Update 28
విక్రమాదిత్య
THE RISE OF THE DEVIL
THE RISE OF THE DEVIL
మానస : చిన్నా... బావా.. నిజంగానే నిన్ను చాలా ప్రేమించాను
విక్రమాదిత్య : నాకు తెలుసు
మానస : నొప్పిగా ఉందిరా
విక్రమాదిత్య : కదలకు
మానస : నీ మీద పడుకోవాలని ఉంది
విక్రమాదిత్య లేచి మానస కడుపులో గుచ్చుకున్న కత్తి ముక్క తీసి చిన్నగా తన మీద పడుకోబెట్టుకున్నాడు.
మానస : ఒక ముద్దు ఇస్తావా
విక్రమాదిత్య చిన్నగా మానసని చూస్తూనే తన కింద పెదాన్ని అందుకుని ముద్దాడుతుంటే మానస చిన్నగా తన చెయ్యితో విక్రమాదిత్య చేతిని పట్టుకుని తన తొడల మధ్యలోకి తీసుకెళ్ళింది. విక్రమాదిత్య ముద్దు ఆపి మానసని చూసాడు.
మానస : నేను నీకుస్తున్న బహుమతి అనుకో, చాలా జాగ్రత్తగా ఉపయోగించు అని తన తొడల మధ్యలో ఉన్న జిగటని విక్రమాదిత్య చేతికి అంటించి పెదాలు అందుకుని కళ్ళుమూసుకుని అలానే తిరిగిరాని లోకాలికి వెళ్ళిపోయింది.
పడవలో వర్షపు జల్లులో.. కింద విక్రమాదిత్య.. పైన మానస, రెండు చేతులు మానస చుట్టు వేసి చలనం లేని మూసుకుని ఉన్న తన కళ్ళని, తన మొహాన్ని చూస్తూ ఒకసారి ఆకాశంలోకి చూసాడు, ఒక చినుకు విక్రమాదిత్య కంట్లో పడగానే కళ్ళు మూసుకున్నాడు.. ధారగా కారాయి కన్నీళ్లు.
తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది.. నేరుగా అనురాధ దెగ్గరికి వెళ్ళి అడవిలోని గూడెంలోకి అడుగు పెడుతూనే అందరి సంబరాలు వింటూ మౌనంగా లోపలికి వెళ్ళాడు. సంధ్య తన కొడుకు మొహం చూడగానే నవ్వుతున్న తన మొహం ఆశ్చర్యానికి గురై కొడుకు వంక మౌనంగా చూసింది.
విక్రమాదిత్య వెళ్లి పడుకున్న అనురాధ పక్కన కూర్చుని తన కళ్ళలోకి చూసాడు, అనురాధ నవ్వుతూ పక్కన ఉన్న ఇద్దరు కొడుకులని చూడమని సైగ చేసింది, కొడుకులిద్దరి వంక ఒక చూపు చూసి లేచి ముద్రగడ నాయకుడితో ఏకాంతంగా మాట్లాడాడు. కొడుకులు ఇద్దరినీ తీసుకెళతానని సరైన సమయానికి మాట ఇచ్చినట్టు తెగకి ఒక కొడుకుని అప్పగిస్తానని మాట ఇచ్చి అక్కడ నుంచి ఇంటికి బైలుదేరారు అందరూ. సంధ్య కొడుకుతో మాట్లాడాలనుకున్నా తన మొహం చూసి ఎందుకో ఆగిపోయింది.
తెగలో ఏర్పాట్లు ముగించుకుని ఇంటికి బైలుదేరేసరికి రషీద్ రెండు వందల మందితో విక్రమాదిత్య ఇంటికి కాపలాగా ఉన్నాడు, విక్రమాదిత్య వాళ్ళు వెళ్లేసరికి పడి ఉన్న శవాలని రక్త పాతాన్ని అంతా తుడిచేసి ఇంటిని కూడా బాగు చేపిస్తున్నాడు. ఎప్పుడైతే విక్రమాదిత్య యుద్ధం సమయంలో అందరినీ అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడో రషీద్ వెంటనే ఊరు వచ్చి తను కోల్పోయిన బలాన్ని మొత్తం తిరిగి తెచ్చుకుని అంతకంటే బలంగా తయారయ్యాడు.
సంధ్య పని చేస్తున్న మనుషులని సెక్యూరిటీగా నిలబడ్డ వందల మంది మనుషులని చూసి భయపడుతూనే చేతిలో పిల్లోడితో ఇంట్లోకి నడిచింది, ఆ వెనకాలే అనురాధ కూడా ఇంకో బాబూతో ఇంట్లోకి వెళుతూ మొగుడి కోసం వెనక్కి తిరిగి చూసింది.. కనీసం ఎత్తుకొనైనా ఎత్తుకొలేదని బిడ్డని చేతిలో పెడదాం అని పిలవబోయి విక్రమాదిత్య వేరే వైపు వెళ్లడం చూసి ఆగిపోయింది.
విక్రమాదిత్య రషీద్ సలాం పెడుతున్నా పట్టించుకోకుండా వెళుతూ అక్కడ ఉన్న పొలుగు తీసుకుని ఇంటి వెనక్కి వెళ్ళాడు.. అది చూసి రషీద్ కూడా వెళ్ళాడు. ఒక్కడే గుంట తవ్వడం మొదలుపెట్టడం చూసి రషీద్ తన మనుషులకి సైగ చేసాడు, కానీ విక్రమాదిత్య చెయ్యి ఎత్తి వద్దని సైగ చేసి ఆ వెంటనే వెళ్లిపొమ్మని చెయ్యి ఊపాడు.. అందరూ వెళ్లిపోయారు రషీద్ మాత్రం నిలుచొని చూస్తున్నాడు. అనురాధ వెంటనే లోపలికి వెళ్లి సంధ్య దెగ్గర పిల్లలని వదిలి ఇంటి వెనక్కి వచ్చింది.
