Update 02

(గడ్డివేముల కర్నూల్ నుంచి 25 కిమ్ దూరం)

ఆ ఊరి సర్పంచ్ రాములు రెడ్డి ఇంటి చుట్టూ జనం పోగు అయ్యారు ఆ ఊరి చివర ఉన్న ఒక అర ఎకరం భూమి నీ ఒక ముసలి రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అతని స్థలం పక్కనే ఉన్న పోరంబోకు భూమి నీ గవర్నమెంట్ భూమి కింద పట్టాలు తయారు చేసి దాని స్వాధీనం చేసుకున్నాడు యాదవ్ అనే ఆ ఊరి లోని రౌడీ వాడు ఆ పోరంబోకు భూమి నుంచి హద్దులు నీ రోజు రోజుకు జరుపుకుంటు వచ్చి మొత్తం భూమి నాది నువ్వు నాకూ అమ్మేసావు కదా అని ఆ ముసలాయన నీ కొట్టి తరిమేసాడు దాంతో ఆ పెద్దాయన పంచాయతీ నీ ఆశ్రయించాడు కానీ ఊరు మొత్తం కీ తెలిసిన విషయం యాదవ్ రెడ్డి మనిషీ అని యాదవ్ ఏమీ చేసిన వెనుక రెడ్డి హస్తం ఉంటుంది అయిన కూడా పిచ్చి జనం రెడ్డి చెప్పిందే వింటారు, రాములురెడ్డి తన ఇంటి వరండా లో కుర్చీ వేసుకొని సిగరెట్ కాలుస్తూ ఏంటి విషయం అన్నట్టు సైగ చేశాడు దాంతో యాదవ్ "అది కాదు రెడ్డి ఈ పెద్దయ్య బ్యాంక్ లో లోన్ ఉండా అప్ప, అప్పు తీర్చాలా నను ఆదుకో అప్ప అని తన ఆర ఎకరం రాసిచినాడు ఇప్పుడు ఏమో యాలా రాసిచినా అంటానాడు నువ్వే న్యాయం చెప్పాలా" అన్నాడు, దానికి "ఏం పెద్దయ్య ఎంది కథ పోనీలే అని కష్టం లో ఆదుకునేందుకు ఆడు వస్తే ఇట మోసం చేస్తే ఏటా పైగా ఈ ఊరి లో యా గడపకు కటం వచ్చిన ముందు ఉండే యాదవ్ ఆటాంటోడి మీద పంచాయతీ ఎంది అప్ప " అని ఆ ముసలాయన దే తప్పు అన్నట్టు మాట్లాడి "అయిన స్థలం అమ్మినాక పట్టాలు ఉంటాయి కదా లే, యాదవ సూపి లే " అన్నాడు రాములురెడ్డి దాంతో యాదవ్ బలవంతంగా ఆ ఊరి బ్యాంక్ మేనేజర్ నీ పిలిపించి అందులో ఆ ముసలాయన వేసిన వేలి ముద్రలు చూపించి అవి లోన్ మొత్తం యాదవ్ క్లియర్ చేసినందుకు అవి యాదవ్ పేరు మీదకు మారాయి అని చూపించాడు, కానీ నిజం ఏమిటి అంటే బ్యాంక్ లో ఆ ముసలాయన తో కొన్ని తెల్ల కాగితం లో వేలి ముద్రలు వేయించి వాటిని మీ సేవ లో రిజిస్టర్ డాక్యుమెంట్ గా మార్పించారు అందుకు బ్యాంక్ మేనేజర్ నీ బలవంతంగా వాడుకున్నారు, "సరే పెద్దయ్య ఏదో తాగేసి డబ్బులు ఖర్చు చేసి ఉండావు ఇదిగో ఈ లేక ఉంచుకో" అని నాలుగు లక్షల స్థలం కీ పదివేలు ఇచ్చి నిర్దాక్షిణ్యం గా ఆ భూమి నీ లాకున్నారు.

