిగి "నువ్వు లవ్ చేసిన అమ్మాయి నిన్ను లవ్ చేస్తున్న అమ్మాయి ఇద్దరు vampires అనే సరికి పాపం భయం తో షాక్ లో ఉన్నట్లు ఉన్నావ్ అందుకే నీ ఈ షాక్ కీ ఒక మందు ఉంది" అని చెప్పి శ్రీను ఒడిలో కూర్చుని శ్రీను షర్ట్ పట్టుకుని దగ్గరికీ లాగి ముద్దు పెట్టింది దానికి శ్రీను, శ్రీను నడుము పట్టుకుని లేపి గోడకి ఆనించి శ్రీ ఎడమ కాలు తన నడుము చుట్టూ వేసుకుని, శ్రీ మెడ చుట్టూ చెయ్యి వేసి తన పంటి తో శ్రీ పెదవి లాగి తన రెండు పెదవుల మధ్య పెట్టి జురుతున్నాడు, మొదటిసారిగా ఒక మగాడు అది కూడా ఒక మనిషి తనను అనుభవిస్తున్నాడు అనే ఊహ లో శ్రీ ఇంకా మత్తుగా శ్రీను కీ లొంగి పోయి ములుగుతు ఉంది తన పెదవి జుర్రుతు ఉన్న శ్రీను, శ్రీ మెడ నీ గట్టిగా పిసకడం మొదలు పెట్టాడు దానికి శ్రీ కొంచెం నొప్పిగా ఫీల్ అయ్యి శ్రీను నీ వెనకు తోసి గట్టిగా దగ్గుతు శ్రీను గొంతు పట్టుకొని "నువ్వు పిల్లి పిల్ల వీ అని అనుకున్నా but you are wild as lion I like it" అని చెప్పి మళ్ళీ శ్రీను కీ ముద్దు పెట్టింది, అప్పుడు అనిత వచ్చి "మీ పని అయితే వెళ్లదాం" అనింది.

పద్దు, శ్రీను చూపు నుంచి దూరంగా ఉంది ధర్మాసనం ముందు ముగ్గురిని మోకాలి పైన నిలబెట్టారు దాంతో రామ్మోహన్ "పద్మావతి ఎందుకు వాళ్ళని చంపావు" అని అడిగాడు, దానికి పద్దు "పెద్దయ్య నేను రెండు నెలల నుంచి రక్తం కీ దూరంగా ఉన్నాను, నాలో ఉన్న దాహం నీ అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు కావాలి అని శ్రీను రక్తం వాసన చూపి నను రెచ్చగొట్టారు ఆ మైకం లో ఏమీ చేశానో నాకే తెలియదు నన్ను క్షమించండి మీరు మరణ శిక్ష వేసిన నేను సిద్ధంగా ఉన్నాను" అని చెప్పింది దానికి శ్రీను "లేదు తనని ఏమీ చేయకండి అది అంత పధకం ప్రకారం జరిగిన తప్పు దాంట్లో పద్దు కీ ఏమీ సంబంధం లేదు ఆలోచించండి" అని చెప్పాడు దాంతో రామ్మోహన్ "చూస్తుంటే నువ్వు ఆ అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నట్టు ఉన్నావ్ సరే నీ కోరిక మేరకు తనను వదిలేస్తా కానీ నీ సంగతి ఏంటి నీకు ఇచ్చిన అవకాశం నువ్వు సరిగ్గా వినియోగించుకోలేదు మీ అమ్మ ఇంకా ఆ కేసు దర్యాప్తు వదలలేదు కాబట్టి మీ అమ్మను చంపడం తప్ప మాకు వేరే దారి లేదు" అని అన్నాడు దానికి శ్రీ "తాత మాకు ఒక ఇంకో అవకాశం ఇవ్వు మేము ముగ్గురం కలిసి స్వప్న ఆంటీ నీ దారి మళ్లీస్తాము మమ్మల్ని నమ్ము" అని అడిగింది దాంతో మిగిలిన సభ్యుల వైపు చూశారు అప్పుడు అనిత "మీరు ఇప్పటికే వీడికి చాలా అవకాశాలు ఇచ్చారు ఇంకో అవకాశం ఇచ్చి తప్పు చేయకండి పెద్దయ్య" అని చెప్పింది, "నేను కూడా అలా అనుకోని ఉంటే నువ్వు ఈ కౌన్సిల్ లో మెంబర్ అయ్యే దానివా అసలు ప్రాణాలతో ఉండే దానివా" అని అడిగాడు రామ్మోహన్ ఇంకో చివరి అవకాశం ఇచ్చి శ్రీను, శ్రీ, పద్దు నీ వదిలేశారు అలా ముగ్గురు బయటికి వచ్చారు అప్పుడు శ్రీను, పద్దు నీ పిలిచే లోపు పద్దు వేగంగా పరిగెత్తుతూ వెళ్లిపోయింది