అనురాధ : ఏమైంది
విక్రమాదిత్య ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు, అనురాధ తన మొగుడి మొహాన్ని చూసింది అందులో తనకి తెలిసిన విక్రమాదిత్య కనిపించనేలేదు ఎవరో కొత్త మనిషి ఉన్నట్టు అనిపించింది ఆ మొహంలో శాంతి లేదు, ఎవరి మీదో కోపం, అసహనం.. చెప్పాలంటే ఒక రాక్షసత్వం కనిపించింది.. అనురాధ కంగారు పడిపోయింది.
విక్రమాదిత్య తవ్వడం అయిపోవచ్చిందనగా అక్కడున్న అందరికి అర్ధం అయ్యింది అది ఎవరినో పూడ్చడానికని కానీ సంధ్యకి, అనురాధకి ఇద్దరికీ ఎవరో అర్ధంకాలేదు.. ఇంతలో వ్యాన్ ఒకటి వచ్చి ఆగడంతో విక్రమాదిత్య తనంత తానుగా వెళ్లి అందులోంచి మానసని బైటికి తీసి రెండు చేతులతో ఎత్తుకొస్తుంటే అనురాధ, సంధ్య ఇద్దరు ఏడుస్తూ బిడ్డలతో దెగ్గరికి వెళ్లారు.
విక్రమాదిత్య ఎవ్వరిని పట్టించుకోలేదు నేరుగా మానసని గుంతలో పడుకోబెట్టి పిడికిలి మట్టి తీసుకుని మానస మీద వేస్తూ ఒకసారి తన మొహాన్ని చూసి గట్టిగా పిడికిలి బిగించి వదిలాడు.. వెంటనే పార అందుకుని త్వరత్వరగా పూడ్చేశాడు. ఒక రెండు నిమిషాలు అక్కడే మౌనంగా కూర్చుని లేచి కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి వెళుతు.. "రషీద్ ఆకలిగా ఉంది ఏమైనా తెప్పించు" అని లోపలికి వెళ్ళిపోయాడు.. అనురాధ, సంధ్య ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
రషీద్ నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ అలాగే సర్ అని మాత్రమే అనగలిగాడు
రోజూ లేవడం ఇంటి వెనక్కి వెళ్లి మెట్ల మీద కూర్చుని మానస సమాధి చూస్తూ కూర్చోవడం, టైముకి అన్నం తినడం.. కొంచెం సేపు పడుకోవడం మళ్ళీ రాత్రి నిద్ర వచ్చేవరకు మానస సమాధి చూస్తూ కూర్చోవడం ఇదే విక్రమాదిత్య పని అయిపోయింది.. ఉన్న ఆస్తుల గురించి కానీ కంపెనీల గురించి కానీ పట్టించుకోవడం ఎప్పుడో మానేసాడు.. ఏదో ఉన్నాడంటే ఉన్నాడన్నట్టు ఇంట్లో ఉంటున్నాడు ఆలోచనలు మొత్తం చిన్నప్పటి నుంచి తనూ మానస బంధం గురించి వాళ్ళిద్దరి మధ్యా జరిగిన సంభాషణల గురించి ఆలోచిస్తూ, గుర్తుచేసుకుంటూ కూర్చునేవాడు.
అనురాధ, సంధ్య ఇద్దరు విక్రమాదిత్యని మార్చడానికి ఈ బాధలో నుంచి బైటికి తీసుకురావడానికి వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు కానీ లాభం లేదు, ఇటు తల్లీ భార్య ఎవరు తన పక్కన ఉన్నా.. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు, చెప్పిన పని చేస్తున్నాడు, పిల్లలని ఆడిస్తున్నాడు కానీ మానస ఆలోచనల నుంచి మాత్రం బైటికి రాలేకపోతున్నాడు.. అనురాధ బాధపడటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయింది.
రెండేళ్లు గడిచిపోయాయి విక్రమాదిత్య నవ్వి, అనురాధ కూడా ఏమి అడగలేకపోతుంది.. తనతో ప్రేమగానే ఉంటున్నాడు. పిల్లలీద్దరికీ అటు మానస మరియు తన పిన్ని శశి ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ఒకరికి మానస్ అని ఇంకొకరికి శశికాంత్ అని పేర్లు పెట్టాడు అన్ని బానే ఉన్నాయి కానీ ఇంతకముందు తనాకి తెలిసిన ఆ విక్రమ్ మాత్రం లేడు.. ఆ కొంటెతనం, ఆ చిలిపితనం, అనురాధ డామినేట్ చేస్తే తల వంచుకుని నిలబడే ఆ విక్రమ్.. అనురాధ మాట జవదాటని ఆ విక్రమ్ ఇక రాడేమో ఇక తనని అలా చూడలేనేమో అని భయపడింది.
రోజులు గడుస్తుండగా ఒకరోజు విక్రమాదిత్య పిన్ని అయిన శశి దెగ్గర శిష్యరికం చేసే ఒకరి దెగ్గరనుంచి కబురు వస్తే ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు, తన పిన్ని ప్రియ విద్యార్థి అయిన సామాన్య అనే అమ్మాయి దెగ్గర శశి తన సంతానాన్ని పిండ రూప పద్ధతిలో దాచిందని తెలిసి ముందు ఆశ్చర్యపోయాడు.. తన పిన్ని తన మీద పెట్టుకున్న నమ్మకానికి తనపై చూపించే ప్రేమకి తన మీద ప్రేమ కలిగింది.
ఎంతకీ పిండం చీల్చుకుని బిడ్డలు బైటికి రావట్లేదని చెప్పడంతో విక్రమాదిత్య ముద్రగడ ప్రజలకి కబురు చేశాడు. తెగ పెద్ద ఇది చూసి తన వల్ల కాదని తమ తెగ పూర్వికులు ఆఫ్రికా అడవుల్లో ఉన్నారని చెప్పగా విక్రమాదిత్య ఒక్కడే బైలుదేరాడు.