ఆ మరుసటి రోజు ఉదయం బ్యాంక్ మేనేజర్ ఆఫీసు కీ వెళుతుంటే దారిలో ఆ ముసలాయన పొలం లో జనాలు కనిపిస్తే వెళ్లి చూశాడు ఆ పెద్దాయన తన పొలం లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అది చూసి చలించి పోయిన మేనేజర్ వెంటనే రెడ్డి ఇంటికి బయలుదేరాడు, అప్పుడే తన ఉంపుడుకత్తె అయిన నూర్ తో బెడ్ రూమ్ లో ఉన్న రెడ్డికి యాదవ్ ఫోన్ చేసాడు "రెడ్డి బెంగళూరు పార్టీ మనం చెప్పిన రేటుకు రావడం లేదు ఏమీ చేయాలా" అని అడిగాడు, దానికి కోపం వచ్చిన రెడ్డి "మెట్టు తోనే కోడత నా కోండే గా యా నా కొడుకు చెప్పుండాడు నీకు స్థలం అమ్మమని రెండు రోజులు ఆగు నేను చెప్తా" అని ఫోన్ పెట్టేసాడు అప్పుడే వచ్చిన మేనేజర్ గట్టిగా రెడ్డి అని అరిచాడు దాంతో బయటకు వచ్చిన రెడ్డి "ఏమైనాది అప్ప ఆటా కేక లేస్తాంటివి" అని సోఫా లో కూర్చుంటు అడిగాడు, "సోలార్ పవర్ ఫ్యాక్టరీ వాళ్లు రోడ్డు వేసేదానికి ముందే పొల్లాలు కొని రోడ్డు పనులు మొదలు పెట్టాలని ఉంటే ఆ దారి మలుపు లో ఈ పెద్దాయన పొలం ఉంది అని కంపెనీ వాడు ముంబాయి వాడు నీకు వాట ఇవ్వడు అని ఈ స్థలం లాకుని దాని వాడికి దారి వేసే తప్పుడు అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఆలోచిస్తున్నావు అని నాకూ తెలుసు, ఈ డాక్యుమెంట్స్ మీద రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ల స్టాంప్ లేదు ఇది కోర్టు లో ఇస్తే చాలు నువ్వు జైలుకు పోతావు" అని చెప్పి వెనకు తిరగగానే తన ముందు ఉన్న టేబుల్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ తీసుకోని మేనేజర్ గొంతుకు బిగించి చంపేసాడు.

మరుసటి రోజు ఉదయం సోలార్ ఫ్యాక్టరీ వాచ్ మ్యాన్ సోలార్ ప్లాంట్ గ్రౌండ్లో చెక్ చేయడానికి వెళ్లి తలుపులు తీస్తే మేనేజర్ శవం అక్కడ JCB bulldozer కీ ఉరి వేసి ఉంది దాంతో భయపడి ఓనర్ కీ ఫోన్ చేసే లోపే సెక్యూరిటీ అధికారి లు జనాలు వచ్చారు, ఆ తర్వాత ఫ్యాక్టరీ ఓనర్స్ కూడా వచ్చారు అప్పుడే రాములురెడ్డి కూడా వచ్చాడు రాగానే యాదవ్ ఓనర్స్ నీ సైడ్ కీ తీసుకుని వెళ్లి కేసు కాకుండా చుసుకుంటాం ఒక 80 కోట్లు ఇచ్చి సెటిల్ చేస్తాం అని చెప్పాడు దాంతో వాళ్లు వేరే మాట లేకుండా డబ్బు సెటిల్ చేశారు తరువాత కార్ లో కూర్చున్నాక "ఏంది రెడ్డి ఆ మేనేజర్ గాడి శవం నీ నాకూ చెప్పి ఉంటే వెలుగోడు రిజర్వాయర్ లో పడేసి మాయం చేసి ఉండేటోడిని ఈడ ఎందుకు" అని అడిగాడు యాదవ్ దానికి రెడ్డి "ఆ పొలం మనం మహా అయితే 50 లచ్చలకు అమ్మగలం అదే ఇప్పుడు ఇంకో మాట లేకుండా 80 కోట్లు వచ్చుండ్ల" అని చెప్పాడు.

ఆ తర్వాత ఇద్దరూ ఊరి లోకి వెళ్లుతుంటే రాజా ఫ్యామిలీ నూర్ వాళ్ల ల్యాండ్ చూస్తూ ఉన్నారు దాంతో యాదవ్ నీ దిగ్గమని చెప్పడం తో యాదవ్ వెళ్లి నూర్ వాళ్ల మేనమామ జమాల్ భాషా నీ పట్టుకొని "ఏంది భాషా ల్యాండ్ అముతుండారా అయిన రెడ్డి నీ అడిగేది లా " అని అన్నాడు దానికి రాజా ముందుకు వచ్చి "హలో ఏంది వాళ్లు అమ్ముతునారు మేము కోంటానం మధ్యలో రెడ్డి ఎవ్వురూ అసలు ఇంతకీ నువ్వు ఎవరు" అని అడిగాడు దానికి యాదవ్ "చూడు చిన్న ఈ ఊరి లో ఏమీ జరగాలి అన్న మా రెడ్డి నే చూసుకుంటాడు మళ్లీ కలుదాం " అని చెప్పి వెళ్లిపోయాడు, అప్పుడే చెర్రీ నుంచి ఫోన్ చేసి "రేయ్ బావ మనం హోటల్ సైట్ కోసం పెట్టిన డబ్బు మొత్తం exchange transaction లో బ్లాక్ అయ్యింది ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేదు" అని అన్నాడు దానికి రాజా మళ్లీ తన ఫ్యామిలీ వైపు చూసి ఛీ దరిద్రం అని తన ఫోన్ లో selfie తీసుకోని తన మీద తనే తూ అని ఉమ్మేసాడు.