అది చూసి శ్రీను, శ్రీ వైపు చూశాడు దానికి శ్రీ "పాపం నువ్వు తనని ఎలా అయితే చూడకుడదు అని ఆశ పడిందో నువ్వు అలా చూసేసరికి బాధ పడుతుంది నిజం చెప్పాలి అంటే నాకూ నీ మీద ఉన్నది ప్రేమో, మొహమొ తెలియదు కానీ తనకి మాత్రం తన ఒంటరి జీవితం లో మొదటి సారిగా తనకు ప్రేమ పంచిన ఒకే ఒక్క వ్యక్తి నువ్వు కాబట్టి ఇక నుంచి నువ్వు కూడా ఉండవు అని భయం తో తను వెళ్లిపోయింది" అని చెప్పి శ్రీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

దాంతో ఆలోచిస్తూ ఇంటికి వెళ్లిన శ్రీను నీ స్వప్న ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని కోపంగా తీడుతు ఉంది కానీ అది ఏమీ పట్టించుకోకుండా శ్రీను దిగులుగా వెళ్లి dining table మీద ఉన్న భోజనం పెట్టుకోని తింటూ ఉన్నాడు అలా శ్రీను నీ చూసిన స్వప్న "నీకు పద్దు కీ ఏమైనా గొడవ జరిగిందా" అని అడిగింది దానికి శ్రీను "ఎలా కనిపెట్టావు" అని అడిగాడు దానికి స్వప్న నవ్వుతూ "నాది కూడా లవ్ మ్యారేజ్ రా నా కొడక సరే మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని అడగను కానీ ఒకటి గుర్తు పెట్టుకో ప్రేమలో నువ్వు ఓపెన్ గా లేనంత వరకు ఆ అమ్మాయి కూడా నీతో ఓపెన్ గా ఉండదు ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడింది నీ దగ్గర తను ఏది దాచాలి అని అనుకోదు కానీ ఒక వేళ ఏదైనా దాచింది అంటే ఆ రహస్యం వల్ల నువ్వు ఎక్కడ దూరం అవుతావు అనే భయం తోనే ఒక వెళ్ల ఆ భయం దాటే ధైర్యం నువ్వు కనుక తనకి ఇస్తే ఇంక తను ఎప్పటికీ నీ చెయ్యి వదలదు" అని చెప్పింది దాంతో శ్రీను నిద్రపోతూ ఆలోచిస్తూ ఉన్నాడు మొదటి రోజు నుంచి తనకు, పద్దు మధ్య జరిగిన సంఘటనలు అన్ని గుర్తు చేసుకున్నాడు దాంతో ఇంత తక్కువ సమయంలో వాళ్లు అంత లోతు ప్రేమలో ఎలా పడ్డాము అని ఆలోచిస్తూ ఉన్నాడు.

మరుసటి రోజు ఉదయం కాలేజీ కీ వెళ్లాడు కానీ ఎక్కడా పద్దు కనిపించలేదు తన ఫ్రెండ్స్ నీ అడిగితే తెలియదు అన్నారు, అప్పుడు గుర్తుకు వచ్చింది శ్రీను కీ వెంటనే అక్కడికి వెళ్లాడు అడవిల్లో ఉన్న తన తాత విగ్రహం దగ్గర కూర్చుని "వాడు అంటే ఇష్టం ఉంది కాబట్టే కదా నిజం దాచ్చాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి వాడు నను accept చేస్తాడా చెప్పు తాత" అంటూ విగ్రహం తో మాట్లాడుతూ ఉంది దానికి శ్రీను నవ్వుతూ "చెప్పాల్సిన నాతో కాకుండా మీ తాత తో చెబితే నాకూ ఎలా తెలుస్తుంది" అని అన్నాడు దాంతో పద్దు భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి చూసింది కానీ అక్కడి నుంచి వెళ్లకుండా తనను ఏదో శక్తి ఆపుతు ఉంది అప్పుడు శ్రీను తన చేతిలో ఉన్న ఒక డబ్బా చూపించాడు "ఎల్లిపాయ పొడి vampire's ఉన్న చోట ఈ పొడి వేస్తే అవి ఎక్కడికి కదలవు రాత్రి నీ స్పీడ్ చూశాక నాకూ నిన్ను పట్టుకునే అంత సత్తా లేదు అమ్మ తల్లి" అని చెప్పి ఒక దండం పెట్టాడు దానికి పద్దు నవ్వింది కానీ కోపం లో vampire లాగా మారి