పెద్దాయన చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ ప్రయాణం సాగించాడు.. ముద్రగడ ప్రజలు, వీళ్ళ అసలు ఆనవాళ్లు ఉన్నది ఆఫ్రికాలోనే అక్కడ నుండి విడిపడి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు.. వారి దెగ్గర నుంచి యుద్ధ విద్యలు మిగతా కావాల్సిన విద్యలు నేర్చుకున్నారు కానీ వైద్యానికి సంబంధించిన విద్యని నేర్చుకోలేకపోయారు. కారణం లేకపోలేదు ఎందుకంటే ఈ తెగ వాళ్ళని అక్కడి వాళ్ళు బహిష్కరించారు.
ఆఫ్రికా అడవుల్లో నివసించే మంధీ తెగ, మిధాలి తెగ, బిజారి తెగ మొదలగు పదముడు తెగల్లో ముద్రగడ తెగ ఒకటి.. ఇందులో ముద్రగడ తెగ ప్రజలకి మిగతా పన్నెండు తెగల విద్యలు మరియు రహస్యలు తెలుసుకోవాలన్న పిచ్చి కోరిక పుట్టింది దాని వల్ల వాళ్లలో వాళ్ళకే గొడవలు పుట్టి చివరికి ముద్రగడ తెగను బహిష్కరణ చేశారు, కానీ దాని తరవాత అందరూ విడిపోయారు.. ఇంతకముందులా కలిసి మెలిసి ఉండలేకపోయారు, ఒకరిమీద మరొకరికి అనుమానాలు మొదలయ్యాయి.
ఇంకా తెగలకి సంబందించిన విషయాలు అన్నిటి గురించి తెలుసుకుని విక్రమాదిత్య ఆఫ్రికా అడవుల్లో అడుగుపెట్టాడు.. ముందుకు వెళుతున్న కొద్దీ ఎవ్వరు కనిపించకపోవడంతో ఇంకొంత ముందుకు వెళ్ళగా దూరంగా మంటలు కనిపిస్తుంటే అటు వైపు వెళ్ళాడు.. అడవి మధ్య పెద్ద పెద్ద చెట్ల మధ్యలో విశాల ప్రాంగణంలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది అక్కడ.. పన్నెండు తెగల ప్రజలు కొట్టుకు చస్తున్నారు.. విక్రమాదిత్య అక్కడికి వెళ్లి ఒక చెట్టు పక్కన నిలబడ్డాడు, దూరంగా ఒక సింహాసనం లాంటి రాతి కుర్చీ ఒకటి ఉంది.. బహుశా కొండనే ఆ విధంగా చెక్కి ఉంటారు దాని ముందు ఒక గొడ్డలి నిలబెట్టి ఉంది, బంగారపు రంగులో ఉంది కానీ బంగారంలా అనిపించలేదు .. ప్రతీ ఒక్కరు ఆ గొడ్డలిని అందుకోడానికి వెళుతుంటే ఒకరిని ఒకరు ఆపుకుంటు దొరికిన వాడిని దొరికినట్టు పొడుచుకుంటున్నారు.
యుద్ధంలో భాగంగా ఎవరో నలుగురు వచ్చి విక్రమాదిత్య మీద పడగా వారిని వారించబోయాడు కానీ వాళ్ళు వినకపోవడంతో తప్పక నలుగురిని మట్టి కరిపించాడు.. అందరూ ఒకసారి విక్రమాదిత్య వైపు చూసారు.. తమ వాళ్ళని ఒక బైట వాడు వచ్చి కొట్టాడు అని తెలియగానే వాళ్ళున్న క్రోధపు క్షణాల అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.. అందరూ విక్రమాదిత్య మీదకి వెళుతుంటే విక్రమాదిత్యకి సహనం నశించింది..
చిన్నప్పటి నుంచి తాను ఎదురుకున్న కష్టాలు, కోపాలు, నష్టాలు, మోసాలు అన్నిటికీ మౌనంగా సహనంగా ఓపిక పట్టీ పట్టీ ఉన్నాడు.. అవన్నీ మానస చావుతో ఎప్పుడో పటాపంచలయ్యాయి కానీ ఎవరి మీద చూపించాలో తెలియలేదు ఇంట్లో ఉన్న అమ్మ మీద భార్య మీద పిల్లల మీద చూపించలేక ఇన్ని రోజులు అణుచుకున్నాడు కానీ ఇప్పుడు ఆ అవసరం కనిపించలేదు.. పిడికిలి బిగించి గట్టిగా అరిచాడు.. తెగ నాయకులు అది చూసి వాళ్ళ వాళ్లకి సైగ చెయ్యగా విక్రమాదిత్య మొదటి యుద్ధం మొదలయ్యింది.
ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే తెగ నాయకలు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే విక్రమాదిత్య కొట్టె ప్రతీ దెబ్బ చాలా బలంగా సరిగ్గా తను అనుకున్న చోటే తగులుతున్నాయి వాళ్లకి.. వెనక నుంచి బాణాలు, బల్లాలు కూడా పడుతుంటే చుట్టూ ఆయుధం కోసం చూసాడు కానీ ఏమి కనిపించలేదు ఒక్కటి తప్ప.. అదే గొడ్డలి.. విక్రమాదిత్య కొట్టుకుంటూ అందినవాడి మొహం మీద పిడి గుద్దులు గుద్దుతూ అటువైపు కదులుతుంటే విక్రమాదిత్య కోపానికి తన శరీరం చిన్నగా మెరవడం నాయకులు గమనించి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని అందరూ తమ తమ సైన్యానికి సైగ చేశారు.. యుద్ధ తీవ్రత పెరిగింది.
విక్రమాదిత్య చూపిస్తున్న క్రొధానికి తెగ వాళ్ళు సైతం తట్టుకోలేకపోతున్నారు, అస్సలు తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోయి అందరినీ కొట్టుకుంటూ వెళుతున్నాడు, తన చూపు మొత్తం ఆ గొడ్డలి మీదే ఉంది. ప్రతీ ఒక్కడు అడ్డుపడుతున్న కొద్దీ ఆ గొడ్డలిని అందుకోవాలన్న తన కోరిక ఇంకా ఎక్కువ అవుతుంది.. విక్రమాదిత్య ఎంతలా అయిపోయాడంటే చివరికి ఒక్కొక్కడిని ముట్టుకోకుండానే కింద పడేస్తున్నాడు. తెగ వాళ్ళు ఇది చూసి బెంబేలెత్తిపోయారు.