చెర్రీ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత రాజా మొహం లో మారిన మార్పు చూడగానే అర్థం అయ్యింది రాజా చెల్లి లావణ్య కీ వాళ్లకు మూడింది అని దాంతో కావాలి అని కళ్లు తిరిగి పడిపోయింది అప్పుడు తనని హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లారు రాజా నీ మందుల కోసం పంపి వాళ్లు సీక్రెట్ గా "ఏమైందే అలా పడిపోయావు" అని అడిగింది వాళ్ల అమ్మ, "అన్నయ్య కీ కోపం వచ్చింది వాడి టార్గెట్ మనమే అందుకే ముందే మనం వీక్ అయితే వాడు కూల్ అవుతాడు అని ఇప్పుడు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది ఏంటి అమ్మ" అని అడిగింది లావణ్య దాంతో వాళ్ల నాన్న రాజా నీ ఈ ల్యాండ్ సెటిల్ అయ్యే వరకు దూరం పెట్టాలి అని ఆలోచించి వాడిని తిరిగి హైదరాబాద్ పంపాలని అని నిర్ణయం తీసుకున్నారు, కానీ రాజా మాత్రం మరుసటి రోజు మళ్లీ గడ్డివేముల కీ వెళ్లి నూర్ లేని సమయంలో వాళ్ల ఫ్యామిలీ నీ కలిశాడు, నూర్ వాళ్ల నాన్న లేడు అని మిగిలిన అక్క చెల్లెలు అంతా పొలం అమ్మి అప్పులు తీర్చి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు కాకపోతే పెద్ద పిల్ల నూర్, వాళ్ల మేనమామ జమాల్ భాషా మాత్రం దాని రెడ్డికి అమ్మి ఎక్కువ వాటా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ల ఆధార్ కార్డు జిరాక్స్ లు ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకోని తను అమెరికా వెళితే ఖర్చుల కోసం దాచుకున్న ఐదు లక్షల డబ్బు టోకెన్ అమౌంట్ కింద కట్టి ల్యాండ్ తనకు అమ్ముతున్నారు అన్నట్టు ఒక వెళ్ల మధ్యలో మాట మారిస్తే తను ఇచ్చిన ఐదు లక్షలకు ఇంకో ఐదు లక్షల రూపాయలు కట్టాలి అని తెలివిగా వాళ్లను ఇరికించి పెట్టాడు రాజా, ఇది అంతా తెలివిగా తన ఫ్రెండ్ చెర్రీ వాళ్ల నాన్న రెవెన్యూ ఆఫీసర్ అవ్వడం తో ఆయన సహాయం తో రిజిస్ట్రేషన్ పనులు మొదలు పెట్టించాడు.

ఇది ఇలా ఉంటే నూర్ తన మేనమామ కొడుకు ఫక్రుద్దీన్ ద్వారా రాజా ఇలా డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ పనులు మొదలు పెట్టాడు అని తెలుసుకొని అదే విషయాన్ని రెడ్డికి చెప్పింది దాంతో ఆ పొలం కీ అనుకోని ఉన్న కొండ పైన యాదవ్ కీ భూమి ఉంది దాంతో పాటు నూర్ వాళ్ల పొలం కీ వెనుక 3 ఎకరాల్లో పోరంబోకు భూమి ఉంది ఎప్పటి లాగే ఖాళీగా ఉన్న భూమిని ప్రభుత్వం నుంచి లీజు కు తీసుకున్న భూమి లాగా డాక్యుమెంట్ తయారు చేసుకొని యాదవ్ నూర్ వాళ్ల భూమి చుట్టూ పనులు చేయించి హద్దులు పెట్టే పనిలో పడ్డాడు ఈ విషయం చెర్రీ వాళ్ల నాన్న ద్వారా తెలుసుకున్న రాజా వెంటనే ఆ పొలం దగ్గరికి వెళ్లి తను కూడా ఆ పొలం చుట్టూ కంచె వేయించడం మొదలు పెట్టాడు, అది ఊహించని యాదవ్ రాత్రికి రాత్రి తన మనుషుల తో వచ్చి కంచె పీకే పనిలో ఉన్నాడు ఇలా చేస్తారు అని ముందే ఊహించిన రాజా సాయంత్రం నుంచి అక్కడే పొలం కీ కాపలా కాస్తూ ఉన్నాడు, రాజా నీ చూసిన యాదవ్ "లే ఆ నా కోండే నీ నరికి పోయి చీన్ని పళ్ల తోటలో పూడ్చండి అసలే తోట లో ఎరువు బస్తాలు తగ్గినాయి" అన్నాడు కాకపోతే రాజా నే అందరినీ కొట్టి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసి అందరినీ అరెస్ట్ చేయించాడు.