శ్రీను మీద గర్జించింది కానీ శ్రీను, పద్దు నీ మీదకు లాగి తను vampire గా ఉన్నప్పుడే తనకి పెదవి మీద ముద్దు పెట్టి తన నడుము కు రెండు వైపులా చేతులు పెట్టి పిసికాడు దాంతో పద్దు పూర్తిగా శ్రీను ఒడిలో ఒదిగిపోయింది అలా ఇద్దరు వాళ్ల పెదవి తో నాలుక తో గొడవ పడ్డారు ఆ తర్వాత పద్దు వెనకు జరిగి "నిజంగా నేను అంటే అంత ఇష్టమా" అని అడిగింది దానికి శ్రీను "నువ్వు vampire గా మారిన కూడా భయపడకుండా నిన్ను ఇంత ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నా అప్పుడే అర్థం కాలేదా" అని అడిగాడు అప్పుడు పద్దు శ్రీను నీ గట్టిగా కౌగిలించుకున్ని తన గుండెల్లో ఇన్ని సంవత్సరాలు గా ఉన్న బాధ మొత్తం బయటికి కార్చింది, ఆ తర్వాత ఇద్దరూ అక్కడ కూర్చుని ఉన్నారు అప్పుడు పద్దు, శ్రీను భుజం మీద తల వాల్చి తన గతం గురించి చెప్పడం మొదలు పెట్టింది "అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు తాత చనిపోయి అప్పటికే 15 సంవత్సరాలు అయ్యింది ఆయన తరువాత మా నాన్న vampires నీ వేటాడం మొదలు పెట్టారు, కాకపోతే తాత లేకపోవడంతో ఆయన సైన్యం లో వాళ్లు కొంతమంది అమాయకపు vampires నీ కూడా చిత్రవాధ చేశారు అది చూడలేక నాన్న వాళ్లను సైన్యం నుంచి బయటకు పంపాడు దాంతో వాళ్లు vampires నీ చిత్రవాధ చేస్తున్నాడు అని vampires కీ చెప్పడంతో ఒక రోజు నేను నాన్న ఇలా అడవిలో తాత విగ్రహం దగ్గర పూజ చేయడానికి వస్తే వాళ్లు ముందే పధకం ప్రకారం వాళ్లు చెట్టు పైన ఉండి నాన్న పైన ఎటాక్ చేశారు అప్పుడు శేఖర్, కీ మా నాన్న కీ పెద్ద యుద్ధం జరిగింది అప్పుడు ఠాకూర్ వెనుక నుంచి వచ్చి నాన్న నీ పట్టుకున్నాడు అప్పుడు శేఖర్ మా నాన్న మెడ తిప్పి చంపేశాడు" అని కన్నీరు పెడుతూ చెప్పడం మొదలు పెట్టింది పద్దు "ఆ తర్వాత నను ధర్మాసనం దగ్గరికి తీసుకోని వెళ్లారు అప్పుడు పెద్దయ్య ఒక vampire hunter కుటుంబానికి చెందిన ఈ పిల్ల నీ vampire గా మారిస్తే వాళ్ల కుటుంబాన్నికి ఎప్పటికీ ఒక మారని మచ్చ గా మిగిలిపోతుంది మన పగ కూడా తీరుతుంది అని చెప్పి తన భర్త మా నాన్న చేతిలో చనిపోవడంతో అనిత ఆ కోపంతో నను కొరికి నాలో vampire విషం నింపింది దాంతో నేను ఒక vampire గా మారిపోయా కాకపోతే నాకూ అన్నిటికంటే కష్టం అయిన పని నిన్ను spy చేయడం నువ్వు శ్రీ నీ చూసిన తర్వాత శేఖర్ నను నీ మీద కన్ను వేయమని చెప్పాడు నేను అప్పటికే నువ్వు అంటే ఇష్టపడా కానీ ఇలా ప్రేమలో పడతా అనుకోలేదు" అని తన గతం మొత్తం చెప్పింది పద్దు దానికి శ్రీను, పద్దు తల నీ తన ఆరిచేతిలో పట్టుకొని నుదుటి పైన ముద్దు పెట్టాడు దాంతో పద్దు కూడా శ్రీను నీ గట్టిగా కౌగిలించుకుంది ఇది అంత దూరం నుంచి చూస్తున్న శ్రీ లోపల బాధ పడుతున్న ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయింది.​
Next page: Update 03
Previous page: Update 01
Next article in the series 'పున్నమి': పున్నమి 3 [Completed]