దాదాపు వంద మంది విక్రమాదిత్య గొడ్డలిని ముట్టుకోకుండా అడ్డుగా నిలుచుంటే విక్రమాదిత్యకి ఇంకా పంతం పెరిగిపోయింది, మొదటి మెట్టు మీద అడుగుపెట్టి అందరినీ తోసుకుంటూ, కొడుతూ వెళ్లి ఒక్కసారిగా ఎగిరి గొడ్డలి మీద చెయ్యి వేసి దాన్ని పట్టుకున్నాడు.. అంతే గొడ్డలి ఆ కొండ రాయి నుంచి పెకిలి విక్రమాదిత్య చేతిలోకి వచ్చింది.. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
కొన్ని వందల ఏళ్ల నుంచి ఆ తెగ మొదటి నాయకుడు మాత్రమే ఆ గొడ్డలిని ఎత్తాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు దాని వల్లే ఆయన మృత్యువు కూడా సంభవించింది మళ్ళీ ఇన్నేళ్లగా ఎవ్వరికి ఆ గొడ్డలి లొంగలేదు, ఎవ్వరూ ఆ సాహసం కూడా చెయ్యలేదు, పిచ్చి ప్రవర్తనతో ఒకరి మీద ఒకరికి అనుమానాలు, ఈర్ష్య వల్ల అది మాకు చెందాలంటే మాకు చెందాలని కొట్టుకుంటున్నారు కానీ అలాంటిది విక్రమాదిత్య చేతిలో నిషితంగా ఉండటం చూసి ఇప్పుడు జరిగే వింత చూసి ఎవరి నోటా మాట బైటికి రావట్లేదు తెగ నాయకులు సైతం భయపడ్డారు.
యుద్ధంలో కింద పడ్డ ఓ చిన్నపిల్లాడు తన తండ్రిని అడిగాడు, నాన్న ఆ గొడ్డలి ఎవ్వరికి లొంగదు కదా కాని ఆయన పట్టుకున్నాడు అని చూపించగా ఆయన ఆశ్చర్యపోయి భయపడుతూ నోరు విప్పాడు.
అది పరుశురాముడి గొడ్డలి.. మన తెగలు ఏర్పాటు చేసుకున్న కొత్తలో రాక్షసులు మన మీదకి దండేత్తి ఆడవాళ్ళని తీసుకెళ్లిపోతుంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఒక్కరిని చూసి మన పూర్వికులకి ధైర్యం వచ్చింది.. ఆయనే పరుశురాముడు ఈ రాజ్యాన్ని పాలించే రాజు తన దెగ్గర ఉన్న పదిలక్షల మంది సైన్యంతో ఒక్కడు యుద్ధం చేస్తున్నారని తెలిసి అది నిజామా కాదా అని వెళ్లి చూసారట.. పొద్దున మొదలు పెట్టి సూర్యాస్తమయం అయ్యే లోపు ఒక్కడే పది లక్షల మందిని, ఆ తరవాత రాజుని నరికేసాడు.. ఇక్కడుండే ప్రజలకి విముక్తిని స్వాత్రంతాన్ని ప్రసాదించాడు.. ఇప్పుడు నువ్వు చూస్తున్నావే ఆ గొడ్డలితోనే అనగానే పిల్లవాడు భయంగా విక్రమాదిత్య వైపు గొడ్డలి వైపు చూసాడు.
యుద్ధం అయ్యాక ఆయనలో మళ్ళీ ఒక సాధువునే తప్ప వీరుడిని చూడలేకపోయేసరికి ఆశ్చర్యపోయి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి ఆయనని సేవించుకుని గోడు వెళ్ళబోసుకోగా ఆయన ఆ రాక్షసులను చంపేశాడు. ఇక ఆయన హిమాలయాలకి వెళ్లిపోతున్నానని మళ్ళీ తిరిగి రానని మీకు కాపలాగా ఈ గొడ్డలి ఉంటుందని తనకి ఎదురుగా కనిపిస్తున్న ఆ కొండ మీదకి విసిరేసి అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు.. చాలా ఏళ్ల తరువాత మన మొదటి తెగ నాయకుడు ఆ గొడ్డలిని ఒక్కసారి అయినా ముట్టుకోవాలని వెళ్లి అక్కడికక్కడే రక్తం కక్కుకుని చనిపోయాడు.. అప్పటి నుంచి అందరం ఆ గొడ్డలి వెనకాలే మన స్థావరాలు, మన ఉనికి ఏర్పరుచుకున్నాము.. అని ముగించాడు
ఈదురు గాలుల శబ్దాలు చెవుల్లో మారుమొగుతుంటే అందరూ మౌనంగా ఆశ్చర్యంగా విక్రమాదిత్య వంకే చూస్తున్నారు తరువాత ఏం జరుగుతుందా అని.. పక్కనే ఉన్న చెట్టు మీద పిడుగు పడటంతో పెద్ద మంట వచ్చింది.. అందరూ అటు వైపు చూసారు.. ఆకాశంలో ఉరుములు మెరుపులు, సూర్యుడిని మబ్బులు కమ్మేసాయి.. పెను తుఫాను వచ్చేలాగా మారిపోయింది ఒక్కసారి ఆ వాతావరణం.. పెద్దగా ఓం నమస్సివాయ అన్న ఖంఠం విని అందరూ ఆ వైపున చూసారు.