యాదవ్ నీ అరెస్ట్ చేశారు అని తెలుసుకున్న రెడ్డి హడావిడిగా స్టేషన్ కీ పోయాడు ఆ ఇన్స్పెక్టర్ కీ రెడ్డి చేసే అక్రమాలు తెలిసిన కూడా సైలెంట్ గా ఉన్నాడు కానీ రాజా వాళ్ళని ఎదిరించేసరికి రాజా కీ కుర్చీ వేసి మరీ మర్యాదలు చేశారు స్టేషన్ లో అప్పుడే వచ్చిన రెడ్డి నీ చూసి స్టేషన్ లో అందరూ లేచి నిలబడి ఉన్నారు కానీ రాజా మాత్రం కాలు మీద కాలు వేసి కూర్చొని ఫోన్ లో గేమ్ ఆడుతూ కూర్చున్నాడు, దాంతో రాములురెడ్డి కీ పట్టరాని కోపం వచ్చింది కానీ అయిన సరే రాజా పక్క కుర్చీ లో కూర్చుని "ఏంది ఇన్స్పెక్టర్ వాడు ఏవ్వురో మర్చినావా మా పొట్టేగాడిని లోపల ఏసీ ఉండావ్" అని అడిగాడు, "వాడు మా పొలంలో హద్దులు జరిపేదానికి వచ్చి ఉండాడు తప్పు అని చెప్పుండా ఆడు ఇనేది లా అన్నాడు నేను కూడా నాకూ చేతికి ఆగేదిలా అన్ని సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసినా" అని వెటకారం గా చెప్పాడు రాజా, దానికి ఇన్స్పెక్టర్ కీ నవ్వు వచ్చిన ఆప్పుకున్నాడు "చూడు అప్ప ఇది సీమ ఈడ ఏవ్వురీకి కష్టం వచ్చినా మాకాడికే వస్తారు ఆటాంటిది నువ్వు నా మనిషి నీ కోడితే ఏటా " అన్నాడు దానికి రాజా నవ్వుతూ "ఏంది రెడ్డి బాగా ఇడురంగ మాటాతానావు నువ్వే ఈ సీమ లో పుట్టినావా నేను కూడా ఇదే సీమ లో పుట్టినోడినే" అని అన్నాడు, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వైపు చూసి "సార్ మీరు ఏ సెక్షన్ పెడతారో నాకూ తెలియదు వాడు మాత్రం రిజిస్ట్రేషన్ వరకు బయటకు రాకుడద్దు" అని చెప్పి రాములురెడ్డి భుజం మీద చేయి వేసి "మరి పోయి వస్తా రెడ్డి రిజిస్ట్రేషన్ అప్పుడు కలుదాం" అని చెప్పి వెళ్లిపోయాడు రాజా.

ఇంత జరిగిన తరువాత రాజా ఇక్కడే ఉంటే ఇంకా రిస్క్ అని అర్థం అయ్యి పైగా ఇదే సందు అని వాడిని హైదరాబాద్ పంపించారు వాళ్ల అమ్మ నాన్న తరువాత రాజా ఇచ్చిన టోకెన్ అగ్రిమెంట్ లో రాజా పేరు మార్చి వాళ్ల బావ తేజ పేరు పెట్టారు హైదరాబాద్ వెళ్లిన తర్వాత రాజా ఒక రోజు తన favorite హీరో అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో చూడడానికి వెళ్లాడు అప్పటికే మనోడు 5 సార్లు చూశాడు అలా Imax లో సినిమా కీ వెళ్లినప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఏస్కలేటర్ మీద నుంచి స్లిప్ అయి పడిపోతుంటే పట్టుకున్నాడు చూస్తే ఆ అమ్మాయి రీతిక తనని చూడగానే రాజా తనని లేపి అక్కడి నుంచి పారిపోయాడు కాకపోతే రీతక సినిమా లో తన పక్క సీట్ లో కూర్చుంది తన పక్కన ఎవరో అబ్బాయి కూడా ఉన్నాడు ఆ తర్వాత ఇంటర్ ఎల్ లో రీతిక రాజా నీ చూసి "హే ఏంటి ఇందాక అలా వెళ్లి పోయారు" అని అడిగింది, దానికి రాజా "ఆ రోజు అంత సీన్ జరిగింది కదా మళ్లీ మీతో మాట్లాడాలి అంటే ఏదోలా అనిపించింది" అని కొంచెం మొహమాటం పడుతు మాట్లాడటం చూసి "పర్లేదు I can understand" అని చెప్పింది రీతిక అప్పుడు తన పక్కన ఉన్న అబ్బాయి గురించి అడిగితే తన కాబోయే భర్త అని చెప్పింది దాంతో కంగ్రాట్స్ అని చెప్పాడు ఆ తర్వాత సినిమా అయిపోయాక చెర్రీ నుంచి ఫోన్ వచ్చింది "బావా మనం అనుకున్న సైట్ లో ఏదో స్కామ్ జరిగింది అంట అందుకే ఆ బిల్డింగ్ మూసేశారు మన డబ్బు పోలేదు ఎంతైనా లక్కీ రా మనం" అన్నాడు కానీ రాజా మాత్రం వెళ్లుతున్న రీతిక నీ చూసి ఈ అమ్మాయి మనకు లక్కీ లాగా ఉందే అనుకున్నాడు.

రాజా చేసిన అవమానం కీ రాములురెడ్డి కీ తన తల తీసేసినటు అయ్యింది ఏదో ఒకటి చేసి ఆ ల్యాండ్ దక్కించుకుకోక పోతే ఊరి అందరి ఎదవ అయిపోతాను అని భయం మొదలు అయ్యింది దాంతో వాడిని ఇలా కాకుండా ఇంకో దారి లో ఏదో ఒకటి చేయాలని ఆలోచించాడు దాంతో నూర్ తో పుల్లలు పెట్టించడం మొదలు పెట్టాడు ముందు ఒక్కో ఎకరం 5 లక్షలు అన్నట్టు మాట్లాడి ఇప్పుడు పొలం పక్కన ఉన్న దారిని కూడా కలుపుకుని ఇంకో ముప్పై వేలు కలిపి ఒక్కో ఎకరం కీ ఇవ్వమని గొడవ చేసింది దాంతో ముందు 35 లక్షలు అవుతుంది అనుకుంటే ఇప్పుడు ఇంకో రెండు లక్షలు ఎక్కువ అడగడం తో రాజా గొడవ కీ దిగాడు దాంతో పాటు ఆ పొలం వాళ్లకు ఎవరో అమ్మి వెళ్లారు ఆ లింక్ డాక్యుమెంట్ లు కూడా కనిపించడం లేదు దాంతో పాటు నూర్ వాళ్ల అమ్మ పేరు మీద బ్యాంక్ లో నూర్ 10 లక్షల లోన్ తీసుకుంది దాంతో ఇప్పుడు ల్యాండ్ అమ్మిన కూడా బ్యాంక్ approval కావాలి అది రాజా ఫ్యామిలీ కీ రావాలి అంటే పాత మేనేజర్ అయితే మామూలు గానే ఒప్పుకునేవాడు ఇప్పుడు కొత్త మేనేజర్ రెడ్డి మనిషి అందుకే వాళ్లు లోన్ క్లియర్ చేసే వరకు అమ్మడం కోనడం జరగకుండా కోర్టు నుంచి స్టే తెప్పించి పొలం లో బోర్డు కూడా పాతించాడు, ఇలా మొత్తం అనుకున్నది జరగక పోవడంతో రాజా కీ కోపం పెరిగింది దాంతో ఏమీ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా రాములురెడ్డి పెద్దమ్మ కొడుకు గోపాల్ రెడ్డి కర్నూల్ MLA అతనితో మాట్లడితే పని ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకున్నాడు.