ఏడడుగుల వజ్రకాయం కలిగిన ముని ఒంటి మీద రుద్రాక్షలతో కోపంగా వేగంగా నడుచుకుంటూ వస్తుంటే, ఆ అపార తేజస్సుని తట్టుకోలేక అక్కడున్న వాళ్లంతా స్పృహ తప్పి పడిపోతుంటే విక్రమాదిత్య మాత్రం చేతిలో గొడ్డలితో వస్తున్న ఆ ముని వంక చూస్తూ ఉన్నాడు. ఇంకా విక్రమాదిత్య కోపం తగ్గలేదు సరైన శత్రువు కోసం చూస్తున్నాడు.
ముని వేగంగా నడుచుకుంటూ విక్రమాదిత్య ముందుకు వచ్చి ఆగాడు.. విక్రమాదిత్య చేతిలో ఉన్న గొడ్డలిని చూసి ఆయన కోపం కట్టలు తెంచుకుంది సంస్కృతం మరియు పురాతన తెలుగు మరియు ఇంకేదో భాష కలిసిన వచనాలు చాలా కోపంగా పలుకుతుంటే అంతా అర్ధమైనట్టు ఉన్నా ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు, అయోమయంగా చూసాడు.
సంస్కృతంలో : ఈ భార్గవ రాముడి పరుశుని తాకడానికి నీకెంత ధైర్యం, నీవంత వీరునివా, అయితే రా తలపడు అంటూ రెండు అడుగులు ముందుకు వేసాడు.
విక్రమాదిత్యకి ఒక్క ముక్క అర్ధం కాలేదు కానీ ఆయన ఎవరో కోపంగా ఉన్నాడని మాత్రం అర్ధం అయ్యింది, మధ్యలో పరుశు అన్నాడు అంటే సంస్కృతంలో గొడ్డలి అని అర్ధమయ్యి ఆయన ఈ గొడ్డలి గురించి మాట్లాడుతున్నాడేమో అని గొడ్డలిని చూసాడు, రెప్పపాటులో గొడ్డలి విక్రమాదిత్య చేతిలో నుంచి ఎగిరి ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ వెంటనే ఆయన మాటల్లో భార్గవ్ రామ్ అన్న పేరు గుర్తుకు వచ్చి ఆ వెంటనే ఆగిపోయి భక్తిగా కొంత భయంగా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసాడు.
పరుశురాముడు మాత్రం కోపంగా గొడ్డలి తిప్పగానే విక్రమాదిత్య కూంగా పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ అందుకున్నాడు, అది చూసి ఆయన చులకనగా నవ్వుతూ పక్కనే ఉన్న నాలుగు అడుగుల వెడల్పు గల చెట్టుని ఒక్క వేటుతో నిలుచున్న చోటు నుంచి కదలకుండా అవలీలగా నరికేసాడు. విక్రమాదిత్య చేతిలో నుంచి చెట్టు కొమ్మ కింద పడిపోయింది. కింద పడ్డ కత్తి అందుకుని నిలబడ్డాడు.
పరుశురాముడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఎగిరి విక్రమాదిత్య మీద గొడ్డలితో వేటు వెయ్యబోతుంటే విక్రమాదిత్య కత్తి అడ్డం పెట్టాడు.ఇవ్వాల్టితో తన చావు మూడిందని ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు, అర రెప్ప పాటులో పరుశురాముడి గొడ్డలి వేటుకి అడ్డంగా సుదర్శన చక్రం వచ్చి ఒక్క క్షణంలో మాయం అయ్యింది, సుదర్శన చక్రం మరియు శివుడి పరుశు రెండు కలబడగానే ఒక మెరుపు మెరిసింది.. ఆ తాకిడికి పరుశురాముడు ఎగిరి అవతల పడ్డాడు. విక్రమాదిత్య కళ్ళు తిరిగి పడిపోయాడు.
లేచి నిలబడ్డ పరుశురాముడు తను చూసింది నిజామా కాదా అన్నట్టు గుర్తు తెచ్చుకుని పాహిమాం పాహిమాం అంటూ మోకాళ్ళ మీద కూర్చుని వేడుకుని లేచి విక్రమాదిత్య దెగ్గరికి వెళ్లి తన నుదిటిన అరచేయితో పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు.
పరుశురాముడు కళ్ళు తెరిచి ఏదో అర్ధం అయ్యిన వాడిలా ఒక చేత్తో విక్రమాదిత్యని ఎత్తుకుని తన భుజాన వేసుకుని ఇంకో చేత్తో గొడ్డలి పట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
విక్రమాదిత్యకి మైకం తగ్గి కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ మంచు ఎడారి, ఎటు చూసినా తెల్లగా మంచు తప్ప ఇంకేమి కనిపించలేదు. తల తిప్పి చూసాడు పరుశురాముడు ధ్యానంలో ఉన్నాడు. ఏమి అర్ధం కాక లేచి అక్కడ నుంచి పరిగెత్తడం మొదలు పెట్టాడు, రెండు అడుగులు వేశాడో లేదో గొడ్డలి అడ్డంగా నిలబడింది. అటు ఇటు కదిలి చూసాడు లేదు ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వనంటూ ఎదురు పడుతుంది గొడ్డలి. కోపంగా వెనక్కి తిరిగి పరుశురాముడిని చూసాడు.
పరుశురాముడు కళ్ళు తెరిచి చూసాడు ఆయన మాములుగా మాట్లాడినట్లు ఉన్నా కళ్ళు మాత్రం కోపంగానే ఉన్నాయి, విక్రమాదిత్యకి అవేమి అర్ధంకాలేదు, ఆయనని పట్టించుకోకుండా వెనక్కి తిరిగేసరికి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క తన్ను తన్నాడు దెబ్బకి విక్రమాదిత్య నేలలో కుంగినట్టు కిందకి పడిపోయాడు, లేచి నిలబడ్డాడు నోట్లో నుంచి రక్తం అయినా కానీ తనకి ఏమి అర్ధం కాలేదు.