దాంతో రాజా వాళ్ల నాన్న ఫ్రెండ్ గోపాల్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ అవ్వడం తో అపాయింట్ మెంట్ తీసుకోని కలిశారు మొత్తం జరిగింది అంతా చెప్పారు అప్పుడు గోపాల్, రాములు నీ పిలిపించి "యాంది రా మన ఊరోలకి మనం కాకపోతే ఏవ్వూరూ రా సాయం చేసేది అయిన ఊరంతా మెక్కినావు కదా లే ఇంక ఎంత కావాలే" అంటూ రాజా వైపు చూసి "ఒ తూరి బయట ఉండు అప్ప ఈడితో కొంచెం మాటడేది ఉంది" అని చెప్పి బయటకు పంపించి తన చెప్పు తీసి రాములు నీ కొడుతూ "నా కొండె గా ఒక పని సరిగ్గా చేసేదానికి రాదు కానీ నీకు యాలా వోయి సర్పంచి వాళ్లు మన ఊరోలు వాళ్ల తాత మనకాడే పని చేస్తాడు వాళ్లు లేకుండా గడప కూడా దాటలేం మన అప్పోజిషనోలని సంపింది అలా తాత ఆలు మన చెప్పుల లేక రా ఆలు లేరు అనుకో ముళ్లు దిగుతాయి అందుకే అల్లనీ ఎప్పుడు ఆడే ఉండాలా ఉంచాల పొరపాటునా ఆ చెప్పు మేకు అయినాదా అంతే కాలు కోసేయాలా, నా మాట ఇన్ను ఆ పొలం సంగతి ఇరుసు ఆ పొలం పక్కనే ఇండస్ట్రీస్ రాబోతానాయి ఆలు ఇప్పుడు కొంటె వాళ్లకు లాభం అదే వాళ్లకు ఇచ్చి లాకోనిన్నాము అనుకో మనకు లాభం రాజకీయం అంటే పూకు లో పెట్టి దెంగినట్టు కాదు అదును సూసి సింహం నీ ఏటాడినటు వాళ్ల తాత కనుక లేడు అనుకో మనకి ఓటు బ్యాంక్ పోయినటే నింపాదిగా ఆలోచించు ఈ పొలం ఇరుసు నేను చూసుకుంటా " అని చెప్పాడు, దానికి రాములు "తూ నీ బతుకు లో నా మొడ్డ సొంత చినాయన కొడుకును నీ ఓటు బ్యాంక్ కోసం చెప్పు తో కోడతావా నీ అబ్బ ఆ నా కొండె నా ముందే రొమ్ము ఇరుసుకోని కాలు మీద కాలు వేసుకొని కూర్చుని నా భుజం మీద చేయి ఏసీ మాటాడినాడు, మన కాలి కింద బతికే కొడుకులు నాలుగు ఇంగ్లీసు చదువులు చదివి మన ముందే లుంగి కట్టి తిరగాతాంటే నువ్వు పోయి వాళ్ల ఉచ్చ తాగుతావు ఏమో నేను కాదు నను కాదు అని ఏటా ఆ పొలం కొంటారో సుత్తా " అని బయటికి వెళ్లాడు గోపాల్ ఎంత చెప్పిన వినిపించోకుండా పోయాడు.

ఆ తర్వాత రాజా నీ లోపలికి పిలిచి "ఆడు మూర్కుడు అప్ప అంత తేలిగ ఇన్నడు మీరు పోయి మిగిలిన పనులు చూసుకొని ఎమైన అయితే నేను చూసుకుంటా " అని చెప్పి పంపేసాడు ఆ తర్వాత ఆ పొలం చుట్టూ పక్కల తొందర లో వచ్చే ఇండస్ట్రీస్ ల్యాండ్ ఎక్కడి దాక వస్తాయి ఎన్ని ఎకరాలు వస్తాయి అని ఆ మ్యాప్ మొత్తం తెప్పించి చూశాడు గోపాల్ రెడ్డి, ఆ తర్వాత బెంగళూరు లో ఒక ల్యాండ్ ఉంది అని డబ్బు కూడా రెడీగా ఉంది అని చెర్రీ ఫోన్ చేస్తే వెళ్లాడు రాజా ఆ ల్యాండ్ రాజా కీ బాగా నచ్చింది దాంతో ఆ ల్యాండ్ కీ సగం అమౌంట్ కట్టి లాక్ చేశారు ఆ తర్వాత construction పనులు మొదలు పెట్టారు చెర్రీ దెగ్గర ఉన్న డబ్బు తో హోటల్ కట్టెసిన తరువాత మెయిన్టేన్స్ కోసం డబ్బు కావాలి అని తొందరగా ల్యాండ్ అమ్మే పనిలో పడ్డాడు, అప్పటికే కరోనా కేసులు ఇండియా లో పెరగడం మొదలు అయ్యింది జనతా కర్ఫ్యూ విధించారు ఆ మరుసటి రోజు రిజిస్ట్రార్ ఆఫీసు కీ వెళ్లితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ లు జరగడం లేదు అని చెప్పారు.

అప్పుడే రాములురెడ్డి నూర్ ద్వారా ఇంట్లో అందరితో బ్యాంక్ లోన్ కోసం అని సంతకాలు తీసుకుని దాని డిజిటల్ చేయించి ఇంట్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అని తెలుసుకోని ఫ్యామిలీ తో సహ వెళ్లాడు రాజా అప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండా గొడవ చేశాడు దాంతో రెడ్డి రాజా నీ చంపేయమని చెప్పాడు దాంతో రాజా అందరినీ కొట్టడం మొదలు పెట్టాడు రాజా నీ గన్ తో కాల్చి చంపే టైమ్ లో రాజా ఇంకో గన్ తో రాములురెడ్డి నీ కాల్చాడు కాకపోతే తన గన్ లో బుల్లెట్స్ లేవు కానీ వాడి గుండెల్లో బుల్లెట్ దిగింది రెడ్డి చనిపోయాడు దాంతో అందరూ రాజా నీ రాజా ఫ్యామిలీ మీదకు వస్తే అందరినీ కార్ ఎక్కమని చెప్పి అడ్డు వచ్చిన వాళ్ళని గుద్దీ అక్కడి నుంచి పారిపోయారు.