పరుశురాముడు వేలితో చుట్టూ తిప్పగానే గొడ్డలి దానికదే ఆయన చుట్టూ గుండ్రంగా పెద్ద గీత గీసింది, వెళ్లి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు. విక్రమాదిత్య ఆయన ఎలాగో ధ్యానంలో కూర్చున్నాడు కదా అని వెళ్ళబోతే గీత దాటలేకపోయాడు. కోపంగా పరుశురాముడిని చూసి ఆయన ముందుకు వెళ్లి నిలుచున్నాడు.
పరుశురాముడు కళ్ళు తెరిచి చెయ్యి చాపగానే ఆయన చేతిలో ఏవో తాళపత్రాలు ప్రత్యక్షమయ్యాయి, విక్రమాదిత్య మీదకి విసరగానే పట్టుకున్నాడు.
పరుశురాముడు : సంస్కృతం నేర్చుకుని నాతో మాట్లాడు
విక్రమాదిత్య : అస్సలు నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు, నాతో మీకేం పని.. నన్ను ఎందుకు బంధించారు.. నేను వెళ్ళాలి నన్ను పోనివ్వండి.
పరుశురాముడు ఏమి మాట్లాడలేదు, మౌనంగా ధ్యానం చేసుకుంటున్నాడు.
విక్రమాదిత్య : మాట్లాడడండి.. మీకు తెలుగు వచ్చినప్పుడు అదే మాట్లాడొచ్చు కదా
పరుశురాముడు : నీ భాషతో నాకేం పని.. నువ్వే నేర్చుకో.. నాతో ఏం మాట్లాడాలనుకున్నా అందులో నేర్చుకుని మాట్లాడు అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.. ఆ తరువాత విక్రమాదిత్య ఎంత గింజకున్నా ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది, చివరాఖరికి ఆయన ముందు కూర్చుని తాళపత్రాలు తెరిచాడు. పరుశురాముడి మొహంలో చిన్న గర్వం.. ఆయన కళ్ళు తెరవలేదు.
ఏకాగ్రతగా రెండు రోజులు నిద్ర లేకుండా ఆ తాళపత్రాలను ఆవగతం చేసుకుని లేచి ఆయన ముందుకెళ్లి నిలుచున్నాడు.
విక్రమాదిత్య : ఇప్పుడు చెప్పండి ఎందుకు నన్ను బంధించారు, నాకు పని ఉంది.. నా బిడ్డల కోసం నేను వెళ్ళాలి.
పరుశురాముడు : ఇక్కడి నుంచి ఈ బంధనం నుంచి నీవు వెళ్లాలంటే నన్ను ఓడించి, నన్ను పడగొట్టి వెళ్ళు
విక్రమాదిత్య : అది అసాధ్యం అని మీకు తెలుసు
పరుశురాముడు : కాదేమో, ప్రయత్నించు
విక్రమాదిత్య : నా దెగ్గర ఆయుధం లేదు
పరుశురాముడు చిటికె వెయ్యగానే గొడ్డలి మాయమంత్రం వదిలేసి తెల్లని మంచు నేల మీద పడిపోయింది.
పరుశురాముడు : తీసుకో ఆయుధం, నన్ను పడగొట్టి నీవు వెళ్ళవచ్చు
విక్రమాదిత్య వెళ్లి ఆ గొడ్డలిని లేపబోతే లేవలేదు, రెండు చేతులతో ఎత్తబోయాడు కానీ తన వల్ల కాలేదు. చాలా సేపు ప్రయత్నించి చివరికి పరుశురాముడి ముందుకు వచ్చాడు.
పరుశురాముడు : లేవట్లేదా.. నేర్పిస్తాను, నేర్చుకుంటావా.. లేదంటే వెళ్ళలేవు
విక్రమాదిత్య మోకాళ్ళ మీద కూర్చుని నేర్పండి అన్నాడు నిస్సహాయంగా.. పరుశురాముడు మాములుగా కూర్చోమని సైగ చెయ్యగానే విక్రమాదిత్య కూర్చున్నాడు.
పరుశురాముడు : ఆ గొడ్డలి నీ వశం కావాలంటే నీవు మళ్ళీ పుట్టాలి, పసి శిశువులా మారిపోవాలి, నీ క్రోధం నీ అసహనం నీ బాధ నీ ఆనందం నీ ప్రేమ బాంధవ్యం, బంధుత్వం అన్నిటిని వదులుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి మొదటిలో ఆ గొడ్డలి నా చేతికి వచ్చింది నేను యుద్ధాలు గెలిచాను కానీ అది ఎప్పుడు నాకు లొంగిందో తెలుసా నేను రక్తపాతం మీద విసుగెత్తి పోయినప్పుడు ఇప్పుడు నువ్వు కూడా అదే మీమాంసలో ఉన్నావు. ముందు నీ శరీరంలో ఉన్న అన్ని చక్రాలను తెరువు ఒక్కోటి నేర్పిస్తాను, బాధపడకు ఇక్కడి కాలానికి భూమ్మీద కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. నీ బిడ్డలకి ఎటువంటి ముప్పు కలుగదు.
విక్రమాదిత్య ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించాడు, ఎప్పటి నుంచో దీని కోసమే ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ మాములు మనిషి కావాలని ప్రయత్నిస్తున్నాడు దానికి ఇదే సరైన మార్గం అని నిర్ణయించుకుని కళ్ళు తెరిచి నేను సిద్ధం అన్నాడు.
పరుశురాముడు : ముందు ధ్యానం చెయ్యడం నేర్చుకో అని సైగ చెయ్యగానే విక్రమాదిత్య లేచి పరుశురాముడి పక్కన కూర్చున్నాడు.