రాజా కార్ వేగం పెంచి ముందుకు దూసుకొని వెళ్లుతున్నాడు అప్పుడు అందరితో "మీ ఫోన్ లో మీకు అవసరం అయిన కొని నెంబర్ లు కాపీ చేసి పెట్టుకోండి తరువాత సిమ్ కార్డులు తీసి విసిరేయండి" అని చెప్పాడు, రాములురెడ్డి చనిపోయిన విషయం కార్చిచ్చు లాగా పాకింది దాంతో గోపాల్ రెడ్డి రాజా ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి ఆవేశము పెంచుకున్నాడు దాంతో టౌన్ లో ఉన్న మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ల ఫ్యామిలీ ఎక్కడ ఉన్న అరెస్ట్ చేసి తన దగ్గరికి తిసుకొని రమ్మని చెప్పాడు విషయం తెలిసిన రాజా వాళ్ల తాత వాళ్ల అమ్మకు ఫోన్ చేశాడు సిమ్ లేక పోవడంతో ఫోన్ తగలలేదు దాంతో ఆయన ఊరి లో ఉన్న వాళ్ళని వాళ్ల ఊరి చివర ఉన్న అడవిలో దాకోమని చెప్పాడు ఎందుకంటే వాళ్ళని అడవిలో పట్టుకోవడం కష్టం ఆ తర్వాత తను కూడా అక్కడి నుంచి మాయం అయ్యాడు, కార్ తో హైవే లో ఏమీ చేయాలో తెలియని పరిస్థితి లో రాజా ఉంటే వాళ్ల బావ వచ్చి "బావ ఇప్పుడు మన డబ్బు సేఫ్ కదా నీ డబ్బులు పోయాయి నా డబ్బు లో ఏమీ తేడా ఉండదు కదా" అని అడిగాడు తేజ దాంతో రాజా తన షూ తీస్తూంటే సీన్ అర్థం అయ్యి వెనకు వెళ్లాడు తేజ, ఆ తర్వాత కార్లో చూస్తే ఆ '' ఫ్యామిలీ కీ సంబంధించిన ఆధార్ కార్డులు ఇంక రాములురెడ్డి ఫోన్ ఉన్నాయి (కార్ రెడ్డి దే) ఆ తర్వాత ఆ ఫోన్ తీసుకోని చూస్తే గోపాల్ రెడ్డి సెక్యూరిటీ రాజా వాళ్ల నాన్న ఫ్రెండ్ హుస్సేన్ నెంబర్ దొరికింది.

వెంటనే హుస్సేన్ కీ ఫోన్ చేశాడు చనిపోయిన వ్యక్తి ఫోన్ నుంచి తనకు ఫోన్ రావడంతో బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు

హుస్సేన్ : హలో అల్లుడు ఏంట్రా ఇది ఎక్కడ ఉన్నారు

రాజా : నీ ఇంట్లోనే మాము

హుస్సేన్ : రేయ్ నా ఇంట్లో ఏమీ చేస్తున్నారు

రాజా : ఊరిలో చుట్టాలు ఇంటికి వెళితే దొరికిపోతాము అని సెక్యూరిటీ ఆఫీసర్ల ఇళ్లు అయితే సేఫ్ అని ఇక్కడే ఉన్నాము అని చెప్పాడు

దాంతో హుస్సేన్ హడావిడి ఇంటికి వెళ్లాడు వెళ్లిన తర్వాత రాజా తన దగ్గర ఉన్న ఆధార్ కార్డు సహాయం తో హుస్సేన్ వాళ్ల ఇంట్లో ఉన్న కంప్యూటర్ తో బస్ టికెట్ బుక్ చేశాడు అప్పుడే తన ఫ్రెండ్ హరీ వచ్చి మూడు ప్రూఫ్ లేని సిమ్ కార్డులు ఇచ్చాడు ఆ తర్వాత హుస్సేన్ వాళ్ల భార్య దెగ్గర ఉన్న బురకా లు తీసుకోని తన ఫ్యామిలీ కీ ఇచ్చాడు రాజా "మీరు ఇక్కడి నుంచి అనంతపురం వెళ్ళండి మహా అయితే 2 గంటల ప్రయాణం అక్కడ బస్ స్టాండ్ లో నా ఫ్రెండ్ ఖలీల్ వచ్చి మీకు ఒక కార్ ఇస్తాడు దాంతో మీరు బెంగళూరు లో చెర్రీ దగ్గరికి వెళ్ళండి నేను మళ్లీ ఫోన్ చేసే వరకు రావ్వోదు నేను కూడా హైదరాబాద్ వెళ్లిపోతా" అని చెప్పాడు ఆ తర్వాత హరీ తో "రేయ్ నువ్వు వాళ్ళని బిర్లా గేట్ దగ్గర బస్ ఎక్కించి వాళ్ళని డోన్ టోల్ గేట్ దాక ఫాలో అవ్వు ఆ టోల్ గేట్ దాటితే తరువాత జిల్లా మారిపోతుంది మనం సేఫ్ " అని చెప్పాడు ఇలా రాజా సిరీస్ డిస్కషన్ లో ఉంటే తేజ వచ్చి బావ అన్నాడు దానికి రాజా చిరాకు లెసీ హుస్సేన్ గన్ తీసుకోని