మూడు రోజుల ధ్యానం తరువాత విక్రమాదిత్య కళ్ళు తెరిచేసరికి పక్కన పరుశురాముడు కనిపించకపోవడంతో లేచి చూసాడు. పక్కనే ఉన్న జలపాతం కింద ఆయన స్నానమాచరిస్తుంటే వెళ్ళాడు, చెయ్యి పెట్టగానే తీసేసాడు, గడ్డ కట్టే నీరు చేతిని సూదిలా గుచ్చుతుంది.. పరుశురాముడిని చూస్తే మాములుగా నీళ్ల కింద తల పెట్టుకుని ఒంటి కాలితో నిలుచున్నాడు, విరబూసిన జుట్టుతో పెద్ద గడ్డంతో ఆయన శరీరం చూడగానే ఈయనే ఇలా ఉంటే ఇక శివుడు ఎలా ఉంటాడో అని అనుకున్నాడు, ధైర్యం చేసి నీళ్ల కింద నిలుచున్నాడు కానీ ఐదు క్షణాల కంటే ఎక్కువ నిలుచొలేకపోయాడు. పరుశురాముడు అది చూసి నవ్వుతూ బైటికి నడిచి ధ్యాన పద్ధతిలో కూర్చున్నాడు ఆయనకి ఎదురుగా విక్రమాదిత్య కూర్చున్నాడు.
పరుశురాముడు : ఆ జలపాతం చూసావా.. ఆ నీళ్ల వలే నీ శరీరంలో కూడా శక్తి ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి జీవితం మొత్తం భావోద్వేగాలతో నిండి ఉంటుంది అవి దాటుకుని ధ్రుడంగా నిలబడాలి, శరీరంలో మొత్తం ఏడు చక్రాలు.. ఒక్కో చక్రం ముసుకుపోయి ఉండటానికి ఒక్కో ఉద్వేగం. జాగ్రత్తగా ఏకాగ్రతగా ఒక్కో చక్రాన్ని తెరువు.. ఒక్కో చక్రం తెరుచుకునే కొద్ది నీలో ఉన్న శక్తి కూడా ఒక చక్రం నుంచి ఇంకో చక్రానికి ప్రవహిస్తూ ఉంటుంది.. గుర్తుంచుకో ఒక్కసారి మొదలయ్యాక మధ్యలో ఆపడానికి వీల్లేదు.
విక్రమాదిత్య అలాగే అని తీక్షణంగా ఆయన కళ్ళలోకి చూసాడు. పరుశురాముడు కళ్ళు మూసుకోగానే విక్రమాదిత్య కూడా కళ్ళు మూసుకున్నాడు.
పరుశురాముడు : మొదటిది మూలాధార చక్రం, వెన్నపూస దిగువన ఉంటుంది, బ్రతుకుని సూచిస్తుంది.. భయం వల్ల మూసుకుపోయి ఉంటుంది. నీ భయం ఏంటి..?
విక్రమాదిత్య : నేనే నా భయం అని తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు కళ్ళ ముందు తన నరికిన మనుషులు, తెగిపడిన తలలు, ఎటు చూసినా రక్తమే అంతా ఎరుపే
పరుశురాముడు : నిన్ను నువ్వు గెలవగలవన్న నిజాన్ని నువ్వు నమ్మాలి.. నీ కోపానికి కారణాలు వెతుకు నిన్ను నువ్వు సమాధానపరుచుకో, నీ తప్పులని నువ్వు ఒప్పుకో నిన్ను నువ్వే క్షమించమని అడుగు. నీ భయాన్ని నువ్వు గెలువు
విక్రమాదిత్య గట్టిగా కళ్ళు మూసుకుని అలానే బిగపట్టి కూర్చున్నాడు, గంటన్నర తరువాత మామూలు స్థితికి వచ్చాడు, మనసులో ఏదో గంట కొట్టినట్టు శబ్దం.. కళ్ళు తెరిచాడు.. మూలధార చక్రం తెరుచుకుంది.
పరుశురాముడు : తరువాత చక్రం స్వాదిష్టాన చక్రం బొడ్డు కింద ఉంటుంది, ఆనందాన్ని సూచిస్తుంది.. నువ్వు చేసిన తప్పులని ఒప్పుకోక పోవడం వల్ల మూసుకుపోయి ఉంటుంది.. నీ తప్పులని గుర్తు చేసుకో వాటిని ఒప్పుకో.. నిన్ను నువ్వు ఎందుకు నిందించుకుంటున్నావో తెలుసుకో.. నిన్ను నువ్వే క్షమించు.. నిన్ను నువ్వు క్షమించుకున్నప్పుడే అవతలి వాడిని క్షమించేంత గుణం నీకు ఏర్పడుతుంది.
స్నేహితుడి తల్లిని ప్రేమించడం, చిన్నప్పుడు తన తల్లీ మరియు తన గురువు అయిన బిందు మేడంతో సరసాలు, తన గురువు మరియు అమ్మతో సమానమైన పిన్నితో రతి, కన్న తండ్రిని చంపడం.. ఇంకా చాలా ప్రతీ ఒక్క సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూనే ఏడుస్తూ వాటిని ఒప్పుకుంటూ దాటుకుంటూ స్వాదిష్టాన చక్రాన్ని తెరిచాడు.. ఒక రోజు గడిచిపోయింది.
పరుశురాముడు : (జలపాతం దెగ్గర) తరువాత మణిపూర చక్రం, కడుపులో ఉంటుంది, సంకల్పాన్ని సూచిస్తుంది.. నీకు జరిగిన అవమానాల వల్ల మూసుకుపోయి ఉంటుంది, నీకు జరిగిన అవమానాలు గుర్తుతెచ్చుకో ఎందుకు సిగ్గుపడుతున్నావ్.. వాటన్నిటిని దాటు.. దీనికి ఎవరూ అతీతులు కారని తెలుసుకో..
విక్రమాదిత్య తన చిన్నతనం నుంచి పడిన అవమానాలు చులకన మాటలు అన్ని గుర్తుతెచ్చుకున్నాడు, వాటన్నిటిని దాటడం పెద్ద కష్టం అనిపించలేదు. త్వరగానే మణిపూర చక్రాన్ని తెరిచాడు.
పరుశురాముడు : తరువాత అనాహత చక్రం, గుండెకి దెగ్గర్లో ఉంటుంది, ప్రేమని సూచిస్తుంది, దుఃఖం వల్ల మూసుకుపోయి ఉంటుంది.
విక్రమాదిత్య తన జీవితంలో కోల్పోయిన అత్యంత విలువైనది.. మానస.. కళ్ళు మూసుకుని ఉన్నా కన్నీరు కారడం ఆగలేదు.. ఆ తరువాత తన వాళ్ళు తన పిన్ని, స్నేహితుడు రాజు, సునీల్, రాజు వాళ్ల అమ్మ, ఎందరో..
పరుశురాముడు : అందరినీ కోల్పోయానన్న చింత వలదు, వాళ్లందరి ప్రేమా ఆప్యాయత నీలోనే ఉన్నాయని తెలుసుకో వాళ్ళని, వాళ్ళతో పాటు నిన్ను నీలోనే వెతుక్కో
పరుశురాముడి మాటలు వింటుండగానే మానస మదిలో మెదిలింది, తన చిరునవ్వు తన మాటలు.. విక్రమాదిత్య ముఖం ప్రశాంతమయమయ్యింది
పరుశురాముడు : నీ బాధని అందులో ఉన్న గాయాలని పోనివ్వు అనగానే విక్రమాదిత్య నవ్వుతూ కళ్ళు తుడుచుకున్నాడు.
పరుశురాముడు : విశుద్ధ చక్రం గొంతు దెగ్గర ఉంటుంది, నిజాన్ని సూచిస్తుంది, నీ అబద్ధాల వల్ల మూసుకుపోయి ఉంటుంది.
విక్రమాదిత్య ఎంతో మంది దెగ్గర అబద్ధాలు అడాడు, ఈ లోకాన్ని తనొక పేద వాడిగా ఎంతో కాలం నమ్మించాడు అవన్నీ గుర్తు చేసుకుని వాటిని దాటేసారికి మూడో రోజు పూర్తయ్యింది.
పరుశురాముడు : ఆజ్ఞ చక్రం వెలుగుని సూచిస్తుంది, నీలో ఉన్న సందేహాల వల్ల లేనిపోనీ భయల వల్ల మూసుకుపోయి ఉంటుంది. అవేమి లేవని అంతా ఒకటేనని ప్రతీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని.. నిన్ను నువ్వు సమాధానపరుచుకో
విక్రమాదిత్య ఈ చక్రాన్ని కూడా చాలా కష్టపడి తెరిచాడు, అంతా ఒక్కటేనని కంగారు వలదని తనని తాను ధ్రుడపరుచుకున్నాడు. ఇప్పటికి ఐదో రోజులు పూర్తయ్యింది.
పరుశురాముడు : ఆఖరి చక్రం సహస్ర చక్రం, ఒక్కసారి ఈ చక్రం తెరుచుకున్నాక నీ శరీరం నీ మనసు అన్ని నీ అధీనంలోకి వస్తాయి. (దీని కోసమే విక్రమాదిత్య ఎదురు చూస్తుంది)
సహస్ర చక్రం మెదడు పై భాగంలో ఉంటుంది, విశ్వంలోని శక్తిని సూచిస్తుంది. ధ్యానం చెయ్యి.. నిన్ను అన్నిటికంటే ఎక్కువగా ఏది నీ మనసుని లాగుతుంది, ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తావ్ అనగానే విక్రమాదిత్యకి అనురాధ కనిపించింది, ప్రశాంతమైన మొహం అమాయకమైన కళ్ళు, తన ప్రేమ అన్నీ..
పరుశురాముడు : దాన్ని వదిలేయి
విక్రమాదిత్య : లేదు.. నా వల్ల కాదు.. నా అనురాధ
పరుశురాముడు : లేదు, తప్పదు త్యాగం చెయ్యి.. నీ ప్రేమ వల్ల నువ్వు బలహీన పడిపోతావు.. నీకు ఆ మహాశక్తి దక్కదు
విక్రమాదిత్య : నాకు ఏ మహాశక్తి అవసరం లేదు, అవన్నీ నా అనురాధ ప్రేమ ముందు ఎందుకు పనికిరావు
పరుశురాముడు : నీ త్యాగం వృధా పోదు.. నీలో దాగి ఉన్న శక్తిని ఎందుకు లేపాలో నీ పుట్టుక ఎందుకు సంభవించిందో అన్నీ చెపుతాను.. ఆఖరి చక్రం తెరువు అని కోపంగా అరిచాడు.
విక్రమాదిత్య కళ్ళ ముందు తనని ప్రేమగా చూస్తున్న అనురాధ మెల్లగా మాయం అవుతుంటే తనని అందుకోవాలని ఉన్నా కళ్ళు మూసుకున్నట్టు భ్రమించాడు అంతే సహస్ర చక్రం తెరుచుకుంది.
ఒక్కసరిగా అంతా సూన్యం.. విక్రమాదిత్య గాల్లో రెండు చేతులు చాపి అలానే కళ్ళు మూసుకుని ఉన్నాడు. తనలో ఏదో వెలుగు తన వెనక ఏదో కాంతి.. ఉన్నట్టుండి విష్ణు చక్రం తన వీపు వెనుక పెద్దగా వేగంగా తిరుగుతుంటే విక్రమాదిత్య సన్నగిల్లుతున్న శక్తితో కళ్ళు తెరిచాడు విష్ణు చక్రాన్ని చూసే లోప కళ్ళు తిరిగి పడిపోయాడు.. కింద పడుతున్న విక్రమాదిత్యను పరుశురాముడు పట్టుకున్నాడు.
ఇలా ఆరు రోజుల్లో విక్రమాదిత్య ఏడు చక్రాలని తెరిచి తన మనసుని తేలిక పరిచాడు, అమ్మ మీద భార్యల మీద బిడ్డల మీద ప్రేమని కూడా అందుకు త్యాగం చెయ్యాల్సి వచ్చింది. ఇంకా స్పృహ రాలేదు కానీ మొగ్గ లోనుంచి పువ్వు విచ్చుకున్నట్టుగా ఒక కొత్త విక్రమాదిత్య పుట్టాడని పరుశురాముడు గ్రహించాడు.