"అవసరం అయితే నిన్ను చంపి నా చెల్లి నీ widow నీ చేసి మళ్లీ పెళ్లి చేస్తా ఇంకోసారి డబ్బు గురించి అడిగితే" అన్నాడు దానికి తేజ సైలెంట్ గా వెళ్లి కార్ లో కూర్చున్నాడు.

రాజా చెప్పినట్లు హరీ వాళ్ళని బస్ ఎక్కించి ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు తరువాత టోల్ గేట్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లు బస్ ఆపి తనిఖీ చేశారు కాకపోతే వాళ్లు బురఖా లో ఉండి నూర్ ఫ్యామిలీ ఆధార్ కార్డు చూపిస్తే ఎవరూ పట్టించుకోలేదు ఆ తర్వాత బస్ కర్నూల్ దాటి డోన్ లో ఆగింది అప్పుడు రాజా కొత్త నెంబర్ తో వాళ్ల నాన్న కీ ఫోన్ చేసి బస్ మారిపోండి అని చెప్పాడు దాంతో వాళ్లు వేరే బస్ ఎక్కి అనంతపురం వెళ్లారు, వాళ్ళు ముందు ఎక్కిన బస్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకున్నారు అది ముందే డౌట్ వచ్చి రాజా వాళ్ళని బస్ మారమని చెప్పాడు, అక్కడ ఊరి చివర హైవే దగ్గరే ఖలీల్ బస్ ఆపి వాళ్లకు కార్ ఇచ్చి వెళ్లిపోయాడు ఆ తర్వాత వాళ్లు బెంగళూరు వైపు ప్రయాణం అయ్యారు, ఇక్కడ రాజా హరీ వాళ్ల మామ కీ జడ్చర్ల లో బెల్ట్ షాపు కీ సరుకు పంపే బండి లో సీక్రెట్ గా ఎక్కి వెళ్లాడు జడ్చర్ల లో తను దిగితే రాజా హైదరాబాద్ కీ వెళ్లడానికి బైక్ arrange చేశారు, ఆ తర్వాత సాయంత్రం కల్లా వాళ్లు బెంగళూరు, రాజా హైదరాబాద్ చేరుకున్నారు.

రాజా తన రూమ్ కీ వెళ్లి ఫ్రెష్ అవుతుంటే హుస్సేన్ నుంచి ఫోన్ వచ్చింది "అల్లుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు అని వాళ్లకు తెలిసింది ముందు ఆ రాములు గాడి ఫోన్ ఎక్కడైన పడేయి అన్నాడు అప్పుడు వరకు ఆ ఫోన్ తన దెగ్గర ఉంది అన్న విషయం మరిచి పోయాడు రాజా, రాములు ఫోన్ నెట్వర్క్ ద్వారా రాజా అడ్రస్ కనుకున్నారు వాళ్లు వచ్చే లోపు రాజా తన లగేజ్ సర్దుకోని బైక్ మీద పారిపోతున్నాడు అప్పుడు రెండు సుమొలో గోపాల్ రెడ్డి మనుషులు వచ్చారు వాళ్లు రాజా నీ వెంబడిస్తు ఒకడు గన్ తో కాలిస్తే బైక్ పంచర్ అయ్యింది దాంతో రాజా జారీ పడ్డాడు అప్పుడు ఇంక లాభం లేదు అని అందరినీ కొట్టాడు కాకపోతే రెండు కత్తి పోట్లు ఒక బుల్లెట్ బుజం మీద దిగింది వాళ్లు ఇంకా వస్తూ ఉంటే దెగ్గర లో ఒకడు కార్ ఎక్కుతుంటే వాడిని లాగి ఆ కార్ వేసుకొని వెళ్లిపోయాడు కాకపోతే రక్తం పొత్తు ఉండటం తో కళ్లు తిరిగి కార్ నీ ఒక స్కూటీ నీ గుద్దేసాడు ఆ స్కూటీ ఓనర్ రీతిక ఆవేశం లో వచ్చి డోర్ తీసిందీ లోపల రక్తం మడుగులో ఉన్న రాజా నీ చూసి షాక్ అయ్యి అక్కడే ఉన్న తన రూమ్ మేట్ మధురిమ నీ పిలిచి అదే కార్ లో రాజా నీ వాళ్ల ఫ్లాట్ కీ తీసుకోని వెళ్లారు.​
Next page: Update 03
Previous page: Update 01